రాజధానిలో ప్రమాదం జరిగితే అంతేనా! | 108 Vehicles Not Available in Rajdhani Amaravathi | Sakshi
Sakshi News home page

రాజధానిలో ప్రమాదం జరిగితే అంతేనా!

Jan 18 2019 1:17 PM | Updated on Jan 18 2019 1:17 PM

108 Vehicles Not Available in Rajdhani Amaravathi - Sakshi

ప్రమాదంలో తలకు బలమైన గాయం తగలడంతో మహిళకు సపర్యలు చేస్తున్న భర్త, పక్కన ఏడుస్తున్న చిన్నారులు

గుంటూరు, తాడికొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత రాజధానిలో పేదవాడికి చోటులేదు సరికదా.. జరగరానిది ఏదైనా జరిగితే కనీస అత్యవసర వైద్యం అందించేందుకు 108 వాహనం కూడా అందుబాటులో లేదంటే అతిశయోక్తి లేదు.  తాడికొండ శివారు గొడుగు కంపెనీ వద్ద గురువారం ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ కుటుంబ సభ్యులకు హఠాత్తుగా గేదె అడ్డు రావడంతో వాహనం అదుపుతప్పి మహిళ పడిపోయింది.

తలకు బలమైన గాయం తగలడంతో స్పృహ తప్పిన ఆమెను 108 వాహనంలో పంపించాలనే ఆత్రుతతో పలువురు ఫోన్‌ చేసినా స్పందన కరువైంది. చివరకు ఆరాతీయగా తాడికొండ మండలానికి చెందిన 108 వాహనం ఐనవోలులో సీఎం సభకు వెళ్లడంతో అందుబాటులో లేదని తెలిసింది. స్పందించిన స్థానికులు అటుగా వెళుతున్న కారును ఆపి, బతిమాలి స్థానిక గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఆటోలో గుంటూరుకు తరలించారు. చిన్నారులతో ప్రయాణం చేస్తూ ప్రమాదం పాలైన ఆ జంటకు ఆపద సమయంలో 108 వాహనం రాకపోవడంతో ‘రాజధానిలో ఇదేం ఖర్మ!’ అంటూ పలువురు ప్రభుత్వ పనితీరుపై బహిరంగ చీవాట్లు పెట్టారు.

పెరిగిన ప్రమాదాలు
రాజధాని నేపథ్యంలో పెరిగిన వాహనాల రాకపోకల దెబ్బకు ప్రమాదాలు కూడా అదే రీతిలో పెరిగాయి. 108 వాహనాన్ని రాజధానికి ప్రత్యేకంగా కేటాయించాలని ప్రజలు పలుమార్లు రాజధాని వాసులు ఎమ్మెల్యేలను కోరినా స్పందించిన నాథుడు లేడు. దీంతో తాడికొండ, తుళ్లూరు మండలాలకు చెందిన పలువురు ఆపద సమయంలో నానా అగచాట్లు పడుతున్నారు. ప్రపంచ గొప్ప రాజధాని నిర్మాణం అంటూ పదేపదే ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబుకు, ఆయన ప్రభుత్వ పెద్దలకు రాజధానిలో కనీస అత్యవసర సదుపాయమైన 108 వాహనాన్ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement