ఈ నెలాఖరులోగా 13 జిల్లాల్లో ఈ-పాస్ విధానం అమలు చేస్తామని మంత్రి పరిటాల సునీత తెలిపారు.
అనంతపురం: ఈ నెలాఖరులోగా 13 జిల్లాల్లో ఈ-పాస్ విధానం అమలు చేస్తామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఆధార్ అనుసంధానంతో బోగస్ కార్డులను ఏరివేస్తామన్నారు. 8 లక్షల రేషన్ కార్డులు ఇంకా ఆధార్తో అనుసంధానం కాలేదని చెప్పారు. కొత్తగా 12 లక్షల కార్డులు ఇస్తామని తెలిపారు. వచ్చే ఆరు మాసాల్లో 20 లక్షల దీపం కనెక్షన్లు పంపిణీ చేస్తామన్నారు. అమరావతిలో రూ.2 కోట్లతో పౌరసరఫరా భవనం నిర్మిస్తామని తెలిపారు.