రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం | 2 killed in road accident in ysr district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

May 7 2016 11:41 AM | Updated on Aug 30 2018 4:07 PM

వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలం వాసవీ ఫార్మసీ కళాశాల వద్ద కడప- చెన్నై జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది.

సిద్ధవటం: వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలం వాసవీ ఫార్మసీ కళాశాల వద్ద కడప- చెన్నై జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును పులివెందుల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లె గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నాయకుడు ముక్కా సుదర్శన్‌రెడ్డి (65)తోపాటు కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయిపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement