breaking news
vadde shobhanadreswar rao
-
ఏపీలో మూడు సెకన్లకో ఓటు ఎలా సాధ్యమైంది?
తిరుపతి అర్బన్: ‘ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) ద్వారా ఓ వ్యక్తి ఓటు వేయడానికి 17 సెకన్ల సమయం పడుతుంది. కానీ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కేవలం 3 సెకన్లకు ఒక ఓటు చొప్పున వేయడం ఎలా సాధ్యమైంది’ అని రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ప్రశ్నించారు. తిరుపతిలో ఆదివారం ‘భారత రాజ్యాంగం.. సవాళ్లు’ పేరిట లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక చైర్మన్ జల్లి విల్సన్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. పరకాల మాట్లాడుతూ.. ప్రజలపై కేంద్ర ప్రభుత్వం స్వారీ చేస్తోందని.. దానినుంచి ప్రజలను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదన్నారు. కొత్తగా ‘సర్’ పేరుతో ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టనున్నారని చెప్పారు. దేశంలో 30 శాతం ఓట్లు గల్లంతైనా ఆశ్చర్యం లేదన్నారు. దేశవ్యాప్తంగా 16 కోట్ల మందికి ఓటు హక్కు తీసివేసే కుట్ర జరుగుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో దేశంలో ఓట్లు ఉన్నవారు, ఓట్లు లేనివారు అనే రెండు వర్గాలు మాత్రమే మిగులుతాయన్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగాలి రైతు ఉద్యమనేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల ద్వారా లక్షల ఓట్లు నమోదయ్యాయని గుర్తు చేశారు. సాంకేతికతలో మనదేశం కంటే ముందున్న దేశాల్లో సైతం బ్యాలెట్ ఓటింగ్ జరుగుతోందని చెప్పారు. మనదేశంలోనూ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరపాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని ఓ యువ నాయకుడు స్మార్ట్ మీటర్లు పెడితే రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఆయనే స్మార్ట్ మీటర్లను ప్రోత్సహించడం విడ్డూరంగా ఉందన్నారు. నల్ల చట్టాలను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ కేంద్రానికి ఏజెంట్గా మారింది మాజీ ఎమ్మెల్సీ, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్గా మారిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ రిటైరయ్యే ముందు బీజేపీకి అనుకూలంగా 10 తీర్పులు ఇచ్చారని, అనంతరం బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. విభజన హామీలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పేద రైతులకు రుణాలు ఇవ్వడం లేదని, అయితే బడా నేతలు మాత్రం రుణాల పేరుతో బ్యాంకులను లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. మన గ్యాస్ను స్థానికంగా ఇవ్వకుండా గుజరాత్కు తరలించడం దుర్మార్గమన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు దుర్మార్గం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీని వ్యతిరేకిస్తున్న వారిని చొరబాటుదారులుగా ముద్ర వేయడాన్ని తప్పుపట్టారు. రాజ్యాంగ వ్యవస్థల్ని రద్దుచేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయన్నారు. వ్యవస్థల్లో తప్పులను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. మనుషులపై మారణహోమం సృష్టించే మిలిటరీ ఇండ్రస్టియల్ హబ్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం తగదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ.. దేశంలో నిజానికి సంకెళ్లు వేసే వ్యవస్థ నడుస్తోందని, దీనిపై ప్రతి పౌరుడు చైతన్యవంతుడు కావాలని పేర్కొన్నారు. తప్పులను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడే ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం టీడీపీ పుట్టిందని, దాని మూలాలను చంద్రబాబు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు పి.అంజయ్య, సీపీఐ రాష్ట్ర నేత హరినాథ్రెడ్డి, వామపక్ష నేతలు కందారపు మురళి, వందాసి నాగరాజు, మురళి, సాయిలక్ష్మి, జయచంద్ర మాట్లాడారు. -
‘రైతన్న’..వారి కష్టాలు కళ్లకు కట్టినట్లు..
‘‘కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చెయ్యాలి. దేశానికి రైతే వెన్నెముఖ అంటారు. కానీ అన్నదాత ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? అనే కథాంశంతో ‘రైతన్న’ సినిమా తీశా. ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వంగపండు ప్రసాదరావుగార్లు పాటలు పాడారు.. వారికి నా నివాళులు’’ అని ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రైతన్న’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా పలువురు రైతు నాయకుల కోసం హైదరాబాద్లో ‘రైతన్న’ సినిమాని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభ నాద్రీశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఈ రోజు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, వారి బాధలు, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాల వల్ల ఎలాంటి కష్టాలు వస్తాయో ‘రైతన్న’ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు నారాయణ మూర్తి. స్వామినాథన్ కమిషన్ నివేదికను వెంటనే అమలు పరచాలి’’ అన్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ నాయకులు కోదండ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి, మధు, శ్రీనివాసరెడ్డి, ప్రజాకవి గద్దర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కవి అందె శ్రీ, రైతు నాయకులు వెంకట రామయ్య, మల్లారెడ్డి, గోవర్ధన్, సాగర్, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
స్విచ్ ఒప్పందం రద్దు శుభపరిణామం
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రభుత్వం, సింగపూర్ కంపెనీలు స్విచ్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం శుభపరిణామం, దీన్ని మేము మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిరావు పేర్కొన్నారు. అప్పట్లో చంద్రబాబు చెప్పినా వినిపించుకోకుండా స్విచ్ చాలెంజ్ను సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా మార్చడానికి ఏకంగా రూల్స్ మార్చారు. ఈ ఒప్పందం ఒక లోపభూయిష్టమైనదని, దీనిని రద్దు చేయడంపై ప్రజలందరూ సంతోషించాలని పేర్కొన్నారు. స్విచ్ చాలెంజ్ ఒప్పందం వల్ల రూ. 306 కోట్లు సింగపూర్ కంపెనీలు పెట్టుబడితే రూ. 3604 కోట్లు లబ్ధి చేకూరనుంది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని తెలిపారు. ఈ ఒప్పందం రద్దు అయితే రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు అంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్విస్ చాలెంజ్ ఒప్పందం రద్దు వల్ల ఏపీలోని 13 జిల్లాల అభివృద్ది జరిగేలా అధికార వికేంద్రికరణ జరగాలి అని అభిప్రాయపడ్డారు. రాజధానిలో 45,50 అంతస్తుల నిర్మాణాలపై ప్రభుత్వం పునరాలోచించాలని తెలిపారు. -
అక్కడ మంత్రి అయితే ఇంటికే!
సాక్షి,మైలవరం : రాజకీయాల్లో ఒక్కొక్క చోట.. ఒక్కో రకం సెంటిమెంట్ రాజ్యమేలుతుంటాయి. మైలవరం నియోజకవర్గంలో ఒక సెంటిమెంట్ ప్రచారంలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మంత్రి పదవి చేపడితే ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి ఖాయం అనేది ఆ సెంటిమెంట్. 1983 ఎన్నికల నుంచి ఇదో సెంటిమెంట్గా మారింది. మైలవరం నుంచి చనమోలు వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆర్ ఆండ్ బీ శాఖ మంత్రిగా పనిచేశారు. తదనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 1989లో కోమటి భాస్కరరావు ఎమ్మెల్యేగా విజయం సాధించి మార్క్ఫెడ్ చైర్మన్గా పదవినలంకరించారు. తదనంతరం కనుమరుగయ్యారు. 1999లో వడ్డే శోభనాద్రీశ్వరరావు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొంది వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో పరాజయం తప్పలేదు. 2004 ఎన్నికల్లో చనమోలు వెంకట్రావు గెలుపొంది, పదవీ కాలం పూర్తి కాకుండానే మృతి చెందారు. 2009, 2014 ఎన్నికల్లో దేవినేని ఉమామహేశ్వరరావు విజయం సాధించారు. 2014 ఎన్నికల తరువాత ఆయన జలవనరుల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో మైలవరం అభ్యర్థిగా మరోసారి పోటీలో ఉన్నారు. ఈ దఫా ఎటువంటి ఫలితాలు వస్తాయో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
'రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాలు అవసరంలేదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూమి అవసరం లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను వేధిస్తే సహించబోమని హెచ్చరించారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని, రైతుల ఆమోదంతోనే రాజధానిని నిర్మించాలని వడ్డే శోభనాద్రీశ్వరరావు సూచించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో రాజధానిని నిర్మించనున్న సంగతి తెలిసిందే.


