నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శ్రీ చైతన్య టెక్నో స్కూల్కు చెందిన రెండు వ్యాన్లకు దుండగులు నిప్పంటించారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శ్రీ చైతన్య టెక్నో స్కూల్కు చెందిన రెండు వ్యాన్లకు దుండగులు నిప్పంటించారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఓ వ్యాను పూర్తిగా దగ్ధం కాగా, మరో వ్యాన్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు స్కూల్ యాజమాన్యం వెల్లడించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఎవరన్నది ఇంకా గుర్తించలేదు.