తూర్పుగోదావరి జిల్లాలో 12 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు.
తొండంగి : తూర్పుగోదావరి జిల్లాలో 12 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ ఘటన శనివారం తొండంగి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని హుకుంపేట గ్రామానికి చెందిన 12 మంది రెండు బోట్లలలో శనివార తెల్లవారు జామున చేపల వేటకు వెళ్లారు. అయితే వీరు తిరిగిరాకపోవడంతో మత్య్సకారుల కుటుంబాలకు అధికారులకు సమాచారం అందించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటానికి తోడు వర్షం కురుస్తుడటంతో బాధితుల కుంటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.