ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూమి అవసరం లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూమి అవసరం లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను వేధిస్తే సహించబోమని హెచ్చరించారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని, రైతుల ఆమోదంతోనే రాజధానిని నిర్మించాలని వడ్డే శోభనాద్రీశ్వరరావు సూచించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో రాజధానిని నిర్మించనున్న సంగతి తెలిసిందే.