స్కూల్ బస్సు బోల్తా: ఒకరి మృతి | 1 died in school bus accident | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు బోల్తా: ఒకరి మృతి

Aug 26 2015 8:42 AM | Updated on Sep 15 2018 4:05 PM

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామం వద్ద బుధవారం ఉదయం ఓ స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు.

జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామం వద్ద బుధవారం ఉదయం ఓ స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. స్వామి వివేకానంద స్కూల్ కు చెందిన బస్సు పిల్లలను తీసుకు రావడానికి వెళుతుండగా మార్గ మధ్యంలో చెట్టును ఢీకొని బోల్తాపడింది. అదే సమయంలో చెట్టు కింద ఉన్నదిమ్మెపై కూర్చున్న కె.నారాయణ (75) అనే వ్యక్తి పై బస్సు పడటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. 

ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్‌కు స్వల్ప గాయలయ్యాయి. ప్రమాదం అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement