Sri Sathya Sai District News
-
అన్నదాతను విస్మరించిన కూటమి సర్కార్
అప్పు కోసం ఆత్మగౌరవాన్ని చంపుకుని.. చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపారు. అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా రైతులకు అర్ధరూపాయి కూడా సాయం చేయలేదు. పైగా ఉచిత పంటల బీమాకు మంగళం పాడారు. పంటనష్టం అంచనాలతో సరిపెట్టారు. నమ్మి ఓటేసినందున నట్టేట ముంచారు. – మడకశిర మండలం ఈచలెడ్డి గ్రామానికి చెందిన రైతు మంజునాథ్ ఆవేదనరబీ పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. పెట్టుబడులు సైతం చేతికందక రైతులు అప్పులు మూటగట్టుకున్నారు. ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం అంచనాలకే పరిమితమైంది. ఇపుడు ఖరీఫ్కు సమయం ఆసన్నమవుతుండగా పెట్టుబడి కోసం అన్నదాత అత్మగౌరవాన్ని చంపుకుని ప్రైవేటు వ్యక్తుల వద్ద చేయిచాచాల్సిన దుస్థితి తలెత్తింది. చంద్రబాబు ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ’ ఊసే లేకపోవడంతో రైతులంతా వైఎస్ జగన్ హయాంలో అమలు చేసిన ‘రైతు భరోసా’ను తలచుకుంటున్నారు. వ్యవసాయం దండుగ అని ఎప్పుడో తేల్చేసిన చంద్రబాబు...తన అభిప్రాయం మార్చుకోలేదంటున్నారు.చిన్నా పెద్దా తేడా లేకుండా ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద ఏటా ప్రతి రైతుకూ రూ.20 వేలు సాయం అందిస్తాం. రైతుకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాం. – ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయినా ‘అన్నదాతా సుఖీభవ’ పథకం కింద ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు అందించేందుకు కేటాయింపులు చేశాం. – గత ఫిబ్రవరిలో శాసనమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన ● పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సకాలంలో జమ ● 11 నెలలుగా విడుదల కాని రాష్ట్ర ప్రభుత్వ వాటా ● పెట్టుబడి సాయం కోసం ఎదురు చూపు ● ఒక్కో రైతుకు చంద్రబాబు రూ.20 వేలు బాకీ ● జిల్లా వ్యాప్తంగా అన్నదాతలకు రూ.560 కోట్లు ఎగనామం ● పెట్టుబడుల కోసం ‘ప్రైవేటు’ అప్పులు చేస్తున్న రైతులుకదిరి/మడకశిర రూరల్ : ‘ఇది మంచి ప్రభుత్వం’ అని గొప్పలు చెప్పిన చంద్రబాబు సర్కార్ ఇంత వరకూ రైతులకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. ఎన్నికల సమయంలో ప్రతి రైతుకూ ఏడాదికి రూ. 20 వేలు ‘అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పన చంద్రబాబు... అధికారం చేపట్టి 11 నెలలవుతున్నా.. ఇప్పటి దాకా దానిపై ఉలుకూ పలుకూ లేదు. కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇచ్చే డబ్బులు మాత్రం సకాలంలో రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. అధికార టీడీపీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ‘సుఖీభవ’పై అదిగో..ఇదిగో అని చెప్పడమే కానీ ఖాతాల్లో నగదు జమ చేసింది మాత్రం లేదు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ సైతం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏనాడూ రైతుల పక్షాన మాట్లాడ లేదు. రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తవుతోందని, ఈ పథకం ద్వారా జిల్లాలో ఒక్కో రైతుకు రూ.20 వేల చొప్పున సుమారు రూ.560 కోట్లు చంద్రబాబు ఎగ్గొట్టారని అన్నదాతలు లెక్కలేసి మరీ చెబుతున్నారు. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఇప్పటి దాకా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదని సంబంధిత అధికారులు అంటున్నారు. గతంలో అన్నదాతకు ఆర్థిక భరోసా ఖరీఫ్ సీజన్లో రైతులు విత్తనాల కొనుగోలుతో పాటు సాగుకు ఇబ్బంది పడకుండా గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలిచింది. ఇందులో కేంద్రం ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా ఇచ్చే రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మరో రూ.7,500 కలిపి మొత్తంగా 13,500 ‘వైఎస్సార్ రైతు భరోసా’ పేరుతో ఏటా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చింది. జిల్లాలో మొత్తం 2,92,170 మంది రైతులుండగా... వీరిలో 2,79,556 మంది రైతులకు గత ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా ద్వారానే రూ.1767.09 కోట్లు లబ్ధి చేకూరింది. మూడు విడతల్లో జమ గత ప్రభుత్వం రైతులకు ఖరీఫ్ పంట వేసేముందు ఏటా సరిగ్గా మే నెలలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద రూ.7,500 ఖాతాల్లో జమ చేసేది. తర్వాత అక్టోబర్ నెలలో పంట కోతతో పాటు రబీ సాగు అవసరాలకు రెండో విడతలో రూ.4 వేలు ఇచ్చేది. ఆ తర్వాత జనవరి నెలలో మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళ సంక్రాంతి పండుగ సమయంలో మరో రూ.2 వేలు ఇచ్చేది...ఇలా మూడు విడతల్లో ఒక్కో రైతుకు మొత్తం రూ.13,500 చొప్పున గత ప్రభుత్వం రైతులకు నగదు రూపంలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. ఇలా ఏటా సకాలంలో రైతులను ఆదుకుంటూ వచ్చింది. వైఎస్సార్ రైతు భరోసా పథకంతో పాటు వైఎస్సార్ సున్నా వడ్డీ, డా.వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ ఇలా అనేక రకాలుగా గత ప్రభుత్వం ఆదుకుంటూ వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం ఇంతవరకూ రైతు సంక్షేమం గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అతివృష్టి, అనావృష్టితో జిల్లాలో గత ఖరీఫ్, రబీలో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆదుకోవాల్సిన కూటమి సర్కార్ కేవలం అంచనాలతో సరిపెట్టింది. దీంతో పెట్టుబడులు కూడా చేతికందక రైతులు అప్పుల పాలయ్యారు. ప్రస్తుతం ఖరీఫ్లో పంటల సాగుకు చేతిలో చిల్లిగవ్వలేక ఆత్మగౌరవాన్ని చంపుకుని ప్రైవేటు వ్యక్తుల వద్ద చేతులు చాచాల్సిన పరిస్థితి తలెత్తింది. -
జిల్లాలో విరివిగా మొక్కలు నాటాలి
ప్రశాంతి నిలయం: పర్యావరణ పరిరక్షణకు జిల్లాలో విరివిగా మొక్కలు నాటాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అటవీశాఖ, ఎన్హెచ్ఏ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, చెరువుగట్లు, బంజరు భూములు, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇందుకు ఎన్ని మొక్కలు అవసరయో జిల్లా అటవీశాఖ అధికారికి తెలియజేయాలన్నారు. వారంలోపు మొక్కలు నాటేందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. జిల్లాలోని 1,74,065 హెక్టార్లలో 10.43 లక్షల మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి చక్రపాణి, డీఆర్డీఏ పీడీ నరసయ్య, డీపీఓ సమత, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ హిందూపురం టౌన్: స్థానిక శ్రీకంఠపురం ఝూన్సీలక్ష్మీబాయి పురపాలక ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో ప్రవేశాలకు తొలి విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ రాయపురెడ్డి మంగళవారం పేర్కొన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 24వ తేదీలోపు https:/ iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 94402 58629, 94904 45744 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈవీఎంల భద్రత పరిశీలన ధర్మవరం రూరల్: స్థానిక మార్కెట్ యార్డ్లోని గోదాములో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం)ను జేసీ అభిషేక్ కుమార్ మంగళవారం పరిశీలించారు. గోదాముకు వేసిన సీళ్లు, సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక పరికరాలు తదితర వాటిని పరిశీలించారు. జేసీ వెంట ఆర్డీఓ మహేష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు.చెర్లోపల్లి – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దష్ట్యా చెర్లోపల్లి – తిరుపతి మధ్య వయా వికారాబాద్, గుంతకల్లు, కడప మీదుగా ప్రత్యేక రైళ్లును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి గురు, శుక్రవారాల్లో ఈ రైళ్లు నడుస్తాయన్నారు. మే 8వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ రాకపోకలు ఉంటాయని పేర్కొన్నారు. చెరోపల్లి నుంచి ఈ రైలు (07257) 8వ తేదీ (గురువారం) సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు తిరుపతి జంక్షన్కు చేరుతుందన్నారు. తిరిగి అదే రైలు (07258) అదే రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి శనివారం తెల్లవారుజూమున 4.30 గంటలకు చెర్లోపల్లి జంక్షన్ చేరుతుందన్నారు. ఈ రైలు సనత్నగర్, లింగంపల్లి, వికరాబాద్, తాండూరు, యాద్గిరి, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రాజంపేట, రేణుగుంట మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. -
తాగి బండి నడిపితే జైలుకు పంపండి
ప్రశాంతి నిలయం: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని, హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి రోడ్ సెఫ్టీ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. అధ్యక్షత వహించిన కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ... జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించాలన్నారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్ స్కూళ్ల బస్సులను కచ్చితంగా తనిఖీ చేయాలన్నారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ.. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జాతీయ రహదారుల్లోని ధాబాలు, రెస్టారెంట్లలో సీసీ కెమెరాలు అమర్చేలా చూడాలన్నారు. సమావేశంలో కదిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎన్హెచ్ఏ అధికారి భరత్, డీఈఓ కృష్టప్ప తదితరులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం -
శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు
పుట్టపర్తి టౌన్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్న పోలీస్ అధికారులను ఆదేశించారు. నేరస్తులకు శిక్ష పడేలా సమగ్ర విచారణ జరపాలన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్సు హాలులో డీఎస్పీలు, సీఐలతో ఎస్పీ రత్న నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. గ్రేవ్, నాన్గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ, పోక్సో, మర్డర్, చోరీ కేసులపై సమీక్షించారు. అనంతరం కేసులు పురోగతిలో ప్రతిభ కనబరచిన పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రత్న మాట్లాడుతూ...పోలీసులు గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకం కావాలన్నారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వివిధ స్టేషన్ల పరిధిలో నమోదయ్యే కేసుల వివరాలు ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్లో పొందుపరచాలన్నారు. వేసవిలో చోరీల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అనుమానిత వ్యక్తులు కదలికలతో పాటు వాహనాల తనిఖీలు పెంచాలన్నారు. పోక్సో, లైంగిక దాడుల కేసుల్లో పక్కా సాక్ష్యాధారాలను కోర్టులకు సమర్పించి నేరస్తులకు శిక్షపడేలా చూడాలన్నారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. కేసు నమోదైన 60 రోజుల్లోపు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఉమెన్ హెల్ప్ డెస్క్ ద్వారా అందే ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. పోలీస్ అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాలో నేరాల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్పీలు విజయకుమార్, శివన్నారాయణస్వామి, నరసింగప్ప, హేమంత్కుమార్, లీగల్ అడ్వయిజర్ సాయినాథ్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, ఎస్ఐ ప్రదీప్ కుమార్ పాటు సిబ్బంది పాల్గొన్నారు. నేరస్తులకు శిక్ష పడేలా సమగ్ర విచారణ చేయండి కేసుల దర్యాపు వేగవంతం కావాలి నేర సమీక్షలో ఎస్పీ రత్న -
తవ్వుకో..తరలించుకో
హిందూపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే ‘తెలుగు తమ్ముళ్లు’ ప్రకృతి వనరులను చెరబట్టారు. నదులు, చెరువుల్లోని ఇసుకను అక్రమంగా తవ్వుకుని సొమ్ముచేసుకుంటున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో హిందూపురం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రోజూ వందలాది వాహనాల్లో తరలింపు హిందూపురం నియోజకవర్గంలో కుముద్వతి, కుషావతి, పెన్నా నదుల పరివాహక ప్రాంతాల్లోని ఇసుకను టీడీపీ నేతలు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. ముఖ్యంగా హిందూపురం మండలం సుగూరు, బోరెడ్డిపల్లి, బేవనహళ్లి, సంజీవరాయుడిపల్లి, కిరికెరతోపాటు చిలమత్తూరు పరిధిలో కుషావతి నది పరీవాహకంలోని బలిజపల్లి, నల్లరాళ్లపల్లి, అప్పనపల్లి, దేవరపల్లి, కొడికొండ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు. అలాగే చిత్రావతి నది సమీపంలో శెట్టిపల్లి, తిమ్మాడిపల్లి ప్రాంతంలోనూ ఇష్టానుసారం ఇసుకను తవ్వుకుని ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొందరు తూమకుంట, సంతేబిదనూర్, బేవనహళ్లి ప్రాంతాల్లోని అసైన్డ్ భూముల్లోని ఇసుక తవ్వుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో తవ్విన ఇసుకను ట్రాక్టర్ల ద్వారా జాతీయ రహదారి మీదుగా కర్ణాటక ప్రాంతంలో నూతనంగా వేస్తున్న లేఅవుట్లకు తరలిస్తున్నారు. ఇలా రోజూ 100 నుంచి 150 లోడ్లు వరకు డంప్ అవుతుంటాయని సమాచారం. ట్రాక్టర్ ఇసుక రూ.2,500 వేల నుంచి రూ.3,500 వేలకు విక్రయిస్తున్నారు. ఇసుక క్వాలిటీని బట్టి టిప్పర్ రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేసుకుంటున్నారు. కళ్లప్పగించి చూస్తున్న అధికారులు హిందూపురంలోని కిరికెర, బేవనహళ్లి, సంతేబిదనూర్, కంచినపల్లి ప్రాంతాల్లోని ఇసుకను రాత్రిపూట కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందస్తుగా ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుకను ఓ రహస్య ప్రాంతంలో డంప్ చేసి ఆ తర్వాత అవసరమైన ప్రాంతాలకు టిప్పర్ల ద్వారా సరఫరా చేస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణా తూమకుంట చెక్పోస్టు మీదుగానే సాగుతున్నా... పోలీసులు, విజిలెన్స్ అధికారులు కళ్లప్పగించి చూస్తూ ఉండిపోతున్నారు. హిందూపురంలో జోరుగా ఇసుక అక్రమ రవాణా నది పరీవాహక ప్రాంతాల్లో భారీగా తవ్వకాలు రోజూ వందల ట్రాక్టర్లతో కర్ణాటకకు తరలింపు పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులుకఠిన చర్యలు తప్పవు నదీ పరీవాహక ప్రాంతాలు, చెరువుల వద్ద ఇసుకను తవ్వుకోవడం, రవాణా చేయడం నేరం. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇసుక అక్రమంగా రవాణా చేసే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం. – మహేష్, డీఎస్పీ, హిందూపురం -
ఆర్ఎస్కే సిబ్బంది హేతుబద్ధీకరణకు ఆమోదం
అనంతపురం అగ్రికల్చర్: రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే)లో పనిచేస్తున్న సిబ్బంది హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్)కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో మంగళవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి, ఉద్యానశాఖ డీడీ ఫిరోజ్ఖాన్, సూపరింటెండెంట్ బాషా, హెచ్ఓ రత్నకుమార్, సెరికల్చర్ ఆఫీసర్ డి.ఆంజనేయులు, టెక్నికల్ ఏఓ వెంకట్కుమార్ తదితరులు సమావేశమై చర్చించారు. రేషనలైజేషన్ లేదా రీడెప్లాయిమెంట్ (పునర్విభజన) పేరుతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 450 ఆర్బీకేలకు సిబ్బంది సర్దుబాటు ప్రక్రియ మొదలు పెట్టారు. ఉమ్మడి జిల్లా ఆధారంగా రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియను ముగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆర్ఎస్కే ఇన్చార్జిలుగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ (వీఏఏ), విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ (వీహెచ్ఏ), విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్స్ (వీఎస్ఏ) పనిచేస్తున్నారు. అలాగే కొన్ని ఆర్ఎస్కేలకు ఔట్సోర్సింగ్ పద్దతిలో మల్టీ పర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు (ఎంపీఈఓలు) పనిచేస్తున్నారు. రేషనలైజేషన్ కింద సిబ్బందిని సర్దుబాటు చేసే క్రమంలో 1000 నుంచి 1,500 ఎకరాలకు ఒకరిని నియమించనున్నారు. 2024 ఖరీఫ్, 2025 రబీ ఈ–క్రాప్లో నమోదైన పంటల విస్తీర్ణం ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆయా మండలాలు, గ్రామాలు, ఆర్ఎస్కేల పరిధిలో వ్యవసాయ, ఉద్యాన, మల్బరీ పంటల విస్తీర్ణాన్ని బట్టి... ఏది ఎక్కువగా ఉంటే ఆ శాఖ సిబ్బందికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. -
ఒంటరి జీవితాన్ని తాళలేక రాలిన పండుటాకు
● ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడు అనంతపురం: ఒంటరి జీవితంపై విరక్తితో ఓ పండుటాకు రాలిపోయింది. మృతి చెందిన భార్య జ్ఞాపకాలు వెంటాడుతుంటే మలివయస్సులో అర్ధంతరంగా తనువు చాలించాడో ఓ వృద్ధుడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని రెవెన్యూ కాలనీ, షిర్డీనగర్లో నివాసముంటున్న కళ్లమడి నరసింహారెడ్డి (90)కి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె లక్ష్మీనరసమ్మను ఉరవకొండ మండలం ధర్మపురి గ్రామానికి చెందిన జయరామిరెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. కుమారుడు ప్రభాకరరెడ్డి విజయవాడలోని ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం భార్య మృతి చెందడంతో మానసికంగా కుదేలైన నరసింహారెడ్డి కొంత కాలం విజయవాడలో కుమారుడి వద్ద ఉన్నారు. అయితే తనకు కాలక్షేపం కావడం లేదని, అనంతపురానికి పోతానంటూ పట్టుపడడంతో కుమారుడు కాదనలేకపోయాడు. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా అనంతపురంలోని సొంతింటిలోనే ఒంటరిగా ఉంటున్న నరసింహారెడ్డి బాగోగులు చూసుకునేందుకు ఓ మనిషిని ఏర్పాటు చేశారు. రెండు నెలలకోసారి కుమారుడు వచ్చి తండ్రి బాగోగులు చూసుకుని కుమారుడు వెళ్లేవారు. కష్ట కాలంలో తనకు తోడుగా భార్య లేదంటూ పలువురితో చెప్పుకుని బాధపడే నరసింహారెడ్డి మంగళవారం ఇంట్లోని హాల్లో ఫ్యాన్కు పంచతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గుర్తించిన ప్రభాకరరెడ్డి పిన్నమ్మ వెంటనే ఆయనకు ఫోన్ చేసి తెలిపింది. దీంతో విజయవాడ నుంచి బయలుదేరిన ఆయన సాయంత్రం ఇంటికి చేరుకుని, బంధువుల సాయంతో తలుపు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించి తండ్రి మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న అనంతపురం మూడో పట్టణ సీఐ శాంతిలాల్ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నెట్టికంటుడికి కిలో వెండి బహూకరణ గుంతకల్లు రూరల్: మండలంలోని కసాపురంలో వెలసిన నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి డి.హీరేహాళ్ మండలం పులకుర్తి గ్రామానికి చెందిన భక్తుడు బి.శ్రీధర్రెడ్డి కిలో బరువున్న వెండి సామగ్రిని బహూకరించారు. ఈ సందర్భంగా దాతల కుటుంబ సభ్యుల పేరున ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. తాళం వేసిన ఇంట్లో చోరీ గుంతకల్లు రూరల్: స్థానిక కసాపురం రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయం వెనుక నివాసముంటున్న రైల్వే విశ్రాంత ఉద్యోగి సూర్యనారాయణ రాజు ఇంట్లో చోరీ జరిగింది. తన కుటుంబసభ్యులతో కలసి ఇంటికి తాళం వేసి ఆయన రెండు రోజలు క్రితం పుట్టపర్తిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం తిరిగి వచ్చారు. అప్పటికే తలుపులు తీసి ఉండడం గమనించి సమాచారం ఇవ్వడంతో సీఐ ప్రవీణ్కుమార్, కసాపురం పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బీరువాలోని 6 తులాల బంగారు నగలు, రూ.12 వేల నగదు అపహరించినట్లుగా గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
మహిళా చైతన్యానికి సైకిల్యాత్ర
● పర్వతారోహకురాలు, సైకిలిస్ట్ సమీరాఖాన్ అనంతపురం అర్బన్: మహిళ సాధికారత, వరకట్న వేధింపులు, గృహహింసపై దేశ వ్యాప్తంగా మహిళల్లో చైతన్యం కల్పించేందుకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు అనంతపురానికి చెందిన పర్వతారోహకురాలు, సైకిలిస్ట్ సమీరాఖాన్ తెలిపారు. తన యాత్ర నేపాల్ వరకూ సాగుతుందన్నారు. సైకిల్ యాత్రను కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా సాధికారత కింద ఎవరెస్ట్ పర్వతారోహణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోలో సైక్లింగ్ క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించే ముందు మహిళ సాధికారతపై దృష్టి పెట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి.ఉదయ్భాస్కర్, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టాలి ప్రశాంతి నిలయం: జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల రవాణా నివారణకు పోలీస్, ఫారెస్ట్, ఎకై ్సజ్ శాఖలు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్లు చేయాలన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేసే వారికి వేసే శిక్షల గురించి అందరికీ తెలిసేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే చెడు ప్రభావాలను వివరించాలని ఆదేశించారు. విద్యా సంస్థలు వద్ద కూడా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు జిల్లాలో ఈగల్ టీమ్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల రహిత జిల్లాగా శ్రీసత్యసాయిని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. మాదకద్రవ్యాల రవాణాకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. లారీలు, బస్సులు, రైలు ద్వారా రవాణా చేస్తున్నవారిని అందుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం మాదక ద్రవ్యాల నివారణకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. -
సనపకు పోటెత్తిన భక్త జనం
ఆత్మకూరు: మండలంలోని సనప గ్రామంలో ఊరి దేవరకు మంగళవారం భక్తులు పోటెత్తారు. 35 సంవత్సరాల తరువాత నిర్వహించిన ఊరి దేవరకు వేల సంఖ్యలో ప్రజలు రావడంతో సనప గ్రామం కిటకిటలాడింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో పెద్దమ్మ తల్లి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జంతువులను బలిచ్చారు. మంగళవారం భక్తులు అమ్మవారికి టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఇంట్లో మొక్కుబడిలో భాగంగా పొట్టేళ్లు, గొర్రెలను బలి ఇచ్చారు. బంధు మిత్రులతో కలసి విందు భోజనాలు చేశారు. గ్రామంలోకి వచ్చేందుకు ప్రజలకు గంటల సమయం పట్టింది. మూడు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
బీపీఈడీ ఫలితాల విడుదల
అనంతపురం: ఎస్కేయూ పరిధిలో బీపీఈడీ రెండో సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ఆచార్య బి.అనిత మంగళవారం విడుదల చేశారు. మొత్తం 63.51 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ జీవీ రమణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ లోకేశ్వర్లు, ఎస్కేయూ న్యాయశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. సీహెచ్ఓల వినూత్న నిరసన పుట్టపర్తి అర్బన్: తమ డిమాండ్లు నెరవేరే వరకూ నిరవధిక సమ్మె చేస్తామని ప్రతినబూనిన సీహెచ్ఓలు రెండవ రోజు సమ్మెలో భాగంగా డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ... జీతభత్యాల సమస్యతో పాటు గ్రాట్యూటీ, ఇంక్రిమెంట్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. మద్యం అక్రమ రవాణాను అరికట్టండి తనకల్లు: కర్ణాటక నుంచి మద్యం అక్రమ రవాణా కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఎకై ్సజ్ అధికారులను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య ఆదేశించారు. స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. పెండింగ్ కేసులను త్వరితగతిన విచారణ జరిపి చార్జిషీట్ దాఖలు చేయలన్నారు. నాటుసారా తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నాటుసారా తయారు చేస్తూ పట్టుబడిన వారితో పాటు బెల్లం విక్రేతపై కేసు నమోదు చేయాలన్నారు. మద్యం దుకాణాలపై డెకాయ్ ఆపరేషన్లు చేపట్టాలన్నారు. బెల్టు షాపులు నిర్వహించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్, సీఐ మారుతీరావు, తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్య మడకశిర: స్థానిక మారెమ్మ గుడి వీధిలో నివాసముంటున్న రాజశేఖర్(54) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన మేరకు.. బెంగళూరులో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజశేఖర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఇంటికి వచ్చిన ఆయన మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి బలవన్మరణం హిందూపురం: మండలంలోని తూముకుంట ఎస్సీ కాలనీ చెందిన రాజు(40) ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసైన ఆయన తాగుడుకు అలవాటు పడి తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం భార్యతో గొడవ పడిన రాజు.. ఇంటి పైభాగానికి చేరుకుని సిమెంట్ పిల్లర్కు లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
రూ. కోట్ల విలువైన భూమి స్వాహా
ధర్మవరం రూరల్: రూ. కోట్లు విలువైన పట్టా భూమిని ఆన్లైన్లో మరొకరి పేరుపై బదలాయింపు జరిగింది. విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన రైతులు లబోదిబోమంటున్నారు. ఈ అంశంలో రెవెన్యూ అధికారుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మంగళవారం తహసీల్దార్ను బాధిత రైతులు కలసి ఫిర్యాదు చేశారు. వివరాలు... కనగానపల్లి మండలం మామిళ్లపల్లికి చెందిన ఆదినారాయణరెడ్డి ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన కృష్ణమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కుణుతూరు రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 351–2 లెటర్లో ఉన్న 4.54 ఎకరాల పట్టా భూమిని కృష్ణమ్మకు 2008లో ఆమె తల్లి వెంకటలక్ష్మమ్మ రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. అయితే ఈ అంశంపై కృష్ణమ్మ కుటుంబసభ్యుల మధ్య వివాదం చోటు చేసుకుని అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ భూమిపై కొందరు కన్నేశారు. ఆ భూమితో వారికి ఎలాంటి సంబంధం లేకపోయినా... మిగులు భూమి కింద చూపి రెవెన్యూ అధికారులను లోబర్చుకుని భారతి అనే మహిళ పేరుపై ఆన్లైన్లో మార్పు చేయించారు. అంతటితో ఆగకుండా వెనువెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఇటీవల విషయం తెలుసుకున్న కృష్ణమ్మ కుటుంబసభ్యులు మూకుమ్మడిగా మంగళవారం తహసీల్దార్ నటరాజ్ను కలసి ఫిర్యాదు చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించారు. మొత్తం ఈ అక్రమాల్లో రెవెన్యూ అధికారుల ప్రమేయముందని, ఇందు కోసం రూ.5 లక్షల వరకు చేతులు మారినట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న అధికారులు జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు సమయం కోరినట్లు తెలిసింది. కాగా, ధర్మవరం పట్టణానికి సమీపంలో ఉన్న ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ. కోట్లు ఉంటుందని రియల్టర్లు అంటున్నారు. ఈ విషయమై తహసీల్దార్ నటరాజ్ మాట్లాడుతూ.. రికార్డులను పరిశీలించి తప్పిదాలు చోటు చేసుకుని ఉంటే సరిచేస్తామని పేర్కొన్నారు. ఆన్లైన్లో మరొకరి పేరుపై బదలాయింపు రెవెన్యూ అధికారుల ప్రమేయంపై అనుమానాలు భగ్గుమంటున్న బాధితులు -
రెడ్డప్పశెట్టి ‘పాలీహౌస్ సబ్సిడీ’పై విచారణ
చిలమత్తూరు: రియల్టర్ రెడ్డెప్పశెట్టి పాలీహౌస్ల పేరుతో అక్రమంగా రూ.కోట్లు లబ్ధిపొందడంపై ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన ‘‘అక్రమాలు కోకొల్లలు’’ కథనంపై ఉద్యాన శాఖ అధికారులు స్పందించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉద్యానశాఖ అధికారి మహేష్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. ఆయా సంవత్సరాల్లో సబ్సిడీ పొందిన వారి వివరాలను పరిశీలిస్తున్నారు. రెడ్డెప్పశెట్టి ఎస్టేట్ను కూడా అధికారులు పరిశీలించి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక సబ్సిడీ ముసుగులో రెడ్డెప్పశెట్టి, ఆయన బృందం చేసిన ప్రజాధనం లూటీపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఆయన అక్రమాలపైనే జోరుగా చర్చ జరిగింది. వామ్మో రూ.5.48 కోట్లు అవినీతి జరిగిందా..? అనే మాటలు సర్వత్రా వినపడ్డాయి. ఈ తరహా మోసాలు చూడటం ఇదే తొలిసారని చెబుతున్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగింది. ప్రజాధనం లూటీపై విచారణ జరపాలని నియోజకవర్గ ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
డీసీసీబీ, డీసీఎంఎస్లకు నూతన చైర్మన్ల నియామకం
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ కూటమి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్గా గార్లదిన్నె మండలానికి చెందిన టీడీపీ నాయకుడు ముంటిమడుగు కేశవరెడ్డి నియమించారు. అలాగే జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్గా కనగానపల్లి మండలానికి చెందిన టీడీపీ నాయకుడు నెట్టెం వెంకటేసును నియమించారు. డిమాండ్లు నెరవేర్చే వరకూ సమ్మె పుట్టపర్తి అర్బన్: తమ డిమాండు నెరవేర్చే వరకూ సమ్మెలో కొనసాగుతామని వైద్య, ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న సీహెచ్ఓలు స్పష్టం చేశారు. సోమవారం డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకూ బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు మాట్లాడుతూ... గత రెండేళ్లుగా జీతభత్యాల విషయంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సమస్యలను పరిస్కరించే వరకూ నిరవధిక సమ్మెలోకి వెళుతున్నామని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజబేగంకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ఎంసీఏ జిల్లా అధ్యక్షుడు కార్తీక్రెడ్డి, జనరల్ సెక్రెటరీ నందీశ్వరరెడ్డి, చందన, వేణుగోపాల్, ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రామమోహన్, నాయకులు శంకర్, జగదీష్, బాబాఫకృద్దీన్, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచండి : డీఐఈఓపెనుకొండ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి మెరుగైన ఫలితాలు రాబట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధ్యాపకులకు డీఐఈఓ సయ్యద్ మౌలా సూచించారు. పెనుకొండలోని కళాశాలలో నిర్వహిస్తున్న ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను సోమవారం పరిశీలించారు. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బొటనీ సబ్జెక్టులకు బోధనా విధానాలపై ఆన్లైన్లో అందిస్తున్న శిక్షణను పరిశీలించారు. అనంతరం ఆయన విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలో అధికంగా చేరడానికి తగిన దృష్టి సారించాలన్నారు. అనంతరం ఆయనను ప్రిన్సిపాల్ సుదర్శన్, అధ్యాపకులు సన్మానించారు. హౌస్ వైరింగ్పై ‘రూడ్సెట్’లో ఉచిత శిక్షణ అనంతపురం: ఎస్కేయూ సమీపంలోని రూడ్సెట్ సంస్థలో మే 6 నుంచి జూన్ 4వ తేదీ వరకూ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్పై యువకులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 18 నుంచి 45 సంవత్సరాల్లోపు వయస్సు, రేషన్కార్డు, ఆధార్కార్డు కలిగి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు అర్హులు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వసతి ఉంటుంది. పూర్తి వివరాలకు 94925 83434లో సంప్రదించవచ్చు. -
పునర్వ్యవస్థీకరణలో అసంబద్ధాలు తొలగించండి
కదిరి అర్బన్: పాఠశాలల పునర్ వ్యవస్థీకరణలో అసంబద్ధాలను తొలగించాలని కూటమి ప్రభుత్వాన్ని ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కదిరికి విచ్చేసిన డీఈఓ కృష్ణప్పకు ఫ్యాప్టో చైర్మన్ హరిప్రసాద్, కో చైర్మన్ షామిల్లా వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. నిబంధనలకు అనుగుణంగా పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల తీర్మానాలతో పాఠశాల పునర్ నిర్మాణ ప్రక్రియ చేపట్టాలన్నారు. చాలా ప్రాంతాల్లో పాఠశాల కమిటీ తీర్మానాలను పరిగణనలోకి తీసుకోకుండా పునర్నిర్మాణ ప్రక్రియ చేపడుతుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉర్దూ సెక్షన్ ఉన్న తెలుగు మీడియం పాఠశాలల్లో ఉర్దూ పోస్టులను రద్దు చేయడం జరిగిందన్నారు. ఉన్నఫలంగా ఉర్దూ సెక్షన్, ఉర్దూ పోస్టులను రద్దు చేయడంతో ఉర్దూ మాధ్యమం చదివే పిల్లల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో అతావుల్లా, ఆష్రఫ్, వాజిద్, సొహెల్, గౌస్ అహమ్మద్, తదితరులు ఉన్నారు. -
తెలంగాణ సీఎస్గా ఏపీఆర్ఎస్ పూర్వ విద్యార్థి
పరిగి: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఏపీఆర్ఎస్ కొడిగెనహళ్లి పూర్వ విద్యార్థి కె.రామకృష్ణారావు నియమితులయ్యారు. ఉమ్మడి అనంతపురం జిల్లా గుత్తికి చెందిన రామకృష్ణారావు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ గుత్తి కోటలోని 8వ వార్డు స్కూల్లో చదువుకున్నారు. అనంతరం కొడగినహళ్లి ఏపీఆర్ఎస్లో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం సాగించారు. అనంతరం నాగార్జున సాగర్లో ఇంటర్, కాన్పూర్ ఐఐటీలో బీటెక్, ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్, డ్యూక్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశారు. 1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రామకృష్ణారావు అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ (హైదరాబాద్)లో సెటిల్ అయ్యారు. తెలంగాణ ఆర్థిక కార్యదర్శిగా కూడా పని చేశాడు. రామకృష్ణారావు తెలంగాణ సీఎస్గా ఎంపిక కావడంతో ఏపీఆర్ఎస్ పాఠశాల ప్రిన్సిపాల్ మురళీధర్ బాబు, ఉపాధ్యాయ బృందం, పూర్వవిద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. తమ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి చీఫ్ సెక్రటరీ హోదాలో ఉండటం తమకెంతో గర్వకారణమన్నారు. -
బాలికను కాపాడిన పోలీసులు
హిందూపురం: మైనర్ బాలికను సురక్షితంగా కాపాడి తల్లిదండ్రుల చెంతకు పోలీసులు చేర్చారు. వివరాలు...హిందూపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల వయసున్న బాలికను పరిగి మండలం బీచగానిపల్లికి చెందిన ఓ యువకుడు సోమవారం తనతో పాటు పిలుచుకెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు తెలిపారు. స్పందించిన డీఎస్పీ మహేష్ ఆదేశాలతో రూరల్ సీఐ ఆంజనేయులు, ఎస్ఐ మునిప్రసాద్, సిబ్బంది బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సోమందేపల్లి మండలం వెలగమాకులపల్లి తండా గుట్టల్లో ఉన్నట్లుగా గుర్తించి, ఎస్ఐ మునిప్రతాప్, ఎఎస్ఐ జయరామిరెడ్డి, సోమందేపల్లి ఎస్ఐ రమేష్ అక్కడకు వెళ్లి రాత్రి 7 గంటల సమయంలో యువకుడితో పాటు మైనర్ బాలికను హిందూపురం రూరల్ పీఎస్కు పిలుచుకువచ్చారు. కౌన్సెలింగ్ అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. యువకుడి దుర్మరణం పావగడ: రోడ్డు పక్కన నిలబడిన లారీని వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహన చోదకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... పావగడ తాలూకా క్యాతగానచెర్లు గ్రామానికి చెందిన కురుబ సుబ్బిరెడ్డి, లక్షీదేవి దంపతుల నాల్గవ కుమారుడు ప్రదీప్(23) తుమకూరులోని ఓ ద్విచక్రవాహనాల షోరూంలో మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని చేదోడుగా నిలిచాడు. ఆదివారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై శిరా గేట్ ప్రాంతానికి బయలుదేరిన ఆయన.. జోరుగా వర్షం కురుస్తుండడంతో రోడ్డు సరిగా కనపడక ఎదురుగా నిలబడిన లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బీటెక్ ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బీటెక్ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ ఫలితాలను ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి సోమవారం విడుదల చేశారు. పరీక్షలు జరిగిన 15 రోజుల్లోనే ఫలితాల విడుదలకు కృషి చేసిన డిప్యూటీ కంట్రోలర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కే. మాధవి, డాక్టర్ డి .లలిత కుమారి కృషి ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ అనంతపురం పాలకమండలి సభ్యుడు ఎం.రామశేఖర్రెడ్డి, విభాగాధిపతులు టి.నారాయణరెడ్డి, జి.మమత, కళ్యాణ్కుమార్, అజిత, జరీనా పాల్గొన్నారు. -
క్వింటా చింతపండు రూ.19 వేలు
హిందూపురం అర్బన్: క్వింటా చింతపండు గరిష్టంగా రూ.19 వేలు పలికింది. సోమవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్కు 450.60 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలంపాట నిర్వహించారు. ఇందులో కరిపుళి రకం చింతపండు గరిష్టంగా రూ.19 వేలు, కనిష్టంగా రూ. 8,100, సరాసరిన రూ.14 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 12 వేలు, కనిష్టంగా రూ.4,200, సరాసరిన రూ. 8 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు. 15న ‘మడకశిర’లో బలపరీక్ష ● చైర్పర్సన్, వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ● కౌన్సిలర్లు అందరూ హాజరుకావాలని నోటీసులు మడకశిర: స్థానిక మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది. అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే 13 మంది కౌన్సిలర్లు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో మే నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. అదేరోజు మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఈ సమావేశానికి కౌన్సిలర్లందరూ హాజరు కావాలని సోమవారం అధికారులు నోటీసులు జారీ చేశారు. మడకశిర మున్సిపాలిటీలో 20 వార్డులుండగా... గత ‘స్థానిక’ ఎన్నికల్లో 15 స్థానాలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. టీడీపీ ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక మున్సిపల్ పీఠంపై కన్నేసిన టీడీపీ నాయకులు 8 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకున్నారు. అనంతరం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. 19 మండలాల్లో వానపుట్టపర్తి అర్బన్: వాతావరణంలో ఒక్కసారి మార్పులు చోటుచేసుకోగా, ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ జిల్లాలోని 19 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మడకశిరలో 39.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక సీకేపల్లి 17.2, ధర్మవరం 16.4, గుడిబండ 16.2, అగళి 11.4, కనగానపల్లి 10.2, బత్తలపల్లి 9.2, రొళ్ల 7.2, పరిగి 4.2, అమరాపురం 2.6, కదిరి 2.2, రామగిరి 2.2, నల్లచెరువు 2.0, హిందూపురం 1.8, గాండ్లపెంట 1.6, తాడిమర్రి 1.2, బుక్కపట్నం, పుట్టపర్తి మండలాల్లో ఒక సెంటీమీటరు చొప్పున, కొత్తచెరువు మండలంలో 0.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. రాగల నాలుగు రోజులూ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు, జీవాల కాపర్లు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భారీ వర్షంతో నేలకొరిగిన చెట్లు పరిగి: మండలంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మోదా, శ్రీరంగరాజుపల్లి, కొడిగెనహళ్లి, పరిగి, తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొడిగెనహళ్లిలో అంధుల ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో పలు చెట్లు నేలకొరిగాయి. చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లపై పడటంతో సేవా మందిరం విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో అన్ని గ్రామాల్లో అంధకారం నెలకొంది. సబ్సిడీతో డ్రిప్పు, స్ప్రింక్లర్లు పుట్టపర్తి అర్బన్: అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం సబ్సిడీ డ్రిప్పు, స్ప్రింక్లర్ల (2025–26 సంవత్సరానికి) అందిస్తోందని ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్ ఒక ప్రకటనలో తెలిపారు. బోరు బావి ఉన్న రైతులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. డ్రిప్పును సంబంధించి 5 ఎకరాల వరకూ 90 శాతం, 10 ఎకరాల వరకూ 70 శాతం, స్ప్రింక్లర్లకు సంబంధించి 5 ఎకరాల వరకూ 55 శాతం, 5 నుంచి 12.5 ఎకరాల వరకూ 45 శాతం సబ్సిడీ వర్తిస్తుందన్నారు. -
టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారు
పుట్టపర్తి టౌన్: తమ సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే టీడీపీ నేతలు అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో డీఎస్పీ విజయ్కుమార్ను కలసి వినతి పత్రం అందజేసి, తమ గోడు వెల్లబోసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పుట్టపర్తి మండలం బుగ్గపల్లి గ్రామానికి చెందిన నిడిమామిడప్పకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మూగవాడు, రెండో కుమారుడు జీవనాధారం కోసం అనంతపురానికి వలస వెళ్లాడు. నిడిమామిడప్పకు అదే గ్రామంలో 2007లో సర్వే నంబర్ 349లో అప్పటి ప్రభుత్వం రెండు సెంట్ల స్థలాన్ని మంజూరు చేస్తూ పట్టా ఇచ్చింది. 2023లో ఆర్టీటీ సౌజన్యంతో పునాది ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇంటి పట్టా చెల్లదంటూ అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు నలుగురు దౌర్జన్యానికి దిగారు. పోరంబోకు భూమిలో పునాదులు వేశారంటూ పెకలించి వేశారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే నిడిమామిడప్పకు అనుకూలంగా తీర్పు వెలువడింది. అయినా టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తూనే ఉన్నారు. ఈ విషయంగా తమకు న్యాయం చేయాలంటూ గతంలో కలెక్టర్, ఎస్పీకు ఫిర్యాదు చేసినా న్యాయం చేకూరలేదని బాధితులు వివరించారు. ఇప్పటికై నా క్షేత్రస్థాయిలో పరిశీలించి తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నామని పేర్కొన్నారు. సమస్యపై స్పందించిన డీఎస్పీ విజయ్కుమార్ వెంటనే సంబంధిత సీఐకి ఫోన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ● జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 65 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ, పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్న బాధితులు ‘పోలీసు స్పందన’కు 65 వినతులు -
భద్రత లేని ప్రయాణం
హిందూపురం అర్బన్: వాహనం ఎక్కిన వారు తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుకుంటారనుకునే పరిస్థితులు పోయాయి. సరైన భద్రతా ప్రమాణాలు, రహదారులపై సిగ్నలింగ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలో చోటు చేసుకుని పలువురు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు వైకల్యం బారిన పడుతున్నారు. ఈ పరిస్థితి 544ఈ జాతీయ రహదారితో పాటు 44వ జాతీయ రహదారిపై మరీ దారుణంగా మారింది. జాతీయ రహదారుల్లో మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాల సంఖ్య ఏటా పెరుగుతూ ఉంది. మూడేళ్ల క్రితం నూతనంగా నిర్మించిన ఎన్హెచ్ 544ఈపై చిలమత్తూరు, టేకులోడు మలుపుల వద్ద ఏర్పాటు చేసిన సోలార్ లైటింగ్ వ్యవస్థ పని చేయడం లేదు. లేపాక్షి లోకి వెళ్లే చోట పిల్లగుండ్లు, నవోదయ సమీపంలో మలపుల వద్ద సరైన భద్రతా ప్రమాణాలు లేవు. డివైడర్లను క్రమ పద్దతిలో ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొల్లకుంట వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ప్రమాదాల నివారణకు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం గమనార్హం. మచ్చుకు కొన్ని.. ● హిందూపురం నుంచి గోరంట్ల, కదిరి వెళ్లే వాహనదారులు పాలసముద్రం క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిని దాటాల్సి ఉంది. ఈ ప్రాంతంలో అతివేగంగా వాహనాలు వెళుతుంటాయి. అండర్బ్రిడ్జి లేకపోవడంతో అటు వైపు నుంచి వస్తున్న వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇదే పరిస్థితి కొడికొండ చెక్పోస్టు వద్ద నెలకొంది. ● హిందూపురం–కదిరి రహదారి మరమ్మతుల కారణంగా రోజూ ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకుంటూనే ఉంది. రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ రహదారుల మలుపులు వద్ద, ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడమే ఇందుకు కారణంగా పలువురు ఆరోపిస్తున్నారు. ● చిలమత్తూరు సమీపంలోని చేనేపల్లి క్రాస్ వద్ద జాతీయ రహదారి క్రాస్ చేయాలి. అక్కడ నిత్యం ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఈ మూడేళ్లలో ఐదుగురు అక్కడ మృత్యువాతపడగా, 12 మంది క్షతగాత్రులయ్యారు. ● చిలమత్తూరు మీదుగా టేకులోడు క్రాస్కు వెళ్లే రహదారిలో బైరేకుంట వద్ద మలుపు ఉంది. రహదారి ఓ వైపు దింపుగా ఉండడంతో అటుగా వెళ్లే వాహనాలు, వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. 20 రోజుల క్రితం ఇదే మలుపు వద్ద ఓ మహిళ బస్సు నుంచి జారి పడి మృతి చెందింది. ● జాతీయ రహదారి 544ఈ లో చిలమత్తూరు, టేకులోడు మలుపుల వద్ద చిలమత్తూరు రోడ్డుకు కలిపే రోడ్డు వద్ద సరైన జాగ్రత్తలు చేపట్టలేదు. ఏడాది క్రితం కారు ఢీ కొనడంతో చామలపల్లికి చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి రోడ్డు డివైడర్లు రాత్రి సమయంలో అస్సలు కనిపించవు. ఇక సోలార్ లైట్లు అలంకార పప్రాయమయ్యాయి. ● 44వ జాతీయ రహదారిపై కొడికొండ చెక్పోస్టు, కోడూరు, పాలసముద్రం క్రాస్ల వద్ద తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల నివారణకు ఇప్పటికే పలు సర్వేలు చేసినా.. ఆచరణలో అమలుకు నోచుకోలేదు. మూడేళ్లలో ఆరుగురు చనిపోగా.. 8 మంది గాయపడ్డారు. కోడూరు వద్ద ప్రమాదాలు జరిగినప్పుడు సమీప గ్రామాల వారు ధర్నాలు చేస్తే ఆ సమయంలో స్పందించే అధికారులు... తర్వాత ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ● జాతీయ రహదారులపై ఆటోల నిషేధం ఉన్నా.. తప్పని పరిస్థితుల్లో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు తరచూ ఆటోలను ఆశ్రయించడం తప్పడం లేదు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులను తరలిస్తుండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ‘ఎన్హెచ్ 544ఈ’లో ప్రమాదకరంగా మలుపులు ఎన్హెచ్ 44లోనూ ఇదే పరిస్థితి చర్యలు తీసుకుంటాం జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఆర్అండ్బీ అధికారులు, పోలీసులను సమన్వయం చేసుకుని గుర్తిస్తాం. ఈ క్రమంలోనే ప్రమాదాలపై ప్రజలు అందజేసిన అర్జీలనూ పరిగణనలోకి తీసుకుని కలెక్టర్, ఎన్హెచ్ అథారిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రమాదాల నివారణపై చర్యలు తీసుకుంటాం. – కరుణసాగర్రెడ్డి, జిల్లా రవాణాధికారి -
‘తమ్ముళ్ల’ తన్నులాట!
● రచ్చకెక్కిన భూ తగాదాలు ● సాలక్కగారి శ్రీనివాసులు రుబాబు ● మైలసముద్రం సుబ్రమణ్యంపై దాడి ● కొత్తచెరువు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కొత్తచెరువు: పుట్టపర్తి నియోజకవర్గంలో ‘తెలుగు తమ్ముళ్లు’ భూ తగాదా పోరు రచ్చకెక్కింది. రెండు రోజుల క్రితం కొత్తచెరువులో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ భూ తగాదాలో రౌడీషీటర్, టీడీపీ నాయకుడు సాలక్క గారి శ్రీనివాసులు తన అనుచరులతో కలిసి మైలసముద్రం సుబ్రహ్మణ్యంపై దాడి చేశాడు. బాధితుడు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏం జరిగిందంటే... కొత్తచెరువు నుంచి పెనుకొండకు వెళ్లే మార్గంలో తిప్పాబట్లపల్లి రెవెన్యూ పొలం సర్వే నంబరు 71–1లో మూడెకరాల పొలం ఉంది. ఆ పొలంపై బ్రాహ్మణులకు ఎలాంటి హక్కులు లేవు. కానీ బ్రాహ్మణుల నుంచి ఆ భూమి కొన్నట్లు సాలక్కగారి శ్రీనివాసులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అమ్మకానికి పెట్టాడు. భూమి కొనేందుకు సిద్ధమైన వ్యక్తి టీడీపీ నాయకుడు మైలసముద్రం సుబ్రహ్మణ్యంకు స్నేహితుడు కావడంతో భూమి కొనుగోలు విషయం చర్చకు రాగా.. అసలు విషయం బయట పడింది. ఈ క్రమంలో భూమి కొనదలచిన వ్యక్తి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. దీనంతటికి మైలసముద్రం సుబ్రహ్మణ్యమే కారణమని భావించిన సాలక్కగారి శ్రీనివాసులు ఆగ్రహంతో ఊగిపోయాడు. శనివారం రాత్రి నాలుగు రోడ్ల కూడలిలోని అన్నపూర్ణ హోటల్లో ఉన్న సుబ్రహ్మణ్యం వద్దకు వెళ్లి గొడవకు దిగాడు. తన భూమిని విక్రయించకుండా అడ్డుకుంటావా... అంటూ అంటూ సాలక్కగారి శ్రీనివాసులు, అతడి అనుచరులు దాడి చేశారు. దాడిలో గాయపడిన సుబ్రమణ్యం కొత్తచెరువు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. -
ప్రకృతి సిద్ధంగా మాగబెట్టాలి
పుట్టపర్తి అర్బన్: అరటి, మామిడి కాయలను ప్రకృతి సిద్ధంగా మాగబెట్టాలని పండ్ల వ్యాపారులకు ఫుడ్ ఇన్స్పెక్టర్ రామచంద్ర సూచించారు. జిల్లా ఉద్యాన అధికారి చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద, మార్కెటింగ్ ఏడీ నరసింహమూర్తితో కలసి సోమవారం కొత్తచెరువు మార్కెట్ యార్డులోని పండ్ల వ్యాపారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కాల్షియం కార్బైడ్ వాడకంతో కలిగే అనర్థాలను వివరించారు. మామిడి, అరటిని సహజ సిద్దంగా మగ్గబెడితే మంచి గిట్టుబాటు ధర లభ్యమవుతుందని, అంతేకాకుండా పండ్లు కూడా పాడవకుండా ఉంటాయన్నారు. 1న చెస్ పోటీలు ధర్మవరం అర్బన్: వచ్చే నెల 3, 4 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి అండర్–9 చెస్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే జిల్లా క్రీడాకారుల ఎంపిక కోసం మే 1న పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి నాగార్జున సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ధర్మవరంలోని కళాజ్యోతిలో ఓపెన్ అండర్–9 కేటగిరిలో ఇద్దరేసి చొప్పున బాలబాలికలను ఎంపిక చేయనున్నారు. ఆసక్తి ఉన్న చెస్ క్రీడాకారులు గురువారం ఉదయం 11గంటలకు పోటీలకు హాజరుకావాలి. పూర్తి వివరాలకు 99858 96901, 91770 32075లో సంప్రదించవచ్చు. ‘పురం’లో పెనుగాలుల బీభత్సం హిందూపురం టౌన్: పట్టణంలో సోమవారం సాయంత్రం పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటన్నర పాటు వర్షంతో పాటు విపరీతమైన గాలులు వీచడంతో ఆర్పీజీటీ రోడ్డు, రైల్వే రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, హోండా షోరూం ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆ సమయంలో హోండా షోరూం వద్ద ఉన్న ఆటోతో పాటు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. వాహనదారులకు ప్రాణాపాయం తప్పింది. మేళాపురం సమీపంలో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మేళాపురం వద్ద కాలువ పొంగి రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు పారింది. రైల్వే రోడ్డులో ఎక్కడికక్కడ నీరు నిలిచి పరిస్థితి దారుణంగా మారింది. -
అర్జీలు పరిష్కరించకపోతే చర్యలు
ప్రశాంతి నిలయం: ‘‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే ప్రతి అర్జీకి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ కొన్ని శాఖల అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నెలల తరబడి అర్జీలను పెండింగ్ ఉంచారు. ముఖ్యంగా రెవెన్యూ, సర్వే, పోలీస్ పంచాయతీ రాజ్, ఏపీఎస్పీడీసీఎల్ శాఖల పరిధిలో అత్యధిక గ్రీవెన్స్ అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. ఇకనైనా అధికారులు పద్ధతి మార్చుకుని అర్జీలకు పరిష్కారం చూపాలి. లేకపోతే కఠిన చర్యలు తప్పవు’’ అని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 231 అర్జీలు అందగా, వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం కలెక్టర్ చేతన్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి అర్జీకి అర్థవంతమై సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు నెలవారీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీల పరిష్కారంపై డీఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇక నుంచి ప్రతి శుక్రవారం జిల్లా ప్రణాళిక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జిల్లాలోని అన్ని శాఖల హెచ్ఓడీలతో వివిధ శాఖలకు సంబంధించిన నెలసరీ ప్రగతి నివేదికలపైన, పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తారన్నారు. ● అనంతరం ఆయన కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పరిశీలించారు. ప్రతి సోమవారం చిరుధాన్యాలకు సంబంధించిన స్టాల్స్ను నిర్వహించాలని సూచించారు. దివ్యాంగుడికి హామీ.. ఓడీ చెరువు మండలానికి చెందిన దివ్యాంగుడు శంకర సమస్యను కలెక్టర్ విన్నారు. 63 సెంట్లు భూమికి పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయాలని కోరగా, త్వరలోనే జాయింట్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఓ విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, డీఆర్డీఏ పీడీ నరసయ్య, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, పశుసంవర్ధక శాఖ జేడీ శుభదాస్, సెరికల్చర్ జేడీ పద్మావతి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సీపీఓ విజయ్ కుమార్, ల్యాండ్ సర్వే ఏడీఈ విజయశాంతి బాయి, ఎల్డీఎం రమణకుమార్, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్రెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ తిప్పేంద్రనాయక్, గిరిజన సంక్షేమ అధికారి మోహన్రావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫిరోజ్ బేగం, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. కౌమార బాలికల సాధికారతకు కృషి చేయాలి.. కౌమార బాలికల సాధికారత కోసం కృషి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ సమావేశం అనంతరం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘కిశోర వికాసం’ వాల్ పోస్టర్లను ఆయన అవిష్కరించారు. కిశోర వికాసం పేరుతో ప్రతి గ్రామం, వార్డులో కిశోర బాలికలకు ప్రతి మంగళవారం, శుక్రవారం 12 అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. మే 2వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకూ సమ్మర్ క్యాంప్ నిర్వహించాలన్నారు. కొన్ని శాఖల్లో పెండింగ్ అర్జీలు ఎక్కువగా ఉన్నాయి పనితీరు మార్చుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తాం అధికారులను హెచ్చరించిన కలెక్టర్ టీఎస్ చేతన్ -
సోలార్ నిర్మాణ పనులు అడ్డుకున్న రైతులు
ఎన్పీకుంట: పరిహారం చెల్లించేవరకూ తమ భూముల్లో సోలార్ ప్రాజెక్ట్ పనులు చేపట్టరాదంటూ సోమవారం నిర్వాసిత రైతులు ఆందోళన చేపట్టారు. ఎన్పీకుంట మండలం పెడబల్లి పంచాయతీలో ఎన్హెచ్పీసీ, ఇలియోస్ పవర్ కంపెనీ వారు చేపట్టిన నూతన సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భూములు కోల్పోయిన పలువురు రైతులకు ఇప్పటి వరకూ పరిహారం అందలేదు. దీంతో తమకు పరిహారం చెల్లించిన తరువాతనే పనులు చేపట్టాలని బాధిత రైతులు నిర్మాణ పనులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సోలార్ నిర్మాణం కోసం భూ సేకరణ చేసే సమయంలో ఎకరాకు రూ.5లక్షలు పరిహారం చెల్లిస్తామని తెలిపారన్నారు. ఇందులో కొందరు రైతులకు భూమికి బదులు భూమి ఇస్తామని, అలాగే ఉలవ పంట సాగు చేసిన రైతులకు పంట నష్ట పరిహారం కూడా ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఒక్క రూపాయి చెల్లించకుండా మోసం చేశారని వాపోయారు. సోలార్ ప్రాజెక్టు వలన ఇక్కడి రైతులకు, నిరుద్యోగ యువతకు ఎలాంటి ప్రయోజనం లేదని ధ్వజమెత్తారు. తమ భూములకు పరిహారం చెల్లించిన తరువాతనే పనులు చేపట్టాలని, అలాకాకుండా దౌర్జన్యంగా పనులు చేపడితే ఎంతవరకై నా పోరాటానికి తాము సిద్ధమని హెచ్చరించారు. -
పీఏబీఆర్లో తగ్గిన నీటిమట్టం
కూడేరు: ఇన్ఫ్లో లేక కూడేరు మండలం పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో నీటి మట్టం తగ్గింది. ఆదివారం నాటికి రిజర్వాయర్లో 2.62 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. జలాశయం వద్ద ఏర్పాటైన అనంతపురం, శ్రీసత్యసాయి, ఉరవకొండ తాగునీటి ప్రాజెక్ట్లకు రోజుకు సుమారు 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లీకేజీ, ఆవిరి రూపంలో సుమారు 60 క్యూసెక్కుల వరకు నీరు బయటకు వెళుతోంది. వృద్ధుడి బలవన్మరణం సోమందేపల్లి: జీవితంపై విరక్తితో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... సోమందేపల్లి మండలం మాగేచెరువు గ్రామానికి చెందిన రామప్ప (68)కు బార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు వెంకటేష్ ఇంట్లోనే నివాసముంటున్న ఆయన శనివారం రాత్రి అందరితో కలసి భోజనం ముగించుకుని నిద్ర పోయాడు. ఆదివారం తెల్లవారుజామున కుటుంబసభ్యులు నిద్రలేచి చూసేసరికి ఓ గదిలో పైకప్పునకు ఉరి వేసుకుని విగతజీవిగా వేలాడుతూ రామప్ప కనిపించాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రమేష్బాబు ఆ గ్రామానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, రామప్ప ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
అడిగిన ప్రతి రైతుకూ డ్రిప్, స్ప్రింక్లర్లు అందిస్తామని ఘనంగా ప్రకటించిన చంద్రబాబు సర్కారు జిల్లాకు 41,200 హెక్టార్ల టార్గెట్ ఇచ్చి. చివరకు 17 వేల హెక్టార్లకు మాత్రమే పరిమితమైంది. వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమ, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ పరిధిలో పథకాలకు సంబ
● పైసా విదల్చని కూటమి ప్రభుత్వం ● సుఖీభవ లేదు, ఇన్పుట్, ఇన్సూరెన్స్కు గతి లేదు, ఎక్స్గ్రేషియా అసలే లేదు ● పంటలు దెబ్బతిన్నా ఖరీఫ్, రబీలో కంటితుడుపుగా కరువు మండలాల ప్రకటన ● ఆర్బీకేలు, అగ్రి–వెటర్నరీ ల్యాబ్లు నిర్వీర్యం, ఆగిన 1962 అంబులెన్స్ సేవలు అన్నదాత సుఖీభవ కింద ఏటా ప్రతి రైతుకూ రూ.20 వేలు పెట్టుబడిసాయం అందిస్తామన్న హామీని కూటమి పెద్దలు తుంగలో తొక్కేశారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో రూ.6 వేలు రైతుల ఖాతాల్లోకి వేసింది. చంద్రబాబు చెప్పినట్లు సుఖీభవ పథకం కింద ఈ ఏడాది రూ.20 వేలు ఇచ్చివుంటే 2.90 లక్షల మంది వరకు రైతులకు రూ.580 కోట్లు జమ అయ్యేవి. పోనీ, పీఎం కిసాన్ రూ.6 వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.14 వేలు ఇచ్చివున్నా రూ.400 కోట్ల పైచిలుకు ప్రయోజనం చేకూరేది. అయితే పైసా ఇవ్వకుండా ఈ ఏడాది మొండి చెయ్యి చూపించారు. ● గతంలో 2019–24 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏటా పీఎం కిసాన్, రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున ఐదేళ్లలో ఒక్కో రైతుకు రూ.67,500 చెల్లించింది. అలా ఐదేళ్లలో జిల్లా రైతులకు రూ.1,937 కోట్ల పెట్టుబడి సాయం అందింది. 2023 ఖరీఫ్, రబీకి సంబంధించి ఉచిత పంటల బీమా పథకం కింద ఇవ్వాల్సిన పరిహారంతో తమకు సంబంధం లేదన్నట్లుగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. 2024 ఖరీఫ్లో ఉచిత పంటల బీమా అమలు చేసినా... పరిహారం చెల్లింపు అనుమానంగానే కనిపిస్తోంది. ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసి రబీ నుంచి రైతుల నుంచి ప్రీమియం కట్టించుకోవడం మొదలు పెట్టారు. ఇలా ఇకపై ఏటా రూ.100 కోట్ల వరకు ప్రీమియం రూపంలో రైతులపై అదనపు భారం మోపారు. ● 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులపై ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా కింద ఏకంగా జిల్లా రైతులకు రూ.1,967 కోట్ల భారీ మొత్తంలో పరిహారం చెల్లించింది. తొలిసారిగా ఉద్యాన రైతులకు బీమా ఇచ్చి భరోసా కల్పించింది. ఇక ప్రీమియం రూపంలో ఏటా రూ.100 కోట్ల వరకు జిల్లా రైతులకు ఆదా అయ్యేలా చర్యలు తీసుకుంది. ఖరీఫ్, రబీ పంట ఉత్పత్తులు అరకొరగానే చేతికొచ్చాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో వ్యాపారులు, దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.350 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను మద్ధతు ధరతో కొనుగోలు చేసింది. ఖరీఫ్, రబీ కింద బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులకు వడ్డీ రాయితీపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఖరీఫ్, రబీ కింద బ్యాంకుల్లో రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న చిన్న, సన్నకారు రైతులకు సున్నావడ్డీ కింద రూ.72 కోట్ల వరకు వడ్డీ మాఫీ చేయడంతో 3.40 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. విత్తనంపై రాయితీ తగ్గింపు కరువు పరిస్థితులు నెలకొన్నా ఈ రబీలో కేవలం 25 శాతం సబ్సిడీతో విత్తన పప్పుశనగ అందించడంతో జిల్లా రైతులపై రూ.6 కోట్ల వరకు అదనపు భారం పడింది. ఇక ఖరీఫ్లో విత్తన వేరుశనగ, కందులు నామమాత్రంగా అందించారు. 80 శాతం రాయితీతో ప్రత్యామ్నాయం అంటూ 27 వేల క్వింటాళ్లకు గానూ 10 వేల క్వింటాళ్లతో సరిపెట్టారు. ● గత జగన్ సర్కార్ 40 శాతం రాయితీతో రైతులకు విత్తనం అందించింది. ఐదేళ్ల జగన్ పాలనలో అన్ని రకాలకు చెందిన 6.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలపై రైతులకు రూ.289 కోట్ల రాయితీ దక్కింది. దిక్కూమొక్కు లేని పంటల బీమా మద్ధతు ధర హుష్కాకి స్పష్టత లేని సున్నా వడ్డీ -
చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
చిలమత్తూరు: ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... చిలమత్తూరు గ్రామానికి చెందిన ఖలీల్ (40)కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. పెయింటింగ్ పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో గత శుక్రవారం పనికి వెళ్లిన ఆయన చింత చిగురు కోసమని చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అటుగా ఎవరూ వెళ్లకపోవడంతో ఈ విషయం వెలుగు చూడలేదు. ఆదివారం ఉదయం అటుగా వెళ్లిన వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఎండ తీవ్రతకు మృతదేహం బొబ్బలెక్కి ఉబ్బిపోయింది. దుర్వాసన వెదజల్లుతోంది. మృతదేహం వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని ఖలీల్గా నిర్ధారించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
‘వెటర్నరీ’ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక
అనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధకశాఖ అధికారుల సంఘం (వెటర్నరీ ఆఫీసర్స్ అసోసియేషన్) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక పశుశాఖ డీడీ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు పార్థసారథిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రెడ్డిపల్లి శిక్షణా కేంద్రం ఏడీ డాక్టర్ వి.రామచంద్రారెడ్డిని ఎన్నుకోగా, కార్యదర్శిగా డాక్టర్ పి.మల్లేష్గౌడ్ (కొత్తచెరువు వీహెచ్, ఏడీ), కోశాధికారిగా డాక్టర్ జీఎస్ అమర్ (మడకశిర వీహెచ్, ఏడీ), ఉపాధ్యక్షురాలిగా డాక్టర్ ప్రసన్నబాయి (తలుపుల వీహెచ్, ఏడీ), జాయింట్ సెక్రటరీగా డాక్టర్ ఖదీర్బాషా (తాడిపత్రి వీహెచ్, ఏడీ) ఎన్నికయ్యారు. ఎన్నికై న నూతన కార్యవర్గ సభ్యులు రెండు జిల్లాల జేడీలు డాక్టర్ జీపీ వెంకటస్వామి, డాక్టర్ జి.శుభదాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గ సభ్యులను, అసోసియేషన్ సభ్యులను ఆ శాఖ అధికారులు అభినందించారు. వృద్ధుడి అనుమానాస్పద మృతి గుడిబండ: మండలంలోని నాచేపల్లి గ్రామానికి చెందిన గోవిందప్ప(60) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొన్నేళ్లుగా మతిస్థిమితం లేక తిరిగే వాడు. భార్య భాగ్యమ్మ, కుమారులు, కుమార్తె బెంగళూరుకు వలస వెళ్లి కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి తన ఇంటి వద్ద బొక్కబోర్లా పడి కనిపించడంతో గమనించిన గ్రామస్తులు పైకి లేపేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ గోవిందప్ప భార్య భాగ్యమ్మ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. యువకుడి దుర్మరణం బుక్కరాయసముద్రం: మండలంలోని రేకులకుంట సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బీకేఎస్ మండలం దయ్యాలకుంటపల్లికి చెందిన చాకలి శివానంద (28) గ్రామంలో రజక వృత్తితో కుటుంబానికి చేదోడుగా నిలాచాడు. భార్య ప్రసన్నలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యక్తిగత పనిపై ఆదివారం అనంతపురానికి వెళ్లిన ఆయన.. రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. రేకులకుంట సమీపంలోకి చేరుకోగానే వేగంగా దూసుకొచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఘటనలో శివానంద కాలు విరిగి 15 అడుగుల దూరంలో పడింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనం ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
ఆర్డీటీని కాపాడుకుందాం
అనంతపరం టవర్క్లాక్: నిరుపేదల జీవనోపాధుల కోసం విశేష కృషి చేస్తున్న ఆర్డీటీకి నిధులు రాకుండా కేంద్రంలోని కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోందని, ఇలాంటి తరుణంలో ఆర్డీటీని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్ పిలుపునిచ్చారు. ఆర్డీటీని కాపాడుకుందామనే డిమాండ్పై అనంతపురంలోని పెన్షనర్స్ భవన్లో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో రాంభూపాల్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్డీటీకు విదేశీ నిధులు రాకుండా అడ్డుపడిందన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. దీని వల్ల సంస్థ సేవలు నిలిచి పోయే పరిస్థితి వచ్చిందన్నారు. నిత్యం కరువు కాటకాలతో విలవిల్లాడుతున్న జిల్లాకు ఆర్డీటీ వరదాయినిగా నిలిచిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్డీటీకి నిధులు అందకపోతే నష్టపోయేది పేదలేనన్నారు. మతం పేరుతో బీజేపీ ఇలాంటి దురాగతాలకు పాల్పడడం తగదన్నారు. కులాలు, మతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న సంస్థపై ఆంక్షలు సరికాదన్నారు. పేదలు ఐక్యతతో ఉద్యమాలు చేపట్టి ఆర్డీటీని కాపాడుకోవల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ఈ పోరాటాలకు కుల, ప్రజాసంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంస్థ అందజేస్తున్న ఉచిత విద్యతో ఎందరో ఇంజినీర్లు, డాక్టర్లుగా జీవితంలో స్థిరపడ్డారన్నారు. తక్షణమే కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి ఆర్టీటీకి విదేశీ నిధులు అందేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాలు, కుల సంఘాల నాయకులు గోవిందరాజులు, ఎస్.ఎం. బాషా, సాకే హరి, నెరమెట్ల ఎల్లన్న, ఓ.నల్లప్ప, కృష్ణమూర్తి, చంద్రశేఖర్ రెడ్డి, ఓబులేసు, రాహుల్, శివారెడ్డి, కేశవరెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాసులు, సాయికుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ -
పోస్టల్ బీమా ఏజెంట్లకు దరఖాస్తుల ఆహ్వానం
హిందూపురం: హిందూపురం డివిజన్లో గ్రామీణ తపాలా జీవిత బీమా(ఆర్పీఎల్ఐ)డైరెక్ట్ ఏజెంట్లుగా పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈమేరకు శనివారం తపాలా శాఖ హిందూపురం సూపరింటెండెంట్ విజయ్కుమార్, డెవలప్మెంట్ ఆఫీసర్ నరసింహమూర్తి శనివారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఎస్వీడి రోడ్డులోని సూపరింటెండెంట్ కార్యాలయంలో ఈనెల 28 నుంచి 30(ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలు) వరకు జరిగే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. టెన్త్ విద్యార్హత కల్గి 18 నుంచి 50ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులన్నారు. ఎంపికై న ఏజెంట్లు సెక్యూరిటీ డిపాజిట్ రూ.5 వేలు కెవీపీ, ఎన్ఎస్సీ రూపంలో చెల్లించాలన్నారు. వివరాలకు తపాలా శాఖ హిందూపురం సూపరింటెండెంట్ కార్యాలయం, తపాలా జీవిత బీమా డివిజన్ ఆఫీసులో సంప్రదించాలని సూచించారు.‘హంద్రీ–నీవా’ బ్లాస్టింగ్ రాయి తగిలి బాలుడికి తీవ్రగాయాలుపుట్టపర్తి: హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్ చేయడంతో రాయి తగిలి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు..బుక్కపట్నం మండలం జానకంపల్లి సమీపంలో హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. శనివారం కాలువలో రాయి ఉండటంతో దానిని పగులగొట్టేందుకు కాంట్రాక్టర్లు బ్లాస్టింగ్ చేశారు. ఈ క్రమంలో 8 నుంచి 10 కేజీల బరువున్న ఓ రాయి జానకంపల్లి ప్రధాన రహదారి వద్దకు వచ్చి తిరుమలసాయి అనే బాలుడి కాలికి తగిలింది. తీవ్రగాయాలపాలైన బాలుడిని కాంట్రాక్టర్లు మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. కాలువకు జానకంపల్లికి 200 మీటర్ల దూరం ఉందని, బ్లాస్టింగ్ సమయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గ్రామస్తులు, బాధితుడి తల్లి దండ్రులు పేర్కొన్నారు. -
దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి
కదిరి టౌన్: బీమా రంగంలో వీదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా మే 20న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు పి.సతీష్ పిలుపునిచ్చారు. ఎల్ఐసీ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘం కడప డివిజన్ ఉపాధ్యక్షుడు సూరిబాబు అధ్యక్షతన శనివారం కదిరి ఎల్ఐసీ కార్యాలయంలో జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఆర్డీఏ సంస్థ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుకూలంగా పనిచేస్తూ ఎల్ఐసీని బలహీన పరిచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఉద్యోగుల అందరికీ పెన్షన్, పెన్షన్ అప్డేషన్, స్టాగ్నేషన్, ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రఘునాథ్రెడ్డి, ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యదర్శి ఎస్.శ్రీనివాసులు, నాయకులు అక్బర్ బాషా, నాగరాజు, మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతి నిలయంలో భద్రత కట్టుదిట్టం
ప్రశాంతి నిలయం: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ప్రశాంతి నిలయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వి.రత్న తెలిపారు. శనివారం ఆమె సిబ్బందితో కలసి ప్రశాంతి నిలయంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గణేష్ గేట్, వెస్ట్ గేట్, షాపింగ్ మాల్ ప్రాంతం, సాయికుల్వంత్ సభా మందిరం, భక్తులు బస చేసే బిల్డింగ్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... కాశ్మీర్లో ఉగ్రదాడి తర్వాత జిల్లా వ్యాప్తంగా భద్రతా పరమైన అంశాలపై తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు సైతం అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలన్నారు. వివిధ దేశాల నుంచి ప్రశాంతి నిలయానికి భక్తులు వస్తుంటారని, ఇక్కడ భక్తులకు మెరుగైన భద్రత కల్పించాల్సన అవసరం ఉందన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీలు విజయ్ కుమార్, శ్రీనివాసులు, సీఐలు సునీత, ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు. -
ప్రాణం ఉన్నంత వరకూ జగన్ వెంటే
మడకశిర: ‘‘నేను వైఎస్ జగన్ వీరాభిమానిని. ఆయన అవకాశం కల్పించబట్టే కౌన్సిలర్ను అయ్యాను. నా ప్రాణం ఉన్నంత వరకూ రాజకీయాల్లో జగన్ వెంటనే నడుస్తాను. అమ్మపాలు తాగి రొమ్ముగుద్దను. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి ద్రోహం చేయను’’ అని 16వ వార్డు కౌన్సిలర్ సతీష్రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ గుర్తుపై కౌన్సిలర్గా విజయం సాధించిన తాను వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మడకశిర మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లపై టీడీపీ ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి తాను మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాటని కోరుతూ కొందరు కౌన్సిలర్లు కలెక్టర్కు ఇచ్చిన నోటీసులో తాను సంతకం చేయలేదని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు.బావిలో పడి వృద్ధుడి మృతిగుడిబండ: దప్పిక తీర్చుకోవడం కోసం బావిలోకి దిగిన ఓ వృద్ధుడు కాలుజారి అందులో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు..కరికెర గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప(72) శనివారం గ్రామ సమీపాన తన పొలం వద్దకు వెళ్లాడు. దప్పిక వేయడంతో నీరు తాగేందుకు బావిలోకి దిగాడు. ఈక్రమంలో కాలుజారి అందులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటి మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న మడకశిర అగ్నిమాపకశాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని నీటిలో మునిగిన హనుమంతరాయప్ప మృతదేహాన్ని బయటికి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రాజ్కుళ్లాయప్ప తెలిపారు. -
సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం
మడకశిర: సంక్షేమం, అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన పది నెలలోనే అన్ని ప్రభుత్వ శాఖలను గాడిలో పెట్టిన ఘనత సీఎం చంద్రబాబుదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16,500 డీఎస్సీ పోస్టుల ప్రక్రియకు శ్రీకారం చుట్టామని, పోలీస్శాఖలో వివిధ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. అమరావతి పునఃనిర్మాణ పనులకు మే 2న ప్రధాని నరేంద్రమోదీచే శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత మంత్రి మడకశిరలో రూ.2 కోట్లతో నిర్మించిన బాల్బ్యాడ్మింటన్ హాలు, టేబుల్ టెన్నిస్ కోర్టు తదితర వాటిని పరిశీలించారు. అనంతరం కదిరి–అనంతపురం, కదిరి–రాయచోటి సర్వీసులను ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, బాబూ జగ్జీవన్రామ్ నూతన విగ్రహాల స్థాపనకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా డిపోలో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ లాభాలు వచ్చే 150 డిపోల్లో ప్రతి డిపోకు కొత్తగా 20 బస్సులు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం కొత్తగా గ్రామీణ ప్రజల సౌకర్యార్థం 1000 అదనపు బస్సులు నడుతున్నామని తెలిపారు. ప్రభ్తుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా డిపోలను అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడతున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, డీపీటీఓ మధూసూదన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి -
‘అనంత’లో దొంగల స్వైర విహారం
అనంతపురం: నగరంలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకూ ఐదు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. నాలుగో రోడ్డు ఎక్స్టెన్షన్ శాంతినగర్ గౌరవ గార్డెన్స్లో ఉండే ఐదు ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేశారు. గౌరవ్ గార్డెన్ రెండో క్రాస్లో ఆర్. మణికంఠ, డి.మహేశ్వరరెడ్డి, విజయభాస్కర్రెడ్డి, రాజమౌళి, నీలిమ ఇంటి యజమానులు త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి తలుపులకు వేసిన తాళాలతో పాటు ఇన్నర్లాకులను సైతం దొంగలు తొలగించారు. ముందుగా తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి చోరీలకు తెగబడ్డారు. రిటైర్డ్ ఆఫీసర్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు దొంగలు చోరీల్లో పాల్గొన్నట్లు తెలిసింది. పోలీసులకు సమాచారం అందడంతో ఉదయమే ఘటనాస్థలాలకు వెళ్లి పరిశీలించారు. వేలిముద్రలను సేకరించారు. ముఖానికి మాస్క్లు, చేతులకు గ్లౌజులు.. గౌరవ్ గార్డెన్స్లో ఏకంగా ఐదు ఇళ్లల్లో చోరీ జరగడం నగర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇద్దరు దొంగలు ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు ధరించారు. కనీసం ఫింగర్ ప్రింట్లు కూడా దొరకకుండా అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 5:15 నిమిషాల వరకు ఐదు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. అయితే ఐదు ఇళ్లల్లో విలువైన వస్తువులు చోరీకి గురికాలేదు. బంగారు లాకర్లలో పెట్టుకోవడంతో విలువైన వస్తువులు పోలేదు. ఒక ఇంట్లో 8 తులాల బంగారు, వెండి ఉన్నప్పటికీ, బీరువాలో పెట్టకుండా.. పోపు డబ్బాలో దాచుకున్నారు. దీంతో వీరి సొమ్ము భద్రంగా ఉంది. సీసీ కెమెరాల ఫుటేజీని సైతం పరిశీలించి పోలీసులు నిర్ధారణ చేశారు. ఇదిలా ఉండగా, చోరీ జరిగిన ఇళ్లను అనంతపురం అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాసరావు, త్రీటౌన్ సీఐ కే.శాంతిలాల్ పర్యవేక్షించారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
గాండ్లపెంట: వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం గాండ్లపెంటలో చోటుచేసుకుంది. మృతుని భార్య చంద్రకళ తెలిపిన వివరాల మేరకు...గాండ్లపెంట గంగమ్మ వీధిలో ఉండే ఎన్.మల్లికార్జున (55) కదిరిలోని ఓ హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తెల్లవారుజాము 5 గంటలకే విధుల్లోకి వెళ్తుంటాడు. అయితే శనివారం తెల్లవారుజామున మల్లికార్జున ఎంతకూ నిద్రలేవకపోవడంతో భార్య చంద్రకళ అతన్ని నిద్రలేపేందుకు ప్రయత్నించింది. తనకు ఆరోగ్యం సరిగా లేదని తెలిపి ముఖం కడక్కునేందుకు లేచాడు. అయితే కళ్లుబైర్లు కమ్మాయని చెబుతూ ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో భార్య ఇరుగూపొరుగు వారి సాయంతో మల్లికార్జునను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే అతను మృతి చెందాడు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మల్లికార్జున హోటల్లో పనిచేశాడని, ఎండవేడిమికి అనారోగ్యానికి గురై రాత్రి ఇంటికి రాగానే పడుకున్నాడని, ఈ క్రమంలో మృతి చెందాడని భార్య చెబుతోంది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
హైకోర్టు జడ్జీలను కలిసిన ఎస్పీ రత్న
పుట్టపర్తి టౌన్: హైకోర్టు జడ్జీలు రామకృష్ణప్రసాద్, హరహరనాథశర్మను ఎస్పీ రత్న మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన జడ్జీలను ఎస్పీ రత్నతో పాటు జిల్లా జడ్జి భీమారావ్, అనంతపురం ఎస్పీ జగదీష్ అనంతపురం ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద కలిశారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, శాంతి భద్రతలపై జడ్జీలతో కాసేపు చర్చించారు. వీరాపురాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం ● కలెక్టర్ టీఎస్ చేతన్ చిలమత్తూరు: సైబీరియన్ పక్షులకు నెలవైన వీరాపురం, వెంకటాపురం గ్రామాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. శనివారం ఆయన వీరాపురం, వెంకటాపురం గ్రామాల్లో సైబీరియన్ పక్షుల నివాస ప్రాంతాలను పరిశీలించారు. పక్షులకు తాగునీరు, ఆహారం, సౌకర్యాలు వంటి వాటిపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొంగలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వెంకటాపురం, వీరాపురం చెరువులకు నీరు నింపేందుకు నివేదికలు సిద్ధం చేయాలన్నారు. పక్షులను సంరక్షించడంలో భాగంగా ఈ రెండు గ్రామాల చెరువులను చిత్తడి నేలగా ప్రకటించినట్టు ఆయన తెలిపారు. పర్యాటకుల కోసం వసతి సదుపాయాలు, వాచ్ టవర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పెనుకొండ అటవీ క్షేత్ర అధికారి జె. శ్రీనివాసులురెడ్డి, సర్పంచ్ లక్ష్మీపతిరెడ్డి, గ్రామస్తులు ఉన్నారు. రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలు ప్రారంభం ● తొలిరోజు పోటాపోటీగా లీగ్ మ్యాచ్లు కదిరి అర్బన్: స్థానిక ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం 54వ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లా జట్లు పాల్గొన్న ఈ టోర్నీని డీఎస్పీ శివనారాయణస్వామి, మున్సిపల్ కమిషనర్ కిరణ్కుమార్, ఏపీ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రామాంజినేయులు ప్రారంభించారు. తొలిరోజు మ్యాచ్లు ఇలా... తొలిరోజు జరిగిన లీగ్మ్యాచ్లో గుంటూరు జట్టుపై అనంతపురం జట్టు నాలుగు గోల్స్ తేడాతో గెలుపొందింది. అనంతరం జరిగిన మ్యాచ్లో శ్రీకాకుళం జట్టుపై కర్నూలు, అనంతపురం జిల్లా జట్టుపై వైఎస్సార్ జిల్లా, ఈస్ట్ గోదావరి జట్టుపై వెస్ట్ గోదావరి, నంద్యాల జట్టుపై చిత్తూరు, ప్రకాశం జట్టుపై వెస్ట్ గోదావరి, నంద్యాల జట్టుపై విజయనగరం, బాపట్ల జట్టుపై కర్నూలు జట్లు విజయం సాధించాయి. -
‘పాలిసెట్’ పకడ్బందీగా నిర్వహించాలి
ప్రశాంతి నిలయం: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కోసం ఈనెల 30న జిల్లాలో జరిగే ‘పాలిసెట్–2025’ పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్ఓ విజయసారథి ఆదేశించారు. పాలిసెట్ పరీక్ష నిర్వహణపై శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సంబంఽధిత శాఖల అధికారులతో డీఆర్ఓ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధర్మవరం, కదిరి, హిందూపురం పాలిటెక్నిక్ కళాశాలల పరిధిలోని 15 కేంద్రాల్లో పరీక్ష ఉంటుందన్నారు. జిల్లాకు చెందిన 5,326 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని వెల్లడించారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకూడదన్నారు. ఇన్విజిలేటర్లు కూడా సెల్ఫోన్లు వాడకూడదన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలన్నారు. కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్క నిమిషం దాటినా పరీక్షకు అనుమతించం పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఉంటుందని, అభ్యర్థులు 10 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని డీఆర్ఓ సూచించారు. 11 గంటల తర్వాత ఒక్క నిముషం దాటినా పరీక్షకు అనుమతించబోమన్నారు. సమావేశంలో పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం, కదిరి, హిందూపురం పాలిటెక్నికల్ కళాశాలల ప్రిన్సిపాళ్లు రమ, హరీష్, అసిస్టెంట్ కో ఆర్డినేటర్ బాలస్వామి, ఆర్టీసీ డీఎం ఇనాయతుల్లా, ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్, హిందూపురం తహసీల్దార్ మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నుంచి 5,326 మంది దరఖాస్తు.. 15 కేంద్రాల ఏర్పాటు డీఆర్ఓ విజయసారథి -
భానుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
● మధ్యాహ్నం పూట ఇంట్లోనే ఉండాలి. ● ఎక్కువ మోతాదులో మంచినీళ్లు తీసుకోవాలి. ● ఎండలో తిరిగి వచ్చినప్పుడు కొబ్బరి నీళ్లు లేదా ఓఆర్ఎస్ తీసుకోవాలి. ● జ్వరం లేదా నీరసం అనిపించినప్పుడు వెంటనే సైలెన్ పెట్టించుకోవాలి. ● బీపీ, షుగర్, గుండెజబ్బులకు మందులు వాడే వారిలో వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ. వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ● వేసవిలో తేలికపాటి వ్యాయామాలు మాత్రమే చేయాలి. ● దోస, పుచ్చ, దానిమ్మ, అరటి వంటి పండ్లను బాగా తీసుకోవాలి. ● పండ్లతో పాటు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ● జ్వరంగా ఉంటే నుదిటిపై తడిబట్టను పెట్టాలి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో భానుడు భగ భగ మండిపోతున్నాడు. పగటి పూట ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. ఏప్రిల్ మొదటి వారంలో 40 డిగ్రీల లోపు ఉన్న ఉష్ణోగ్రతలు తాజాగా 42 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండ వేడిమికి తాళలేక జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పట్టణాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పల్లెటూళ్లలో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ఎండదెబ్బకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి హామీ కూలి పనులకు వెళ్లి ఇప్పటికే ఓ వ్యక్తి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వడదెబ్బ కేసులు పెరుగుతున్నట్లు ఆస్పత్రుల రికార్డులు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఈసారి మాత్రం అప్పుడే 42 డిగ్రీలు నమోదైంది. రానున్న నెలన్నర రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మే రెండో వారం నుంచి ఎండ తీవ్రత మరింతగా ఉంటుందని, వడదెబ్బ ప్రభావం తారస్థాయికి చేరుకుంటుందని పేర్కొంటున్నారు. మరోవైపు వృద్ధులు, బాలింతలు, చిన్నారులు మధ్యాహ్నం పూట బయటకు రావద్దని, వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందని, వాళ్లు కూడా ఎండలో తిరగకూడదంటున్నారు. వడదెబ్బకు గురికాకూడదంటే.. వడదెబ్బ లక్షణాలు విపరీతమైన తలనొప్పి, వాంతికి వచ్చినట్లు ఉండటం నాలుక తడి ఆరిపోయినట్లు ఉండటం శరీర ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరగడం శరీరం బాగా అలసిపోయినట్లు ఉండటం మాట తడబడుతున్నట్లు ఉండటం ఒక్కోసారి కండరాలు పట్టేసినట్టు అనిపించడం వెంటనే నీరసం వచ్చేసి ఎక్కడైనా వాలిపోవాలనిపించడం శరీరం తిమ్మిరిగా అనిపించడం భారీగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు ఏప్రిల్లోనే 42 డిగ్రీలను దాటుతున్న వైనం మేలో 45 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉందంటున్న శాస్త్రవేత్తలు వృద్ధులు, బాలింతలు, చిన్నారులు బయటకు రావద్దంటున్న వైద్యులు ఈసారి ఎండలు ఎక్కువే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంది. మేలో 45 డిగ్రీల వరకూ నమోదు కావచ్చు. మిగతా జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉక్కపోత (హ్యుమిడిటీ) తక్కువ. ఈ ఏడాది కాస్త ముందస్తు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. – విజయశేఖర్, సైంటిస్ట్, రేకులకుంట వాతావరణ కేంద్రం45 డిగ్రీలు దాటే అవకాశం.. -
డ్రోన్ వినియోగంపై రైతులకు శిక్షణ
పుట్టపర్తి అర్బన్: పంటల సాగులో డ్రోన్లు వినియోగించేలా రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. మండలానికి ఒకరికి డ్రోన్ వినియోగంపై శిక్షణ ఇచ్చి రైతులకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. పురుగు మందుల పిచికారీ, ఎరువుల చల్లడానికి ఉపయోగకరమైన డ్రోన్లు శుక్రవారం జిల్లాకు చేరుకోగా, కలెక్టర్ అధికారులతో కలిసి వాటి పనితీరును పరిశీలించారు. జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, సెరికల్చర్ అధికారి పద్మమ్మ, టెక్నీషియన్లతో కలిసి పుట్టపర్తి సమీపంలోని పొలాల్లో డ్రోన్ల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో 35 డ్రోన్ గ్రూప్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక్కో గ్రూపులో ఐదుగురు రైతులు సభ్యులుగా ఉంటారన్నారు. అందులో ఒకరు డ్రోన్ కన్వీనర్, మరొకరు కో కన్వీనర్గా ఉంటారన్నారు. ఒక్కో డ్రోన్ ధర రూ.9.8 లక్షలు కాగా, 80 శాతం సబ్సిడీతో అందజేయనున్నట్లు వెల్లడించారు. రైతు రూ.5 లక్షలు చెల్లిస్తే తక్కిన మొత్తాన్ని బ్యాంకులు రుణం అందిస్తాయన్నారు. డ్రోన్ వినియోగించే సమయానికి సబ్సిడీ మొత్తం రైతు గ్రూపు ఖాతాకు జమ చేస్తారన్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని 28 మంది యువతకు పైలెట్ శిక్షణ పూర్తి చేసినట్లు చెప్పారు. తక్కిన 7 మందికి త్వరలో మూడో బ్యాచ్లో శిక్షణకు పంపుతామన్నారు. 35 గ్రూపులకు 35 డ్రోన్లు అందజేసి వాటి ద్వారా రైతులు తక్కువ ధరకే మందులు పిచికారీ చేసుకునేలా చూస్తామన్నారు. ప్రస్తుతం గ్రూపులన్నింటికీ బ్యాంక్ ఖాతాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 35 డ్రోన్ గ్రూపులు: కలెక్టర్ చేతన్ -
‘పురం’ మార్కెట్కు తగ్గిన పట్టుగూళ్లు
● మూడురోజులుగా 1,500 కిలోల లోపేరాక హిందూపురం అర్బన్: రాష్ట్రంలోనే పేరుగాంచిన హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్కు సరుకు రావడం తగ్గిపోయింది. సీజన్లో రోజూ 8 టన్నుల నుంచి 12 టన్నుల వరకు పట్టుగూళ్లు వచ్చేవి. అన్ సీజన్లో అయితే 3 టన్నులకు తగ్గకుండా పట్టుగూళ్లు వచ్చేవి. కానీ మూడు రోజులుగా మార్కెట్కు 1,500 కిలోలలోపే పట్టు గూళ్లు రావడంతో మార్కెట్ అధికారులను కలవరపాటుకు గురిచేసింది. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, వైరస్తో దిగుబడి తగ్గడంతో పట్టుగూళ్లు ఉత్పత్తులు తగ్గాయి. కర్ణాటక ప్రాంతాల్లోని మార్కెట్లలో ధరలు కాస్త ఎక్కువగా ఉండటంతో అరకొర దిగుబడిని కూడా రైతులు అక్కడికే తీసుకెళ్తున్నారు. దీంతో హిందూపురం మార్కెట్కు వచ్చే పట్టుగూళ్లు తగ్గిపోయాయి. కిలో బైవోల్టిన్ పట్టుగూళ్లు రూ.662.. హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్లో కిలో బైవోల్టిన్ పట్టుగూళ్లు గరిష్టంగా రూ.662 వరకూ పలుకుతున్నాయి. ఈ నెల 23వ తేదీన 824 కిలోలు, 24వ తేదీన 979 కిలోలు, 25వ తేదీన 1,481 కిలోల పట్టుగూళ్లు మార్కెట్కు వచ్చాయి. కిలో పట్టు గూళ్లు (భైవోల్టిన్) గరిష్టంగా రూ. 662, కనిష్టం రూ.358, సరాసరిన రూ. 582 ప్రకారం ధర పలికాయి. కర్ణాటక ప్రాంత మార్కెట్లలో ఒకటి, రెండు లాట్లకు ఎక్కువ రేటు చూపుతారని, మిగతా వాటికి ఇక్కడి కంటే తక్కువే ధర వస్తోందని హిందూపురం మార్కెట్ ఇన్స్పెక్టర్ లక్ష్మిరెడ్డి తెలిపారు. రైతులు దూరభారం వెళ్లి మోసపోవద్దని సూచించారు. నాణ్యమైన పట్టుగూళ్లకు స్థానికంగానే మంచి ధర లభిస్తోందని ఆయన వెల్లడించారు. సజావుగా ధ్రవపత్రాల పునఃపరిశీలనఅనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఉపాధ్యాయుల మెడికల్ సర్టిఫికేషన్ పునఃపరిశీలన ప్రక్రియ శుక్రవారం సజావుగా సాగింది. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పరిశీలనకు హాజరయ్యారు. ఆస్పత్రిలోని డీఈఐసీ, బర్న్స్ వార్డు, ఆప్తాల్మిక్ వార్డుల్లో ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. ఆర్థో హెచ్ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ ఆత్మారాం, వైద్యులు డాక్టర్ ఆనంద్ బాబూ నాయక్, డాక్టర్ ప్రశాంతి, తదితరులు సర్టిఫికెట్లను పరిశీలించారు. మే 19 నుంచి ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు పుట్టపర్తి టౌన్: ఓపెన్ 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు మే 19 తేదీ నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ కృష్టప్ప తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. అలాగే మే 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రాక్ట్రికల్స్ ఉంటాయని వెల్లడించారు. అందుబాటులో పాలిసెట్ హాల్టికెట్లు హిందూపురం: ఏపీ పాలిసెట్–2025 (ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) హాల్ టిక్కెట్లు www. polycetap.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు హిందూపురం పాలిటెక్నిక్ కళాశాల నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 30వ తేదీన పరీక్ష ఉంటుందని అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా హాలుటికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే సమీపంలోని సహాయ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. -
రూ.కోటికి కుదిరిన డీల్..?
చిలమత్తూరు: చిత్రావతి నదిపై ఏకంగా బ్రిడ్జి నిర్మించి నదీజలాలు సొంతానికి మళ్లించుకుని, ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని, సమీపంలోని పొలాలకు రైతులు వెళ్లకుండా ఇబ్బందులు పెడుతున్న రియల్టర్ రెడ్డెప్పశెట్టికి ‘రెవెన్యూ’ అండగా నిలుస్తోంది. ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వశాఖలోని కొందరు అధికారులు అమ్యామ్యాలకు ఆశపడి రియల్టర్కు సహకారం అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కోర్టును ఆశ్రయించేందుకు సహకారం రియల్టర్ రెడ్డెప్పశెట్టి భూ ఆక్రమణలు, రైతులకు పెడుతున్న ఇబ్బందులు, విద్యుత్ చోరీ, నదీ జలాల అక్రమ వినియోగం తదితర వాటిపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కాగా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు హడావుడి చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఇక చర్యలే తరువాయి అన్న తరుణంలో రైతులు, మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అయితే రెవెన్యూ శాఖలోని ఓ డివిజనల్ స్థాయి అధికారి క్షేత్రస్థాయి నివేదికలను పక్కన పెట్టి సదరు రియల్టర్కు అనుకూలంగా వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో కథ మళ్లీ మొదటికి రావడంతో రియల్టర్ మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. తప్పుడు సమాచారంతో తన అక్రమాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవిక్షన్ నోటీసు ఇచ్చినా... రెడ్డెప్పశెట్టి అక్రమాలు గుర్తించిన అధికారులు నోటీసులు ఇవ్వడం, కేసు నమోదు చేయించడం తదితర చర్యలన్నీ చకచకా జరిగిపోయాయి. నివేదికలను కూడా ఉన్నతాధికారులకు పంపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు రియల్టర్కు ఎవిక్షన్ నోటీసు కూడా ఇచ్చారు. నెల గడిచినా చర్యలు తీసుకోలేదు. ఉన్న ఫలంగా రెవెన్యూ డివిజనల్ స్థాయి అధికారి రహస్యంగా రెడ్డెప్పశెట్టి ఎస్టేట్కు రావడం, వెళ్లడం జరిగిపోగా... ఆ తర్వాత అన్నీ నెమ్మదించాయి. ఫిబ్రవరి 28వ తేదీలోపే బ్రిడ్జిని తొలగిస్తామని చెప్పిన ఇరిగేషన్ అధికారులు... రియల్టర్ కోర్టుకు వెళ్లేందుకు సమయాన్ని ఇచ్చి అతను తప్పించుకునేందుకు అవకాశం ఇచ్చారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములు, ఈడీ అటాచ్మెంట్ భూములు, నది ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు నోటీసు ఇచ్చి మిన్నకుండి పోయారు. మండలస్థాయి రెవెన్యూ అధికారి హిందూపురానికి పరిమితం కావడం, డివిజనల్ స్థాయి అధికారి ఆదేశాలతో రెడ్డెప్పశెట్టితో లోగుట్టు ఒప్పందాలు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా డీల్..? రియల్టర్ అక్రమాలు, ఆక్రమణలపై నోరు మెదపకుండా ఉండేందుకు బెంగళూరు కేంద్రంగా డివిజనల్ స్థాయి అధికారితో రూ. కోటికి ఒప్పందం చేసుకున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. రెడ్డెప్పశెట్టి ఆక్రమణలో ఉన్న భూములను సైతం అధికారికంగా కట్టబెట్టే విధంగా డీల్ కుదిరినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన బాధ్యతలను ఇప్పటికే ఇద్దరు వీఆర్ఓలకు కేటాయించినట్లు తెలుస్తోంది. రియల్టర్ ఆక్రమణలోని భూములు ప్రస్తుతం రూ. కోట్ల విలువ చేస్తుండగా... అధికార యంత్రాంగం ఆయనకు ధారాదత్తం చేసేందుకు సిద్ధం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రియల్టర్ రెడ్డెప్పశెట్టికి రెవెన్యూ అండ బెంగళూరు కేంద్రంగా సెటిల్మెంట్! డివిజనల్ స్థాయి అధికారి పూర్తి సహకారం -
అధికారం కోసం అడ్డదారులు
సాక్షి, పుట్టపర్తి ప్రజా క్షేత్రంలో ఓడినా.. అడ్డదారిలో మున్సిపాలిటీల్లో పెత్తనం చెలాయించాలని కూటమి నాయకులు భావిస్తున్నారు. ఇందుకోసం ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపారు. ప్రత్యర్థి పార్టీ తరఫున గెలిచిన వారిని బెదిరిస్తూ.. పదవులు ఆఫర్ చేస్తూ.. పచ్చ కండువా కప్పేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. అడ్డదారుల్లో అధికారం చేపట్టేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే హిందూపురం మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇటీవలే కదిరి మున్సిపల్ పీఠాన్ని చేజిక్కించుకునే క్రమంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తాజాగా మడకశిర మున్సిపల్ సీటును సైతం దక్కించుకునేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేసున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఇప్పటికే కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. నేడో, రేపో బల పరీక్షకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా టీడీపీకి రెండంకెల సంఖ్య సీట్లు లేవు. ప్రతి మున్సిపాలిటీలో సింగిల్ డిజిట్కే పరిమితమైంది. హిందూపురంలో 38 సీట్లకు గానూ ఆరు, మడకశిరలో 20 సీట్లలో ఐదు, కదిరిలో 36 స్థానాల్లో ఐదు చోట్ల టీడీపీ గెలిచింది. పుట్టపర్తిలో 20 వార్డులకు గానూ 6 చోట్ల, పెనుకొండలో 20 సీట్లకు గానూ రెండు చోట్ల, ధర్మవరంలో 40 స్థానాలకు గానూ టీడీపీ బోణీ కూడా కొట్టలేదు. కానీ అడ్డదారిలో ఇప్పటికే హిందూపురం పీఠాన్ని టీడీపీ చేజిక్కించుకుంది. కదిరిలో పాగా వేసేందుకు ప్లాన్ కుదిరింది. మడకశిర సీటును సాధించేందుకు కుట్ర జరుగుతోంది. హిందూపురం మున్సిపాలిటీలో 38 స్థానాలకు వైఎస్సార్సీపీ 29 చోట్ల, టీడీపీ 6 చోట్ల, బీజేపీ 1, ఎంఐఎం 1, ఇండిపెండెంట్ 1 చోట గెలిచారు. మున్సిపల్ పీఠం కై వసం చేసుకోవాలంటే.. కనీసం 20 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే వైఎస్సార్సీపీ నుంచి 13 మందిని ప్రలోభాలకు గురి చేసి టీడీపీలో చేర్చుకున్నారు. అప్రజాస్వామికంగా ఎన్నిక జరిగి మున్సిపల్ చైర్మన్ సీటును టీడీపీ గెలుచుకుంది. వైఎస్సార్సీపీ హయాంలో బీసీ మహిళకు అవకాశం ఇవ్వగా.. ప్రస్తుత కూటమి సర్కారు పురుషుడికి పెత్తనం కట్టింది. పార్టీ ఫిరాయించిన వారిని ఇప్పుడు కూరలో కరివేపాకులా పక్కన పడేసింది. కదిరి మున్సిపాలిటీలో 36 వార్డులున్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 30 చోట్ల గెలవగా.. టీడీపీ కేవలం 5 స్థానాలు మాత్రమే సాధించింది. మరో స్థానంలో రెబల్ అభ్యర్థి గెలిచారు. కాగా ఇటీవల కేసుల పేరుతో వైఎస్సార్సీపీ సభ్యులను బెదిరించి.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తమకు మద్దతు ఇవ్వకుంటే ఇబ్బంది పడతారని బెదిరించడంతో చైర్పర్సన్కు వ్యతిరేకంగా 25 మంది చేతులెత్తారు. దీంతో చైర్పర్సన్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. త్వరలోనే ఎన్నిక నిర్వహించి కొత్త చైర్మన్ ఎన్నుకోనున్నారు. టీడీపీ ఫిరాయింపు రాజకీయం మున్సిపాలిటీల్లో పెత్తనం కోసం బరితెగింపు ఇప్పటికే అడ్డదారిలో హిందూపురం మున్సిపాలిటీ కై వసం తాజాగా కదిరి మున్సిపల్ చైర్ పర్సన్పై అవిశ్వాసం ఒకట్రెండు రోజుల్లో మడకశిర పీఠంపై కూటమి కుట్రలు బలం లేకున్నా.. బలవంతంగా ఫిరాయింపు రాజకీయం కేసుల పేరుతో భయపెట్టి టీడీపీ కండువా కప్పుతున్న వైనం మెజారిటీ సీట్లు రాకున్నా.. జిల్లాలో హిందూపురం, కదిరి, ధర్మవరం, మడకశిర, పుట్టపర్తి, పెనుకొండ మున్సిపాలిటీలుండగా... 2021లో జరిగిన ‘స్థానిక’ ఎన్నికల్లో టీడీపీ ఏ ఒక్క చోట కూడా అధికారం చేపట్టలేకపోయింది. ఆరు మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగహించడంతో ఆ పార్టీ అభ్యర్థులే చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతలు అడ్డదారిలో ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపారు. వైఎస్సార్సీపీ సభ్యులను కేసుల పేరుతో బెదిరిస్తూ.. పార్టీ మారేలా చేశారు. అనంతరం అధికారులను అడ్డు పెట్టుకుని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి.. సంతకాలు సేకరించి.. పీఠం కై వసం చేసుకుంటున్నారు. ‘పురం’లో ఆరు సీట్లు గెలిచి.. కదిరిలో ఐదు సీట్లు గెలిచి.. సింగిల్ డిజిట్కే పరిమితం -
ప్రశాంతంగా జీవించండి
పుట్టపర్తి టౌన్: గొడవలకు దూరంగా అందరూ ప్రశాంతంగా జీవించాలని ఎస్పీ రత్న సూచించారు. శుక్రవారం రాత్రి ఆమె కొత్తచెరువు మండలం కేశాపురం గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రామ సందర్శన’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రత్న ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... గొడవలు, ఫ్యాక్షన్ వల్ల జీవితాలు చిన్నాభిన్నమవుతాయన్నారు. అలాంటి కుటుంబాల్లోని పిల్లల జీవితాలూ నాశనమవుతాయన్నారు. అందరూ ఎవరూ గొడవల జోలికి వెళ్లవద్దన్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలు, నూతన చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామంలో ఏవైనా సంఘటనలు జరగితే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ భవిష్యత్కు బాటలు వేసుకోవాలన్నారు. అనంతరం శక్తి యాప్, డయల్ 112, 100 గరించి వివరించారు. అంతకుముందు కళాజాత బృందం సభ్యులు నాటక ప్రదర్శన, ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్, సీఐలు సురేష్, గోపీనాథ్రెడ్డి, ఎస్ఐలు లింగన్న, కృష్ణమూర్తితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ సందర్శనలో ఎస్పీ రత్న -
ఇంటింటా సౌర వెలుగులు విరజిమ్మాలి
ప్రశాంతి నిలయం: జిల్లా అంతటా సౌరవెలుగులు విరజిమ్మేలా ‘పీఎం సూర్యఘర్’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో 10 వేల పీఎం సూర్యఘర్ రూఫ్టాప్ యూనిట్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని కోర్టు హాలులో నియోజకవర్గాల అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ‘పీఎం సూర్యఘర్’పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం రూ.60 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.55 వేలు సబ్సిడీగా అందించి యూనిట్ను పూర్తి ఉచితంగా అందిస్తుందన్నారు. ఉత్పత్తి అయిన విద్యుత్ను లబ్ధిదారు అవసరాలకు వాడుకుని మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు అందిస్తే యూనిట్కు రూ.2.90 వంతున చెల్లిస్తారన్నారు. బీసీలకు 2 కిలోవాట్కు కేంద్రం రూ.60 వేలు, రాష్ట్ర ప్రభుత్వం 10 వేల చొప్పున రాయితీ ఇస్తుందని, మరో రూ.35 వేలు లబ్ధిదారుడు బ్యాంక్ ద్వారా రుణం పొంది ఐదేళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, బ్యాంకర్లు, విద్యుత్ అధికారులు సమన్వయం చేసుకొని లక్ష్యాలను చేరుకునేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఇక అన్ని నియోజకవర్గాల విజన్ ప్రణాళికలు రూపొందించాలని, భూగర్భ జలాలు, వ్యవసాయం, ఉద్యాన శాఖలు పూర్తి వివరాలతో జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్కు సంబంధించి పోస్టర్లు, ఫ్లెక్సీలు అన్ని ఆర్డీఓ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి కాలుష్యం జరగకుండా అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఓ విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్కుమార్, మహేష్, డీపీఓ సమత, డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం, సీపీఓ విజయ్ కుమార్, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం -
మడకశిర మున్సిపల్ పీఠంపై టీడీపీ కన్ను
మడకశిర: మడకశిర మున్సిపాలిటీని అడ్డదారుల్లో తన ఖాతాలో వేసుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందుకోసం ఇప్పటికే పావులు కదిపింది. సొంతంగా బలం లేకపోవడంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసింది. చైర్పర్సన్గా ఉన్న దళిత మహిళను ఎలాగైనా పీఠం నుంచి దింపేందుకు రంగం సిద్ధం చేసింది. 20 స్థానాల్లో 15 వైఎస్సార్ సీపీవే.. మడకశిర మున్సిపాలిటీలో 20 వార్డులుండగా...గత ‘స్థానిక’ ఎన్నికల్లో 15 వార్డుల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. టీడీపీ కేవలం ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది. చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వు కాగా, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ పీఠంపై ఓ మహిళను కూర్చోబెట్టాలని భావించారు. ఈ నేపథ్యంలోనే 7వ వార్డు నుంచి గెలుపొందిన దళిత సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీ నరసమ్మకు చైర్పర్సన్గా అవకాశం ఇచ్చి పాలనలో మహిళలను భాగస్వామ్యులను చేశారు. కానీ టీడీపీ నేతలు మాత్రం దళిత మహిళను చైర్పర్సన్ స్థానం నుంచి దించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు గాలం.. ఎలాగైనా సరే మడకశిర మున్సిపాలిటీని కై వసం చేసుకోవాలని భావిస్తున్న టీడీపీ నాయకులు.. తమకు తగినంత బలం లేకపోవడంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు గాలం వేస్తున్నారు. ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి ఇప్పటికే 8 మందికి టీడీపీ కండువా కప్పేశారు. దీంతో టీడీపీ బలం 13కు చేరగా...వారందరితో సంతకాలు చేయించి చైర్పర్సన్ లక్ష్మీనరసమ్మపై అవిశ్వాసం ప్రవేశ పెట్టడానికి అవకాశం కల్పించాలని కలెక్టర్కు వినతిపత్రం అందించారు. దళిత మహిళకు అన్యాయం చేసేందుకు కుట్ర కలెక్టర్కు అవిశ్వాసం నోటీసు ఇచ్చిన కౌన్సిలర్లు -
ప్రపంచానికే న్యాయాన్ని పంచిన అంబేడ్కర్
పెనుకొండ రూరల్: పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ అన్నారు. అంబేడ్కర్ జయంతి ముగింపు వేడుకలను పెనుకొండలోని మార్కెట్ యార్డ్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం మాధవ మాట్లాడారు. న్యాయ శాఖ కోవిదుడుగా ప్రపంచానికే న్యాయాన్ని పంచిన మహనీయుడిగా అంబేడ్కర్ ఖ్యాతిగాంచారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్, జోనల్ ఇన్చార్జ్ సందిరెడ్డి శ్రీనివాసులు, జిల్లా కో కన్వీనర్ గోపీనాథ్, రమేష్రెడ్డి, తలుపుల గంగాధర్, భాస్కర్ నాయక్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ -
‘ఎలాంటి బ్లాక్మెయిల్ చేయలేదు’
హిందూపురం టౌన్: బాలిక నగ్న వీడియోలతో తాము ఎలాంటి బ్లాక్ మెయిల్ చేయలేదని హిందూపురంలోని మేళాపురానికి చెందిన జయలక్ష్మి, వెంకటేష్ అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తాము వీడియోలు తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నామనడం పూర్తిగా అవాస్తవమన్నారు. తమపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. పట్టణానికి చెందిన సువర్ణ తనకు స్నేహితురాలని, తమ మధ్య ఉన్న బంధంతో సువర్ణకు దాదాపు రూ.2కోట్లకు పైగా నగదును విడివిడిగా ఇచ్చామన్నారు. ఆమె రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి, తన డబ్బును తిరిగి ఇస్తానని చెబితే, చెక్కులను, ప్రాంసరీ నోట్లను తీసుకుని ఇచ్చినట్లు వివరించారు. అయితే డబ్బు తీసుకుని చాలా కాలమైనా తిరిగి ఇవ్వకపోవడంతో ఇటీవల వెళ్లి అడిగామన్నారు. దీంతో తమపై అసత్య ఆరోపణలు చేస్తూ అందరినీ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. దీనిపై పోలీసులు సైతం విచారణ చేపట్టారని గుర్తు చేశారు. తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వమంటే ఇలా బురద చల్లడం సబబు కాదని అన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగంలో పలువురికి చోటు
పుట్టపర్తి టౌన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురికి ఆ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగంలో చోటు కల్పిస్తూ.. పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడిగా నరేంద్ర రెడ్డి, జనరల్ సెక్రటరీగా రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారు. బాలికల భద్రతకు పటిష్ట చర్యలుఅనంతపురం సెంట్రల్: యుక్త వయస్సు బాలికల భద్రతకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని ఐసీడీఎస్ పీడీ నాగమణి తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేటు సెమినార్ హాల్లో ఉమ్మడి జిల్లాలోని ఐసీడీఎస్ నోడల్ ఆఫీసర్లు, యూనిసెఫ్ ప్రతినిధులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు అధికారులు మాట్లాడారు. యుక్త వయస్సు బాలికల సాధికారిత కోసం ప్రత్యేక క్యాలెండర్ను విడుదల చేస్తూ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలా చేపడుతున్న అంశాలను వివరించారు. బాల్య వివాహాలు నివారించడానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. జెడ్పీ సీఈఓ భాస్కర్రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, శ్రీసత్యసాయి జిల్లా ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, డీఆర్డీఏ పీడీ ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు పులమతి విద్యార్థిని
లేపాక్షి: మండలంలోని పులమతి గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్లో 8వ తరగతి విద్యార్థిని సి.వర్ష.. జాతీయ స్థాయి ఎస్జీఎఫ్ అండర్–14 ఫుట్బాల్ పోటీలకు ఎంపికై ంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకూ జాతీయ స్థాయి పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో చోటు దక్కించుకున్న వర్ష ను... ఆ పాఠశాల హెచ్ఎం సుబ్బారావు, పీడీ రామాంజినేయులు, గ్రామ సర్పంచ్ అశ్వత్థనారాయణ, పాఠశాల కమిటీ అధ్యక్షుడు నరసింహమూర్తి, ఉపాధ్యాయులు అభినందించారు. వడడెబ్బతో విద్యార్థిని మృతి పెద్దపప్పూరు: వడదెబ్బ ప్రభావంతో ఓ విద్యార్థిని మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు... పెద్దపప్పూరు మండలం చాగల్లు గ్రామానికి చెందిన గంగరాజు, కవిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యాన్ని తాళలేక గంగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి కవిత వ్యవసాయ కూలి పనులతో ఇద్దరు కుమార్తెలను పెంచి పోషించుకుంటోంది. ఈ నేపథ్యంలో గురువారం వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం గూడూరు అంకాలమ్మ ఆలయానికి వెళ్లి వచ్చారు. ఎండ వేడిమి కారణంగా ఇంటికి చేరుకోగానే కుమార్తె గౌతమి (10)కి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. జ్వరం వచ్చినట్లు శరీరం మొత్తం కాలిపోతుండడంతో వడదెబ్బకు గురైనట్లుగా నిర్ధారించుకుని బంధువులు వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి వైద్యులు అనంతపురానికి రెఫర్ చేశారు. పరిస్థితి విషమిస్తుండడంతో సర్వజనాస్పత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున అక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, చాగల్లులోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న గౌతమి మృతి విషయం తెలియగానే ఉపాధ్యాయులు, ఎంఈఓ ఓబులపతి విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించి, నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. -
చెవిలో కమ్మలు లాక్కొని ఉడాయింపు
సోమందేపల్లి: మండలంలోని చాకర్లపల్లి రైల్వే గేటు వద్ద జామ పండ్లు విక్రయిస్తున్న ఓ వృద్దురాలి చెవిలోని బంగారు కమ్మలను లాక్కొని దుండగులు పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్నేహలత నగర్కు చెందిన జయమ్మ పండ్లు విక్రయిస్తుండగా హిందూపురం వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె వద్ద ఆపి, చెవిలోని కమ్మలను బలవంతంగా లాక్కొని ఉడాయించారు. ఘటనతో ఆమె చెవి తమ్మలు తెగిపోయి తీవ్ర రక్త స్రావమైంది. స్థానికులు ఆమెను హిందుపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తులం బరువున్న బంగారు కమ్మలను అపహరించుకెళ్లినట్లు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి
ధర్మవరం అర్బన్: ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య డిమాండ్ చేశారు. స్థానిక ఎన్జీఓ హోంలో జిల్లా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈయూ జిల్లా అధ్యక్షుడు కె.బి.నాగార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దామోదరరావు మాట్లాడుతూ... గత 12 ఏళ్లుగా ఆర్టీసీలో కారుణ్య నియామకాలు తప్ప ప్రభుత్వం ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్తో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో వివిధ కేటగిరిలలో దాదాపు 11వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి, బడుగు, బలహీన వర్గాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిలతో పాటు నూతన పీఆర్సీని ఏర్పాటు చేయాలని కోరారు. ఈహెచ్ఎస్ ద్వారా కనీస వైద్య సౌకర్యాలు కూడా అందడం లేదని మండిపడ్డారు. ఫలితంగా దాదాపు 350 మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రెఫరల్ ఆస్పత్రుల ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలన్నారు. సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నబీరసూల్, కడప జోన్ అధ్యక్షుడు కేకే కుమార్, జోనల్ కార్యదర్శి రాజశేఖర్, జిల్లా కార్యదర్శి వైపీ రావు, జోనల్ నాయకులు ఎన్సీ శేఖర్, అరుణమ్మ, జిల్లా నాయకులు నారాయణస్వామి, ఆర్ఎస్ రెడ్డి, ఏవీవీ ప్రసాద్, రమణప్ప, వాసులు, నరసింహులు, సుమో శీనా, తదితరులు పాల్గొన్నారు. ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదరరావు డిమాండ్ -
సమస్యలు పరిష్కరించండి
పుట్టపర్తి టౌన్: ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని ఎన్ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యచంద్రరావు డిమాండ్ చేశారు. నేషనల్ మజ్దూన్ యూనియన్ (ఎన్ఎంయూ) కడప జోన్ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు ఎన్.వి.రమణ అధ్యక్షతన కడప జోన్ ప్రథమ మహాసభ శుక్రవారం పుట్టపర్తిలోని సాయిఆరామంలో జరిగింది. ముఖ్య అతిథులుగా ఎన్ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యచంద్రరావు, నాయకులు శివారెడ్డి, భాస్కరనాయుడు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చెన్నారెడ్డి హాజరై, మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం ఘోరంగా విఫలమైందన్నారు. ఉద్యోగ భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ అమలు చేయాలని, అన్ని కేటగిరీల్లో పదోన్నతులు కల్పించి ఖాళీలు భర్తీ చేయాలని, ప్రభుత్వం ద్వారానే విద్యుత్ బస్సులు కొనుగోలు చేసి నిర్వహణ బాధ్యతను ఆర్టీసీ సిబ్బందికి అప్పగించాలని, అన్ని గ్యారేజ్ల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నైట్ అలవెన్స్లను రూ.300 నుంచి రూ.400కు పెంచాలని కోరారు. సిక్ లీవ్లకు సంబంధించి జీతాలు చెల్లించాలన్నారు. పాత వైద్య విధానాన్ని పునరుర్దరించాలన్నారు. ఉద్యోగులపై వేధింపులు ఆపాలన్నారు. డిమాండ్ల సాధనకు నిరంతర పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతనం కడప జోనల్ అధ్యక్షుడిగా వినోద్బాబు, జోనల్ కార్యదర్శిగా చెన్నారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. కార్యక్రమంలో ఎన్ఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీకర్ రెడ్డి, కార్యదర్శులు చెంచులయ్య, ఇస్మాయిల్, ఎర్రిస్వామి, నాగరాజు, భద్రావతి, సీసీఎంసీ మెంబర్లు వినోద్, గోపాలప్ప, 52 డిపోల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఎన్ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యచంద్రరావు -
జాతీయ స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీకి ఎంపిక
రొళ్ల: జాతీయ స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో రొళ్ల మండలం దొమ్మరహట్టి వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు టి.నవదీప్, టి.వరుణ్సందేష్, ఎన్.హర్షవర్ధన్, ఎం.దినేష్ చోటు దక్కించుకున్నారు. మే 3, 4వ తేదీల్లో నెల్లూరు వేదికగా జాతీయ స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ జరగనుంది. ప్రతిభ చాటిన విద్యార్థులను ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మైలారప్ప, వైస్ ప్రిన్సిపాల్ రమేష్ పీఈటీలు వెంకటనారాయణ, చంద్రశేఖర్, అనంతపురం జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు శుక్రవారం అభినందించారు. -
రైతుకు తీరని నష్టం
ధర పతనం.. పుట్టపర్తి అర్బన్: వేసవిలో ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించే కళింగర, దోస పంటలు రైతులను నట్టేట ముంచాయి. ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుని ఆరుగాలం శ్రమించి పండించిన పంట కాస్త చేతికి రాగానే ధరల పతనంతో తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. స్థానికంగా మార్కెటింగ్ సదుపాయం కూడా లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోలేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చివరకు కిలో కళింగర, దోస కాయలను రూ.5 చొప్పున విక్రయించేందుకు సిద్ధమైన కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో పంట పొలాల్లోనే దిగుబడులు వదిలేసిన దైన్య స్థితి. 323 హెక్టార్లలో సాగు.. జిల్లాలో ఏటా వంద హెక్టార్లలో కూడా సాగు చేయని కళింగర, దోస పంటలను ఈ సారి రైతులు ఏకంగా 323 హెక్టార్లలో సాగు చేయడం విశేషం. ఇందులో 118 హెక్టార్లలో కళింగర, మరో 205 హెక్టార్లలో దోస సాగు చేశారు. పంటల సాగుకు ఎకరాకు సుమారు రూ. లక్ష వరకూ ఖర్చు చేశారు. భూమి దుక్కి చేయడం మొదలు.. విత్తనాలు, మల్చింగ్ షీట్, ఎరువులు, డ్రిప్పు ఎరువులు, మందుల పిచికారీ, తొలగించే వరకూ కూలీల ఖర్చులు తడిసి మోపడయ్యాయి. అవగాహన లోపంతో ఉద్యాన అధికారులు, ఫర్టిలైజర్ షాపు యజమానులు, తోటి రైతులు చెప్పిన మందులు, ఎరువులకు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేశారు. తీరా పంట చేతికి వచ్చే సమయంలో వైరస్కు తోడు వేసవి ఎండల తాకిడికి పంట పొలాల్లోనే కాయల్లో పగుళ్లు వచ్చాయి. అష్టకష్టాలు పడి నాణ్యమైన కాయలను వేరు చేసి మార్కెట్కు తరలించేలోపు కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి ముందస్తుగానే కళింగర కాయలు ఇబ్బడి ముబ్బడిగా దిగుమతి అయ్యాయి. దీంతో ఇక్కడి పంటలకు గిట్టుబాటు ధర లభించలేదు. చివరకు కొందరు వ్యాపారులు కిలో రూ.5 నుంచి రూ.7 చొప్పున కొనుగోలుకు ముందుకు వచ్చారు. ఈ ధరతో పంటను విక్రయిస్తే కనీసం కూలీల ఖర్చులు కూడా గిట్టుబాటు కాదని భావించిన పలువురు రైతులు దిగుబడులను పొలాల్లోనే వదిలేశారు. రైతుల బలహీనతను ఆసరాగా చేసుకున్న మరికొందరు వ్యాపారులు కళింగరను కిలో రూ.3, దోసను కిలో రూ.7 చొప్పున కొనుగోలు చేస్తామంటున్నారు. దీంతో రైతులు పంటను రోడ్డు పక్కన పడేసి తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. నట్టేట మునిగిన కళింగర, దోస రైతులు పెట్టుబడి సైతం చేతికి అందక ఇబ్బందులు కిలో రూ.5 చొప్పున కూడా అమ్ముడుపోని దిగుబడులు -
15 మంది చిన్నారులకు బీఎంటీ చికిత్స
అనంతపురం మెడికల్: ఉమ్మడి జిల్లాలోని 15 మంది తలసీమియా బాధిత చిన్నారులకు బెంగళూరులోని సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో బోన్ మ్యారో ట్రాన్స్ఫ్లాంటేషన్ చేయనున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్ఫ్లాంటేషన్పై తలసీమియాతో బాధపడుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులకు గురువారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. తలసీమియా బాధిత చిన్నారులకు అందించి సదుపాయాలను సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధి ఆంకాలజిస్టు డాక్టర్ మోహన్ రెడ్డి, అభిజిత్, పుష్ప వివరించారు. డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... తలసీమియాతో బాధపడే చిన్నారులకు ప్రీవెంటివ్, చికిత్సనందించేందుకు సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ సహాయం చేస్తోందన్నారు. సర్వజనాస్పత్రిలో గైనిక్ విభాగంలో తలసీమియా జన్యు లోపాన్ని గుర్తించడానికి ప్రత్యేక ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 20 వారాలున్న 1,500 మంది గర్భిణుల్లో తలసీమియా జన్యులోపాన్ని గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో 40 మందిలో జన్యులోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరిలో 8 మంది పుల్ మ్యాచింగ్, మరో ఏడుగురు హాప్ మ్యాచింగ్ అయ్యారన్నారు. అంకాలజిస్టు డాక్టర్ మోహన్రెడ్డి మాట్లాడుతూ... కేంద్రం సహకారంతో చిన్నారులకు బెంగళూరులోని జైన్ ఆస్పత్రిలో చికిత్సనందిస్తారన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్దీన్కుమార్, డాక్టర్ శంకర్నారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
నూతన జిల్లాల ప్రాతిపదికన కౌన్సెలింగ్ నిర్వహించాలి
పుట్టపర్తి అర్బన్: నూతన జిల్లాల ప్రాతిపదిక మేరకే తమకు రివైజ్డ్ రీడిప్లాయ్మెంట్ నిర్వహించాలని హెల్త్ అసిస్టెంట్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్బేగంను గురువారం కలసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో జరగనున్న రివైజ్డ్ రీడిప్లాయ్మెంట్ కౌన్సెలింగ్ను స్థానిక జిల్లాలోనే నిర్వహించాలని కోరారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నిర్వహిస్తే తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియను మలేరియ సబ్ యూనిట్లు సైతం వర్తింపజేస్తూ జిల్లా మెరిట్ లిస్ట్ను ప్రదర్శించాలని కోరారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ... ప్రభుత్వ నిబంధనల మేరకు కౌన్సిలింగ్ చేపడతామని హామీనిచ్చారు. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య బుక్కరాయసముద్రం: మార్కులు సరిగా రాలేదంటూ తండ్రి మందలింపుతో మనస్తాపం చెంది డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బీకేఎస్ మండలం పొడరాళ్ల గ్రామానికి చెందిన రవి కుమార్తె వాణి (20) అనంతపురంలోని కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆన్లైన్ ద్వారా బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్న ఆమె కోచింగ్కు నిర్వహించిన పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయి. విషయం తెలుసుకున్న తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
శేషవాహనంపై విహరించిన శ్రీవారు
బొమ్మనహాళ్: మండల కేంద్రంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి బ్రహోత్సవాల సందర్భంగా గురువారం శ్రీవారు శేష వాహనం ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వైదపండితుల ఆధ్వర్యంలో పవిత్ర గంగాజలాభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక అలంకరణ , అలంకరణ , మంగళహారతి, తీర్థప్రసాదాలు, అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. రాత్రి 8 గంటలకు ప్రత్యేకంగా అలంకరించిన శేషవాహనంలో స్వామి వారిని గ్రామ వీధుల్లో ఊరేగింపు చేశారు. వందలాదిగా భక్తులు పాల్గొని శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు. -
ఒకే ఈతలో నాలుగు మేక పిల్లలు!
గుమ్మఘట్ట: మండలంలోని రంగచేడు గ్రామానికి చెందిన సిద్దయ్యగారి మల్లికార్జున పెంచుతున్న మేక ఒకే ఈతలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అంతకు ముందుకు కూడా ఇదే మేక మూడు పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పుట్టిన నాలుగు పిల్లలు క్షేమంగా ఉండడంతో గ్రామస్తులు ఆసక్తిగా గమనించారు. అధిక హార్మన్ల ప్రభావంతో అండాలు అధికంగా ఉత్పత్తి అయినప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని పశు వైద్యాధికారి నవీన్కుమార్ పేర్కొన్నారు.గుర్తు తెలియని వ్యక్తి మృతిధర్మవరం అర్బన్: స్థానిక ప్రభుత్వాస్పత్రి పక్కన ఉన్న అన్న క్యాంటీన్ ఎదుట గురువారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. దాదాపు 60 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉండవచ్చునని అంచనా వేశారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. వ్యక్తి మిస్సింగ్ కేసుల్లో సంబంధీకులు ఎవరైనా ఉంటే ధర్మవరం వన్ టౌన్ సీఐ (94407 96831), ఎస్ఐ (94948 16259), హెడ్ కానిస్టేబుల్ (98496 48216)ను సంప్రదించాలని పోలీసులు కోరారు.వ్యక్తి దుర్మరణంకదిరి టౌన్: ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... కదిరి మున్సిపాలిటీ పరిధిలోని మూర్తిపల్లిలో నివాసముంటున్న డేరంగుల లక్ష్మీనారాయణ (40)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. గురువారం రాత్రి పనిముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరిన లక్ష్మీనారాయణ... మున్సిపల్ పరిధిలోని టిడ్కో ఇళ్ల వద్దకు చేరుకోగానే వేగాన్ని నియంత్రించుకోలేక గోరంట్ల వైపుగా వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి వెంకటప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
అదృశ్యమైన వ్యక్తి మృతి
గార్లదిన్నె/బ్రహ్మసముద్రం: కనిపించకుండా పోయిన బ్రహ్మసముద్రం మండలం కోనాపురం గ్రామానికి చెందిన దండు కరేగౌడ (44) గురువారం ఉదయం గార్లదిన్నె వద్ద మృతదేహమై కనిపించాడు. పోలీసులు తెలిపిన మేరకు... కొంత కాలంగా మానసికంగా ఇబ్బంది పడే కరేగౌడ ఈ నెల 19న గార్లదిన్నెలో నివాసముంటున్న చెల్లెలు ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు సాయంత్రం అలా బయటకు వెళ్లి వస్తానంటూ చెల్లెలుకు తెలిపి ఇల్లు విడిచిన వెళ్లిన ఆయన రాత్రయినా రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. చివరకు బంధువులు ఊర్లలోనూ ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం మధ్యాహ్నం గార్లదిన్నెలోని అక్షర ఇంటర్నేషనల్ పాఠశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. వడదెబ్బతో మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోలీసులు వైరల్ చేయడంతో గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అప్రమత్తమై మృతదేహాన్ని పరిశీలించి, మృతుడిని కరేగౌడగా నిర్ధారించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు గార్లదిన్నె పీఎస్ ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. యువకుడి బలవన్మరణం రాప్తాడు రూరల్: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం రూరల్ మండలం నరసనాయనికుంటకు చెందిన రామచంద్ర నాయక్ కుమారుడు సిద్ధునాయక్ (19) 5వ తరగతి వరకు చదువుకున్నాడు. కేటరింగ్ కార్మికుడిగా పని చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న సిద్దు నాయక్ గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న అవ్వ.. విగతజీవిగా ఉరికి వేలాడుతున్న సిద్దునాయక్ను చూసి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని యువకుడి మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న అనంతపురం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మెడికో ఆత్మహత్యాయత్నం ● పెంచికలపాడు విశ్వభారతి మెడికల్ కళాశాలలో ఘటన కోడుమూరు రూరల్: గూడూరు మండలం పెంచికలపాడు విశ్వభారతి మెడికల్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని కళాశాలపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు.. అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన శ్రీనివాసులు, అనిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా, పెద్ద కుమార్తె హన్సిక.. విశ్వభారతి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల నిర్వహించిన పరీక్ష సరిగా రాయలేకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం సాయంత్రం కళాశాల రెండో అంతస్తుపై నుంచి దూకింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను సహ విద్యార్థులు సిబ్బంది వెంటనే కళాశాలలోని హాస్పిటల్కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కె.నాగలాపురం పోలీసులు విచారణ చేపట్టారు. ఐసీడీఎస్ పరిధిలోకి ‘ప్రధానమంత్రి మాతృవందన యోజన’ అనంతపురం: ప్రధానమంత్రి మాతృవందన యోజన శిక్షణ కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ నుంచి ఐసీడీఎస్ పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అనంతపురంలో ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సీడీపీఓలకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్రస్థాయి అధికారులు, మెడికల్ డిపార్ట్మెంట్ కో–ఆర్డినేటర్లు ,నోడల్ ఆఫీసర్ వీరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మానవత్వం చూపిన పోలీసులు
బత్తలపల్లి: స్థానిక పోలీసులు మానవత్వంతో ఓ వృద్ధుడిని సకాలంలో ఆస్పత్రికి చేర్పించి, ప్రాణాలు కాపాడారు. వివరాలు.. బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామ శివారులోని నార్పలకు వెళ్లే మార్గంలో ఓ చెట్టు కింద గుర్తు తెలియని వృద్ధుడిని వదిలి వెళ్లారనే సమాచారాన్ని అందుకున్న బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్ వెంటనే స్పందించారు. కానిస్టేబుల్ అనిల్కుమార్, హోంగార్డు నరసింహులును అక్కడకు పంపి, ఆరా తీయించారు. చెట్టు కింద నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడిని 108 వాహనంలో ఆర్డీటీ ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రజలు పోలీసుల చొరవను అభినందించారు. -
దేవపుత్ర సాహిత్యం చిరస్మరణీయం
అనంతపురం కల్చరల్: జిల్లా సాహిత్యంలో చిలుకూరి దేవపుత్రది ప్రత్యేక స్థానం. ఆయన ఎన్నో రచనలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని పలువురు వక్తలు కొనియాడారు. గురువారం స్థానిక విశాలాంధ్ర బుక్ హౌస్ ప్రాంగణంలో టీవీ రెడ్డి అధ్యక్షతన చిలుకూరి దేవపుత్ర 73వ జయంతిని అనంత సాహితీ సంస్థలు, తెలుగు వెలుగు సామాజిక సంస్థ సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రచయితలు, కవులు మాట్లాడుతూ.. జిల్లా సాహిత్యంలో చిలుకూరు దేవపుత్ర సామాన్యుల పక్షం వహించి ఎన్నో మానవీయ రచనలు చేశారని గుర్తు చేసుకున్నారు. అనంత సాహిత్యంలో చేసిన ప్రయోగాలు విలక్షణమైనవని తెలిపారు. దేవపుత్ర ఆశయాలను కొనసాగిస్తుండటంపై వారి కుటుంబ సభ్యులను అభినందించారు. కవి, గాయకుడు అంకె రామలింగమయ్య ఆలపించిన పద్యం ఆకట్టుకుంది. అనంతరం సీనియర్ కవి చం.శాస్త్రిని దేవపుత్ర స్మారకంగా సత్కరించారు. కార్యక్రమంలో ఈశ్వరయ్య, ప్రసాద్, తిరుపాలు, హరీష్, రసూల్, వెంకటేష్, దేవుపుత్ర కుటుంబీకులు చిలుకూరి దీవెన, అన్వేష్, కవులు, విశ్రాంత అధికారులు డాక్టర్ శశాంకమౌళి, మధురశ్రీ,. రియాజుద్దీన్, రామాంజనేయులు, గోవిందరాజులు, విశాలాంద్ర బుక్ హౌస్ విశ్రాంత మేనేజర్ చెట్ల ఈరన్న పాల్గొన్నారు. -
ఖర్చు తక్కువ.. వసూళ్లు ఎక్కువ
సాక్షి టాస్క్ ఫోర్స్: హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో హిందూపురంలో వచ్చే నెలలో అభినందన సభకు ఆయన పీఏలు ప్లాన్ చేశారు. ఇందుకోసం పట్టణంలోని ఎంజీఎం గ్రౌండ్ను ఎంపిక చేశారు. సుమారు 20 వేల మందితో సభను నిర్వహించాలని ప్రణాళిక చేసుకుంటున్నారు. ఇదే అదునుగా అందిని కాడికి దోచేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. భారీగా వసూళ్లకు ప్లాన్? బాలకృష్ణ అభినందన సభ కోసం అయ్యే ఖర్చుకు మించి భారీగా నగదు కూడబెట్టుకోవాలన్న ఆలోచనలో ఎమ్మెల్యే పీఏలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే పక్కా ప్లాన్ ప్రకారం అన్ని అడ్డదారుల్లోనూ డబ్బు వెనుకేసుకునేలా పథకం రచించారంటున్నారు. జన సమీకరణ బాధ్యత టీడీపీ నేతలకే అప్పజెప్పుతున్నారు. టీడీపీ నేతలకు ఆఫర్లు ఊరకనే ఖర్చు అంటే టీడీపీ నేతలు వెనుకడుగు వేస్తారేమో అన్న ఆలోచనతో పదవులు, కాంట్రాక్టులు ఆశ చూపెడుతున్నారు. భూఆక్రమణలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇసుక, మట్టి దందాలకు అడ్డు లేకుండా చేస్తున్నారని సమాచారం. వేలంలో అమ్మినట్లు పదవులను అమ్మకానికి పెట్టారంటున్నారు. ఇందులో భాగంగానే మార్కెట్ యార్డు చైర్మెన్ పదవి టీడీపీ నేతకు ఇచ్చారన్న విమర్శలున్నాయి. మద్యం బెల్టు షాపులు నిర్వహించేందుకు కూడా సహకరిస్తున్నరని చెబుతున్నారు. ఆ నలుగురిపై భారం హిందూపురం పట్టణానికి చెందిన నలుగురు టీడీపీ ముఖ్య నేతలపై వసూళ్ల భారం వేశారని సమాచారం. వారు కూడా భారీ మొత్తంలో పీఏలకు నగదు అందించినట్లు తెలుస్తోంది. కొట్నూరు వద్ద మున్సిపాలిటీ స్థలంలో అక్రమంగా షెడ్ల నిర్మాణానికి పీఏలు ఒకే చెప్పడంతో అందుకోసం రూ. 20 లక్షలు సదరు టీడీపీ నేత ఎమ్మెల్యే కార్యాలయానికి చెల్లించినట్లు సమాచారం. అందుకే మున్సిపల్ అధికారులు ఎవరూ అటువైపు వెళ్లడం లేదు. పరిశ్రమల నుంచి వచ్చే నెలవారీ మొత్తం, మద్యం దుకాణాలు, కల్లు దుకాణాల నుంచి మామూళ్లు, మట్టి, ఇసుక ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నింట్లో సభ కోసం అంటూ అందినకాడికి దోచేయాలని పీఏలు ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యే బాలకృష్ణకు పద్మభూషణ్ దక్కడంతో సత్కరించాలని పీఏల నిర్ణయం ‘పురం’లో సభ నిర్వహణకు ఏర్పాట్లు జన సమీకరణ, ఖర్చు పేరుతో భారీగా వసూళ్లు జేబులు నింపుకునేందుకు సిద్ధమైన పీఏలు !మండల పరిషత్ నిధులకు ఎసరు !బాలకృష్ణ అభినందన సభ కోసం 20 వేల మందిని జన సమీకరణ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే దృష్టిలో అంతమంది జనాభా వస్తున్నారని చెప్తే ఖర్చులు కూడా భారీగా ఉంటాయని ఆయన దృష్టిని మరల్చే యత్నం చేస్తున్నారని తెలిసింది. ఎంజీఎం గ్రౌండ్ కెపాసిటీ 6 నుంచి 7 వేల మందికి మిందని... మరి ఎలా 20 వేల మంది సభకు ఎలా తరలిస్తారన్న విషయంలో ఆ పార్టీ సభ్యుల మధ్యే చర్చ సాగుతోంది. 20 వేల మందితో సభ అంటూ ఖర్చు భారీగా ఉంటుందని జేబులు నింపుకునేందుకు ఎత్తువేశారని అంటున్నారు. -
వేర్వేరు హత్య కేసుల్లో వీడిన మిస్టరీ
తాడిపత్రి టౌన్: వివాహేతర సంబంధాల కారణంగానే తాడిపత్రి ప్రాంతంలో రెండు హత్యలు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. వేర్వేరు ఘటనలకు సంబంధించిన హత్య కేసుల్లో నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. తాడిపత్రి పట్టణ పీఎస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ సాయిప్రసాద్ వెల్లడించారు. ● పుట్లూరు మండలం చప్పిడి వెంగన్నపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరెడ్డికి 15 సంవత్సరాల క్రితం తాడిపత్రి మండలం బందర్లపల్లికి చెందిన పుష్పావతితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటేశ్వరెడ్డి పెళ్లి కాకముందు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లిలో నివాసముంటున్న తన పిన్నమ్మ ఇంటికి తరచూ వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అక్కిలి శ్రీలక్ష్మితో అయిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే శ్రీలక్ష్మికి పామిడి మండలం రామరాజుపల్లికి చెందిన రాజారెడ్డితో పెళ్లి జరిగింది. భర్త మరణించడంతో ఆమె పుట్టింటికి చేరుకుంది. ఈ క్రమంలో సులువుగా ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. దీంతో తన భార్య పుష్పావతిని, కుమారులను వెంకటేశ్వరరెడ్డి నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. అదే సమయంలో భర్త వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న ఆమె... ఆయనలో మార్పు రావాలని ఆకాంక్షిస్తూ ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉండిపోయింది. ఆ సమయంలో శ్రీలక్ష్మిని పిలుచుకుని నేరుగా తాడిపత్రిలోని యల్లనూరు రోడ్డులో ఉన్న అద్దె ఇంట్లోకి వెంకటేశ్వరరెడ్డి మకాం మార్చాడు. ఆ తర్వాత కాపురానికి రావాలని పుష్పావతికి తెలపడంతో వెంకటేశ్వరెడ్డి పేరు మీదున్న 9 ఎకరాల పొలాన్ని పిల్లల పేరుపై రాయాలని ఆమె పట్టుబట్టింది. ఈ అంశాన్ని వెంకటేశ్వరరెడ్డి, శ్రీలక్ష్మి వ్యతిరేకించారు. పుష్పావతి ఉంటే ఎప్పటికై నా తమకు ముప్పేనని భావించిన వారు.. పథకం ప్రకారం తాడిపత్రిలోని హేమాద్రి గెస్ట్హౌస్లో పెద్దల సమక్షంలో ఆస్తి పంపకాలపై పంచాయితీకి రావాలని కబురు పెట్టారు. దీంతో ఈ ఏడాది జనవరి 17న హేమాద్రి గెస్ట్హౌస్కు పుష్పావతి చేరుకుంది. పంచాయితీ పెద్దలతో మాట్లాడిన అనంతరం గది బయట వేచి ఉన్న పుష్పావతిపై అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న వేట కొడవలితో వెంకటేశ్వరరెడ్డి దాడి చేసి, హతమార్చి ఉడాయించాడు. అనంతరం శ్రీలక్ష్మిని పిలుచుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం విస్తత గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి శ్రీలక్ష్మి ఇంట్లో ఉన్న సామగ్రిని తీసుకెళ్లేందుకు యల్లనూరు రోడ్డులో ఉన్న అద్దె గదికి వారు చేరుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో వెంకటేశ్వరెడ్డి, శ్రీలక్ష్మిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ● తాడిపత్రిలోని ఓశాంతి నగర్ నివాసముంటున్న మణికి పామిడి గ్రామానికి చెందిన యక్కలూరి మహేష్తో వివాహమైంది. ఈ క్రమంలో అత్తింటికి తరచూ వచ్చి వెళ్లే మహేష్... ఆ పక్కనే నివాసముంటున్న రమీజాబీతో ఏర్పడిన పరిచయంతో చాలా చనువుగా ఉండేవాడు. ఇది గమనించిన రమీజాబీ కుమారుడు సయ్యద్ ఫైరోజ్ తన పిన్నమ్మ షేక్ ఖాజాభీతో చెప్పుకుని బాధపడ్డాడు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు చోటు చేసుకునేవి. ఈనెల 10న మహేష్ తన భార్య మణితో పాటు తాడిపత్రికి వచ్చాడు. 16వ తేదీ రమీజాబీతో షేక్ ఖాజాబీ, సయ్యద్ ఫైరోజ్ గొడవ పడుతుంటే వారికి సర్దిచెప్పేందుకు మహేష్ వెళ్లాడు. తమ ఇంటి గొడవలో నువ్వెందుకు కలుగ చేసుకుంటున్నాంటూ మహేష్పై ఖాజాబీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి ఫైరోజ్కిచ్చి పొడవమని ప్రోత్సహించింది. దీంతో మహేష్ పొట్టలో బలంగా పొడవంతో తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడిని వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఈ కేసులో సయ్యద్ ఫైరోజ్, షేక్ ఖాజాబీను వారి ఇంటి వద్దనే గురువారం పోలీసులు అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. వివాహేతర సంబంధాలే కారణమని నిర్ధారించిన పోలీసులు హత్య కేసుల్లో నిందితుల అరెస్ట్ -
హౌసింగ్ లబ్ధిదారులకు అదనపు నిధులు
లేపాక్షి: రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకం కింద గతంలో మంజూరై అర్ధాంతరంగా ఆగిపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులు ఇళ్లు పూర్తి చేసుకునేలా ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటనారాయణ తెలిపారు. గురువారం స్థానిక హౌసింగ్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అదనంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అయితే అనుకున్న స్థాయిలో ఇళ్లను పూర్తి చేసుకోలేకపోయారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అదనంగా నిధులు మంజూరు చేసిందన్నారు. ఇళ్లను జూన్ 12వ తేదీలోగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే మండల వ్యాప్తంగా 830 ఇళ్లు మంజూరు చేయాలని దరఖాస్తులు వచ్చాయని వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో డీఈఈ శ్రీనివాసులు, ఏఈ రాజేంద్రప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. ఆర్డీటీ సెట్కు దరఖాస్తుల ఆహ్వానం బత్తలపల్లి: పదో తరగతి ఫలితాల్లో 500 మార్కులు పైబడిన వచ్చిన విద్యార్థులు ఆర్డీటీ నిర్వహించే ఆర్డీటీ సెట్కు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ రీజనల్ డైరెక్టర్ ప్రమీల, ఏటీఎల్ కృష్ణ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్డీటీ ఫీల్డ్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆర్డీటీ పేద విద్యార్థులను ఇంటర్ చదివించేందుకు అవకాశం కల్పిస్తోందన్నారు. 500 మార్కులు పైబడి సాధించిన విద్యార్థులు ఆర్డీటీ సెట్కు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో ఆర్డీటీ స్పాన్సర్షిప్ కలిగి ఉంటే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివి ఉన్నా అర్హులన్నారు. ఓసీ, బీసీ, స్పాన్సర్షిప్ లేనివారు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చదివి ఉండాలన్నారు. శుక్రవారం నుంచి స్థానిక ఫీల్డ్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. 30వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. మే 11న ఆర్డీటీ సెట్ పరీక్ష ఉంటుందన్నారు. ఆర్డీటీ సెట్కు దరఖాస్తు చేసుకునేవారు ఆధార్, రేషన్కార్డు, పదో తరగతి హాల్ టికెట్, మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం, రెండు పాస్ ఫోటోలు తీసుకురావాలన్నారు. స్వచ్ఛతలో జిల్లాకు అవార్డు ప్రశాంతి నిలయం: స్వచ్చాంధ్ర గ్రామీణ్ కార్యక్రమం అమలులో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు జిల్లాకు ప్రత్యేక అవార్డును అందజేశారు. గురువారం విజయవాడలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ చేతులు మీదుగా కలెక్టర్ టీఎస్ చేతన్ అవార్డును అందుకున్నారు. ఇంటర్లో నూతన సిలబస్పై శిక్షణ పుట్టపర్తి: ఈ ఏడాది ప్రభుత్వం ఇంటర్లో నూతన సిలబస్ ప్రవేశ పెట్టిందని, ఆ సిలబస్పై ఆయా కళాశాల అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్నట్లు ఇంటర్ జిల్లా విద్యాశాఖ అధికారి రఘునాథరెడ్డి తెలిపారు. ఆయన సిబ్బందితో కలిసి కొత్తచెరువు కార్యాలయం ఆవరణలో బ్యానర్ ప్రదర్శించారు. నూతన సిలబస్పై అధ్యాపకులకు నాలుగు దశలలో శిక్షణ ఉంటుందన్నారు. మే 5వ తేదీ వరకూ పెనుకొండ కళాశాలలో సబ్జెక్టుల వారీగా శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. -
నువ్వే మాకు శరణం సాయీ..
ప్రశాంతి నిలయం: అశేష భక్తకోటి తమ ఇలవేల్పు సత్యసాయికి ఆత్మనివేదనను అర్పించుకున్నారు. నువ్వే మాకు శరణం అంటూ భక్తిగీతాలతో సాయిరాముడిని స్మరించారు. సత్యసాయి ఆరాధన మహోత్సవం గురువారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు సత్యసాయి మహాసమాధి చెంత సాయి విద్యార్థుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. సత్యసాయి విద్యార్థులు, మిర్పురి సంగీత కళాశాల భజన బృందం సత్యసాయిని కీర్తిస్తూ పంచరత్న కీర్తనలు అలపించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు నాగానంద ప్రారంభోపన్యాసం చేశారు. విశ్వమానవాళిని అంధకారం నుంచి చైతన్యం వైపు నడిపిన ఆదిగురువు సత్యసాయి అని కొనియాడారు. అనంతరం ‘‘సత్యసాయి ప్రేమ ప్రవాహిని’’ యాత్ర పేరుతో ఏర్పాటు చేసిన ప్రచార రథాలను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జె.రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తి, నాగానంద, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్ పాండే తదితరులు ప్రారంభించారు. తర్వాత బ్రోచర్లను విడుదల చేశారు. నమిష్ పాండే మాట్లాడుతూ ప్రేమ వాహిని యాత్రను దేశ వ్యాప్తంగా ఉన్న సత్యసాయి భక్తులు విజయవంతం చేయాలన్నారు. 2026 నవంబర్ 24 వరకూ దేశ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తాయన్నారు. సాయంత్రం ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఉత్తర ఉన్ని కృష్ణ బృందం నిర్వహించిన సంగీత కచేరీ అందరినీ అలరించింది. వేడుకల్లో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు చక్రవర్తి, శెట్టి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిల్వ్యూ స్టేడియంలో మహా నారాయణ సేవ సత్యసాయి ఆరాధన మహోత్సవంలో భాగంగా గురువారం ప్రశాంతి నిలయంలో వేడుకలు ముగిసిన అనంతరం పట్టణంలోని హిల్వ్యూ స్టేడియంలో మహానారాయణ సేవ నిర్వహించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జె.రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యులతో కలసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 30 వేల మందికి సత్యసాయి అన్నప్రసాదాలతో పాటు చీర,దోవతీ వితరణ చేశారు. శతజయంతి వేడుకలకు ఏర్పాట్లు సత్యసాయి శతజయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్రాజు తెలిపారు. సత్యసాయి ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకుని సత్యసాయి ప్రేమ ప్రవాహిని పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దేశంలోని సుమారు 500 జిల్లాల్లో 2.5 లక్షల కిలోమీటర్లు ప్రేమ ప్రవాహిని రథాలు ప్రచారం చేస్తాయన్నారు. సత్యసాయి అవతార వైభవం, సేవా మార్గాలు, ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రజలకు వివరిస్తూ చైతన్యపరుస్తాయన్నారు. ప్రశాంతి నిలయంలో ఘనంగా సత్యసాయి ఆరాధన మహోత్సవం శతజయంతి వేడుకలను విజయవంతం చేయాలని రత్నాకర్రాజు పిలుపు -
బాధితుల పక్షాన నిలబడాల్సిన కొందరు ఖాకీలు సెటిల్మెంట్లే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఏది చెబితే అది ఎఫ్ఐఆర్లో చేరుస్తున్నారు. బాధితులతో పద్ధతిగా మాట్లాడకుండా బూతులు లంఘించుకుంటున్నారు. డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తారో వారికే న్యాయం చేస్తున్నారు.
సార్ చెప్పండి... మీరెంత చెప్తే అంత● టీడీపీ నేతల అండతో కొందరు ఖాకీల విచ్చలవిడితనం ● ఎమ్మెల్యేలే బాసులుగా విధులు నిర్వర్తిస్తున్న సీఐలు ● రాత్రి పదిన్నర తర్వాతే కదిరి అర్బన్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ● ఇటుకలపల్లి సీఐ దగ్గరికెళితే కేసులతో పాటు బూతులు బోనస్ ● రాయదుర్గం సీఐ జయ.. ఆయనకు లేనిదే దయ అనే విమర్శలు ● పుట్టపర్తి ఎస్పీ ఆఫీసులో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ ప్రదీప్ హవా సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొంతమంది సీఐల వ్యవహార శైలితో ఖాకీ చొక్కాకు అవినీతి మరకలంటుకున్నాయనే విమర్శలున్నాయి. కదిరి అర్బన్ పోలీస్స్టేషన్ సీఐగా ఉన్న నారాయణరెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల గంజాయి కేసులో పట్టుబడిన వారిని ఉదారంగా వదిలేసి కేవలం బైండోవర్తో సరిపెట్టారనే విమర్శలున్నాయి. రాత్రి పదిన్నర వరకూ ఎఫ్ఐఆర్లు నమోదు కావని, సెటిల్మెంట్ సక్సెస్ అయితే ఎఫ్ఐఆర్ ఊసే ఉండదని, కుదరకపోతే కేసు నమోదవుతుందని బాధితులు చెబుతున్నారు. సీఐ కార్యాలయం ఎప్పుడూ సివిల్ పంచాయితీలతో బిజీగా ఉంటోందని తెలిసింది. ‘జయ’.. కానరాని దయ రాయదుర్గం అర్బన్ సీఐ జయానాయక్కు దయ అనేది ఎక్కడా లేదన్న విమర్శలున్నాయి. ఈ స్టేషన్లో రోజూ సివిల్ పంచాయితీలు ఎక్కువగా జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ వివాదంలో బాధితుడి నుంచి భారీగా డబ్బు చేతులు మారినట్టు బాధితుల తరఫు బంధువులు చెప్పారు. స్టేషన్కు వచ్చే వారిపట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధికి మాత్రమే సేవకుడిగా ఉంటున్నారనే విమర్శలున్నాయి. హేమంత్ నోట బూతులే.. ఇటుకలపల్లి సీఐగా ఉన్న హేమంత్కుమార్ నోటికొచ్చినట్టు బూతులు తిడుతున్నట్టు బాధితులు వాపోతున్నారు. పరిటాల శ్రీరామ్కు అనుంగు అనుచరుడిగా ఉన్న ఈయన టీడీపీ నేతల అండచూసుకుని రెచ్చిపోతున్నట్టు ఇటీవల ఓ బాధితుడు చెప్పారు. మొన్నటికి మొన్న అక్రమంగా మట్టి తోలుతున్న రెండు టిప్పర్లు పట్టుకుని తెల్లారేసరికి వదిలేశారు. వారితో సెటిల్మెంట్ చేసుకున్నట్టు తేలింది. టీడీపీ నేతలు చెబితే ప్రత్యర్థులను అకారణంగా స్టేషన్కు పిలిపించడం, బెదిరించడం చేస్తున్నట్టు చెబుతున్నారు. స్టేషన్కు వెళ్లిన వారికి కనీస మర్యాద ఇవ్వకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తగా ఎస్ఐ సుధాకర్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఖాకీ డ్రెస్సు వేసుకుని పొలిటికల్ పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీసుగా రామ గిరి ఎస్ఐ సుధాకర్ గుర్తింపు పొందారు. పరిటాల కుటుంబానికి పనిమనిషిగా ఉన్నట్టు కూడా ఆరోపణలున్నాయి. ఇటీవల రామగిరి వైస్ ఎంపీపీ ఎంపికలో ఎంపీటీసీలను బెదిరించడం, వారిని టీడీపీ వ్యానులో ఎక్కించడం వంటివి బహిరంగంగా చేశారు. బాధితులను భయభ్రాంతులకు గురిచేశారు. పక్కా టీడీపీ కార్యకర్తలా సామాజిక మాధ్యమాల్లో మాట్లాడినా ఇతనిపై శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న వీసమెత్తు చర్యలు తీసుకోలేదు. ఎస్బీ ఎస్ఐ ప్రదీప్ కీలకంగా.. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఆఫీసులో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పనిచేస్తున్న ప్రదీప్.. ప్రస్తుతం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. తన పై అధికారులకు పనులు చక్కబెట్టడంలో దిట్ట అని పేరుంది. చాలా మంది సీఐలు, డీఎస్పీలకు జరగని పనులు ప్రదీప్కు జరుగుతాయి. సెటిల్మెంట్ల ద్వారా పై అధికారులకు ఆర్థిక చేయూతనివ్వడం, ఎప్పటికప్పుడు ఏ పోలీసు అధికారి ఏం చేస్తున్నారో పెద్దబాస్కు చెప్పడం ఇతని పని. దీంతో పోలీసు అధికారులు చాలామంది ప్రదీప్ అంటే భయపడిపోతున్నారు. జిల్లాలో ప్రదీప్ ఏదిచెబితే అది జరుగుతుందని చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి కృషి
ప్రశాంతి నిలయం: జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం చేయడానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం జిల్లా పంచాయతీశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ హాజరై జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళిలర్పించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ తరుఫున పన్నులు, ఇతర వసూళ్లు 80 శాతం చేసినందుకు, ఓడీఎఫ్ 100 శాతం, పంచాయతీ పోర్టల్లో పాలనాపరమైన విషయాలు, ఇతర వివరాలు 100 శాతం నమోదు చేసినందుకు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో పురోగతి సాధించడంతో జిల్లాకు ఉత్తమ అవార్దు వచ్చిందన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులకు జాయింట్ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంధర్బంగా పలువురు డివిజనల్ పంచాయతీ అధికారులు, ఉప మండలాభివృద్ధి అధికారులు, 18 మంది పంచాయతీ కార్యదర్శులు, జిల్లా గ్రామ పంచాయతీ కార్యాలయం ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ధర్మవరం డివిజనల్ పంచాయతీ అధికారి శివకుమారి, కదిరి డీఎల్డీఓ అంజనప్ప, బుక్కపట్నం ఉప మండలాభివృద్ధి అధికారి అశోక్కుమార్రెడ్డి, బత్తలపల్లి కృష్టప్ప, తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ -
పాపిరెడ్డిపల్లిలో భయం.. భయం
సాక్షి, పుట్టపర్తి/రామగిరి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే పరిటాల సునీత ఇలాకాలో వైఎస్సార్సీపీ నేత హత్య జరిగి నెల రోజులు కూడా కాలేదు. ఇంతలోనే పరిటాల సునీత మరో కుట్ర పన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఉగాది పర్వదినం రోజున కురుబ లింగమయ్యను టీడీపీ గూండాలు దారుణంగా హత్య చేశారు. నెల రోజులు తిరగకుండానే పోలీస్ పికెట్ తీసేయడంపై గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భయంతో బతుకుతున్నారు. పోలీసులు అందుబాటులో లేరని తెలిస్తే.. గ్రామంలోని టీడీపీ అల్లరిమూకలు రెచ్చిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసు పికెట్ ఏర్పాటు చేసి గ్రామానికి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. భద్రతా వైఫల్యం.. మరోసారి బహిర్గతం గత మార్చిలో పాపిరెడ్డిపల్లిలో నాలుగు రోజుల పాటు గొడవ కొనసాగింది. పోలీసులకు విషయం తెలియజేసినా పట్టించుకోలేదు. దీంతో గొడవ పెద్దదై లింగమయ్యను హతమార్చే వరకూ వచ్చింది. అలాగే రామగిరి ఎంపీపీ ఎన్నికల విషయంలో పోలీసుల భద్రతా వైఫల్యం బట్టబయలైన సంగతి తెలిసిందే. పోలీసుల సమక్షంలోనే ఓ ఎంపీటీసీ సభ్యురాలిని టీడీపీ వాళ్లు కిడ్నాప్ చేశారు. అంతకుముందు రామగిరి ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు తెగబడ్డారు. పాపిరెడ్డిపల్లిలో హత్య జరిగి నెల రోజులు కూడా పోలీసు బందోబస్తు నిర్వహించలేదంటే.. మరో కుట్రకు తెరలేపారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లికి పర్యటన సమయంలో హెలిప్యాడ్ వద్ద సమస్య వచ్చిన సంగతి తెలిసిందే. ఎస్ఐ సుధాకర్యాదవ్ ఏం చేస్తున్నారో? రామగిరి ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న సుధాకర్యాదవ్.. అక్కడ విధుల్లో చేరిన నాటి నుంచి ఎమ్మెల్యే పరిటాల సునీత కనుసన్నల్లోనే ఉన్నారన్న విమర్శలున్నాయి. అయినా పోలీసు ఉన్నతాధికారులు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయింపునకు కూడా ఆయన వెనుకాడటం లేదు. పోలీసు పికెట్ రద్దు చేయడంపై సుధాకర్యాదవ్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసు పికెట్ తీసేసిన యంత్రాంగం మళ్లీ రెచ్చిపోయే ఆలోచనలో టీడీపీ రౌడీమూకలు లింగమయ్య హత్య జరిగి నెల పూర్తికాకనే కుట్రలు -
నేడు పాసింగ్ ఔట్ పరేడ్
గోరంట్ల: పాలసముద్రం సమీపంలోని సెంట్రల్ ఎకై ్సజ్ అకాడమి అండ్ నార్కోటిక్స్ (నాసిన్) సంస్థలో శిక్షణ పొందుతున్న ఐఆర్ఎస్ 75వ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం జరగనుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి హాజరుకానున్నారు. గురువారం రాత్రే ఆయన జిల్లాకు చేరుకున్నారు. నాణ్యమైన భోజనం అందించాలి కదిరి టౌన్: ఖైదీలకు నాణ్యమైన భోజనం అందించాలని అనంతపురం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.శివప్రసాద్ ఆదేశించారు. గురువారం కదిరి సబ్ జైలును తనిఖీ చేశారు. అనంతరం జైలు సూపరింటెండెంట్కు పలు సూచనలు చేశారు. ఖైదీలకు వండిన భోజనాన్ని పరిశీలించారు. మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, మార్పు చెందాలని ఖైదీలకు సూచించారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ వాసుదేవరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. 30న పాలిసెట్ అనంతపురం: డిప్లొమో కోర్సుల్లో అడ్మిషన్లు నిర్వహించడానికి నిర్వహిస్తున్న ఏపీ పాలిసెట్–2025ను ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ సి. జయచంద్రా రెడ్డి తెలిపారు. అభ్యర్థులు తమ హాల్టికెట్లనుwww.poycetap.nic.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. -
శభాష్ ఉమామహేశ్వరెడ్డి
● సివిల్స్లో 221 ర్యాంకు కదిరి అర్బన్: తల్లిదండ్రుల ప్రొత్సాహం, ప్రణాళిక బద్ధంగా చదివి సివిల్స్లో 221 ర్యాంకు సాధించాడు కదిరికి చెందిన బొల్లంపల్లి ఉమామహేశ్వరెడ్డి. ఆయన కర్నూలు మాంటిస్సోరిలో పదో తరగతి చదివారు. హైదరాబాద్లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేశారు. ఉమామహేశ్వర్రెడ్డి తల్లిదండ్రులు రాజశేఖర్రెడ్డి, తల్లి పద్మావతి విశ్రాంత ఉపాధ్యాయులు. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో ఢిల్లీలో శిక్షణ పొందారు. హైదరాబాద్లో ఉంటూ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. గతంలోనే సివిల్స్లో 270 ర్యాంకు సాధించి ఐఆర్ఎస్ సాధించారు. ప్రస్తుతం నాగపూర్లో ఐఆర్ఎస్ శిక్షణలో ఉన్నారు. ఇంకా మెరుగైన ర్యాంకు సాధించాలని ప్రణాళికాబద్ధంగా చదివి మొన్న వచ్చిన సివిల్స్ ఫలితాల్లో 221వ ర్యాంకు సాధించారు. -
సాక్షి కార్యాలయంపై దాడి హేయం
పుట్టపర్తి టౌన్: వ్యతిరేక వార్త వచ్చిందని ఏలూరు సాక్షి కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఖండించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జర్నలిస్టులతో కలిసి ఎస్పీ రత్నకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సాక్షి కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో పాటు అక్కడ విధుల్లో ఉన్న పాత్రికేయునిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. వాస్తవాలు వెలికితీసే జర్నలిస్టులపై దాడులను పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేశారు. పత్రికలో వచ్చిన వార్తలో వాస్తవాలు లేకుంటే దానికి వివరణ ఇవ్వాలే కానీ, కార్యాలయంపై దాడి చేయడం సిగ్గు చేటన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే జర్నలిస్టులపై కక్షపూరితంగా కుట్రలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు పుల్లయ్య, బాబు, దివిటీ రాజేష్, గంగిరెడ్డి, కేశవరెడ్డి, ఉద్దడం చంద్రశేఖర్, రమణ, విజయశేఖర్రెడ్డి, సతీష్, టీసీ గంగాధర్, అంజిప్రసాద్, నాగరాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కక్ష సాధింపు చర్య సరికాదు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జర్నలిస్టులపై నిత్యం దాడులు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు. దాడులతోపాటు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే ప్రజాస్వామ్యానికే మప్పు వాటిల్లుతుంది. పాలకులు స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలి. – దివిటీ రాజేష్, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ ఎస్పీకి వినతిపత్రం అందజేసిన జర్నలిస్టులు చర్యలు తీసుకోవాలి నిజాలు బయటకు తీసి ప్రజలకు తెలియజేసే రిపోర్టర్లు, కార్యాలయాలపై దాడులు చేయడం హేయమైన చర్య. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి వ్యతిరేకం. రాజకీయంగా కక్షలు ఉంటే రాజకీయంగానే చూసుకోవాలి. అంతేకానీ జర్నలిస్టులపై దాడులు చేయడం మంచి పద్ధతికాదు. దాడులకు పాల్పడిన ఎమ్మెల్యే చింతమనేని అనుచరులను అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలి. – డి.బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజే దాడులు మంచి పద్ధతి కాదు ప్రజల పక్షాన వార్తలు రాస్తూ సమాజ అభివృద్ధి కోసం పాటు పడే పాత్రికేయులపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. ఏమైనా అభ్యతరం ఉంటే ఖండించే హక్కు ఎవరికై నా ఉంటుంది. కానీ ఇలా పాత్రికేయులపై కక్షసాధింపు ధోరణి ప్రదర్శించడం తగదు. ఏలూరులో సాక్షి కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడులు ఇలాగే కొనసాగితే ఉద్యమాలు ఉధృతం చేస్తాం. – చింతకాయల పుల్లయ్య, జిల్లా అధ్యక్షుడు, ఏపీయూడబ్ల్యూజే -
మడకశిరకు రేపు మంత్రి రామ్ప్రసాద్రెడ్డి రాక
మడకశిర: రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మడకశిరలో పర్యటించనున్నారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా ఇండోర్ స్టేడియం, డిపో పరిధిలో నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించనున్నారు. అలాగే అంబేడ్కర్, బాబూజగ్జీవన్రామ్ విగ్రహాల ఏర్పాటుకు భూమిపూజ చేసి, ఆర్టీసీ డిపోను సందర్శించనున్నారు.ఉచిత ఉపాధి శిక్షణకు దరఖాస్తు చేసుకోండిపుట్టపర్తి అర్బన్: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేస్తున్న సీసీటీవీ ఇన్స్టలేషన్ కోర్సులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని బుక్కపట్నం ఎస్ఎస్ఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మగ్బూల్ హుస్సేన్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ కోరారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. మూడు నెలల శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పూర్తి వివరాలకు 79815 41994లో సంప్రదించవచ్చు.గోడ కూలి వృద్ధురాలి మృతిగాండ్లపెంట: మండలంలోని కటారుపల్లి గ్రామంలో బుధవారం పాత మిద్దె గోడ కూలి నారాయణమ్మ(73) మృతి చెందింది. మరో వృద్దురాలు వసుంధరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఎండకు తాళలేక రామాలయం వీధిలోని వేమారెడ్డి పాత మిద్దె వద్ద రోజూ వృద్ధులు సేదతీరుతుంటారు. బుధవారం అక్కడ నారాయణమ్మ, వసుంధరమ్మ కూర్చొని మాట్లాడుకుంటుండగా ఉన్నఫళంగా గోడ కూలింది. శిథిలాల కింద చిక్కుకుని నారాయణమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. గాయపడిన వసుంధరమ్మను గ్రామస్తులు చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించారు.ప్రమాదంలో ఫైర్ మెన్ మృతికనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఫైర్ మెన్ సుధాకర్ (40) దుర్మరణం పాలయ్యారు. అనంతపురంలో నివాసముంటున్న ఆయన పుట్టపర్తిలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఫైర్మెన్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం విధులు ముగించుకున్న ఆయన అనంతపురానికి వెళ్లే క్రమంలో మామిళ్లపల్లికి చేరుకున్నారు. అనంతరం బస్సు కోసం జాతీయ రహదారిని దాటుతుండగా బెంగళూరు నుంచి అనంతపురం వైపుగా వేగంగా వెళుతున్న లారీ ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య రమ్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఎన్సీడీసీ రుణాల రికవరీ పెరగాలి
అనంతపురం అగ్రికల్చర్: నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘాల సభ్యులు తీసుకున్న రాయితీ రుణాల రికవరీ పెరిగితే... కొత్తగా రుణ ప్రతిపాదనలు పంపిస్తామని షీప్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి అన్నారు. స్థానిక పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న షీప్ యూనియన్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఉమ్మడి జిల్లా మహాజన సభలో ఈ అంశంపై చాలా సేపు చర్చ సాగింది. ఈడీ కేఎల్ శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన మహాజనసభలో పర్సన్ ఇన్చార్జి హోదాలో డీడీ డాక్టర్ వై.రమేష్రెడ్డి, అలాగే పశుశాఖ జేడీ డాక్టర్ జీపీ వెంకటస్వామి, సహకార అధికారి మురళి తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్సీడీసీ నుంచి రూ.10 కోట్ల వరకు రుణాలు అందించామని, గడువు మీరినా ఇంకా రూ.2.50 కోట్ల రుణాల వసూళ్లు పెండింగ్లో ఉన్నందున కొత్తగా రుణాల మంజూరుకు అవరోధం ఏర్పడుతోందన్నారు. ఇది ఆర్థికంగా పురోగతి సాధించాలనుకున్న గొర్రెలు, మేకల సహకార సంఘాల సభ్యులకు ఇబ్బందిగా మారుతోందన్నారు. అనంతరం పెండింగ్ రుణాలు సాధ్యమైనంత తొందరగా చెల్లించాలని లేదంటే అవసరమైన చర్యలు తీసుకునేలా సభ ఆమోదం తెలిపింది. జిల్లా సమాఖ్య పాలకవర్గం ఏర్పాటుకు ఎన్నికలు నిర్వహించాలని దీనిపై ఈడీ నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. గొర్రెలు, మేకల పెంపకంపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నందున ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని జేడీ వెంకటస్వామి తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏర్పడిన పాలక వర్గాల అధ్యక్షులు, సభ్యులను పరిచయం చేసుకుంటూ... రిజిస్టర్లు, సమావేశాలు, ఆడిటింగ్ నిర్వహణ అంశంపై అవగాహన కల్పించారు. షీప్ యూనియన్ మహాజన సభలో చర్చ -
చోరీ కేసులో నలుగురి అరెస్ట్
మడకశిర: ఒంటరిగా వెళుతున్న వారిని అటకాయించి చోరీలకు పాల్పడే నలుగురిని అరెస్ట్ చేసినట్లు ప్రొబేషనరీ డీఎస్పీ ఉదయపావని, మడకవిర అప్గ్రేడ్ పీఎస్ సీఐ నగేష్బాబు తెలిపారు. స్థానిక పీఎస్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వారు వెల్లడించారు. ఈ నెల 18న తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై పొలానికి బయలుదేరిన మడకశిర మండలం కల్లుమర్రి గ్రామానికి చెందిన శ్రీనివాసులు, సుభాషిణి దంపతులను దారి మధ్యలో అడ్డుకుని బంగారు, వెండి గొలుసులను అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం కల్లుమర్రి గ్రామ సమీపంలో 544ఈ జాతీయ రహదారిపై ప్రొబేషనరీ డీఎస్పీ ఉదయపావని, సీఐ నగేష్బాబు పర్యవేక్షణలో సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై అటుగా వచ్చిన నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి వెనక్కు వెళ్లే ప్రయత్నం చేశారు. పసిగట్టిన పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో ఈ నెల 18న సుభాషిణి మెడలోని బంగారు, వెండి గొలుసులను అపహరించిన విషయం వెలుగు చూసింది. పట్టుబడిన వారిలో కర్ణాటకలోని మధుగిరి తాలూకా బేడ్తూరు గ్రామానికి చెందిన హరీష్, నల్లకామనహళ్లికి రాకేష్బాబు, మడకశిర మండలం కల్లుమర్రి గ్రామానికి చెందిన రమేష్, పరిగి మండలం శ్రీరంగరాజుపల్లి నివాసి ఒకరు ఉన్నారు. వీరి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, ఓ బంగారు, మరో వెండి గొలుసును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ● ఊరంతా ఖాళీ...సోమందేపల్లి: వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామస్తులు బుధవారం గ్రామాన్ని ఖాళీ చేసి పొలిమేరల్లో గడిపారు. ఏటా సజ్జగంట రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల అనంతరం ఈ ప్రక్రియను ఆనవాయితీగా పాటిస్తూ వస్తున్నారు. గ్రామంలోకి ఎవరూ ప్రవేశించకుండా ముఖద్వారం వద్ద ముళ్ల కంచె వేశారు. వ్యవసాయ పొలాలు, బావులు, చెట్ల కిందకు చేరుకుని వంటావార్పుతో సందడి చేశారు. సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. -
పెచ్చుమీరిన అక్రమాలు, దౌర్జన్యాలు
పెనుకొండ రూరల్: కూటమి పాలనలో అక్రమాలు, దౌర్జన్యాలు పెచ్చుమీరాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ధ్వజమెత్తారు. బుధవారం పెనుకొండ మండలం శెట్టిపల్లిలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల శెట్టిపల్లిలో వైఎస్సార్సీపీ నాయకుడు క్రిష్ణారెడ్డి భూములకు సంబంధించి అధికారుల సహకారంతో మంత్రి సవిత అనుచరులు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేశారన్నారు. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్నారు. అమాయక ప్రజల ఆస్తులను కబ్జా చేసేందుకు పెనుకొండ కేరాఫ్ అడ్రస్గా మారిందన్నారు. ఇసుక, డీజిల్ అక్రమంగా సరఫరా చేస్తూ మంత్రి సవిత సోమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులును ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. కదిరిలో మున్సిపల్ చైర్పర్సన్ పీఠం కై వసం చేసుకునేందుకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను బెదిరించి తమవైపు లాక్కోవడం ఎంతవరకు సమంజసమో ఎమ్మెల్యే కందికుంటకు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, వైఎస్సార్సీపీ పట్టణ, మండల కన్వీనర్లు, బోయ నరసింహులు, సుధాకర్రెడ్డి, సర్పంచ్ శ్యామలాబాయి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు సల్లా సూర్య ప్రకాశ్రెడ్డి, క్రిష్ణారెడ్డి, ప్రభాకర్రెడ్డి, సాయిరాం నాయక్, అశ్వత్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూటమి పాలనపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజం -
చెరువులో విష ప్రయోగం
ముదిగుబ్బ: మండలంలోని సానేవారిపల్లి చెరువులో బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో చేపలు మృతి చెందాయి. అటుగా వెళ్లిన వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో మత్స్యకారులు అక్కడకకు చేరుకుని పరిశీలించారు. చేపల మృతితో చెరువు ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. ఎవరో కావాలనే చెరువులో విషం కలిపినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చైన్స్నాచర్ల అరెస్ట్ హిందూపురం అర్బన్: ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకుని వారి మెడలోని బంగారు గొలుసులను అపహరించుకెళుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూపురం రెండో పట్టణ పీఎస్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ మహేష్ వెల్లడించారు. హిందూపురం, పరిసర ప్రాంతాల్లో చైన్స్నాచింగ్ ముఠా తిరుగుతున్నట్లు అందిన సమాచారంతో అప్రమత్తమైన టూటౌన్, అప్గ్రేడ్ సీఐలు అబ్దుల్ కరీం, ఆంజనేయులు, సిబ్బంది బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆటో నగర్ క్రాస్ వద్ద అనుమానాస్పద స్థితిలో తచ్చాడుతున్న ముగ్గురు యువకులను ఆరా తీయడంతో పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయడంతో చైన్స్నాచింగ్ ఘటనలు వెలుగు చూశాయి. పట్టుబడిన వారిలో హిందూపురంలోని త్యాగరాజనగర్కు చెందిన హఫీజ్, (ఆఫీసుల్లా), సీపీఐ కాలనీ ఎర్రకొట్టాలకు చెందిన దాదా ఖలందర్, లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన పి.లక్ష్మిదేవి (ప్రస్తుతం విద్యానగర్ నివాసి) ఉన్నారు. వీరి నుంచి 85 గ్రాముల బరువున్న బంగారు గొలుసులు, స్కూటీ వాహనం స్వాదీనం చేసుకున్నారు. కాగా, హిందూపురం పరిధిలో 2024, 2025లో చోటు చేసుకున్న రెండు చైన్స్నాచింగ్ కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయింది. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. సత్యసాయి సేవలకు న్యూయార్క్ కౌన్సిల్ విశిష్ట గుర్తింపు ప్రశాంతి నిలయం: సత్యసాయి సేవలకు అమెరికాలోని నూయార్క్ కౌన్సిల్ విశిష్ట గుర్తింపునిచ్చింది. ఈ నెల 24న సత్యసాయి శతజయంతి వేడుకల నిర్వహణ దినంగా ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 22న న్యూయార్క్ నగర కౌన్సిల్ హాల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో నూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ అధికారికంగా ఈ ప్రకటన చేశారు. ఈ సందర్బంగా ఆయన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రత్యేకంగా రాసిన సందేశాన్ని చదివి వినిపించారు. -
మార్కులే జీవితం కాదు
హిందూపురం అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. ఎంతో మందికి 600లకు 400లకు పైబడి మార్కులు వచ్చాయి. పలు కారణాలతో కొందరు పరీక్ష తప్పారు. అలాంటి వారు క్షణికావేశంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకోరాదని, మార్కులే జీవితం కాదని మేధావులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఓటమి కూడా భవిష్యత్తు విజయానికి తొలిమెట్టులాంటిదని అంటున్నారు. పరీక్షల్లో ఎందుకు తప్పాం? లోపం ఎక్కడ ఉంది? అనే అంశాలను విశ్లేషించుకుని అడుగు ముందుకేస్తే త్వరలో జరిగే అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల్లో తప్పక ఉత్తీర్ణత సాధిస్తారని అంటున్నారు. ఫెయిల్ అంటే జీవితంలో ఓడిపోవడమా? ఫెయిల్ అంటే ఎప్పటికీ ఓడిపోవడం కాదు. విజయాన్ని ఇంకా అందుకోలేదని అర్ధం, గెలుపునకు తగినంత సన్నద్ధత కాలేదని అర్థం. ప్రతి మనిషి తన జీవితంలో చేసే ప్రయత్నాలన్నీ గెలుపు లక్ష్యంగానే మొదలు పెడతాడు. ఆ ప్రయత్నాలలో విజయాలే కాదు ఓటమి కూడా ఎదురవుతుంది. విజయాన్ని సాధించాలంటే కొన్నిసార్లు ఓటమిని తప్పనిసరిగా అంగీకరించాల్సి వస్తుంది. ఓటమి విజయానికి తొలిమెట్టు అనే మాటను మరచిపోకూడదు. చాలామంది వారు చేసే పనులలో ఓటమి ఎదురయినప్పుడు భయపడి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మరో ప్రయత్నం చేస్తూ ఉండాలి. విఫలమైన ప్రతిసారీ చేసిన తప్పేంటో అర్థం చేసుకుని అది పునరావృతం కాకుండా ముందడుగు వేస్తే తిరుగులేని విజయం సొంతమవుతుంది. తల్లిదండ్రులూ ఆలోచించండి.. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో పరీక్షలు తప్పి ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆత్మనూన్యత భావంతో మానసిక స్థైర్యం కోల్పోయారు. ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ముందున్న విస్తృత అవకాశాలు తెలిసి ఉండేవి. ఓటమి కూడా భవిష్యత్తులో సాధించబోయే విజయానికి తొలిమెట్టు అనే విషయాన్ని గుర్తించకపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. పాస్, ఫెయిల్ సాధారణ విషయాలే అయినా వ్యక్తిగత ప్రతిష్టకు పోయి పిల్లల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయరాదని తల్లిదండ్రులకూ సూచిస్తున్నారు. విద్యార్థులు సైతం ప్రతికూలంగా ఉన్న ఫలితాలపై ఎలాంటి ఆందోళన చెందకుడా పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు. హిందూపురం పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని బుధవారం వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో 600లకు 571 మార్కులు సాధించింది. అయితే ఆ విద్యార్థినికి వారి తల్లిదండ్రులకు తృప్తి లేదు. దీంతో ఆ విద్యార్థిని బోరున విలపించింది. ఇక్కడ ఆమె కంటే తక్కువ మార్కులు వచ్చిన వారు ఉన్నారనే భావన సదరు విద్యార్థినితో పాటు తల్లిదండ్రులూ గుర్తించలేకపోయారు. అంతటితో ఆగకుండా ఆమె ఆత్మస్తైర్యం కోల్పోయాల పెదవి విరుపు మాటలతో నిరుత్సాహపరిచారు. వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాలు ఓటమి విజయానికి తొలిమెట్టు క్షణికావేశంతో అనాలోచిత నిర్ణయాలు వద్దు హిందూపురంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివిన ఓ విద్యార్థి 600లకు 470 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఈ సంతోషాన్ని పదిమందితో పంచుకునేందుకు స్వీట్లు పంచాడు. మార్కులు తక్కువ వచ్చాయి కదా? అని అడిగితే ఇది ఆరంభం మాత్రమేనని భవిష్యత్తులు మరిన్ని ఎక్కువ మార్కులు సాధిస్తాననే ఆత్మస్థైరాన్ని కనబరిచాడు. .... ఆశించిన ఫలితం రాలేదని, ఉత్తీర్ణత సాధించలేకపోయామనే భావనలో కొందరు విద్యార్థులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికమైన ఆలోచనతో సరిదిద్దుకోలేని నిర్ణయం తీసుకుంటున్నారు. దీన్ని అధిగమించి, ఆశావహదృక్పథంతో అడుగేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మార్కులే జీవితం కాదనే అంశంపై పిల్లలను చైతన్య పరచాలని అంటున్నారు. అర్హత తెలిపేందుకే సర్టిఫికెట్ మార్కులు, సర్టిఫికెట్ అనేది కేవలం అర్హతను మాత్రమే తెలుపుతాయి. పెద్దగా చదువుకోలేని వారు... పదో తరగతి పరీక్షల్లో తప్పిన వారు సైతం ప్రస్తుతం వ్యాపారాల్లో రాణించి ఉన్నత స్థానానికి ఎదిగారు. మార్కులు తక్కువ వచ్చాయని, మనం కోరుకున్న కళాశాలలో సీటు రాదని బెంగ అక్కర్లేదు. ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ దాగి ఉంటుంది. దానిని తల్లిదండ్రులు గుర్తించి, పిల్లలను ఆ దిశగా ప్రోత్సహించాలి. – డాక్టర్ సతీష్రెడ్డి, ప్రభుత్వ వెద్యుడు పిల్లలను ప్రోత్సహించాలి పిల్లలు ఫెయిలయితే తల్లిదండ్రులు తిట్టడం సర్వసాధారణం. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పదో తరగతి అంటే పెద్ద వయసేమీ కాదు... మరోసారి మంచిగా చదివి ఉత్తీర్ణత సాధించాలని ప్రోత్సహించాలి. అప్పుడే విద్యార్థులు క్షణికావేశానికి లోనుకాకుండా ఉంటారు. లేకపోతే వారిలో ఆత్మనూన్యత భావం పెరిగి అనాలోచిత నిర్ణయాలు తీసుకునే ప్రమాదముంది. – బాబావలి, విద్యార్థి సంఘం నాయకుడు, హిందూపురం -
ఉగ్రవాదులది పిరికిపంద చర్య
హిందూపురం టౌన్: కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని పిరికిపంద చర్యగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అభివర్ణించారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త దీపిక ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ అమాయకులపై ఉగ్రవాదులు దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. దేశం అంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. పహల్గాం ఘటనలో పలువురు మరణించడం బాధాకరమని అన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారన్నారు. మృతులందరికీ సంతాపం తెలుపుతున్నామని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూపురం, మడకశిర నియోజకవర్గ సమన్వయకర్తలు దీపిక, ఈరలక్క మాట్లాడుతూ ఉగ్రదాడి ఘటన ఎంతగానో కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు అండగా యావత్ దేశం ఉందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సైతం సీరియస్గా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు వేణురెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కురుబ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శివ, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు మహేష్ గౌడ్, జిల్లా అధికారి ప్రతినిధి శివశంకర్రెడ్డి, జిల్లా కార్యదర్శి తిప్పేరుద్రయ్య, పట్టణ కన్వీనర్ మన్సూర్, మండల కన్వీనర్ రాము, చిలమత్తూరు మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి, నక్కలపల్లి శ్రీరామిరెడ్డి, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
నేడు సత్యసాయి ఆరాధనోత్సవాలు
ప్రశాంతి నిలయం: ప్రపంచ మానవాళికి ఆధ్యాత్మిక, మానవతా విలువలను బోధిస్తూ సన్మార్గం వైపు నడిపిన మహనీయుడు సత్యసాయి ఆరాధనోత్సవాలు గురువారం జరగనున్నాయి. ఇందు కోసం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సర్వం సిద్ధం చేశారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేక ఫల,పుష్ప దళాలతో దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. తమ ఇష్ట దైవం సత్యసాయికి ఆత్మనివేదన అర్పించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. వేడుకలు ఇలా... సత్యసాయి ఆరాధనోత్సవ వేడుకలు సాయికుల్వంత్ సభా మందిరంలో గురువారం ఉదయం 8 గంటల సత్యసాయి మహాసమాధి చెంత వేదపఠనంతో ప్రారంభం కానున్నాయి. ఉదయం 8.10 గంటలకు సత్యసాయి విద్యార్థులు సత్యసాయిని కీర్తిస్తూ పంచరత్నకీర్తనలు అలపిస్తారు. 9.05 గంటలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు నాగానంద ప్రారంభోపన్యాసం చేస్తారు. 9.15 గంటలకు సత్యసాయి శతజయంతి వేడుకల బ్రోచర్ విడుదల చేస్తారు. 9.30కు సత్యసాయి సేవా సంస్థల దేశీయ అధ్యక్షుడు నిమిష్ పాండే వేడుకలనుద్దేశించి ప్రసంగిస్తారు. 9.40కు శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని కార్యక్రమం ప్రారంబోత్సవం నిర్వహిస్తారు. 9.50కి సత్యసాయి పూర్వపు దివ్వ ప్రసంగాన్ని డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శిస్తారు. 10.10 గంటలకు భజనలు, అనంతరం మంగళహారతితో వేడుకలు ముగుస్తాయి. హిల్వ్యూ స్టేడియంలో మహానారాయణ సేవ.. సత్యసాయి ఆరాధనమహోత్సవం సందర్భంగా సత్యసాయి హిల్వ్యూ స్టేడియంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మహానారాయణ సేవ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సాయికుల్వంత్ సభా మందిరంలో ఆరాధనోత్స వేడుకలు ముగిసిన అనంతరం ఉదయం 10 గంటలకు నారాయణ సేవ కార్యక్రమాన్ని హిల్వ్యూ స్టేడియంలో ప్రారంభిస్తారు. 50 వేల మందికి అన్న ప్రసాదంతో పాటు నూతన వస్త్రాలను వితరణ చేస్తారు. భక్తులు ఉదయం 8 గంటలకే సత్యసాయి హిల్వ్యూ స్టేడియంకు చేరుకోవాలని కోరారు. డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతి నిలయంలో వేడుకలు దేశ విదేశాల నుంచి తరలివచ్చిన సత్యసాయి భక్తులు సత్యసాయి హిల్వ్యూ స్టేడియంలో మహానారాయణ సేవ -
నేటి నుంచి వేసవి సెలవులు
● జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం పుట్టపర్తి: అన్ని యాజమాన్య పాఠశాలలకు గురువారం నుంచి వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విద్యార్థులు ఆనందంతో బుధవారం తరగతి గదుల నుంచి కేరింతలతో బయటకు వచ్చారు. మొత్తం ఒక నెలా 19 రోజుల పాటు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 12వ పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఇదెక్కడి వివక్ష బాలయ్యా! ● ఉత్తమ సర్పంచ్ అవార్డు ఎంపికపై పీఏల రాజకీయం చిలమత్తూరు: పనితీరు ఆధారంగా ఉత్తమ సర్పంచ్ అవార్డుకు ఎంపికై న చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి వైఎస్సార్సీపీ సర్పంచ్ ఈడిగ తిరుమలేష్పై ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు వివక్ష చూపడం విమర్శలకు తావిస్తోంది. దేమకేతేపల్లి సర్పంచ్ను జిల్లా పంచాయతీ అధికారులు ఎంపిక చేసి రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ విషయాన్ని అధికారులు తెలపడంతో సదరు సర్పంచ్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లేందుకు టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. అయితే ఉన్నఫలంగా బాలయ్య పీఏల ఒత్తిడితో అవార్డుల జాబితాలో తిరుమలేష్ పేరును తొలగించేశారు. ఆ స్థానంలో టేకులోడు టీడీపీ సర్పంచ్ పేరు చేర్చారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఇదెక్కడి వివక్ష బాలయ్యా అంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు. నెగ్గిన అవిశ్వాస తీర్మానం కదిరి టౌన్: మున్సిపల్ చైర్పర్సన్ పరికి నజీమున్నీసాతో పాటు వైస్ చైర్పర్సన్లు కొమ్ము గంగాదేవి, అంజుకుంట రాజశేఖర్రెడ్డిపై బుధవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను 30 మంది వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచారు. ఐదుగురు టీడీపీ, ఒకరు ఇండిపెండెంట్గా గెలిచారు. అయితే మున్సిపల్ కౌన్సిల్లో జరిగిన అవిశ్వాస తీర్మానానికి 25 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. 11 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ప్రిసైడింగ్ అధికారి ఆర్డీఓ వీవీఎస్ శర్మ అధ్యక్షతన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టగా.. 25 మంది కౌన్సిలర్లు చేతులెత్తారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో చైర్పర్సన్ ఎన్నికకు జీఓ వచ్చిన తరువాత ఎన్నిక ఉంటుందని ఆర్డీఓ తెలిపారు. సంఖ్యా బలం తక్కువ ఉన్నప్పటికీ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి నేతలు పాపులు కదుపుతున్నారు. -
బాధను దిగమింగుకుని పరీక్షలు రాసి..
ధర్మవరం అర్బన్: పదో తరగతి పరీక్షల్లో తండ్రి అనారోగ్యానికి గురవడంతో బాధను దిగమింగుకుని పరీక్షలు రాసిన విద్యార్థి 593 మార్కులతో రాణించాడు. ధర్మవరం పట్టణంలోని సుందరయ్యనగర్ శ్రీగణేష్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి కె.గౌతమ్ కృష్ణ పదో తరగతి పరీక్షలు రాసే సమయంలో తండ్రి సుబ్రహ్మణ్యంకు కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ చేయాలని ఆస్పత్రి అత్యవసర విభాగంలో చేర్పించారు. అంతటి బాధలోనూ పరీక్షలు రాసిన తన కుమారుడు 593 మార్కులు సాధించడంపై తండ్రి సంతోషం వ్యక్తం చేస్తూ స్వీటు తినిపించాడు. ఆ విద్యార్థిని హెచ్ఎం లక్ష్మీనారాయణరెడ్డి, ఉపాధ్యాయులు సానే రవీంద్రరెడ్డి, గోపి, శేఖర్, వెంకటరాముడులు అభినందించారు. గతేడాది కంటే 10 శాతం తగ్గిన ఉత్తీర్ణత రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచిన జిల్లా బాలికలు 79.04 శాతం, బాలురు 70.81 శాతం ఉత్తీర్ణత కార్పొరేట్తో పోటీపడుతూ ప్రభుత్వ విద్యార్థుల సత్తా -
పేదోడి బండి మరోసారి రద్దు
ముదిగుబ్బ: పేదలకు రైలు ప్రయాణం మరోమారు దూరం అయ్యింది. ధర్మవరం – తిరుపతి మార్గంలో తక్కువ టికెట్ ధరకే రాకపోకలు సాగించేవారు. ఇటీవల కుంభమేళా సందర్భంగా మూడు నెలలపాటు ప్యాసింజర్ రైళ్లు తాత్కాలికంగా రద్దు చేశారు. పునరుద్ధరణ తర్వాత నెల రోజులకే మరోమారు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడింది. ఈ మార్గంలో ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. కానీ ప్యాసింజర్ రైళ్లను మాత్రమే తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. ● అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల మీదుగా గుంతకల్లు–తిరుపతి– గుంతకల్లు (రైలు నంబర్ 57403– 57404), తిరుపతి–కదిరిదేవరపల్లి– తిరుపతి (రైలు నంబర్ 57405–57406) ప్యాసింజర్ రైళ్లను ధర్మవరంలోని రైల్వే జంక్షన్లో ఫేజ్–2 యార్డ్లో ఎన్ఐ పనుల కోసం ఈ నెల 15 నుంచి నెల రోజుల పాటు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ధర్మవరం –నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలు (రైలు నెంబర్ 17247–17248 రైలు నర్సాపూర్ నుంచి కదిరి వరకు మాత్రమే నడుస్తుంది. ఈ రైళ్ల రద్దు కారణంగా ముదిగుబ్బ నుంచి ప్రయాణించే సాధారణ ఉద్యోగులు, పేద మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్యాసింజర్ రైళ్లే ఎందుకు రద్దంటే.. ధర్మవరం జంక్షన్లో యార్డ్ సవరణ పనుల కోసం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే రద్దు చేశారు. అయితే అదే లైనుపై నడుస్తున్న పద్మావతి, సెవెన్హిల్స్, అమరావతి, అకోలా, అరుణాచలం వెళ్లే ఈ ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రం నడుస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజల కోసం ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ ధరకే సౌకర్యవంతమైన ప్రయాణం.. ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రైలు టికెట్ ధర అతి తక్కువగా వుంది. ముదిగుబ్బ నుంచి తిరుపతికి టికెట్ ధర రూ.50 మాత్రమే. తిరుమలకు ముదిగుబ్బ నుంచి వందలాది మంది భక్తులు వెళ్తుంటారు. అదే విధంగా అనారోగ్యంతో బాధపడే పేద ప్రజలు తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్తుంటారు. అనంతపురం, ధర్మవరం, కదిరి నుంచి చాలా మంది ఉద్యోగస్తులు ప్యాసింజర్ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. బస్సులో టికెట్ ధర ఎక్కువ కావడంతో రైలు ప్రయాణాన్నే చాలామంది ఎంచుకుంటున్నారు. భారీగా తగ్గిన రైలు చార్జీలు.. ముదిగుబ్బ నుంచి తిరుపతికి ప్యాసింజర్ రైలులో వెళ్లే వారికి టికెట్ ధర రూ.50 మాత్రమే. స్లీపర్ టికెట్ ధర రూ.120 మాత్రమే. గతంలో ఇదే రిజర్వేషన్ టికెట్ ధర రూ.330 ఉండేది. సిట్టింగ్ కోసం రిజర్వేషన్ చేసుకునే టికెట్ ధర ముదిగుబ్బ నుంచి తిరుపతికి రూ.65 మాత్రమే. ఇదే టికెట్ ధర గతంలో రూ.120 ఉండేది. నాడు కుంభమేళా పేరిట 3 నెలలు బంద్ నేడు ధర్మవరం జంక్షన్లో పనుల నేపథ్యంలో రద్దు ప్యాసింజర్ రైళ్ల తాత్కాలిక రద్దుతో తప్పని ఇబ్బందులు -
రంపం.. తీసింది ప్రాణం
● రోడ్డు ప్రమాద మృతి కేసులో వీడిన మిస్టరీ ధర్మవరం అర్బన్: ద్విచక్రవాహనంపై అజాగ్రత్తగా తీసుకొస్తున్న రంపం మరో ద్విచక్రవాహనదారుడి ప్రాణం తీసింది. రోడ్డు ప్రమాదంగా తొలుత నమోదైన ఈ కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని మహాత్మాగాంధీ కాలనీకి చెందిన బేల్దారి ఎం.ఆంజనేయులు (50) ఈ నెల 19న రాత్రి లక్ష్మీచెన్నకేశవపురం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆంజనేయులు మృతికి కారణం ఒక రంపమని పోలీసులు గుర్తించారు. లక్ష్మీచెన్నకేశవపురం సమీపంలోని భవనాలకు ఉన్న సీసీ కెమెరాలోని ఫుటేజీలో రాత్రి ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై పెద్ద పెద్ద చెట్లు కోసే రంపాన్ని తీసుకుని వెళుతున్నారు. ఆ సమయంలో ద్విచక్రవాహనంలో వెళుతున్న ఆంజనేయులు మెడకు పక్కనే ద్విచక్రవాహనంలో తీసుకెళుతున్న రంపం తగిలింది. దీంతో ఆంజనేయులు మెడ తెగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హఠాత్పరిణామంతో రంపం తీసుకెళుతున్న ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి ఉడాయించారు. సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీ ఆధారంగా పోలీసులు రంపం తీసుకెళుతున్న ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. నేడు ‘పది’ ఫలితాలు పుట్టపర్తి: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువుల్లో ఉత్తీర్ణతపై ఆందోళన నెలకొనగా... రాష్ట్రస్థాయిలో జిల్లా స్థానంపై విద్యాశాఖ అధికారులు కలవరపడుతున్నారు. మార్చి 17 నుంచి ప్రారంభమైన పది పరీక్షలు ఈనెల 1తో ముగిశాయి. జిల్లాలో రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు 22,087 మంది పరీక్షలకు హాజరయ్యారు. -
భువనేశ్వర్–యశ్వంత్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భువనేశ్వర్–యశ్వంత్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మే 24 నుంచి జాన్ 28 వరకు ప్రతి శనివారం భువనేశ్వర్ (02811) జంక్షన్ నుంచి యశ్వంత్పూర్కు రైలు బయలుదేరుతుందన్నారు. అదేవిధంగా మే 26 నుంచి జూన్ 30 తేదీ వరకు ప్రతి సోమవారం యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి బయలుదేరుతుందన్నారు. విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నరసరావుపేట, మార్కాపురం రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, డోన్, ధర్మవరం జంక్షన్, ఎస్ఎస్ఎస్పీ నిలయం, హిందూపురం రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 3 రోజుల సంతాప దినాలు ప్రశాంతి నిలయం: పోప్ ఫ్రాన్సిస్ మృతికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22 నుంచి మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిందని కలెక్టర్ చేతన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంతాప దినాల సమయంలో ఆంధ్రప్రదేశ్ అంతటా జాతీయ జెండా సగం వరకు ఎగురవేయనున్నట్లు పేర్కొన్నారు. సివిల్స్లో కదిరి వాసికి 918వ ర్యాంకు కదిరి అర్బన్: యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో కదిరి పట్టణానికి చెందిన జి.సాయి షణ్ముఖకు 918వ ర్యాంకు వచ్చింది. అడపాలవీధిలో నివాసం ఉంటున్న రిటైర్డు ఏఎస్ఐ నరసింహులు, విజయభారతి దంపతుల కుమారుడు సాయి షణ్ముఖ సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ఢిల్లీలో ఆరేళ్లుగా ప్రిపేరవుతున్నాడు. ఐదవ ప్రయత్నంలో విజయం సాధించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తానీ స్థాయికి చేరుకున్నానని సాయి షణ్ముఖ తెలిపాడు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ధర్మవరం విద్యార్థుల సత్తా ధర్మవరం అర్బన్: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ధర్మవరం విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ధర్మవరం పట్టణంలోని దుర్గానగర్లో నివసిస్తున్న హోంగార్డు కేఎస్ మహేష్, శ్యామల దంపతుల కూతురు హేమనందిని హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదువుతోంది. ఇంటర్ ఫస్టియర్, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 1000 మార్కులకు 990 మార్కులు సాధించింది. ధర్మవరం పేరు నిలబెట్టింది. స్టేట్ సెకండ్ ర్యాంకు.. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో ధర్మవరం పట్టణంలోని కేశవనగర్కు చెందిన అచ్యుత శ్రీనివాసులు, ఉమామహేశ్వరి దంపతుల రెండో కుమారుడు అచ్యుత భానుప్రకాష్ ఎంఈసీలో 500 మార్కులకు 495 మార్కులతో తెలంగాణ రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచాడు. కాగా హేమనందిని, భానుప్రకాష్ ధర్మవరంలోని పీసీఎంఆర్ పాఠశాలలో పదో తరగతి చదివారు. -
ముందస్తు ప్రణాళికలు రూపొందించండి
ప్రశాంతి నిలయం: సత్యసాయి బాబా శతజయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సత్యసాయి శతజయంతి వేడుకల నిర్వహణపై ప్రభుత్వ అధికారులలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సత్యసాయి శతజయంతి వేడుకలు ఈ ఏడాది నవంబర్లో జరగనున్నాయని, ప్రపంచ నలుమూలల నుంచి భక్తులతోపాటు ప్రముఖులు తరలిరానున్నారన్నారు. ప్రధాన మంత్రితోపాటు అత్యున్నత స్థాయి ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. భక్తులకు, ప్రముఖులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రత్యేక హెలిప్యాడ్ల ఏర్పాటుతోపాటు ఇంకా అవసరం అయితే అదనపు హెలిప్యాడ్ల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు, భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్, పోలీస్ బందోబస్తు, రవాణా సేవలు, నిరంతర విద్యుత్, తాగునీరు, పట్టణ సుందరీకరణ పనులు, భక్తుల కోసం తాత్కాలిక బస్సు ష్టేషన్ల ఏర్పాటు, తాత్కాలిక వసతి, మొబైల్ టాయిలెట్స్, చిత్రావతి నది సుందరీకరణ, భద్రతా చర్యలు, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఓ విజయసారథి, పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు చలం, రోమెల్, డీఆర్డీఎ పీడీ నరసయ్య, డీపీఓ సమత తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాలపై సమీక్షలో కలెక్టర్ -
ఖాకీ డ్రెస్సు వేసుకుని డ్యూటీ చేయాల్సిన పోలీసులు... టీడీపీ నేతలకు వంగి వంగి సలాములు చేస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ల పనిమనిషిలా మారారంటూ విమర్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇప్పటివరకూ పని చేసిన ప్రతి చోటా విజయకుమార్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో అనంతపురం ఎస్పీగా అంజనా సిన్హా ఉన్నప్పుడు ఈయన చెన్నేకొత్తపల్లి ఎస్ఐగా పనిచేశారు. ఆ సమయంలో స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేయగా, పోలీసు ఉన్నతాధికారులు అప్పట్లో కర్నూలుకు బదిలీ చేసి వీఆర్లో పెట్టారు. మైదుకూరులో డీఎస్పీగా పనిచేసినప్పుడు కూడా అవినీతి ఆరోపణలు రావడంతో శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేసి వీఆర్లో ఉంచారు. గార్లదిన్నెలో పదెకరాల భూమి! విజయకుమార్ పోలీసు ఉద్యోగంలో చేరిన తర్వాత అనంతపురం జిల్లాలోని గార్లదిన్నెలో హైదరాబాద్– బెంగళూరు జాతీయ రహదారికి దగ్గరగా పదెకరాల భూమి కొన్నట్టు ఇప్పటికీ పోలీసు వర్గాలు కథలు కథలుగా చెప్పుకుంటున్నాయి. ఇంత పెద్ద ఎత్తున భూమి కొనడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరపత్రాల కలకలం గతంలో అనంతపురంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీఎస్పీగా విజయకుమార్ ఉన్న సమయంలో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) డీఎస్పీగా గంగయ్య ఉండేవారు. అప్పట్లో గంగయ్యకు, విజయమార్కు మధ్య తీవ్ర స్థాయిలో వివాదాలు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే గంగయ్యపై కొన్ని కరపత్రాలు బయటకు వచ్చాయి. వీటిని విజయకుమార్ వేయించారనే విమర్శలున్నాయి. ఆ తర్వాత విజయకుమార్ బండారాలన్నీ బయటపెడుతూ బయటకు వచ్చిన కరపత్రాలు కలకలం రేపాయి. ప్రబోదానంద కేసులో సస్పెండ్.. తనకు నచ్చినవారి కోసం పరిధి దాటి ప్రవర్తిస్తారని విజయకుమార్కు పేరుంది. గతంలో జేసీ అనుచరులు ప్రబోదానంద ఆశ్రమంపై దాడి చేసిన సమయంలో విజయకుమార్ ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీగా ఉండేవారు. అయినా సరే తాడిపత్రి ఇన్చార్జ్ డీఎస్పీగా వెళ్లి ఆ కేసును డీల్ చేశారు. ఆ కేసులో తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులు విజయకుమార్ను సస్పెండ్ చేశారు. మహిళా సీఐపై పరుషంగా.. ప్రస్తుతం పుట్టపర్తి డీఎస్పీగా ఉన్న విజయకుమార్ ఇప్పటికీ తన వివాదాస్పద తీరు మార్చుకోలేదని తెలిసింది. కొన్ని రోజుల క్రితం ఓ మహిళా సీఐపై ఇష్టారాజ్యంగా నోరుపారేసుకున్నారు. దీంతో మహిళా సీఐ తీవ్ర మనస్తాపం చెంది విజయకుమార్పై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే, మహిళా సీఐకి న్యాయం చేయాల్సిన ఉన్నతాధికారులు.. బాధిత సీఐనే వీఆర్కు పంపించడం శ్రీసత్యసాయి జిల్లా పోలీసుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రామగిరి హెలిప్యాడ్ ఘటనలో ఘోర వైఫల్యం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఇటీవల విజయకుమార్ను రామగిరి మండలం కుంటిమద్ది సమీపంలో హెలిప్యాడ్ వద్ద సెక్యూరిటీ ఇన్చార్జ్గా వేశారు. ఒక మాజీ సీఎం వస్తున్న నేపథ్యంలో నిక్కచ్చిగా బందోబస్తు చేపట్టాల్సిన డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో హెలికాప్టర్ వద్దకు వేలాదిగా జనం వెళ్లడంతో విండ్షీల్డ్ విరిగింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పనిసరి పరిసితుల్లో రోడ్డుమార్గంలో బెంగళూరుకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఖాకీ డ్రెస్సు వేసు కున్న ఈ పోలీసు అధికారి ‘పచ్చ’చొక్కాల అడుగులకు మడుగులొత్తుతుండటం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.టీడీపీ ఎమ్మెల్యేలు ఆడినట్టే ఆట.. పాడినట్టే పాట పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ వ్యవహార శైలిపై సర్వత్రా తీవ్ర చర్చ పల్లె రఘునాథరెడ్డి గీత గీస్తే దాటిపోకుండా డ్యూటీ గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఇప్పటికీ తీరు మార్చుకోని వైనం -
విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు
కదిరి అర్బన్/ కదిరి టౌన్/ ప్రశాంతి నిలయం: కదిరి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన 30 మంది కౌన్సిలర్లకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్ జారీ చేశారు. విప్ను ధిక్కరించిన వారిని పార్టీ నుంచి బహిష్కరించి అనర్హత వేటు వేయనున్నారు. ఈ మేరకు విప్ కాపీని మంగళవారం పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ ప్రణీత్రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కలెక్టర్ చేతన్, ఆర్డీఓ వీవీఎస్ శర్మలకు వేర్వేరుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ మార్గంలో మున్సిపల్ చైర్పర్సన్ పీఠం చేజిక్కించుకోవడానికి టీడీపీ కుయుక్తులు పన్నుతోందన్నారు. ఇందు కోసం వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేస్తోందన్నారు. లొంగని వారిని బెదిరింపులకు గురి చేస్తోందని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి, నిబంధనల మేరకు అవిశ్వాస తీర్మాన కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. కార్యక్రమంలో చైర్పర్సన్ పరికి నజీమున్నీసా భర్త సాధిక్, కౌన్సిలర్లు రాంప్రసాద్, ఆవుల స్వామి, మహ్మద్, నాయకులు షబ్బీర్, నూరుల్లా, షాను తదితరులు పాల్గొన్నారు. నేడు అవిశ్వాస తీర్మానం.. కదిరి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం చైర్పర్సన్ పరికి నజీమున్నీసాతో పాటు వైస్చైర్పర్సన్లు కొమ్ము గంగాదేవి, రాజశేఖరరెడ్డిలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ వెంకట సన్యాసి శర్మ వ్యవహరించనున్నారు. మున్సిపాలిటిలో 36 వార్డులు ఉన్నాయి. ఇందులో వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లు 30 మంది, టీడీపీ నుంచి ఐదుగురు, టీడీపీ రెబల్గా గెలిచిన ఇండిపెండెంట్ ఒకరున్నారు. సార్వత్రిక ఎన్నికల సమ యంలో వైఎస్సార్సీపీ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరారు. సంఖ్యా బలం తక్కువ ఉన్నప్పటికీ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. బెదిరింపులు, ప్రలోభాలతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను తమవైపు లాక్కుని బెంగళూరు క్యాంపునకు తీసుకెళ్లింది. వీరంతా బుధవారం బెంగళూరు నుంచి నేరుగా కదిరి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటారు. కలెక్టర్, ఆర్డీఓకు కదిరి మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నేతల వినతి -
సమస్యల పరిష్కారమే ధ్యేయం
జిల్లా పరిధిలో సోమవారం పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. వేసవితాపం కొనసాగింది. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. ధర్మవరంలో ముస్లింల భారీ ర్యాలీ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి అనకొండ పాలబావిలో గంగ పూజ బిందెడు నీటికి బండెడు కష్టాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న 727 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చే శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. చీనీ టన్ను రూ.23,800 అనంతపురం మార్కెట్యార్డులో సోమవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.23,800 పలికాయి. మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ ప్రశాంతి నిలయం: అనంతపురంలోని జిల్లా కోర్టులో సోమవారం సాయంత్రం నూతన జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన భీమారావును కలెక్టర్ టీఎస్ చేతన్ మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. తగ్గుతున్న చింత పండు ధరలు హిందూపురం అర్బన్: హిందూపురం వ్యవసాయ మార్కెట్లో గత మూడు వారాలుగా చింత పండు ధరలు పడిపోతున్నాయి. సోమవారం 881.70 క్వింటాళ్ల చింత పండు వచ్చింది. మార్కెట్లో ఈ నామ్ పద్ధతిలో వేలం పాటలు సాగాయి. కరిపులి రకం క్వింటా గరిష్ట ధర రూ.19,500, కనిష్ట ధర రూ.8 వేలు , సగటు ధర రూ.15 వేలు పలికింది. అలాగే ప్లవర్ రకం క్వింటా గరిష్ట ధర రూ.12,500, కనిష్ట ధర రూ.4,420, సగటు ధర రూ.8 వేలు పలికింది. గత వారంతో పోలిస్తే కరిపులి రకం క్వింటాపై రూ.1000 తగ్గుదల కనిపించింది. వాతావరణ మార్పులు, చల్లదనంతో ధరలు తగ్గుముఖం పట్టినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. దొంగతనం కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు పుట్టపర్తి టౌన్: కొత్తచెరువులో జరిగిన రెండు దొంగతనాల కేసులో ముద్దాయి అమర్నాథ్నాయుడుకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ పుట్టపర్తి జేఎఫ్సీఎమ్ కోర్టు జడ్జి రాకేష్ సోమవారం తీర్పు వెల్లడించారు. కొత్తచెరువులో జరిగిన రెండు దొంగతనాలపై విచారణ జరిపి అమర్నాథనాయుడుపై 2012లో కేసును నమోదు చేసి విచారణ జరిపి రిమాండ్కు తరలించారు. ఏపీపీ మైలాబాబు, రాజేంద్రప్రసాద్ తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న జడ్జి రాకేష్ ముద్దాయిపై అభియోగాలు రుజువు కావడంతో మూడు సంవత్సరాలు జైలు శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. చిలమత్తూరు సమీపంలోని బైరేకుంట చెరువులో మట్టి తవ్వుతున్న దృశ్యంచిలమత్తూరు: బాలయ్య ఇలాకాలో దందాలు పెచ్చుమీరాయి. సినిమా షూటింగులతో బాలకృష్ణ బిజీగా ఉంటే.. ఆయన పీఏలతో పాటు అనుచర గణం నియోజకవర్గంలోని సహజ సంపదను దోచేసే పనిలో నిమగ్నమయ్యారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నదులు, చెరువులలో మట్టి, ఇసుకను విచ్చలవిడిగా తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఎవరైనా అడిగితే మాత్రం పీఏలు చెప్పారంటూ తమ అక్రమ వ్యాపారాలను సాగించేస్తున్నారు. మట్టి మాఫియాకు కేరాఫ్గా చిలమత్తూరు.. రాష్ట్ర సరిహద్దు అయిన చిలమత్తూరు మండలం మట్టి మాఫియాకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ 44వ నంబరు జాతీయ రహదారి, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, 544ఈ జాతీయ రహదారి, పుట్టపర్తి వరకూ నాలుగు లేన్ల రహదారులు ఉండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొనుగోలు చేసి అగ్రి లేఔట్లను జోరుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. అయితే భూములు ఎత్తుపల్లాలు ఉండటంతో వాటిని లెవలింగ్ చేసుకోవడానికి ఇష్టానుసారంగా మట్టిని చెరువుల నుంచి తరలిస్తున్నారు. నేరుగా పీఏలతోనే బేరం ! రియల్టర్లు నేరుగా ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలతోనే స్థానిక టీడీపీ నేతల ద్వారా టచ్లోకి వెళ్లిపోయి మట్టి దందాను సాగిస్తున్నారన్న విమర్శలున్నాయి. అభివృద్ధి మాట పక్కనపెట్టి వారి స్వలాభాలకే ప్రాధాన్యం ఇస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇటీవల హిందూపురానికి చెందిన ఓ టీడీపీ నేత .. 44వ నంబరు జాతీయ రహదారి దగ్గర ఉన్న రియల్టర్కు చెందిన భూమి లెవలింగ్ కోసం వందలాది లోడ్ల మట్టిని అక్రమంగా లేపాక్షి నాలెడ్జి హబ్ భూముల నుంచి తరలించారు. ఇందుకోసం మండలస్థాయి టీడీపీ నేత అనుచరుడి అకౌంట్లోకి రోజుకు రూ.50 వేల చొప్పున రియల్టర్ చెల్లించినట్లు సమాచారం. ఇదంతా పురంలో ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలకు చేర్చారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అన్నీ అధికారులకు తెలిసే.. హిందూపురం నియోజకవర్గంలో మట్టి దందా విషయం ఇరిగేషన్ , మైనింగ్శాఖ అధికారులకు తెలిసినా ఏమీ చేయలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. కేవలం పీఏల భయంతో మిన్నకుండిపోతున్నట్లు చెబుతున్నారు. మండలంలో కొడికొండ – మొరసలపల్లి ప్రధాన రహదారి పక్కనే ఇటుక బట్టీల కోసం ఓ టీడీపీ నేత వందలాది లోడ్ల మట్టిని డంప్ చేశారు. దీనికి ఎలాంటి అనుమతి లేదు. రైతులకు మట్టి తోలుకునేందుకు వంద నిబంధనలు పెట్టే అధికారులు ఇలాంటి అక్రమార్కులపై చర్యలు ఎందుకు తీసుకోరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కళావిహీనంగా నదులు.. మట్టి దందాతో పాటు అక్రమంగా ఇసుక తరలింపు ద్వారా తమ్ముళ్ల ఆదాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా మారింది. నదుల్లోని సహజ వనరుల సొమ్మంతా టీడీపీ నేతల ఇళ్లకు చేరుతోంది. యథేచ్ఛగా ఇసుక దోపిడీ ద్వారా నదులన్నీ కళావిహీనంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని పెన్నా, చిత్రావతి, కుషావతి నదులు ఇసుక దిబ్బలతో నీటితో కళకళలాడేవి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవి కళావిహీనంగా మారాయి. ఇసుక దోపిడీ కారణంగా వేసవిలో నదుల్లో ఉన్న నీరంతా ఆవిరైపోయింది. సహజ వనరులు ఇలాగే ఖాళీ చేస్తే కరువు సంభవించడం ఖాయమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు స్థానికంగా ఉండే నేతలను బినామీలుగా అడ్డుపెట్టుకొని సహజ వనరులను దోచుకుంటూ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా మార్చేందుకు కుట్ర చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ధర్మవరం: వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకూ పోరాటం చేస్తామని ముస్లిం నాయకులు స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ ధర్మవరం పట్టణంలో ముస్లింలు, సంయుక్త మస్జీద్ కమిటీల ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. జామియా మస్జీద్ నుంచి పీఆర్టీ సర్కిల్, గాంధీ సర్కిల్ మీదుగా కళాజ్యోతి, కాలేజ్ సర్కిల్ వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు. సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ, క్రైస్తవ సంఘాలు, బీఎస్పీ, ఎమ్మార్పీఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం కాలేజ్ సర్కిల్ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? ముస్లిం మతపెద్దలు తాహీర్ మౌలానా తాహీర్, తాయూబ్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం అమలు చేయడం ద్వారా వక్ఫ్ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. ఏళ్ల నాటి వక్ఫ్ ఆస్తులకు ఇప్పుడు రికార్డులను చూపించి హక్కులను పొందాలనడం సమంజసం కాదని తెలిపారు. వక్ఫ్ ఆస్తులతో రియల్ ఎస్టేట్ చేసేందుకు కొంత మంది స్వార్థ పరులు ప్రయత్నిస్తున్నారన్నారు. సవరణ చట్టంలోని లోపాలను సర్వోన్నత న్యాయస్థానం ఎత్తిచూపినా ఇంకా మొండి పట్టు పట్టడం మంచిది కాదన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసేవరకు ఆందోళనలు చేస్తామని అవసరమైతే ఆమరణ దీక్ష చేసేందుకు వెనుకాడబోమన్నారు. రాజకీయ లబ్ధికోసమే.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిహాసం చేసేవిధంగా నల్ల చట్టాలను తెచ్చి అమలు చేసేందుకు యత్నిస్తోందని సీపీఐ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముసుగు మధు, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకులు షేక్ చాంద్బాషా, కాంట్రాక్టర్ వలి, సాధిక్, పాస్టర్లు మోసేజ్ గ్రేసయ్య, సుందర్సింగ్ విమర్శించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని కేవలం రాజకీయ లబ్ధికోసమే కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు. ఇలాంటి చట్టాలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మద్దతు తెలపడం దారుణమన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను అధికారులు శ్రద్ధతో పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. పింఛన్లు, ఇంటి పట్టాలు, ఇల్లు, భూ సమస్యలు తదితర వాటిపై 304 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ నిర్ణీత గడువులోపు నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని అధికారులను ఆదేశించారు. లక్ష్యాలను సాధించడంలో ఏవైనా సమస్యలు ఉంటే విజయవాడలోని ఆయా శాఖల ఉన్నతాధికారులకు తెలియజేస్తే సమస్యలకు పరిష్కారం చూపిస్తారన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీలోపు నమోదు డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనల్లో ఇచ్చిన హామీల సమగ్ర నివేదికలు మంగళవారంలోపు సిద్ధం చేయాలన్నారు. అర్హులకే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు.. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ లబ్ధిదారులకు 604 యూనిట్లు పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బ్యాంక్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో కలసి డీసీసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూ.25.14 కోట్ల విలువతో 604 యూనిట్లను ఎస్సీ లబ్ధిదారులకు అందించేందుకు ఆమోదం తెలిపామన్నారు. అర్హులకు మాత్రమే అవి అందేలా చూడాలన్నారు. రొద్దం, తనకల్లులను కరువు మండలాలుగా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. ఆ రెండు మండలాల్లో రుణాలు రీ షెడ్యూల్ చేయాలని ఆదేశించారు. అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి.. జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. 2025–26లో జిల్లాలో మొత్తం 33,749 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు పేర్కొన్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. మే 5వ తేదీ నుంచి సెప్టెంబర్ వరకూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఓ విజయసారథి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, డీఆర్డీఏ పీడీ నరసయ్య, అడల్ట్ ఎడ్యూకేషన్ డీడీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 8లోన్యూస్రీల్హిందూపురం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. సహజ వనరులను దోచేస్తూ అడ్డదిడ్డంగా సంపాదిస్తోంది. ముఖ్యంగా కొందరు టీడీపీ నాయకులు చెరువుల్లో మట్టిని యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నేరుగా ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల పేర్లతోనే దందా చేస్తుండటంతో అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. బాలయ్య ఇలాకాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా నేరుగా ఎమ్మెల్యే పీఏలతో డీల్ ! బినామీలుగా టీడీపీ నాయకులు రియల్టర్ల నుంచి రోజువారీగా వసూళ్లు చోద్యం చూస్తున్న ఇరిగేషన్, మైనింగ్శాఖ అధికారులు కలెక్టర్ టీఎస్ చేతన్ వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేసే దాకా పోరాటం చేస్తామని ముస్లిం పెద్దల స్పష్టీకరణకేసులు నమోదు చేస్తాం హిందూపురం నియోజకవర్గంలోని చెరువుల్లో మట్టిని కేవలం రైతులు పొలాల్లోకి తోలుకునేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నాం. ఇప్పటి వరకూ వెంచర్లు, కమర్షియల్ వ్యాపారులకు ఎక్కడా మట్టి తవ్వుకునేందుకు అనుమతులు ఇవ్వలేదు. ఎవరైనా మట్టి తవ్వకాలు చేపట్టినట్లు తమ దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు కూడా నమోదు చేస్తాం. – యోగానంద, ఇరిగేషన్, డీఈ, హిందూపురం -
డ్రిప్ మంజూరులో జిల్లాకు నాలుగో స్థానం
అనంతపురం సెంట్రల్: డ్రిప్, స్పింక్లర్ల మంజూరులో రాష్ట్రంలో అనంతపురం జిల్లా మొదటి స్థానం, జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచిందని ఏపీఎంఐపీ రాష్ట్ర ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం నగరంలో ప్రాంతీయ ఉద్యాన శిక్షణా సంస్థ కార్యాలయంలో మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్లు, కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీసత్యసాయి జిల్లా రాష్ట్రంలో నాలుగు, జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో ఉందని అభినందించారు. రైతుల పొలాల్లో పరికరాలను త్వరితగతిన అమర్చి సకాలంలో పంటలు సాగు చేసుకునేందుకు సహకరించాలని సూచించారు. ఎస్సీ,ఎస్టీ రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వంద శాతం రైతులు డ్రిప్ వాడేలా చూడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ అనంతపురం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు రఘునాథరెడ్డి, సత్యసాయి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, ఏపీఎంఐపీ ఇంజనీర్లు పాల్గొన్నారు. ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడి మృతి పరిగి: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... పరికి మండలంవిట్టాపల్లికి చెందిన రవికుమార్ (33).. రొద్దం మండలం ఎం.కొత్తపల్లిలోని అత్తారింటికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం తిరిగి తనస్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ఆయన.. పైడేటి సమీపంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలోకి చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి ● ఎస్టీయూ నాయకుల డిమాండ్ పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల నియామక తేదీని అందరికీ ఒకేలా ఉండేలా చూడాలని ఎస్టీయూ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఈఓ కృష్ణప్పను సోమవారం కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు నియామక పత్రాలను 2010, నవంబర్ 6న ఇచ్చారన్నారు. అయితే కొందరు ఎంఈఓలు నవంబర్ 4, 5, 8 తేదీల్లో జాయినింగ్ డేట్ ఇవ్వడంతో ట్రాన్స్ఫర్ సీనియారిటీలో మెరిట్ ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లుతోందన్నారు. దీంతో 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు కామన్ జాయినింగ్ తేదీని ఇవ్వాలన్నారు. అలాగే 2009లో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు సైతం జాయినింగ్ తేదీల సమస్యలు నెలకొన్నాయని, వీటిని కూడా పరిష్కరించాలన్నారు. ఎల్ఎఫ్ఎల్ టూల్ ఇండక్షన్ ట్రైనింగ్, పదోతరగతి స్పాట్ వాల్యూయేషన్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా కార్యదర్శి రవిచంద్ర, వెంగమనాయుడు, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల అద్యక్షులు శివయ్య, శ్రీనివాసులు, శంకర్ నాయుడు, షెక్షావలి, సురేష్, కృష్ణప్ప, అనిల్కుమార్, శ్రీనివాసులు పాల్గొన్నారు. ‘పురం’ వాసికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు హిందూపురం: స్థానిక మిషన్ కాంపౌండ్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ స్టీఫెన్రాజ్ కుమారుడు పి.ఇమ్మానుయేల్ రాజ్కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. 2024, డిసెంబర్ 1న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు కోసం హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో 1,046 మంది సంగీత కళాకారులు కీబోర్డు వాయించి ఇన్స్ట్రాగామ్లో అప్లోడ్ చేశారు. దీనిని రికార్డుగా గుర్తిస్తూ ఇటీవల హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో ఇమ్మానుయేల్ రాజుకు సర్టిఫికెట్, గోల్డ్ మెడల్ను గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు అందజేశారు. -
బిందెడు నీటికి బండెడు కష్టాలు
రాయదుర్గం: ఉమ్మడి జిల్లాల్లోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల పరిధిలో ఉన్న 727 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చే శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కూటమి సర్కార్ ఘోర వైఫల్యాల కారణంగా పల్లెలన్నీ గొంతెండుతున్నాయి. గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు పొలాల వెంబడి పరుగు తీస్తున్నారు. 16 రోజులుగా నిలిచిపోయిన తాగునీటి సరఫరా లక్షలాది మంది గొంతు తడిపే అతిపెద్ద శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని అధికారం చేపట్టి పట్టుమని పది నెలల కాకనే చంద్రబాబు సర్కార్ అటకెక్కించింది. నిర్వహణ చేతకాక చేతులెత్తేసింది. నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో 16 రోజులుగా కార్మికులు సమ్మె బాటపట్టారు. దీంతో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా శ్రీరామరెడ్డి తాగునీటి పథకం లబ్ధి పొందుతున్న గ్రామాల్లో ప్రజలు కన్నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ బోర్లే దిక్కు ఉమ్మడి జిల్లాల్లోని చాలా గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. విద్యుత్ సరఫరా ప్రారంభం కాగానే పొలాల్లోకి పరుగులు తీస్తున్నారు. రైతుల నుంచి ఎదురయ్యే ఛీత్కారాలను మౌనంగా భరిస్తూ తమ నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. నీటి కష్టాలు చూసిన ట్యాంకర్ల నిర్వాహకులు ధర అమాంతం పెంచేశారు. పట్టణాల్లో ఒక్కో ట్యాంకర్కు రూ.800 నుంచి రూ. వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. అది కూడా అర్ధరాత్రి సమయంలో ట్యాంకర్లు వస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సమ్మె విరమిస్తేనే ప్రయోజనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో 800 మంది కార్మికులు పనిచేస్తుండగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వివిధ కారణాలతో ఆ సంఖ్య 630కి కుదించారు. సూపర్వైజర్లు మరో 20 మంది ఉన్నారు. నిత్యం 47 ఎంల్డీ నీటిని ఉరవకొండ నియోజకవర్గం పీఏబీఆర్ పంప్హౌస్ నుంచి పంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్మికులకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. దీంతో కార్మికుల వేతన బకాయిలు రూ.8 కోట్లకు చేరుకుంది. పలు దఫాలుగా నిరసనలు వ్యక్తం చేసినా... చర్చల పేరుతో కార్మికులను మభ్య పెట్టారు తప్ప సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. దీంతో గత్యంతరం లేని స్థితిలో కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. నిండు వేసవిలో 16 రోజులుగా తాగునీటి పథకం ద్వారా నీరందక పోవడంతో ప్రజల ఇక్కట్లు నానాటికీ జటిలమవుతున్నాయి. కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరితేగాని సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చాక శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం నిర్వీర్యం వేతనాలు అందించలేని దుస్థితిలో ‘బాబు’ సర్కార్ ఈ నెల 6 నుంచి సమ్మెలో కార్మికులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 727 గ్రామాలకు నిలిచిన తాగునీటి సరఫరా -
ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
శ్రీరామిరెడ్డి పథకం తాగునీరే మాకు దిక్కు. ఊర్లో బోర్లలో నీరు ఉప్పుగా ఉంటున్నాయి. వాటిని తాగలేక పోతున్నాం. ఎండకాలంలో ఇంతటి కష్టం వస్తోందని అనుకోలేదు. – మారెక్క, గోనబావి, గుమ్మఘట్ట మండలం రెండు రోజుల్లో పరిష్కారం కార్మికులతో చర్చలకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. సమస్యకు ఒకట్రెండు రోజుల్లో పరిష్కారం దక్కుతుంది. రూ.8 కోట్ల వేతన బకాయిలు చెల్లించేలా నివేదికలు సమర్పించారు. త్వరలో కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమ అవుతాయి. లీకేజీలు తాత్కలికంగా అరికట్టేలా చర్యలు తీసుకుంటాం. కొత్త లైన్ ఏర్పాటుకు ప్రణాళికలు చేపట్టాం. – శిరీష, శ్రీరామిరెడ్డి పథకం డీఈ, అనంతపురం -
కర్ణాటక మద్యం పట్టివేత
హిందూపురం టౌన్: స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో ముగ్గురిని సోమవారం అరెస్ట్ చేసి, 240 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. సోమవారం తనిఖీలు చేపట్టిన సమయంలో కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తూ నంది సర్కిల్ వద్ద ఎకై ్సజ్ సిబ్బందికి అంబేడ్కర్ నగర్కు చెందిన మారుతి, నారాయణ, రాజు పట్టుబడ్డారన్నారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. గంజాయి విక్రేతల అరెస్ట్ బత్తలపల్లి: మండల కేంద్రంలో సోమవారం గంజాయి విక్రయిస్తూ ఇద్దరు పట్టుబడినట్లు ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. పట్టుబడిన వారిలో జ్వాలాపురం గ్రామానికి చెందిన లోక్నాథరెడ్డి, వెంకటరమణ ఉన్నారన్నారు. వీరిద్దరూ బత్తలపల్లిలోని తాడిపత్రి రోడ్డులో ఉన్న జగనన్న కాలనీ వద్ద గంజాయి విక్రయిస్తుండగా రెడ్హ్యాండెడ్గా అరెస్ట్ చేసి, 190 గ్రాముల గంజాయిని స్వాధీని చేసుకున్నట్లు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించామన్నారు. -
ఒంగోలు నివాసి మృతి
కదిరి టౌన్: స్థానిక తాయి గ్రాండ్ లాడ్జ్ మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడిన ఒంగోలుకు చెందిన కోటేశ్వరరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒంగోలుకు చెందిన శ్రీనివాసులు తన కారు డ్రైవర్ కోటేశ్వరరావుతో కలసి అనంతపురంలో బంధువుల ఇంట జరిగిన శుభకార్యానికి వచ్చారు. ఈ క్రమంలో కదిరిలోని తన స్నేహితుడు రమణను మాట్లాడేందుకు సోమవారం సాయంత్రం వచ్చి తాయిగ్రాండ్ లాడ్జ్లో గదిని అద్దెకు తీసుకున్నాడు. టిఫెన్ కోసం వచ్చిన కోటేశ్వరరావు తిరిగి లాడ్జ్ మెట్లు ఎక్కుతుండగా అదుపు తప్పి కిందపడడంతో తలకు బలమైన గాయమైంది. కదిరి ఏరియా ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తుండగా పరిస్థితి విషమించి ఆయన మృతి చెందాడు. ఘటనపై కదిరి పోలీసులు కేసు నమోదు చేశారు. -
లేని భూమిని విక్రయించారు
పుట్టపర్తి టౌన్: భూమి లేకున్నా... రికార్డుల్లో ఉన్నట్లు చూపించి తనకు విక్రయించి మోసం చేశారని, దీనిపై తనకు న్యాయం చేయాలటూ డీఎస్పీ ఆదినారాయణకు బాధితుడు రవీంద్రనాథ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీని అందజేసి తన గోడు వెల్లబోసుకున్నాడు. హిందూపురం సమీపంలోని మోతుకపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 67–3లో ఉన్న మూడు ఎకరాల భూమిలో ఒక ఎకరా విస్తీర్ణాన్ని అదే గ్రామానికి చెందిన బోయ తిమ్మయ్య 2023లో హిందూపురానికి చెందిన రవీంద్రనాథ్కు రూ..20లక్షలకు విక్రయించేలా రూ. 3 లక్షల టోకన్ అడ్వాన్స్తో ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో రవీంద్రనాథ్కు ఇప్పటి వరకూ భూమిని చూపలేదు. ఈ రోజు.. రేపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన రవీంద్రనాథ్ లోతుగా విచారణ చేయడంతో సదరు సర్వే నంబర్లో భూమి లేదని, మొత్తం మూడు ఎకరాలను ఇతరులకు విక్రయించినట్లుగా నిర్ధారణ కావడంతో తాను చెల్లించిన అడ్వాన్స్ వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చేసుకోవడంతో రవ్రీంనాథ్పై తిమ్మయ్య వర్గీయులు దాడిచేశారు. ఘటనపై హిందూపురం ఒకటో పట్టణ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై న్యాయం చేకూరకపోవడంతో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ అందజేశారు. దీనిపై స్పందించిన డీఎస్పీ ఆదినారాయణ... వెంటనే హిందూపురం డీఎస్పీ మహేష్తో ఫోన్లో మాట్లాడారు. సమస్య వివరించి, పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందజేసే ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సరైన పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఎస్పీ రత్న ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ఆదినారాయణ, విజయకుమార్, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి పాల్గొన్నారు. న్యాయం చేయాలంటూ బాధితుడి వేడుకోలు ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 70 వినతులు -
విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై
ధర్మవరం అర్బన్: విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై ఐదుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపిన మేరకు.. ఆదివారం రాత్రి 10.30 గంటలకు బీట్లో భాగంగా స్థానిక కదిరి గేటు వద్దకు కానిస్టేబుల్ విశ్వనాథ్ వెళ్లారు. ఆ సమయంలో అక్కడ రాజు అనే వ్యక్తి ఎగ్రైస్ బండి నిర్వహిస్తుండడం గమనించి, సమయం మించి పోయిందని, వ్యాపారాన్ని ఆపి ఇంటికెళ్లాలని సూచించారు. దీంతో రాజు వాగ్వాదానికి దిగాడు. ఎంత సర్ది చెప్పినా వినకుండా తన స్నేహితులను పిలిపించుకుని కానిస్టేబుల్ విశ్వనాథ్పై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాజు, అతని స్నేహితులు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.వ్యక్తి ఆత్మహత్య● 20 రోజుల తర్వాత వెలుగు చూసిన ఘటనబత్తలపల్లి: మండలంలోని యర్రాయపల్లి ఓబులేసుని కొండలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని గొర్రెల కాపరులు సోమవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని తాడిమర్రి మండలం పూలఓబయ్యపల్లికి చెందిన శెట్టిపల్లి శివారెడ్డి(43)గా గుర్తించారు. విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించి మృతుడిని శివారెడ్డిగా నిర్ధారించి, బోరున విలపించారు. ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఓ ఫర్టిలైజర్ షాపులో పని చేస్తున్నట్లు తెలిపారు. ఉగాది పండుగ నుంచి కనిపించకుండా పోయాడని.. ఘటనపై అప్పట్లోనే ధర్మవరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. కాగా, ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.యువకుడి దుర్మరణంచెన్నేకొత్తపల్లి: ద్విచక్ర వాహనాలు కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రామగిరి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన సాయితేజ (24) సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై ధర్మవరానికి బయలుదేరాడు. ప్యాదిండి గ్రామానికి అదే గ్రామానికి చెందిన రమేష్ మరో ద్విచక్ర వాహనంపై ధర్మవరానికి వెళుతూ సాయితేజ వాహనం వెనుకనే అనుసరించసాగాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోకి చేరుకోగానే ధర్మవరం వైపు నుంచి ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన కారు తొలుత సాయితేజ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని, తర్వాత వెనుకనే ఉన్న రమేష్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఘటనలో సాయితేజ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన రమేష్ను స్థానికులు ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రఽథమ చికిత్స అనంతరం మెరుగైన వెద్యం కోసం అనంతపురానికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. ఘటనపై సీకే పల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
మేధస్సును కదిలించేది ‘శ్రమ కావ్యం’
అనంతపురం: మేధస్సును కదిలించేది ‘శ్రమ కావ్య గానం’ అని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక తేజ అన్నారు. ఆయన రచించిన శ్రమ కావ్యం గానం పుస్తక పరిచయ కార్యక్రమం అనంతపురంలోని జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో సీఐటీయూ, ఐద్వా, యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి నాయకురాలు డాక్టర్ ప్రగతి మాట్లాడుతూ... సుద్దాల అశోక్ తేజ సాహితీ ప్రస్థానాన్ని వివరించారు. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సుద్దాల అశోక్ తేజ రచనలు శ్రమ శక్తిని చాటేలా ఉంటాయన్నారు. అనంతరం సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. శ్రమ కావ్యం గానం గురించి వివరించారు. శ్రమ అన్నది మేథో శ్రమ, శారీరక శ్రమ రెండు రకాలుగా ఉంటుందన్నారు. ఈ రెండు కలగలిసి ప్రయాణం సాగిస్తుంటాయని వివరించారు. శ్రమ ద్వారానే సామాజిక గమనం ఉంటుందనే అంశాన్ని శ్రమ కావ్యం గానం ద్వారా వివరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, సీఐటీయూ ఆర్వీ నాయుడు, యూటీఎఫ్ లింగన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేష్, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప, సీఐటీయూ రాష్ట్ర నాయకులు వి.రాంభూపాల్, మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్ఎం బాష, సామాజిక వేత్త బోస్, మానవతా రక్తదాత తరిమెల అమర్నాథ్ రెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకుడు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుద్దాల అశోక తేజ -
దివ్యాంగులకు వరం.. యూడీఐడీ
దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న యూడీఐడీ (యూనిక్ డిసబిలిటీ ఐడెంటిటీ) కార్డు ఓ వరం కానుంది. ఈ కార్డు ద్వారా వారు తమ వైకల్య శాతాన్ని రుజువు చేయవచ్చు. అంతేకాక ఇతర రాష్ట్రాల్లోనూ సులభంగా సదుపాయాలను పొందవచ్చు. ప్రశాంతి నిలయం: సమాజంలో దివ్యాంగులు తమ సంరక్షణకు పడే పాట్లు అన్నిఇన్నీ కావు. ఈ క్రమంలో వారు తమకు అవసరమైన సేవలను సులువుగా పొందేందుకు వీలుగా యూనిక్ డిసబిలిటీ ఐడెంటిటీ (యూడీఐడీ) కార్డును కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తోంది. రాబోవు రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలంటే ఈ కార్డులు తప్పనిసరిగా కానున్నాయి. సేవలను సులభతరం చేయడమే లక్ష్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు అందించే ప్రయోజనాల కోసం ఇప్పటి వరకూ సదరం సర్టిఫికెట్ తప్పని సరి అయింది. దీని కోసం దివ్యాంగులు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా ముందుగా సదరం స్లాట్ బుక్ చేసుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన వైద్య శిబిరంలో వైద్యులు వైకల్య ధ్రువీకరణ అనంతరం సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు నెలల తరబడి సమయం పడుతోంది. ఇలాంటి తరుణంలో సదరం సర్టిఫికెట్లకు స్వస్తి పలుకుతూ ఆ స్థానంలో యూడీఐడీలను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు యూడీఐడీ కార్డు పొందాలంటే https://www. swavlambancard.gov.in/ వెబ్సైట్ ద్వారా స్వయంగా లేదా మీ సేవా కేంద్రాల నుంచి కూడా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత గతంలో మాదిరిగానే జిల్లా ఆస్పత్రిలో నిర్వహించే క్యాంప్లకు హాజరైతే అక్కడ వారికి స్లాట్ కేటాయించి, మెడికల్ క్యాంప్ ఎప్పుడు ఉండేదనేది ఫోన్ ద్వారా సమాచారం అందజేస్తారు. వారు చెప్పిన రోజున క్యాంప్నకు హాజరైతే సంబంధిత డాక్టర్లు పరీక్షలు నిర్వహించి వైకల్య శాతాన్ని ధ్రువీకరిస్తూ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. దీని ప్రకారం యూడీఐడీ జనరేట్ అయి కార్డు నేరుగా ఇంటికే చేరుతుంది. ఇప్పటి వరకు కేవలం 7 రకాల వైకల్యం ఉన్న వారికే మాత్రమే మీ సేవ ద్వారా సదరం శిబిరాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇకపై 21 రకాల వైకల్యాలకు సంబంధించిన సేవలను పొందేలా సులభతరం చేశారు. ఈ కార్డుల ద్వారా సామాజిక భద్రత పింఛన్లతో పాటు ఇతర సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా ఎక్కడైనా పొందే వెసులుబాటు ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి యూడీఐడీ ప్రాజెక్ట్ ప్రతి సారీ అర్హత పత్రాలతో తిరిగే అవసరం లేదు వివరాలన్నీ కార్డుపై క్యూఆర్ కోడ్ రూపంలో నిక్షిప్తం 21 రకాల వైకల్యాలకు యూడీఐడీ ద్వారా గుర్తింపు జిల్లా వ్యాప్తంగా 54,600 మంది దివ్యాంగులకు లబ్ధి తప్పని సరిగా యూడీఐడీ కార్డు పొందాలి జిల్లాలో సుమారు 54,600 మంది దివ్యాంగులు ఉన్నారు. వీరిలో 35,078 మంది దివ్యాంగుల పింఛన్లు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూడీఐడీ కార్డును ప్రతి ఒక్కరూ పొందాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి లబ్ధి పొందాలన్నా ఈ కార్డు తప్పనిసరి. పూర్తి వివరాల కోసం 94400 33130లో సంప్రదించవచ్చు. – వినోద్, అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ -
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి దుర్మరణం
ఉరవకొండ: స్థానిక నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు... వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి తండాకు చెందిన వెంకటేష్ నాయక్ (51) ఆదివారం వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనంలో ఉరవకొండకు బయలుదేరాడు. మార్గమధ్యంలో పీసీ ప్యాపిలి వద్దకు చేరుకోగానే బస్సు కోసం వేచి ఉన్న అదే గ్రామానికి చెందిన శాంతమ్మ(33) అభ్యర్థన మేరకు ఆమెను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని బయలుదేరాడు. ఉరవకొండ సమీపంలోని హంద్రీ–నీవా కాలువ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్పు ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, వెంకటేష్నాయక్ భార్య ఏడాది క్రితమే చెందింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. పీసీ ప్యాపిలికి చెందిన శాంతమ్మ భర్త వన్నూరు స్వామి ఉరవకొండలోని ఓ హోటల్లో సప్లయిర్గా పనిచేస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తమ్ముడి నిశ్చితార్థానికి వెళుతూ.. అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో స్టాఫ్నర్సుగా పనిచేస్తున్న ప్రవల్లిక.. ఉరవకొండలో భర్త మల్లికార్జునతో పాటు కలసి నివాసముంటుంది. ఈ క్రమంలో రోజూ బస్సులో విధులకు వెళ్లి వచ్చేవారు. వజ్రకరూరు మండలం చాబాలలో ఉన్న తన తమ్ముడి వివాహ నిశ్చితార్థం ఉండడంతో ఆదివారం భర్తతో కలసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వేగంగా వచ్చిన ఆటో ఢీకొంది. ఘటనలో ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మల్లి కార్జునకు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. ఈ రెండు ఘటలపై సీఐ మహనంది కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పిడుగుపాటుకు గుడిసె దగ్ధం
పెనుకొండ రూరల్: దుద్దేబండలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రాత్రి 7.30 గంటల సమయంలో రైతు నారాయణప్ప పొలంలోని గుడిసైపె పిడుగు పడింది. పిడుగు ధాటికి గుడిసె దగ్ధమై పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. గుడిసెలోని బియ్యం, బీరువాలోని దుస్తులు, నగదు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేయాలని సూచించారు. ఎస్పీ కార్యాలయంలో... పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ వి.రత్న తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేస్తే.. పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సూచించారు. నవ వరుడి ఆత్మహత్యాయత్నం పామిడి: పైళ్లెన రెండు నెలలకే జీవితంపై విరక్తితో ఓ నవ వరుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పామిడి మండలం కోనేపల్లికి చెందిన పుంజా హరీష్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 21న యాడికి మండలం వెంకటాంపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ చంద్ర ప్రభావతితో పెద్దల సమక్షంలో పామిడిలోని రహమత్ ఫంక్షన్ హాల్లో పెళ్లి అయింది. దంపతుల మధ్య ఏమి జరిగిందో? ఏమో తెలియదు కానీ ఆదివారం హరీష్ పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతణ్ని కుటుంబసభ్యులు వెంటనే పామిడిలోని సీహెచ్సీకి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరలించినట్లు సమాచారం. ఘటనపై పామిడి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
భక్తులపై తేనెటీగల దాడి
ఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులపై ఆదివారం తేనెటీగలు దాడి చేశాయి. వివరాలు.. మండల పరిధిలోని వెలిగొండ గ్రామానికి చెందిన రాజశేఖర్, భాగ్యమ్మ, శ్రీలేఖ, రామాంజినేయులు, జయలక్ష్మి, రాజేశ్వరి, యుగంధర్, మల్లికార్జున, ప్రతాప్, ప్రభాస్, జనార్దన్ తదితర 20 మంది ఆదివారం పెన్నహోబిలం వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం పొట్టేలు బలి ఇచ్చి ఆలయం కింది భాగంలో వంట చేసుకుని విందు భోజనాలకు కూర్చున్నారు. ఈ క్రమంలోనే అక్కడే చెట్టు మీద ఉన్న పెద్ద తేనెతుట్టె నుంచి ఒక్కసారిగా తేనెటీగలు లేచి దాడి చేశాయి. హఠాత్పరిణామంతో ఆందోళనకు గురైన వారు కేకలు వేస్తూ పిల్లాపాపలతో కలిసి పరుగు తీశారు. స్థానికులు 108 సాయంతో గాయపడ్డ వారిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 20 మందికి గాయాలు -
పొలాలకు వెళ్లే దారేదీ..?
ఇద్దరు రైతులపై కేసులు పొలాలకు దారి ఎందుకు వదలరంటూ దోరణాలపల్లికి చెందిన రైతులు నంజిరెడ్డి, నారాయణరెడ్డి రియల్టర్ రెడ్డెప్పశెట్టిని ప్రశ్నించారు. మీరు దారి ఇవ్వకపోతే.. మేమూ తిరగనివ్వం అని అంటే ఆగ్రహించిన రెడ్డప్పశెట్టి సదరు రైతులపై కేసులు పెట్టించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నాడు. ఆయనకొక న్యాయం.. మాకొక న్యాయమా అంటూ బాధిత రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రాజ్యాంగేతర శక్తిగా మారి ఇంతటి దాష్టీకానికి పాల్పడుతున్నా ప్రభుత్వాలు, అధికారులు ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
ప్రమాదంలో చిన్నారి మృతి
కొలిమిగుండ్ల: నంద్యాల జిల్లాలో కారు, బొలెరో పరస్పరం ఢీకొన్న ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ చిన్నారి మృతి చెందింది. మరో ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన చంద్రమోహన్రెడ్డి తన కుమార్తె జోష్యహర్షిణిరెడ్డి(6)ని నంద్యాలలోని మేనమామ ఇంట్లో ఉంచి చదివిస్తున్నాడు. ఈ క్రమంలో అమ్మవారికి మొక్కుబడి చెల్లించాల్సి ఉండడంతో తాత, విశ్రాంత ఉపాధ్యాయుడు రామసుబ్బారెడ్డి, బంధువులు వెంకటసుబ్బారెడ్డి, ఏటూరి శ్రీనివాసరెడ్డి, లక్ష్మీదేవితో కలసి కారులో నంద్యాల స్వగ్రామానికి జోష్యహర్షిణిరెడ్డి బయలుదేరింది. కొలిమిగుండ్ల మండలం రాఘవరాజుపల్లి శివారులోకి చేరుకోగానే అంకిరెడ్డిపల్లి నుంచి కొలిమిగుండ్లకు వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాద తీవ్రతకు కారు ఎగిరి రోడ్డు పక్కన బోల్తాపడింది. కారులో ఉన్న వారందరూ అందులో చిక్కుకుపోయారు. బొలెరో వాహనంలో ఉన్న అంకిరెడ్డిపల్లికి చెందిన యువకులు రాజకుళ్లాయి, బాలుకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు కారులో చిక్కుకుపోయిన వారిని అతి కష్టంపై వెలికితీసి, తాడిపత్రిలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న జోష్యహర్షిణిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న సీఐ రమేష్బాబు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రుడు ఏటూరి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
క్షతగాత్రుడి ప్రాణాలు కాపాడిన డీఎస్పీ వెంకటేశులు
రాప్తాడు: ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అసహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుడిని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు సకాలంలో తన వాహనంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. వివరాలు.. రాప్తాడుకు చెందిన యువకుడు చెడిపోతుల కుళ్లాయప్ప ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళుతూ జేఎన్టీయూ మార్గంలోని భారత్ గ్యాస్ కార్యాలయం ఎదుట డివైడర్ను ఢీకొని తీవ్ర గాయాలతో పడిపోయాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి 108కు సమాచారం అందించారు. అయితే ఎంతకూ 108 వాహనం రాలేదు. ఈ లోపు కుళ్లాయప్ప పరిస్థితి విషమిస్తుండడంతో తన సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశులు అప్రమత్తయ్యారు. అప్పటికే ఇంటికి వాహనంలో బయలుదేరిన ఆయన వెంటనే ప్రమాదస్థలానికి చేరుకుని తీవ్ర గాయాలతో పడి ఉన్న కుళ్లాయప్పను స్థానికుల సాయంతో తానే పైకి లేపి తన వాహనంలో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. యువకుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో స్థానికంగానే తొలుత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అటు నుంచి బెంగళూరుకు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. కాగా, క్షతగాత్రుడిని తన వాహనంలో ఆస్పత్రికి చేర్చిన డీఎస్పీ చొరవను స్థానికులు అభినందిచారు. ‘ఈ సార్ చాలా మంచోడు’ అంటూ కితాబునిచ్చారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ రొళ్ల: మండలంలోని చర్లోపల్లి గ్రామ పొలిమేరలో పేకాట ఆడుతూ పది మంది పట్టుబడ్డారు. ఎస్ఐ వీరాంజనేయులు తెలిపిన మేరకు... అందిన సమాచారంతో ఆదివారం సాయంత్రం మడకశిర రూరల్ సీఐ రాజ్కుమార్ నేతృత్వంలో చర్లోపల్లి గ్రామ పరిసరాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పేకాట ఆడుతూ పది మంది పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.72,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సూపర్ మార్ట్లో యువతిపై దాడి అనంతపురం: నగరంలోని శాంతినగర్ వద్ద ఉన్న వియాన్సీ ఫ్యామిలీ మార్ట్లో ఓ యువతిపై దాడి జరిగింది. అనంతపురం మూడో పట్టణ సీఐ కె.శాంతిలాల్ తెలిపిన మేరకు... అనంతపురంలో నివాసముంటున్న గుంటూరు హరిత తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో తన చిన్నాన్న పర్యవేక్షణలో ఉంటూ ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు తన చిన్నాన్న నిర్వహిస్తున్న వియాన్సీ ఫ్యామిలీ మార్ట్లోని నగదు కౌంటర్ వద్ద వ్యాపార లావాదేవీలను చూస్తుంటారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 10:30 గంటలకు స్కార్పియో వాహనంలో మార్ట్కు చేరుకున్న సాకే నాగమణి, పయ్యావుల లోకనాథ్, డ్రైవర్ దుర్గాప్రసాద్ ఓ బాస్కెట్ తీసుకుని అందులో తమకు కావాల్సిన సరుకులు వేసుకుని బిల్లింగ్ కౌంటర్ వద్దకు చేరుకున్నారు. వాటికి బిల్ వేయడంతో రూ.200 అయింది. వారి వద్ద ఉన్న క్లాత్ బ్యాగ్లో వేసుకున్న వస్తువులు కూడా బయటకు తీయాలని అక్కడున్న అనిల్ తెలిపాడు. తాము ఎలా కనిపిస్తున్నామంటూ వారు దబాయించారు. దీంతో షాపింగ్ చేస్తున్న సమయంలో తాము సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, అందులో వారు కొన్ని వస్తువులు బ్యాగ్లో వేసుకోవడం స్పష్టంగా గమనించినట్లు తెలపడంతో సాకే నాగమణి రెచ్చిపోయి హరిత జట్టు పట్టి లాగి కొట్టారు. అదే సమయంలో హరితపై పయ్యావుల లోక్నాథ్, డ్రైవర్ దుర్గాప్రసాద్ దాడి చేయబోతుండగా తప్పించుకునినే ఉన్న గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. తలుపులు బద్దలుగొట్టేందుకు లోకనాథ్, దుర్గాప్రసాద్ ప్రయత్నిస్తుండడంతో అక్కడున్న సిబ్బంది అడ్డుకుని సర్దిచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు సీఐ శాంతిలాల్ తెలిపారు. -
హ్యాండ్ బాల్ జిల్లా జట్ల ఎంపిక
కదిరి అర్బన్: జిల్లా హ్యాండ్బాల్ పురుషులు, మహిళల జట్ల ఎంపికను స్థానిక ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న మహిళల జట్టులో మాధవి, నక్షత్ర, సభ, ఝాన్సీరాణి, స్వప్న, సమీరా, చాందిని, లేఖన, షబ్రీన్, ఫర్హానా, ఓం శ్రీ, పవిత్ర, సమిత, దివ్య, చందన, హాసిని, శ్రావణి ఉన్నారు. అలాగే పురుషుల జట్టుకు యాసిర్సిధ్దిఖీ, డానియల్రాజన్, భరత్, జస్వంత్నాయక్, సాదిక్బాషా, మహమ్మద్ అనీఫ్, ఫైజాన్, విశ్వనాథ్, సాయికుమార్, తనయ్, కుమార్, నారాయణస్వామినాయక్, ప్రవీణ్నాయక్, అరుణ్కుమార్, మల్లికార్జున, నాగరాజు ఎంపికయ్యారు. ఈ ప్రక్రియను జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు విజయ్కుమార్, మహేష్ పర్యవేక్షించారు. కండక్టర్పై ఖాకీ దౌర్జన్యం గుత్తి: టికెట్ తీసుకుని ప్రయాణం చేయాలని సూచించిన ఆర్టీసీ బస్సు కండక్టర్పై ఓ హెడ్ కానిస్టేబుల్ బూతులతో రెచ్చిపోయారు. వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున గుత్తి ఆర్టీసీ డిపో నుంచి ప్రయాణికులతో బయలుదేరిన బస్సు గార్లదిన్నె మండలం కల్లూరుకు చేరుకోగానే ఓ హెడ్ కానిస్టేబుల్ ఎక్కారు. టికెట్ తీసుకోవాలని కండక్టర్ గంగేశ్వర్ అడగడంతో తాను హెడ్ కానిస్టేబుల్నని, టికెట్ తీసుకునేది లేదని తెలిపారు. ‘అలా కాదు సార్.. వారెంట్ ఏదైనా ఉంటే చెప్పండి ఫ్రీ గా ప్రయాణం చేయవచ్చు. అలా కాదంటే టికెట్ తీసుకోవాల్సిందే’ అంటూ కండక్టర్ చెప్పగానే హెడ్ కానిస్టేబుల్ రెచ్చిపోయి బూతులతో విరుచుకు పడారు. ‘ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో.. అవసరమైతే కోర్డుకు పోతావా? పో’ అంటూ బెదిరింపులకు దిగారు. తాను లేకుండా బస్సు అక్కడి నుంచి ఎలా ముందుకెళుతుందో చూస్తానంటూ భీష్మించారు. దీంతో సహనం కోల్పోయిన కండక్టర్ టికెట్ తీసుకోవాల్సిందేనంటూ గట్టిగా పట్టుపట్టారు. హెడ్ కానిస్టేబుల్ నిర్వాకంతో బస్సు అక్కడే నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు కల్పించుకోవడంతో చివరకు హెడ్ కానిస్టేబుల్ టికెట్ తీసుకున్నారు. ఘటనపై పోలీసులతో పాటు ఆర్టీసీ డీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు కండక్టర్ గంగేశ్వర్ తెలిపారు. కాగా, వివాదస్పదమైన సదరు హెడ్ కానిస్టేబుల్ పేరు లక్ష్మీనారాయణ అని ప్రయాణికులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ పనిచేస్తున్నది తెలియదన్నారు. పోలీసు శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్న ఇలాంటి వారిపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనంత వరకూ ఇలాంటి ఘటనలు తరచూ చూడాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
ఇక చాలు.. దయ చేయండి!
అనంతపురం: ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం మాట తప్పింది. పైగా ఇప్పటివరకూ ఉన్న ఉద్యోగాలనూ తొలగిస్తోంది. జేఎన్టీయూ (ఏ) పరిధిలో పనిచేస్తున్న 150 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సర్వం సిద్ధం చేయడమే ఇందుకు నిదర్శనం. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2008లో జేఎన్టీయూ (ఏ) వర్సిటీ ఏర్పాటైంది. వర్సిటీలో కార్యకలాపాల నిర్వహణకు అప్పట్లోనే అవుట్ సోర్సింగ్ కింద ఉద్యోగులను నియమించారు. ప్రస్తుతం వర్సిటీ పరిధిలో మొత్తం 650 మంది ఉన్నారు. కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో 120 మంది, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాల 150, క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల 80, ఓటీఆర్ఐ 26, జేఎన్టీయూ (అనంతపురం నగరంలో)లో 274 మంది పనిచేస్తున్నారు. అంతలోనే ఎంత తేడా.. చిరుద్యోగులకు దన్నుగా నిలిచేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. ‘ఆప్కాస్’ ఏర్పాటు చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతం చెల్లించింది. ఉద్యోగాలను ఇష్టానుసారం తొలగించే పరిస్థితి లేకుండా భద్రత కల్పించింది. పీఎఫ్ సౌకర్యం ఉండేది. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ‘ఆప్కాస్’ నుంచి జీతాలు చెల్లించలేమంటూ చేతులెత్తేసింది. దీంతో జేఎన్టీయూ అంతర్గత వనరుల నుంచి జీతాలు ఇవ్వాల్సి రావడంతో ఆ మేరకు ఆర్థిక వనరులు లేక ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చారు. మూడు రోజుల క్రితం జరిగిన పాలకమండలి సమావేశంలో దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించాలని తీర్మానించినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో జేఎన్టీయూ(ఏ)లో ఇద్దరు, కలికిరిలో ఐదుగురిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. మిగిలిన 643 మంది చాలా ఏళ్లనుంచి కొనసాగుతున్న వారే. ఈ క్రమంలో వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి ఉన్న ఉద్యోగులకూ ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. జేఎన్టీయూ (ఏ) పరిధిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఉద్యోగులను తొలగించే ప్రక్రియను జేఎన్టీయూ యాజమాన్యం మానుకోవాలి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థలో దళారుల ప్రమేయం అధికంగా ఉండేది. సక్రమంగా జీతాలు చెల్లించేవారు కాదు. ‘ఆప్కాస్’ ద్వారా సక్రమంగా జీతాలు అందేవి. ఇటీవల ‘ఆప్కాస్’ నుంచి జీతాలు చెల్లించలేమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న ఉద్యోగులను తొలగించేలా నిర్ణయం తీసుకోవడం సరికాదు. – కే.విజయ్, ఉమ్మడి జిల్లా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ -
వైభవంగా కొల్హాపురి మహాలక్ష్మి ఉత్సవాలు
రొళ్ల: రత్నగిరి కొల్హాపురి మహాలక్ష్మీదేవి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ‘పోతులరాజు పుష్పాలంకారణ మహోత్సవం’లో భాగంగా మహాకాళి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా రాజవంశీకుల ఇంటి నుంచి పోతులరాజులు ప్రత్యేకంగా అలంకరించుకుని పురవీధుల గుండా నృత్యం చేస్తూ మంగళవాయిద్యాల నడుమ ఆలయం వద్దకు చేరుకుని ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాలబావి సమీపంలో పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవాన్ని అశేష భక్తజనం మధ్య వైభవంగా నిర్వహించారు. మహిళలు దేవాలయ సమీపంలోని పాలబావిలో గంగపూజ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేశారు. ఇలా చేయడం వల్ల సంతాన భాగ్యం లేని వారికి సంతాన ప్రాప్తి, దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. జాతరలో తినుబండారాల అంగళ్లు కిటకిటలాడాయి. భక్తులకు దాతల సహకారంతో అన్నదానం చేశారు. కార్యక్రమంలో రాజవంశీకుల కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవ వేడుకల్లో జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు పాల్గొన్నారు. ఉత్సవాల్లో సోమవారం పాలబావిలో గంగపూజతో పాటు రాత్రికి పోతులరాజు బండారు మహోత్సవం నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు తదితరులు తెలిపారు. భక్తిశ్రద్ధలో పోతులరాజు పుష్పాలంకరణ -
అందరూ ఆయనకే వత్తాసు
పేదలపై ఎందుకు కక్ష? మా పొలాలకు దారి కావాలని పదేళ్లుగా పోరాడుతున్నాం. ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చాం. తహసీల్దార్ సారు వాళ్లు ఒకసారి వచ్చి చూసి వెళ్లారు. దారి ఉందని చెప్పారు. అయితే రెడ్డెప్పశెట్టి దారి ఇవ్వడం లేదు. ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టిస్తాడు. మాకా వయసైపోతోంది. పైగా పేదవాళ్లం. కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక, ఆర్థిక స్తోమత రెండూ లేక న్యాయం కోసం ఎదురుచూస్తున్నాం. – చలపతి, రైతు, దోరణాలపల్లి మాకు రెండెకరాల పొలం ఉంది. ఆ స్వామి(రెడ్డప్పశెట్టి)ని మేము అడిగింది పొలాలకు వెళ్లేందుకు దారి ఇవ్వండి అని. పంటలు సాగుచేసుకొని జీవనం సాగిస్తున్న మాలాంటి వారిపై దేనికి అంత కక్ష? మా భూములూ ఇచ్చేస్తాం.. ఆయనే ఏలుకోమని చెప్పండి. అంత దూరం నడవలేక, పంటలను సరిగా చూసుకోలేక దిగుబడులు రావడం లేదు. మాకు న్యాయం చేయండి.. దారి ఇప్పించండి. – మునీశ్వరమ్మ, దోరణాలపల్లి -
వరాల తల్లికి జ్యోతుల హారతి
రొళ్ల: రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి వార్షిక ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం జ్యోతుల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారి మూల విరాట్తో పాటు ఉత్సవ విగ్రహానికి భక్తులు కానుక రూపంలో తీసుకొచ్చిన పట్టువస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలతో పాటు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం వేప, తమలపాకులతో అందంగా అలంకరించారు. సాయంత్రం రత్నగిరి ఎస్సీ కాలనీ వాసులు మేళతాళాలతో జ్యోతులను మోసుకువచ్చి ఆలయం చుట్ట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారికి సమర్పించి హారతులు ఇచ్చారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులు.. కొల్హాపురి మహాలక్ష్మీదేవిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తండోప తండాలుగా తరలివచ్చారు. దీంతో శనివారం దేవాలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన మహిళలు సమీపాన ఉన్న పాలబావి వద్దకు చేరుకుని గంగ పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు దాతల సహకారంతో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నేడు పోతులరాజు పూజ.. మహాలక్ష్మీదేవి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం పోతులరాజు పూజ, పుష్పాలంకరణ మహోత్సవం నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు తెలిపారు. వైభవంగా కొల్హాపురి మహాలక్ష్మీదేవి జ్యోతుల ఉత్సవం భారీగా తరలివచ్చిన భక్తజనం -
జిల్లా జడ్జి బాధ్యతల స్వీకరణ
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్జిగా ఈ. భీమా రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు ఉన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ నెల్లూరు జిల్లాకు బదిలీ అయిన సంగతి విదితమే. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఈ. భీమా రావును అనంతపురం కోర్టుకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన భీమారావును బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురుప్రసాద్, జనరల్ సెక్రటరీ వెంకటరాముడు, వైస్ ప్రెసిడెంట్ ధర్మసింగ్ నాయక్, ట్రెజరర్ వెంకట రఘుకుమార్ తదితరులు సత్కరించారు. 22న ‘పురం’లో మెగా జాబ్మేళా ప్రశాంతి నిలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 22న హిందూపురంలోని శ్రీ బాలాజీ విద్యా విహార్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్మేళా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. జిల్లాలోని యువతీ, యువకులు జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శనివారం ఆయన తన చాంబర్లో జాబ్మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాబ్మేళాలో 20 మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమో, బీటెక్, బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, పీజీ కోర్సులు చదివిన వారు జాబ్మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. పూర్తి వివరాల కోసం 9676706976, 9966682246 నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసయ్య, స్కిల్ డెవలప్మెంట్ ట్ అధికారి హరికృష్ణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ–కేవైసీ చేయించుకోండి ప్రశాంతి నిలయం: జిల్లాలోని రేషన్ కార్డుదారులందరూ ఏప్రిల్ 30వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని, లేకపోతే రేషన్ సరుకులు ఇవ్వబోరని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో కార్డుదారులు ఈ–కేవైసీ చేయించుకోకపోయినా రేషన్ సరుకులు ఇచ్చేవారని, ఏప్రిల్ 30 నుంచి అలాంటి పరిస్థితి ఉండదన్నారు. ఈ–కేవైసీ చేయించుకోని వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు. జిల్లాలో 16,89,531 రేషన్ కార్డుదారులుండగా, ఇప్పటి వరకు 15,48,523 మంది ఈ–కేవైసీ చేయించుకున్నారని, ఇంకా 1,11,673 మంది ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. వారంతా వెంటనే ఆయా గ్రామ సచివాలయాలు, రేషన్ షాపుల్లో ఈ–పాస్ యంత్రాల ద్వారా ఈ– కేవైసీ నమోదు చేసుకోవాలని సూచించారు. 5 ఏళ్లలోపు, 80 ఏళ్లు పైబడి వయస్సు కలిగిన వారికి ఈ–కేవైసీ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. జేఈఈ మెయిన్స్లో ర్యాంకుల పంట కదిరి అర్బన్: జేఈఈ మెయిన్స్ రెండోసెషన్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఎన్ఐటీ, త్రిపుల్ ఐటీల్లో బీటెక్, బీఈ కోర్సుల ప్రవేశాలకు నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రెండు విడతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ఈ పరీక్షల్లో జిల్లా నుంచి పలువురు విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. కదిరికి చెందిన చంద్రమోహన్రెడ్డి కుమార్తె కనిష్క 99.78 శాతం పర్సంటైల్తో ఆల్ ఇండియా స్థాయిలో 3411 ర్యాంకు సాధించింది. అలాగే పట్టణానికి చెందిన ఓబులపతి కుమారుడు ఓం కిరణ్ 99.91 శాతం పర్సంటైల్తో ఓబీసీ కేటగిరీలో 252 ర్యాంకు, జనరల్ కేటగిరీలో 1462 ర్యాంకు దక్కించుకున్నాడు. అలాగే రమణారెడ్డి కుమారుడు అనీష్రెడ్డి 2460 ర్యాంక్ సాధించాడు. -
అగ్గిపడితే.. బుగ్గే
ధర్మవరం: వేసవిలో వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో నిత్యం ఏదో ఒకచోట అగ్ని ప్రమాదం జరుగుతోంది. ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ స్టేషన్కు ఫోన్ చేద్దామంటే సమయానికి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. ఎందుకంటే ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లోని ఆరు మండలాలకు ఒకే ఫైర్ ఇంజిన్, ఒకే ఫైర్స్టేషన్ ఉండటమే కారణం. ధర్మవరంలోని మాధవనగర్లోని అగ్నిమాపకశాఖ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయ పరిధిలోకి బత్తలపల్లి, తాడిమర్రి, ధర్మవరం మండలాలతోపాటు చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాలు వస్తాయి. ఈ ఆరు మండలాల్లోని ఏ ప్రాంతంలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా ఇక్కడినుంచే ఫైరింజన్ వెళ్లాల్సి ఉంది. రామగిరి మండలం ధర్మవరానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా తాడిమర్రి మండలంలో చివరి గ్రామం పట్టణానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రమాదం జరిగినపుడు ఆ ప్రాంతాల్లోకి ఫైరింజన్ చేరుకోవాలంటే గంటపైనే సమయం పడుతుండడంతో ఫైర్ సిబ్బంది స్థానికుల ఆగ్రహానికి గురవుతున్నారు. దీనికితోడు ఇతర ప్రాంతాల్లో విపత్తులు సంభవించినపుడు ఇక్కడి సిబ్బంది అక్కడ విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ముందుకు కదలని కొత్త ఫైర్స్టేషన్ ఏర్పాటు.. అగ్ని మాపకశాఖ అధికారులు సీకేపల్లి మండలంలో కొత్త ఫైర్స్టేషన్ ఏర్పాటు చేసేలా గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తద్వారా ధర్మవరంలో ఉన్న ఫైర్స్టేషన్కు పనిభారం తగ్గడంతో పాటు రాప్తాడులోని సీకేపల్లి, కనగానపల్లి, రామగిరి మండలాలకు సత్వరం ఫైర్ సేవలు అందించే వీలుంటుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. మంత్రి సత్యకుమార్ ఈ విషయంపై దష్టిసారించి కొత్త ఫైర్స్టేషన్ ఏర్పాటుతో పాటు ధర్మవరంలో ఉన్న ఫైర్స్టేషన్కు రెండు ఫైర్ ఇంజిన్లు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ● ఈ విషయమై సాక్షి జిల్లా అగ్ని మాపక అధికారి హేమంత్రెడ్డిని వివరణ కోరగా ఫైర్స్టేషన్ అప్గ్రేడ్ చేయడం మా చేతుల్లో లేదని, అది ప్రభుత్వం చేయాల్సిన పని అని, తమను అడగకండి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వేసవి సీజన్లో వరుస అగ్ని ప్రమాదాలు ఆరు మండలాలకు ఒకే ఫైర్ స్టేషన్ ఫైర్సేవలు సత్వరం అందడం ప్రశ్నార్థకమే తీవ్రంగా నష్టపోతున్న అగ్ని ప్రమాద బాధితులు -
గుర్తుపెట్టుకుంటాం.. వడ్డీతో కలిపి చెల్లిస్తాం
పరిగి: ‘‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు...ఇప్పుడు మీరు చేస్తున్న దౌర్జన్యాలన్నీ గుర్తుపెట్టుకుంటాం.. త్వరలోనే వడ్డీతో కలిపి చెల్లిస్తాం’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ కూటమి నేతలను హెచ్చరించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా...ఏ రాజకీయ పార్టీ అన్యాయం చేసినా ప్రజల పక్షాన నిలబడి న్యాయపోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. శనివారం ఆమె పరిగి మండలం పైడేటిలో విలేకరులతో మాట్లాడారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కిందన్నారు. కానీ నేటి కూటమి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చలేకపోయిందని ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ అలవిగాని హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేశారన్నారు. పైగా అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలతో అమాయకులను వేధిస్తున్నారన్నారు. అందుకే కూటమి సర్కార్ దేశంలోనే అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందన్నారు. బీసీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరులో కేవలం టీడీపీ నాయకులకు మాత్రమే వర్తింపజేసేందుకు కూటమి నేతలు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. వక్ఫ్బోర్డు సవరణపై ప్రభుత్వ వైఖరి సరికాదు ముస్లింలకు తీరని నష్టం కలిగించే వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. ముస్లిం, మైనార్టీలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసిన పాపానికి పశ్చాతాప పడుతున్నారన్నారు. సిద్దాంతాలను తాకట్టు పెట్టి, కేంద్ర ప్రభుత్వంతో కలిసి మైనార్టీల గొంతుకోసిన చంద్రబాబును ముస్లింలు ఎప్పటికీ క్షమించబోరన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కూటమి నేతలను హెచ్చరించిన ఉషశ్రీచరణ్ ఎల్లకాలం అవినీతి రాజ్యం సాగదని వెల్లడి -
ఏడు నెలలు.. మద్యం ఏరులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి సర్కారు పుణ్యమా అని ఉమ్మడి అనంతపురం జిల్లా మద్యం మత్తులో ఊగిపోతోంది. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా మద్యం దుకాణాల వద్ద మందు బాబులతో జాతర వాతావరణం తలపిస్తోంది. రోడ్డుమీదే తాగుతూ చిందులేస్తున్నారు. పట్టణాల్లో పర్మిట్ రూములు, పల్లెటూళ్లలో బెల్టుషాపులు.. ఇదీ దుస్థితి. నాలుగు వందల జనాభా ఉన్న గ్రామంలో కూడా రెండు, మూడు బెల్టుషాపులు పెట్టి రేషన్ బియ్యం తరహాలో ఇంటింటికీ మద్యం అమ్ముతున్నారు. టీడీపీ నేతల ఆధ్వర్యంలో అడ్డూ అదుపు లేకుండా జరుగుతున్న మద్యం వ్యాపారంతో వేల కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఏడు నెలల్లో 1.16 కోట్ల లీటర్ల మద్యం.. కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో ఎప్పుడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 2025 ఏప్రిల్ 15 వరకూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1.16 కోట్ల లీటర్ల మద్యం తాగించేశారు. దీన్ని ఐదు వేల లీటర్ల నీటి ట్యాంకర్లతో పోలిస్తే 2,337 ట్యాంకర్ల మద్యం తాగినట్టు లెక్క కావడం గమనార్హం. రోజుకు సగటున రెండు జిల్లాల్లో 55,658 లీటర్ల మద్యం వినియోగమవుతోంది. ఇదికాకుండా ఏడు నెలల్లో 39 లక్షల లీటర్ల బీరు తాగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రోజు రోజుకూ మద్యానికి అలవాటు పడుతున్న యువకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేతల షాపులపై కన్నెత్తి చూడరు.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 230 వరకూ మద్యం షాపులున్నాయి. వీటిలో మెజారిటీ షాపులు టీడీపీ ఎమ్మెల్యేలవే. ఈ దుకాణాలకు అనుబంధంగా బెల్టుషాపులు కూడా నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎకై ్సజ్ అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి. ఎవరైనా అటువైపు వెళితే బదిలీ చేస్తామని ఎకై ్సజ్ అధికారులను ‘పచ్చ’ నేతలు బెదిరిస్తున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకే మద్యం షాపులు పనిచేయాలి. కానీ రాప్తాడు, రాయదుర్గం లాంటి కొన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకే షాపులు తెరుస్తున్నారు. అనంతపురం లాంటి చోట్ల టీడీపీ ఎమ్మెల్యే మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూములు ఏ సమయంలో చూసినా జనం కిక్కిరిసి ఉంటున్నాయి. అయినా ఎవరూ పట్టించుకునే దిక్కులేదు. అడ్డూ అదుపు లేని ఈ మద్యం అమ్మకాలతో సామాన్య కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. విచ్చలవిడిగా లభిస్తున్న మద్యం కారణంగా కుటుంబ తగాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. 1.16 కోట్ల లీటర్ల మద్యం తాగేశారు రోజుకు సగటున 55 వేల లీటర్లకు పైగా వినియోగం మరో 39 లక్షల లీటర్ల బీర్లు కూడా.. పల్లెటూళ్లలో బెల్టుషాపులు.. పట్టణాల్లో పర్మిట్ రూములు ఇప్పటివరకూ ఉమ్మడి అనంతలో మద్యం కోసం రూ. 925 కోట్ల వ్యయం -
ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో మానవాళికి ముప్పు
పుట్టపర్తి టౌన్: ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో మానవాళికి ముప్పు ఉందని, అందువల్ల గృహాలు, కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులు శాసీ్త్రయ పద్ధతిలో తొలగించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. ‘స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం పంచాయతీ రాజ్, పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ – వ్యర్థాల అనర్థాలను వివరిస్తూ పుట్టపర్తిలో విద్యార్థులు, మహిళలు ర్యాలీ నిర్వహించారు. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద ర్యాలీకి కలెక్టర్ చేతన్ జెండా ఊపి ప్రారంభించగా, వైజంక్షన్ వరకూ కొనసాగింది. అక్కడ విద్యార్థులు, మహిళలు మానవహారంగా ఏర్పడి ‘స్వర్ణాంధ్ర,–స్వచ్చాంధ్ర’ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా 2022 నాటికి 8 కోట్ల టన్నుల ఈ– వ్యర్థాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొందన్నారు. ఇందులో ఇరవై మిలియన్ల టన్నులు మాత్రమే రీసైక్లింగ్ జరిగినట్లు వెల్లడించిందన్నారు. మిగిలిన ఈ–వ్యర్థాలను అశాసీ్త్రయ విధానంలో తొలగిస్తున్నారని, ఇది మానవాళి మనుగడకు ప్రమాదకరమన్నారు. ప్రజలు తమ ఇళ్లల్లో పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన ఈ–వ్యర్థ చెత్త సేకరణ కేంద్రంలో అందజేస్తే వాటిని సరైన రీతిలో రీసైక్లింగ్ చేసి ముప్పు లేకుండా చూస్తారన్నారు. ఈ–వ్యర్థాలను శాసీ్త్రయ పద్ధతిలో తొలగిస్తే వాటినుంచి బంగారు, వెండి, ప్లాటీనం వంటి లోహాలు వెలికి తీయవచ్చన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, కమిషనర్ ప్రహ్లాద, డీఆర్డీఏ పీడీ నరసయ్య, డీఈఓ కృష్టప్పతో పాటు విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. శాసీ్త్రయంగా తొలగించడం అందరి బాధ్యత స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ చేతన్ -
విత్తన వేరుశనగ నాణ్యతపై దృష్టి
అనంతపురం అగ్రికల్చర్: వచ్చే ఖరీఫ్లో రైతులకు పంపిణీ చేయడానికి నాణ్యమైన విత్తన వేరుశనగ అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఈ నెల 22న విత్తన వేరుశనగ సేకరణ, సరఫరాకు సంబంధించి టెండర్లు ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో కమిషనరేట్ నుంచి వచ్చిన ఏడీఏ రమణమూర్తి, ఏవో సుకుమార్ గత రెండు రోజులుగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటించారు. రెండు జిల్లాల పరిధిలో ఉన్న 10 ప్రాసెసింగ్ ప్లాంట్లను సందర్శించి అక్కడున్న వేరుశనగ కాయల నాణ్యతను పరిశీలించారు. టెండర్లు ఖరారు కాగానే నిబంధనల మేరకు నాణ్యమైన విత్తన వేరుశనగను సరఫరా చేయాల్సి ఉంటుందని నిర్వాహకులకు సూచించారు. ఏపీ సీడ్స్ ద్వారా సరఫరా, పంపిణీ ఉంటుందని, నెలాఖరు నాటికి సేకరణ ధరలు ఖరారు కానున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలు (గ్రీన్ మెన్యూర్స్) కింద జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తన కేటాయింపులు, 50 శాతం సబ్సిడీ ప్రకటించినట్లు తెలిపారు. వివాహిత ఆత్మహత్య చిలమత్తూరు: వడ్డిచెన్నంపల్లికి చెందిన పవిత్ర (24) అనే వివాహిత శనివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో డీటీ జగన్నాథ, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించారు. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమెకు 15 నెలల కుమారుడు ఉన్నాడు. కలుపు తొలగించబోయి.. కానరాని లోకాలకు అమరాపురం: కాచికుంట గ్రామానికి చెందిన మంజునాథ (31) శనివారం ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన రైతు ఈరన్న పొలంలో వక్క చెట్ల నడుమ పిచ్చి మొక్కలు తొలగించడానికి ట్రాక్టర్తో పాటు రోటావేటర్ తీసుకెళ్లాడు. కలుపు మొక్కలను తొలగిస్తుండగా అకస్మాత్తుగా కిందపడగానే ట్రాక్టర్ టైరు ఎక్కింది. దీంతో మంజునాథ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ ఇషాక్బాషా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కొబ్బరిచెట్టుపై పిడుగు
చిలమత్తూరు: కనిశెట్టిపల్లిలో శుక్రవారం రాత్రి ఓ ఇంటి సమీపాన కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. భారీ శబ్దానికి గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామంలో పలువురు స్పృహ కోల్పోయారు. కులం పేరుతో దూషించిన వ్యక్తిపై కేసు ధర్మవరం అర్బన్: జూనియర్ లైన్మెన్ను కులం పేరుతో దూషించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని జగ్జీవన్ రామ్నగర్కు చెందిన సాకే దినేష్ జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నారు. శనివారం ఇందిరమ్మ కాలనికి చెందిన నిట్టూరు సుబాన్ అనే వ్యక్తికి ఫోన్ చేసి కరెంటు బిల్లు కట్టాలని కోరాడు. ఇందుకు ఆగ్రహించిన సుబాన్ జూనియర్ లైన్మెన్ను కులం పేరుతో దూషించాడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జూనియర్ లైన్మెన్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సుబాన్పై కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. గుర్తుతెలియని యువకుడి మృతి ధర్మవరం అర్బన్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో శనివారం గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడని వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. మృతుడి వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లేదా 94407 96831, 94405 52808, 94407 32538 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
తప్పుల్లేని ఓటరు జాబితాకు సహకరించాలి
ప్రశాంతి నిలయం: తప్పుల్లేని ఓటరు జాబితా తయారీకి అందరూ సహకరించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భగా కలెక్టర్ మాట్లాడుతూ....తప్పుల్లేని ఓటరు జాబితా రూపకల్పన, మార్పులు, చేర్పులు పోలింగ్ శాతం పెంచేందుకు రాజకీయ పార్టీల నేతలూ తగిన సలహాలు, సూచనలు ఇవ్వవచ్చన్నారు. ఓటరు జాబితాలో పేరు నమోదు, తొలగింపు, సవరణ, ఇతర క్లైయిమ్లకు సంబంధించిన అంశాలపై చేసిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవచ్చన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్, ఓటర్ల రేషనలైజేషన్ ప్రక్రియలో రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలని కోరారు. దీనికోసం ముందుగానే ఆయా పార్టీలు తమ ఏజెంట్ల ద్వారా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి వివరాలను సేకరించి సన్నద్ధంగా ఉంటే ప్రక్రియను సులువుగా పూర్తి చేయవచ్చన్నారు. సమావేశంలో డీఆర్ఓ విజయసారథి, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ జాకీర్ హుస్సేన్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరిన కలెక్టర్ టీఎస్ చేతన్ -
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
పుట్టపర్తి టౌన్: ప్రతి ఒక్కరూ మన ఇంటితో పాటు పరిసరాలు, కార్యాలయాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ, పోలీస్ అధికారులు, డీపీఓ సిబ్బంది, ఏఆర్ పోలీసులు కార్యాలయ ఆవరణాన్ని శుభ్రం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందన్నారు. కార్యక్రమంలో ఏఓ సుజాత, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, డీటీఆర్బీ సీఐ సతీష్, ఆర్ఐలు మహేష్, వలి, ఎస్బీ ఎస్ఐ ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సీహెచ్ఓల డిమాండ్లు నెరవేర్చాలి
పుట్టపర్తి అర్బన్: నేషనల్ హెల్త్ మిషన్ కింద పని చేస్తున్న సీహెచ్ఓల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఏపీ ఎంపీసీఏ నాయకులు కోరారు. శనివారం సాయంత్రం ఏపీ ఎంపీసీఏ ఆధ్వర్యంలో ఉద్యోగులు డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎంపీసీఏ జిల్లా అధ్యక్షుడు కార్తీక్రెడ్డి జనరల్ సెక్రటరీ నందీశ్వరరెడ్డి మాట్లాడుతూ జీత భత్యాల విషయంలో సీహెచ్ఓలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ఆరేళ్లు దాటిన సీహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, నేషనల్ హెల్త్ స్కీంలో ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రతి నెలా జీతంతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలని, ఏటా 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ఆర్థికమైన, ఆర్థికేతర సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు చందన, వేణుగోపాల్, సీహెచ్ఓలు పాల్గొన్నారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
పెనుకొండ: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖామాత్యులు సవిత పేర్కొన్నారు. స్థానిక వివేకానంద జూనియర్ కళాశాలలో గురువారం మహిళలకు ఉచిత కుట్టు శిక్షణను మంత్రి ప్రారంభించి, మాట్లాడారు. మహిళల స్వయం ఉపాధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేలా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా కుట్టు శిక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3 నెలల పాటు శిక్షణ ఉంటుందని, 75 శాతం హాజరు కలిగిన వారికి శిక్షణ చివరి రోజున కుట్టు మిషన్తో పాటు ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ● ఉత్సాహంగా ఉరకలెత్తిన దున్నలు కణేకల్లు: స్థానిక చిక్కణ్ణేశ్వరస్వామి ఉత్సవాల సందర్భంగా గురువారం నిర్వహించిన దున్నపోతుల రాతిదూలం పోటీలు ఆసక్తిగా సాగాయి. స్థానిక జెడ్పీఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదిగా పోటీలు నిర్వహించారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో రాతి దూలాన్ని లాగుతూ దున్నపోతులు ఉరకలేయడాన్ని చూసి ప్రజలు కేకలు, ఈలలతో హోరెత్తించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోటీలు సాయంత్రం 4 గంటలకు ముగిసాయి. రైతు కె.ముజ్జుకు చెందిన దున్నపోతులు 15 నిమిషాల వ్యవధిలో 2,608.10 అడుగుల మేర దూరాన్ని రాతిదూలాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. మరో రైతు తిప్పేష్కు చెందిన దున్నపోతులు ద్వితీయ స్థానంలో, రైతు జి.రిజ్వంత్కు చెందిన దున్నపోతులు మూడో స్థానంలో నిలిచాయి. విజేత దున్నల యజమానులను అభినందిస్తూ సర్పంచ్ దంపతులు నిర్మల, డాక్టర్ సోమన్నతో నగదు పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో కణేకల్లు మేజర్ పంచాయతీ ఈఓ ప్రసాద్, కణేకల్లు చెరువు సంఘం అధ్యక్షుడు బీటీ రమేష్, స్థానికులు లాలెప్ప, అనిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సస్పెన్షన్కు గురైన ఉపాధ్యాయులపై విచారణ కదిరి అర్బన్: పదో తరగతి ఇన్విజిలేషన్ విధుల్లో అలసత్వం వహించడంతో సస్పెండ్ అయిన కదిరి మండలానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులపై విచారణ జరిగింది. పెనుకొండ డిప్యూటీ డీఈఓ పద్మప్రియ గురువారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో విచారణ నిర్వహించారు. నడింపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రుద్రంరెడ్డి, సైదాపురం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కిష్టప్ప సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. వారిద్దరి నుంచి రాతపూర్వకంగా సంజాయిషీ తీసుకున్నారు. నివేదికను డీఈఓకు పంపనున్నట్లు తెలిపారు. -
ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్లో ఇద్దరికి చోటు
అనంతపురం అర్బన్: అఖిల భాతర కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. తమిళనాడులోని నాగపట్నంలో మూడు రోజులుగా ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. చివరి రోజు గురువారం కౌన్సిల్ జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో సభ్యులుగా రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు అన్నగిరి కాటమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జునకు చోటు దక్కింది. యువకుడి ఆత్మహత్య రొద్దం: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రొద్దం మండలం ఆర్.కొట్టాల గ్రామానికి చెందిన కాకర్ల వరలక్ష్మి, బుగ్గ రంగయ్య దంపతుల కుమారుడు రవితేజ (35) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా నయం కాలేదు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున నొప్పి తీవ్రత తాళతేక ఓ పొలం వద్ద విషపు గుళికలు మింగాడు. కాసేపటి తర్వాత బంధువులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా తెలిపాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు గాలింపు చేపట్టి పొలంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న రవితేజను గుర్తించి, వెంటనే తుమకూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ‘హంద్రీ–నీవా’కు శాశ్వతంగా సమాధి కడతారా? ● జలసాధన సమితి సభ్యుల ధ్వజం ● కాలువ వెడల్పుపై ఎమ్మెల్యేలు మాట్లాడాలి హిందూపురం: రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్ట్లకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వం.. రాయలసీమకు జీవనాడిగా ఉన్న హంద్రీ–నీవా ప్రాజెక్ట్కు శాశ్వత సమాధి కట్టేందుకు సిద్ధమైందని జలసాధన సమితి సభ్యులు మండిపడ్డారు. ఈ మేరకు జలసాధన సమితి సభ్యులు చైతన్య గంగిరెడ్డి, శ్రీనివాసులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుంచి 38వేల క్యూసెక్కులకు పెంచడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం పూనుకుందన్నారు. అలాగే 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే గాలేరు–నగరి ప్రాజెక్టు కాలువ సామర్థ్యం 30 వేల క్యూసెక్కులతో కాలువ నిర్మాణం చేస్తున్నారన్నారు. అయితే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే హంద్రీ–నీవా ప్రాజెక్టు కాలువ సామర్థ్యం కేవలం 3,850 క్యూసెక్కులకు పరిమితం చేస్తూ, భవిష్యత్తులో కాలువను వెడల్పు చేసేందుకు లేకుండా లైనింగ్ పనులు చేపట్టి రాయలసీమ ఆశయాలకు శాశ్వతంగా గండి కొట్టేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. ఈ అన్యాయంపై జిల్లా ఎమ్మెల్యేలు నోరు విప్పకపోవడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా ముందు చూపుతో ఎమ్మెల్యేలు ఆలోచించి అప్రతిష్ట పాలుకాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకెళ్లి హంద్రీ–నీవా ప్రయోజకాలను కాపాడాలని హితవు పలికారు. చేనేత కార్మికుడి ఆత్మహత్య ధర్మవరం అర్బన్: స్థానిక రాజేంద్రనగర్లో నివాసముంటున్న చేనేత కార్మికుడు బాలకృష్ణ (42) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... రాజేంద్రకుమార్కు భార్య ప్రమీల, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మగ్గం పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. -
రూ.10 లక్షల విలువైన బైక్ల స్వాధీనం
బత్తలపల్లి: ద్విచక్ర వాహనాలను అపహరించుకెళ్లే యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బత్తలపల్లి పీఎస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ ప్రభాకర్, ఎస్ఐ సోమశేఖర్ వెల్లడించారు. అనంతపురం నగరానికి చెందిన ప్రణయ్, ధనూష్, సిద్ది వినయ్ వ్యసనాలకు బానిసలుగా మారి జులాయిగా తిరుగుతూ తమ జల్సాలకు అవసరమైన డబ్బు కోసం ద్విచక్ర వాహనాలను అపహరించడాన్ని పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు మైనర్లను కలుపుకున్నారు. వీరంతా కలసి ఓ ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాలను అపహరించుకెళ్లి తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. అనంతరం ఇతర రాష్ట్రాలకు చేరుకుని జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో బత్తలపల్లిలోని జాతీయ రహదారి కూడలిలో గురువారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై ఆరుగురు వెళుతుండగా స్థానిక పోలీసులు అడ్డుకుని విచారణ జరిపారు. ఆ సమయంలో వారు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. బత్తలపల్లి, ధర్మవరం, అనంతపురం నగర పరిధిలో అపహరించిన 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షలుగా ఉంటుందని నిర్ధారించారు. వీరిపై బత్తలపల్లిలో రెండు, ధర్మవరం టూ టౌన్ పరిధిలో మూడు కేసులు, అనంతపురంలో ఐదు కేసులున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్లను బాలుర పరివర్తన కేంద్రానికి తరలించారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన ఎస్ఐ సోమశేఖర్, సిబ్బందిని సీఐ ప్రభాకర్ అభినందిస్తూ రివార్డులను అందజేశారు. ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఆరుగురి అరెస్ట్ -
దౌర్జన్యంగా కూల్చేశారు
రొద్దం: హైకోర్టు పరిధిలో నడుస్తున్న స్థల వివాదంలోని షెడ్డును పోలీసులను అడ్డుపెట్టుకుని రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారంటూ రొద్దం మండలం ఎల్జీబీనగర్ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారుడు ఈడిగ ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2021లో తన భార్య ఈడిగ రమాదేవి పేరున సర్వే నంబర్ 311లో ఇంటి స్థలానికి పట్టా ఇచ్చిందని గుర్తు చేశారు. అందులో ఓ షెడ్డు ఏర్పాటు చేసుకుని 2016 నుంచి అందులో నివాసముంటున్నామన్నారు. ఈ క్రమంలో షెడ్డును తొలగించాలంటూ అధికారిక ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో దీనిపై హైకోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా గురువారం ఉదయం ఉన్నఫళంగా పెద్ద సంఖ్యలో పోలీసులను వెంటబెట్టుకొచ్చిన రెవెన్యూ అధికారులు.. జేసీబీ సాయంతో షెడ్డును నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ సమయంలో అడ్డుకోబోయిన తన భార్య రమాదేవిని బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారన్నారు. విషయం తెలుసుకున్న స్తానిక వైఎస్సార్ నాయకులు ఎన్.నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, ఎల్జీబీనగర్ మారుతీరెడ్డి, ప్రసాదరెడ్డి, తదితరులు బాధితుడిని పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు వైఎస్సార్సీపీ నేత రాజారెడ్డి తెలిపారు. అది రోడ్డు పొరంబోకు స్థలం : తహసీల్దార్ కూల్చివేతపై తహసీల్దార్ ఉదయశంకరరాజు మాట్లాడుతూ.. పెనుకొండ – పావగడ ప్రధాన మార్గంలోని రోడ్డు పోరం బోకు స్థలంలో రేకుల షెడ్డును నిర్మించుకున్నట్లుగా గుర్తించామన్నారు. వారికి పట్టా ఇచ్చింది ఓ చోట అయితే మరో చోట రేకుల షెడ్డును నిర్మించుకున్నారని వివరించారు. ఈ స్థలంపై హైకోర్టులో వేసిన పిటిషన్ డిస్మిస్ అయిందన్నారు. దీంతో ఇంటి పట్టాను జాయింట్ కలెక్టర్ రద్దు చేశారని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశంతో రోడ్డు పోరం బోకు స్థలంలో ఏర్పాటు చేసుకున్న షెడ్డును తొలగించినట్లుగా పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ మద్దతుదారుడి ఆవేదన -
త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే
హిందూపురం/పుట్టపర్తి టౌన్: క్రైస్తవ సమాజంలో అత్యంత ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడే గుడ్ ఫ్రైడే రానే వచ్చింది. క్రైస్తవ విశ్వాసం ప్రకారం సమాజంలో నెలకొన్న చెడును తొలగించడానికి ఈ రోజున తన జీవితాన్ని యేసు క్రీస్తు త్యాగం చేశాడు. ఆ త్యాగాలను మననం చేసుకుంటూ ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తుపై విశ్వాసం ప్రకటించేందుకు క్రైస్తవులు సిద్ధమయ్యారు. క్షమ, కరుణకు ప్రతిరూపంగా నిలిచిన యేసు క్రీస్తు.. లోకంలో పాపులను పరిశుద్ధులను చేసే క్రమంలో సిలువపై రక్తం చిందించిన దైవ కుమారుడిగా మరణించి కూడా పునరుత్థానుడై లేచిన సంఘటన ప్రపంచ చరిత్రలో మరెక్కడా కనిపించదు. ఆ ఘట్టాలను వివరించే గుడ్ ఫ్రైడే నుంచి ఆదివారం వచ్చే ఈస్టర్ పర్వదినం వరకు సాగే వేడుకలకు జిల్లాలోని ప్రతి ప్రార్థనామందిరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ప్రాణ త్యాగ సమయంలోనూ క్రీస్తు తన మరణ శిక్షను అమలు చేస్తున్న రోమన్ సైనికుల కోసం లోక రక్షకుడైన తన తండ్రితో ‘తండ్రీ వీరు ఏమి చేస్తున్నారో ఎరుగరు.. వీరిని క్షమింపుము’ అని ప్రార్థించి తనలోని దయ, కరుణ తత్వాలను లోకానికి చాటారు. సిలువపై క్రీస్తు చెప్పిన ఏడు సూక్తులు లోకానికి ఆరాధ్యాలయ్యాయి. మూడు రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు.. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా కేవలం దేవుడికి మన హృదయాన్ని సమర్పించుకునేలా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు హిందూపురంలోని సీ అండ్ ఐజీ చర్చ్, సీ అండ్ ఐజీ కాంపౌండ్ మీషన్ చర్చి, జెరూసెలం చర్చి, బైబిల్ మిషన్ చర్చి, సీఎస్ఐ చర్చి, జియాన్ చర్చిలతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. శుక్రవారం గుడ్ప్రై డే ప్రార్థనలు, శనివారం రన్ ఫర్ జీసెస్, ఆదివారం ఈస్టర్ వేడుకలు నిర్వహించనున్నారు. ఆదివారంతో ముగియనున్న శోకదినాలు గుడ్ఫ్రైడేను పురస్కరించుకుని క్రైస్తవులు పాటించిన 40 రోజుల శోక దినాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఈ 40 రోజుల పాటు శుభకార్యాలకు దూరంగా ఉంటారు. కనీసం నూతన దుస్తులు కూడా ధరించరు. పొరపాటున కూడా ఇతరులకు కీడు కలిగించే పనులు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక ప్రార్థనల్లోనే గడపడం ఆనవాయితీ. శుభ శుక్రవారం తర్వాత యేసు క్రీస్తు పునరుత్థానుడై లేచిన సందర్భంగా ఆదివారం పండుగను నిర్వహించేందుకు క్రైస్తవులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.పుట్టపర్తిలో విద్యుద్దీపాలంకరణలో వెలుగులీనుతున్న కింగ్స్ చర్చ్ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న చర్చిలు ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తుపై విశ్వాసం ప్రకటించనున్న క్రైస్తవులు -
వైఎస్ జగన్ చొరవతోనే..
వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు మడకశిర నియోజకవర్గానికి 5 విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు చేశారు. కొన్ని సాంకేతిక కారణాలతో నాడు విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభానికి నోచుకోలేదు. అవే విద్యుత్ సబ్ స్టేషన్లను శుక్రవారం మంత్రులు ప్రారంభించనున్నారు. అయినా ఈ క్రెడిట్ మొత్తం వైఎస్ జగన్దేనని రైతులు అంటున్నారు. ఈ విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణంలో కూటమి ప్రభుత్వ పాత్ర ఎంత మాత్రం లేదని బహిరంగంగానే చెబుతున్నారు. – ఈరలక్కప్ప. వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మడకశిర -
పోక్సో కేసులపై దృష్టి సారించండి
పుట్టపర్తి టౌన్: పోక్సో కేసులతో పాటు లాంగ్ పెండింగ్, సోషిల్ మీడియా కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ రత్న పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో సబ్ డివిజన్ల వారీగా సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మద్యం అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. డీఎస్పీలు విజయకుమార్, నరసింగప్ప, హేమంత్కుమార్, శివన్నారాయణస్వామి, సీఐలు బాలసుబ్రమణ్యంరెడ్డి, శ్రీనివాసులు, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి పాల్గొన్నారు. -
తల్లిదండ్రులు ఆలోచించాలి
● ఓ యువకుడు.. ఇద్దరు బాలికల వివాహ పత్రిక సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న గోరంట్లలో జరగాల్సిన వివాహం చర్చకు దారి తీయడంతో బాలల సంరక్షణ అధికారులు పరిశీలించారు. సదరు యువతులకు 18 ఏళ్లు నిండకపోవడంతో వివాహాలను అడ్డుకున్నారు. బాల్య వివాహం నేరమని కాదూ కూడదు అని ముందుకెళ్తే కటకటాలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ● ఇంటర్ చదువుతోన్న ఓ బాలికను 20 ఏళ్ల యువకుడు ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. పెళ్లి చేసుకునే తమకు రక్షణ కావాలంటూ తొలుత అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. అయితే బాలిక వయసు 17 ఏళ్లు కావడంతో కుటుంబ సభ్యులను పిలిచారు. అప్పటికే యువకుడు పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రులు కేసు వద్దని చెప్పడంతో ఇరు కుటుంబాలకు సర్దిచెప్పి పంపించారు. ఈ ఘటన పుట్టపర్తిలో వెలుగు చూసింది. ● గోరంట్లకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ ఓ బాలికతో ప్రేమలో పడ్డాడు. ఎవరికీ తెలియకుండా రహస్య వివాహం చేసుకుని పరారై వచ్చారు. బాలిక బంధువులు పోలీసులను ఆశ్రయించగా.. కొన్ని నెలల తర్వాత ధర్మవరంలో పట్టుబడ్డారు. అప్పటికే బాలిక గర్భం దాల్చింది. పైగా 18 ఏళ్లు దాటి పది రోజులు పూర్తి కావడంతో ఇరు కుటుంబాలకు సర్దిజెప్పి పంపించారు. బడికి పోవాల్సిన వయసులోనే కొందరు బాలికలు బాధ్యతలు మోయాల్సి వస్తోంది. చదువుకోవాల్సిన వయసులోనే గర్భం దాల్చి అనారోగ్యాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. బాల్య వివాహాలు ఏ రకంగానూ మంచిది కాదని అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పెద్దగా మార్పు కనిపించడం లేదు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం నేరం. అమ్మా యిలకు 18 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాలి. అంతకుముందే వివా హం చేయాలని చూస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. చిన్న వయసులో పెళ్లి, గర్భం దాల్చడం బాలికల ఆరోగ్యానికి ప్రమాదకరం. చదివే వయసులోనే ఇంటి బాధ్యతలు మోయాల్సిన అవసరం లేదు. చదివితే ఉన్నత స్థాయికి వెళ్లి మంచి ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఆలోచించాలి. – శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ సాక్షి, పుట్టపర్తి: జీవితమంటే ఏమిటో తెలియని పసి వయసులోనే ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయడం, అంతలోనే గర్భం దాల్చడం వంటి ఘటనలు జిల్లాలో పెరిగిపోతున్నాయి. బాల్య వివాహాలతో పాటు ప్రేమ వివాహాలు కూడా తెలిసీ తెలియని వయసులోనే జరిగిపోతున్నాయి. అధికారులు అప్రమత్తం కావడంతో గత 12 నెలల వ్యవధిలో 118 బాల్య వివాహాలు ఆగిపోయాయి. జిల్లా బాలల సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు, గ్రామాల్లో అధికారులు బాల్య వివాహాలతో కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. అయినా గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న వయసులోనే గర్భం.. బాల్య వివాహాల కారణంగా చిన్న వయసులోనే బాలికలు గర్భం దాలుస్తున్నారు. ఫలితంగా శారీరకంగా ఎదుగుదల లోపించడంతో పాటు పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా.. గుట్టుగా పిల్లలకు మూడుముళ్ల తంతు సాగిస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా ఆడబిడ్డల తల్లిదండ్రులు చిన్న వయసులోనే బాలికలను ఇల్లు దాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రేమ వ్యవహారాలు కూడా చిన్న వయసులోనే బాలికలను ఇల్లాలిని చేస్తున్నాయి. ప్రేమించిన వారు మోసగించి పరారవుతుండటంతో చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను మోస్తున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఆగని బాల్య వివాహాలు గుట్టుచప్పుడుకాకుండా పెళ్లిళ్లు చేస్తున్న వైనం ఆర్థిక సమస్యలే ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా వెలుగులోకి.. ఏడాదిలో 118 బాల్య వివాహాలకు చెక్ -
క్వింటా చింతపండు రూ.20 వేలు
హిందూపురం అర్బన్: మార్కెట్లో చింతపండు ధర తగ్గింది. గురువారం హిందూపురం వ్యవసాయ మార్కెట్కు 770.70 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.20 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.16 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 12,200, కనిష్టంగా రూ.5 వేలు, సరాసరిన రూ.8 వేల ప్రకారం ధర పలికింది. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు గోరంట్ల: అర్హులైన చిన్న సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్, స్ప్రింక్లర్లను అందిస్తామని జిల్లా మైక్రో ఇరిగేన్ పీడీ సుదర్శన్ పేర్కొన్నారు. గురువారం మండలంలో ఆయన పర్యటించారు. ఉద్యానశాఖ ద్వారా రైతులకు అందించిన డ్రిప్, స్ప్రింక్లర్లను పరిశీలించారు. కార్యక్రమంలో డ్రిప్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. హంద్రీనీవా కాలువకు మళ్లీ గండి సోమందేపల్లి: మండల కేంద్రంలోని హంద్రీనీవా కాలువకు గురువారం మరోసారి గండి పడింది. రెండు నెలల కాలంలో మూడుసార్లు కాలువ తెగిపోవడంపై అధికారులు , స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4 గంటల పాటు కాలువలో నీరు వృథాగా పోయింది. అనంతరం తాత్కాలికంగా గండిని పూడ్చారు. ఎస్ఐ రమేష్బాబు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. యూరియా అమ్మకాలపై కేసు హిందూపురం: నాణ్యత లేని యూరియా అమ్మకాలపై వ్యవసాయ అధికారులు కేసు నమోదు కావడంతో హిందూపురంలోని బృందావన్ ట్రేడర్స్, చిలమత్తూరులోని సాయికృప ట్రేడర్స్, ఐఎఫ్ఎఫ్సీఓ కంపెనీలపై కోర్టు నుంచి సమాన్లు జారీ అయినట్లు తెలిసింది. మూడేళ్ల క్రితం ఐఎఫ్ఎఫ్సీఓ కంపెనీ సరఫరా చేసిన యురియాను హిందూపురంలోని బృందావన్ ట్రేడర్స్ నిర్వహకులు చిలమత్తూరులోని సాయికృప ట్రేడర్స్కు యూరియా సరఫరా చేసినట్లు సమాచారం. అప్పటి మండల వ్యవసాయ అధికారి చిలమత్తూరు సాయికృప ట్రేడర్స్లో తనిఖీలు చేసి యూరియా నమూనా తీసి పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. ఆ యురియా నాణ్యత లేదని తేలడంతో వ్యవసాయాధికారులు వీరిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ముగ్గురు ఈనెల 22వ తేదీ అనంతపురం కోర్టులో హాజరు కావాలని నోటీసులు వచ్చినట్లు తెలిసింది. -
వేర్వేరు ప్రమాదాల్లో అన్నదమ్ముల మృతి
ముదిగుబ్బ: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయారు. దీంతో ముదిగుబ్బ మండలం దొరిగిల్లు క్వార్టర్స్లో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానికుల వివరాల మేరకు.. దొరిగిల్లు సమీపంలో గురువారం ఓ యువకుడి శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొరిగిల్లుకు చెందిన రమణయ్య (46) బుధవారం వ్యవసాయ పనులకు వెళ్లి పనులు ముగిసిన తరువాత స్నానం చేసేందుకు తోట సమీపంలోని గుర్రాల మడుగులోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో తమ్ముడు.. నాలుగు రోజుల క్రితం రమణయ్య సోదరుడు మునికృష్ణ (45) మొలకలచెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఒకే రోజు అన్నదమ్ములిద్దరూ చనిపోవడంతో దొరిగిల్లులో విషాదఛాయలు అలముకున్నాయి. రమణయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే మునికృష్ణ భార్య ఇప్పటికే చనిపోగా కుమారుడు ఉన్నారు. కేసు నమదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివరాముడు తెలిపారు. నీటి మడుగులో ఒకరు.. రోడ్డు ప్రమాదంలో మరొకరు దొరిగిల్లులో విషాదం -
వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
ధర్మవరం: వక్ఫ్ సవరణ చట్టంలో ఎన్నో లోపాలున్నాయి. వెంటనే ఆ చట్టాన్ని రద్దుచేయాలి’ అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలన్న డిమాండ్తో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా సంయుక్త మజీద్ కమిటీలు, ముస్లింలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారంతో ఆరో రోజుకు చేరాయి. ఈ దీక్షల్లో ఇక్బాల్, అజహర్, సైపుల్లా, చాంద్బాషా, షరీఫ్, ఘనీ తదితరులు పాల్గొన్నారు. దీక్షలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మక్బూల్ అహ్మద్ సంఘీభావం తెలిపారు. అంతకు ముందు ర్యాలీగా వచ్చి దీక్షా శిబిరంలో పాల్గొని ప్రసంగించారు. కూటమి నేతల మోసాన్ని గ్రహించాలి.. వక్ఫ్ సవరణ చట్టంలో అనేక లోపాలున్నాయన్నాయని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులకు రిజిస్ట్రర్ పత్రాలు చూపి హక్కులు పొందాలని ఉందని, నాలుగేళ్లు అయిదేళ్లు కిందట తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న రికార్డులే ప్రస్తుతం కనిపించడం లేదని అలాంటిది వందల ఏళ్ల నాటి మజీద్లు, ఆస్తులకు రిజిస్ట్రర్ పత్రాలు తేవడం అసాధ్యమన్నారు. అలాగే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఉండేందుకు కొత్త చట్టం అనుమతిస్తుండటం ఇబ్బందులకు కారణమవుతోందన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయినా ఇంకా మతం , కులం పేర్లతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రూ.8 లక్షల కోట్లకు పైగా ఉన్న వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు సవరణ చట్టం తూట్లు పొడుస్తోందన్నారు. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన సంపూర్ణ మద్దతుతోనే చట్ట సవరణ ఆమోదం జరిగిందన్నారు. రంజాన్కు ముందు వక్ఫ్ సవరణకు తాము మద్దతు తెలపబోమని చెప్పిన సీఎం చంద్రబాబు ఏమొహం పెట్టుకుని మద్దతిచ్చారో చెప్పాలన్నారు. ఇప్పటికై నా ముస్లింలు కూటమి పార్టీల మోసాన్ని గ్రహించాలన్నారు. అవసరాలకు వాడుకోవడంలో చంద్రబాబుకు మించిన మోసగాడు మరొకరు లేరన్నారు. వక్ఫ్ సవరణ చట్టంతో ముస్లింలకు జరిగే అన్యాయాన్ని గ్రహించే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బిల్లుకు మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అలాగే సుప్రీంకోర్టులో చట్ట సవరణ రద్దు కోసం పోరాడుతున్నారన్నారు. ఆమరణ దీక్షకూ వెనుకాడబోం.. వక్ఫ్ సవరణ చట్టంతో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ చట్టాన్ని రద్దు చేసే వరకూ పోరాటం ఉధృతం చేస్తాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు వెనుకాబోం అని వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ కేంద్రాన్ని హెచ్చరించారు. వక్ఫ్ సవరణ విషయంలో ముస్లింలకు అండగా ఉన్న వైఎస్ జగన్కు ముస్లిం సమాజం మొత్తం అండగా ఉంటుందన్నారు. వక్ఫ్ సవరణ విషయంలో కూటమి పార్టీలు మద్దతు తెలపడంతో రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. ఇప్పటికై న బుద్ధి తెచ్చుకుని వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లిం సోదరుల పోరాటానికి కూటమి పార్టీలు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్తో కదిరిలో భారీ ర్యాలీ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకులు షేక్ చాంద్బాషా, జాకీర్హుసేన్, సుభాన్, ఎస్పీ బాషా, అత్తార్ జిలాన్, ఇనాయతుల్లా, సాధిక్ వలి, ఉస్మాన్, నాయకులు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, పెణుజూరు నాగరాజు, సుబ్బారెడ్డి, కత్తెపెద్దన్న, కడప రంగస్వామి, గడ్డం గంగాధర్, చింతా భాస్కర్రెడ్డి, చిగిచెర్ల ప్రభాకర్రెడ్డి, దేవరకొండ రమేష్, చెలిమి రామయ్య, నులక రామయ్య, ఏలకుంట్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కేంద్రం ఆమోదించిన సవరణ చట్టంలో ఎన్నో లోపాలున్నాయి బిల్లు రద్దు చేయాలని ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణం ‘కూటమి’ మద్దతుతోనే బిల్లు ఆమోదం పొందింది చంద్రబాబు, పవన్లను ముస్లింలు ఎన్నటికీ క్షమించరన్న కేతిరెడ్డి, మక్బూల్ ముస్లింల రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం -
వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలి
ప్రశాంతి నిలయం: ప్రభుత్వ పథకాల ప్రగతి సాధనలో వందశాతం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఏపీ సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉచిత ఇసుక సరఫరా, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల ఫిల్లింగ్ యాక్షన్ ప్లాన్, తాగునీటి సరఫరా, సానుకూల ప్రజా అవగాహన, ఎంఎస్ఎంఈ సర్వే , ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19న మూడో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలన్నారు. వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్యల తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపుకోవాలన్నారు. జిల్లా సోలార్ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పశువులకు నీటి తొట్టెల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వి.రత్న, జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అనంతపురం నుంచి బెంగళూరుకు రైలు
● మెమూ రైలును అనంతపురం నుంచి నడపాలని నిర్ణయం ● కొత్తగా ఏడు స్టేషన్లలో స్టాపింగ్కు అనుమతి పుట్టపర్తి టౌన్: ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శ్రీసత్యసాయి జిల్లా ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరు వరకు నడిచే మెము రైలును ఇకపై అనంతపురం వరకు పొడిగించారు. దీంతో పాటు అనంతపురం నుంచే బెంగళూరు బయలుదేరేలా దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్వర్వులు కూడా జారీ చేయడంపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం–బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు నడపాలని ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలు ప్రజాప్రతినిధులను, అధికారులను కోరుతూ వచ్చారు. వారి విజ్ఞప్తిని అధికారులు ఎట్టకేలకు ఆమోదించారు. త్వరలోనే ఈ రైలు అనంతపురం నుంచి బయలుదేరేలా ప్రణాళిక రచించారు. ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరు మధ్య ఇప్పటి వరకు ఉన్న స్టాపింగులతో పాటు అదనంగా ప్రసన్నాయపల్లి, జంగాలపల్లి, చిగిచెర్ల, బాసంపల్లె, కొత్తచెరువు, విదురాశ్వర్థం, సోమేశ్వరలో స్టాపింగ్ సదుపాయం కల్పించారు. సామాన్య ప్రయాణికులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు రైలు ఎంతో సౌకర్యంగా ఉండనుంది. అతి త్వరలోనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి చేతుల మీదుగా అనంతపురం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి రోజూ మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటలకు బెంగళూరుకు చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారు. -
వైభవంగా జ్యోతుల ఉత్సవం
రొళ్ల: రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి ఉత్సవాల్లో భాగంగా గురువారం జ్యోతుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రొళ్ల మండలం హనుమంతనపల్లి, వన్నారనపల్లి, హులీకుంట, దొమ్మరహట్టి, కొత్తపాళ్యం, కొడగార్లగుట్ట, కొత్తపాళ్యంతాండ, రొళ్లకొండ, అలుపనపల్లి, ఏ.వడ్రహట్టి, దాసప్పపాళ్యం, క్యాతప్పపాళ్యం, వన్నప్పపాళ్యం, జీఎన్ పాళ్యం, బాజయ్యపాళ్యం, పి.గొల్లహట్టి, గొట్టుగుర్కి, రంగనపల్లి, వెంకటంపల్లి తదితర గ్రామాల్లో ఉత్సవాన్ని జరుపుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున జ్యోతులతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించారు. -
చాలా ఆనందంగా ఉంది
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన నేను 978 మార్కులు సాధించాను. స్టేట్ టాపర్ల సరసన నిలవడం ఆనందంగా ఉంది. రెండు, మూడేళ్లుగా జూనియర్ కళాశాలల్లో సౌకర్యాలు బాగా మెరుగుపడ్డాయి. అధ్యాపకులు కూడా బాగా బోధిస్తున్నారు. ‘నాడు–నేడు’ పనులతో మా కళాశాల రూపురేఖలు మారాయి. ప్రోత్సహిస్తే ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కూడా సత్తా చాటుతారనేందుకు నేనే ఉదాహరణ. – నీరుగంటి వాణి, హిందూపురం జూనియర్ కళాశాల ఇబ్బందులు లేవు.. అందుకే రాణించా నేను ఇంటర్లో హెచ్ఈసీ చదివాను. ఇటీవల వచ్చిన ఫలితాల్లో 851 మార్కులు సాధించాను. మా కళాశాలలో సౌకర్యాలు చాలా బాగున్నాయి. మాకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో చదువుపై దృష్టి సారించగలిగాను. అందుకే ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు దీటుగా రాణించాను. అధ్యాపకులు, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. ప్రభుత్వ విద్య బలోపేతం చేసేందుకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు. – నీరుగంటి హరిత, కొత్తచెరువు జూనియర్ కళాశాల -
మద్యం మత్తులో గొడవ
● ఇటుకతో బాదడంతో వ్యక్తి మృతి హిందూపురం: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. ఓ వ్యక్తి సహనం కోల్పోయి ఇటుక పెళ్లతో బాదడంతో సుబ్బరాయప్ప(65) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన హిందూపురం మండలం గోళాపురం గుడ్డంపల్లిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గోళాపురం గుడ్డంపల్లి కర్ణాటక సరిహద్దున ఉండటంతో పాటు గ్రామంలో బెల్టుషాపులు నిర్వహిస్తుండడంతో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే బంధువులైన సుబ్బరాయప్ప, నంజేగౌడ మంగళవారం పూటుగా మద్యం సేవించారు. ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో కుటుంబ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. దీంతో పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన నంజేగౌడ ఇటుక పెళ్లతో సుబ్బరాయప్ప తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయమైంది. అతన్ని బంధువులు హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా మారడంతో రాత్రి మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతున్నట్లు హిందూపురం రూరల్ సీఐ ఆంజనేయులు తెలిపారు. ‘కియా’ ఇంజిన్ల దొంగల అరెస్ట్ ● 8 మందిని రిమాండ్కు పంపిన పోలీసులు పెనుకొండ: కియా కార్ల పరిశ్రమలో సుమారు 900 ఇంజిన్లను అపహరించిన దొంగలను పెనుకొండ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి..రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే... కియా కార్ల పరిశ్రమలో 900 ఇంజిన్లు మాయమైనట్లు యాజమాన్యం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఇంజిన్ల మాయం వెనుక ఇంటిదొంగలే ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే గతంలో కియా కార్ల పరిశ్రమలో పని చేసిన పటాన్ సలీం, వినాయక మూర్తి, మణికంఠ, ఆర్ముగం, అర్జున్ తదితర ఎనిమిది మంది ఉద్యోగులను తమిళనాడులో అరెస్టు చేశారు. నిందితులను బుధవారం రాత్రి పెనుకొండ జడ్జి ఎదుట హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. అనంతరం న్యాయమూర్తి అనుమతితో పోలీసులు నిందితులను కస్టడీకి తీసుకుని విచారణ చేయనున్నారు. నిందితులు దొంగలించిన కియా కార్ల ఇంజిన్లను పడవలు, చెరుకు రసం మిషన్ల కోసం విక్రయించినట్లు తెలిసింది. పోలీసు కస్టడీ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. పండ్లను కృత్రిమంగా మాగబెడితే చర్యలు ● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ హెచ్చరిక ప్రశాంతి నిలయం: ఇంకా పక్వానికి రాని పండ్లను కృత్రిమ రసాయనాలు వినియోగించి మాగబెట్టి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో ‘ఆహార సంరక్షణ, ప్రమాణాల చట్టం–2006’ అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. మామిడి, అరటి, బొప్పాయి, దానిమ్మ పండ్లను క్యాల్షియం కార్బైడ్తోపాటు ఇతర హానికర రసాయనాలతో కృత్రిమంగా మాగబెట్టి విక్రయించడం వల్ల వాటిని తినే వారు రోగాల బారిన పడుతున్నారన్నారు. చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. అందువల్ల ఎవరూ పండ్లను కృత్రిమంగా మాగబెట్టకూడదన్నారు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రూ.లక్ష వరకూ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఎవరైనా పండ్లను రసాయనాలతో మాగబెడుతుంటే 9441463315 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సమావేశంలో ఫుడ్ సేఫ్టీ అధికారి రామచంద్ర, తస్లీమ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ను ఎదుర్కోలేకే కూటమి కుట్రలు
సోమందేపల్లి: వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణచూసి ఓర్వలేక, ఆయన్ను ఎదుర్కొనే ధైర్యం లేక కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. బుధవారం ఆమె సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి ఈనెల 8న వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తే పోలీసులు భద్రత కల్పించలేకపోయారన్నారు. ప్రజాభిమానం మెండుగా ఉన్న నాయకుడు కాబట్టే అభిమానులు భారీగా తరలివచ్చారన్నారు. హెలిప్యాడ్ వద్ద పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే అభిమానులు చుట్టుముట్టారని, ఈ క్రమంలోనే హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినిందన్నారు. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం.. ఆ నెపాన్ని ఇతరులపై తోసివేసేందుకు సిద్ధమైందన్నారు. ఈ క్రమంలోనే విచారణ పేరుతో పైలెట్లను రప్పించిందన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో పర్యటించకుండా కట్టడి చేసేందుకు ప్రైవేట్ ఛాపర్ యజమానులను బెదిరిస్తోందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా... జన సునామీని ఆపలేరన్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడని చెప్పుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతిలో గోమాతల మృతిపై ఎందుకు స్పందించలేదన్నారు. వైఎస్ జగన్మోహన్న్రెడ్డిపై టీడీపీ శ్రేణులు అసభ్యకరంగా మాట్లాడితే వారిని వదిలి... ప్రశ్నించిన వారిపై కక్షగట్టి అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. హిందూపురం నియోజకవర్గ నాయకుడు వేణురెడ్డితో పాటు మరికొందరు వైఎస్సార్ సీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్కు తరలించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గజేంద్ర, జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, సర్పంచ్ అంజినాయక్, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు మంజు, సింగిల్ విండో చైర్మన్లు ఆదినారాయణరెడ్డి, సూర్యప్రకాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
వేరుశనగకు రూ.38 వేలు
అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది వేరుశనగ ఎకరాకు రూ.38 వేల ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆదేశాలు వచ్చాయి. ఖరీఫ్, రబీలో పంటల వారీగా రైతులకు ఎంత మొత్తంలో రుణాలు ఇవ్వాలనే దానిపై గరిష్ట రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ఖరారైనట్లు బ్యాంకర్లు తెలిపారు. గతేడాది కన్నా పంట పెట్టుబడులను బట్టి 10 నుంచి 20 శాతం పెంచారు. జిల్లాలోని బ్యాంకుల్లో రైతులకు సంబంధించి ఖరీఫ్ పంట రుణాల రెన్యూవల్స్, కొత్త రుణాల పంపిణీ ప్రారంభమైనట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్కు అదనంగా 15 శాతం అధికంగా ఇచ్చే వెసులుబాటు కల్పించినట్లు సమాచారం. పంటల వారీగా ఇలా: వర్షాధారంగా సాగు చేసే వేరుశనగ ఎకరాకు రూ.38 వేలు, నీటి వసతి కింద అయితే రూ.41 వేలు ప్రకారం పంట రుణం ఇవ్వనున్నారు. కంది పంట వర్షాధారంగా ఎకరాకు రూ.29 వేలు, నీటి వసతి కింద రూ.30 వేలు, ఆముదం రూ.22 వేలు, పప్పుశనగ రూ.37 వేలు, పత్తి రూ.51 వేల నుంచి రూ.55 వేలు, విత్తనోత్పత్తి పత్తి రూ.1.60 లక్షలు, వరి రూ.52 వేలు, విత్తన వరి రూ.55 వేలు, జొన్న రూ.25 వేలు, రాగి రూ.22 వేల నుంచి రూ.25 వేలు, సజ్జ రూ.21 వేల నుంచి రూ.24 వేలు, కొర్ర రూ.17 వేల నుంచి రూ.21 వేలు, వర్షాధారంగా మొక్కజొన్న రూ.31 వేలు, నీటి వసతి కింద రూ.47 వేలు, విత్తన మొక్కజొన్నకు రూ.50 వేలుగా నిర్ణయించారు. ఉద్యాన, కూరగాయల పంటలకు.. పచ్చిమిరపకు రూ.1.10 లక్షలు, ఎండుమిరప రూ.1.75 లక్షలు, టమాట ట్రెల్లీస్ లేకుండా రూ.41 వేలు, ట్రెల్లీస్ టమాట రూ.65 వేలు, హైబ్రీడ్ టమాట రూ.78 వేలు, ట్రెల్లీస్ హైబ్రీడ్ టమాట రూ.1.25 లక్షలు, వంకాయ రూ.54 వేలు, హైబ్రీడ్ వంకాయ రూ.67 వేలు, బెండ రూ.36 వేలు, హైబ్రీడ్ బెండ రూ.50 వేలు, ఉల్లి రూ.60 వేలు, మునగ రూ.49 వేలు, వర్షాధారంగా బేబీకార్న్కు రూ.28 వేలు, నీటి వసతి కింద రూ.44 వేలు, కరివేపాకు రూ.60 వేలు, ధనియాలు రూ.24 వేలు, సోయాబీన్స్ రూ.17 వేలు, అరటి ఎకరా రూ.1.10 లక్షలు, టిష్యూ కల్చర్ అరటి రూ.1.36 లక్షలు, దానిమ్మ రూ.1.60 లక్షలు, చీనీ రూ.71 వేలు, నిమ్మ రూ.85 వేలు, బొప్పాయి రూ.1.20 లక్షలు, మామిడి రూ.55 వేలు, సపోట రూ.43 వేలు, ద్రాక్ష రూ.1.25 లక్షలు, రేగు రూ.34 వేలు, కళింగర రూ.54 వేలు, దోస రూ.66 వేలు, జామ రూ.55 వేలు, అంజూర రూ.42 వేలు, సీతాఫలం రూ.27 వేలు, డ్రాగన్ఫ్రూట్ రూ.77 వేలు, చింత రూ.27 వేలు, కొబ్బరి రూ.70 వేలు, మల్లెపూల తోటల సాగుకు రూ. లక్ష, రోజాపూలు రూ.43 వేల నుంచి రూ.66 వేలు, బంతిపూలు రూ.55 వేలు, చామంతి రూ.60 వేలు, కనకాంబరాలు రూ.39 వేలు, గడ్డి సాగు రూ.36 వేలు, మల్బరీ సాగుకు రూ.1.20 లక్షల మేర స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేశారు. 10 నుంచి 20 శాతం పెరిగిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ప్రారంభమైన పంట రుణాల రెన్యూవల్స్ -
● చౌడేశ్వరీ నమోస్తుతే
అమడగూరు: చల్లని తల్లి చౌడేశ్వరమ్మ జ్యోతుల వెలుగుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అమడగూరులో వెలసిన చౌడేశ్వరీదేవి వార్షిక ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ ధర్మకర్త, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పొట్టా పురుషోత్తమరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జ్యోతి ఉత్సవంలో అమ్మవారిని దర్శించుకుంటే అంతా శుభమే జరుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలనుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, అమ్మవారిని మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించారు. జ్యోతిదర్శనంతో పులకించిన భక్తజనం ఉత్సవంలో భాగంగా తొలుత అమ్మవారి విగ్రహాన్ని పూలపల్లకీపై కొలువుదీర్చి ఆలయం నుంచి గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి వరకూ ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి పల్లకీ ముందు జ్యోతిని రగిలించారు. జ్యోతిముందు వెళ్తుండగా...ఆ వెలుగుల్లో అమ్మవారు భక్తులను దర్శనమిచ్చారు. ఈ క్రమంలో జ్యోతిని చూడటానికి భక్తులు ఎగబడ్డారు. డప్పు, మంగళ వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్ల మధ్య యువకులు చిందులేస్తూ ఆడి, పాడారు. భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన కోలాటలు, భజనలు, హరికథలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చీకిరేవులపల్లి యూత్ సభ్యులు భక్తులకు అన్నదానం చేశారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గురువారం అశ్వవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. కనుల పండువగా జ్యోతుల ఉత్సవం వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు -
పరిశ్రమల స్థాపనతోనే ఆర్థిక ప్రగతి
ప్రశాంతి నిలయం: పరిశ్రమల స్థాపనతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని, అందువల్ల ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తగిన సహకారం అందించి పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పారిశ్రామిక ప్రగతిపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఉందన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక పాలసీకి అనుగుణంగా జిల్లా అర్థిక అభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమల స్థాపన కోసం అందిన దరఖాస్తుల్లో పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలన్నారు. కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలని పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తిని ఆదేశించారు. అనంతరం జిల్లాలో సీఎస్ఆర్ కార్యకలాపాలను సమీక్షించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, ఏసీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ సహాని, డీపీఓ సమత, ఎల్డీఎం రమణకుమార్, పరిశ్రమల శాఖ అధికారి కె.కృష్ణమూర్తి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి హేమంత్రెడ్డి, సీపీఓ విజయ్కుమార్, నాబార్డ్ అధికారి అనురాధ, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘మన మిత్ర’పై అవగాహన కల్పించాలి వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్పోస్టర్లను కలెక్టర్కు బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో విడుదల చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ‘మన మిత్ర’ పేరిట వాట్సాప్ గవర్నెన్స్ను అమల్లోకి తెచ్చిందన్నారు. దీని ద్వారా ప్రస్తుతం 210 సేవలు అందిస్తోందన్నారు. రానున్న రోజుల్లో 350 సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ సేవలు ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం ఏప్రిల్ 15 నుంచి ‘ప్రతి ఇంటికి మన మిత్ర’ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రతి పౌరుడి ఫోన్లో 9552300009 నంబర్ సేవ్ చేయించాలన్నారు. పౌరులకు కావాల్సిన ధ్రువపత్రాలు కూడా వాట్సాప్ ద్వారా పొందే అవకాశం ఉందన్నారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేయాలి అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం -
వృద్ధుడి అదృశ్యం
రాప్తాడురూరల్: వాకింగ్ కోసం వెళ్లిన ఓ వృద్ధుడు అదృశ్యమైన ఘటన అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాపంపేట శివారులోని ఓవీఆర్ కాలనీకి చెందిన నల్లపరెడ్డి మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వాకింగ్ కోసమని బయటకు వెళ్లాడు. తిరిగి రాలేదు. రాత్రయినా ఇంటికి రాకపోయే సరికి కంగారుపడిన కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికారు. అయినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో బుధవారం కుమారుడు హరినాథరెడ్డి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ
ధర్మవరం రూరల్: మండలంలోని రేగాటిపల్లి పొలాల్లో గత నెల 16న దారుణ హత్యకు గురైన చిట్రా అక్కమ్మ (57) కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. వివరాలను బుధవారం స్థానిక పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మవరం రూరల్ పీఎస్ సీఐ ఎన్.ప్రభాకర్ వెల్లడించారు. రావులచెరువు గ్రామానికి చెందిన చిట్రా అక్కమ్మకు 30 సంవత్సరాల క్రితం మేడాపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. దాదాపు 27 ఏళ్ల క్రితం అక్కమ్మ తన భర్త, పిల్లలను వదిలేసి ధర్మవరంలోని తిక్కస్వామి నగర్లో అద్దె ఇంటికి మకాం మార్చింది. ఈ క్రమంలో బతుకు తెరువు కోసం కళాజ్వోతి సర్కిల్లో వ్యభిచారం సాగిస్తుండేది. గత నెల 16న సాయంత్రం కళాజ్వోతి సర్కిల్లో విటుల కోసం వేచి ఉన్న ఆమెను స్థానిక శాంతినగర్కు చెందిన ఆటో డ్రైవర్ కట్టుబడి షెక్షావలి, టీచర్స్ కాలనీలోని చౌడమ్మ గుడి వద్ద నివాసముంటున్న తలారి లోకేంద్ర ఆటోలో ఎక్కించుకుని రేగాటిపల్లి పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ అక్కమ్మతో లోకేంద్ర లైంగిక కోరిక తీర్చుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో షెక్షావలి సాయంతో అక్కమ్మ తలపై లోకేంద్ర రాయితో కొట్టి గాయపరిచాడు. అనంతరం తన వద్ద ఉన్న కత్తితో ఆమె గొంతు కోసి హతమార్చాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు కత్తితో ముఖంపై ఉన్న చర్మాన్ని తొలగించి అక్కడ నుంచి ఉడాయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డీఎస్పీ హేమంత్కుమార్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టి పక్కా ఆధారాలతో నిందితులను గుర్తించారు. బుధవారం ఉదయం సీతారంపల్లి వద్ద జాతీయ రహదారిపై తచ్చాడుతున్న షెక్షావలి, లోకేంద్రను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. కాగా, నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన సీఐ ఎన్.ప్రభాకర్, ఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు బాబ్జాన్, రాజప్ప, షాకీర్, అనిల్కుమార్, రాఘవేంద్ర, బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ చత్రూనాయక్, రామాంజినేయులను ఎస్పీ రత్న, డీఎస్పీ హేమంత్కుమార్ అభినందించారు. -
నేర పరిశోధనలో జిల్లాకు రెండో స్థానం
పుట్టపర్తి టౌన్: నేరాల పరిశోధనలో సాధించిన పురోగతికి సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రకటిస్తున్న ఏబీసీడీ ర్యాంకింగ్లో జిల్లాకు రెండో స్థానం దక్కింది. బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో డీజీపీ హరీష్కుమార్ గుప్త, సీఐడీ అడిషనల్ డీజీపీ రవిశంకర్, లాఅండ్ ఆర్డర్ ఐజీ మధుసూదన్రెడ్డి చేతుల మీదుగా ఎస్పీ రత్నతో పాటు సిబ్బంది సన్మానం అందుకున్నారు. మడకశిర తాలూకా దిన్నేహట్టి గ్రామంలో 1998, అక్టోబర్ 2న తిప్పేస్వామి తన బార్యపై ఉన్న అనుమానంతో అరునెలల బాబు (శివలింగమయ్య)ను గొంతు నులిమి హత మార్చిన విషయం తెలిసిందే. బాబు తల్లి ఫిర్యాదు మేరకు గుడిబండ పోలీసులు కేసు నమోదు చేసినా నిందితుడి ఆచూకీని గుర్తించలేకపోయారు. ఎస్పీ రత్న బాధ్యతలు తీసుకున్న తర్వాత డీజీపీ ఆదేశాల మేరకు పాత కేసుల దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది నవంబర్లో బాలుడి హత్యపై పల్లె నిద్ర కార్యక్రమంతో ఆరా తీయడంతో కొంత సమాచారం దొరికింది. దీని ఆధారంగా పెళ్లి పత్రిక ఽఆధారంగా కేసును ఛేదించి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. 26 ఏళ్ల తర్వాత నిందితుడిని గుర్తించిన ఎస్పీ బృందానికి ఏబీసీడీ ర్యాంకింగ్లో రెండో స్థానం దక్కింది. అవార్డు అందుకున్న వారిలో ఎస్పీ రత్నతో పాటు పెనుకొండ సబ్ డివిజన్, మడకశిర సర్కిల్ పోలీసులు ఉన్నారు. ఎస్పీ రత్నకు అవార్డు అందజేసిన డీజీపీ -
కొడిగెనహళ్లిలో భారీ చోరీ
● ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించిన దుండగులు ● 30 తులాల బంగారం అపహరణ పరిగి: మండలంలోని కొడిగెనహళ్లిలో భారీ చోరీ జరిగింది. వివరాలు.. కొడిగెనహళ్లి విద్యానగర్లో నివాసముంటున్న శంకరప్ప గత శనివారం ఇంటికి తాళం వేసి తన కుటుంబసభ్యులతో కలసి కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లాడు. తాళం వేసిన ఇంటిని గమనించిన దుండగులు మంగళవారం అర్దరాత్రి దాటిన తర్వాత ఇంట్లోకి చొరబడ్డారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. బుధవారం ఉదయం ఇంటికి చేరుకున్న శంకరప్ప.. తలుపులు తీసి ఉండడం గమనించి నివ్వెరపోయాడు. వాకిళ్లను ధ్వంసం చేసి, లోపల ఉన్న బీరువాల్లోని 30 తులాల బంగారంతో పాటు రూ.40 వేల నగదును అపహరించుకెళ్లినట్లుగా గుర్తించి, సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ నర్సింగప్ప, ఎస్ఐ రంగడు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. శంకరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏరియా ఆస్పత్రి వైద్యుల అవినీతిపై విచారణ కదిరి అర్బన్: స్థానిక ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఇద్దరు గైనకాలజిస్టుల అవినీతిపై బుధవారం ప్రత్యేక వైద్యాధికారుల బృందం విచారణ చేపట్టింది. బృందంలో కర్నూలుకు చెందిన డాక్టర్ మాధవీలత, విజయవాడ డీసీహెచ్ వెంకట్రామయ్య, నంద్యాల ఏఓ శైలాజాదేవి ఉన్నారు. ఫిర్యాదుదారుడిని పిలిపించి గత నెల 7న వారికి జరిగిన అన్యాయంపై రాతపూర్వక విశ్లేషణను తీసుకున్నారు. అలాగే బాధితునితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు డాక్టర్లను వేర్వేరుగా విచారించారు. విచారణ నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. కాగా, గైనకాలజిస్టుల అవినీతిపై విచారణ జరుగుతున్న సమయంలోనే స్థానిక సీపీఎం నేతలు అక్కడకు చేరుకుని ఆస్పత్రిలో స్కానింగ్ యంత్రాలున్నా.. కమీషన్ల కోసం ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు రెఫర్ చేస్తున్న గైనకాలజిస్టులపై చర్యలు తీసుకోవాలంటూ విచారణ బృందానికి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సీపీఎం పట్టణాధ్యక్షుడు జీఎం నరసింహులు, నాయకులు ముస్తాక్, రామ్మెహన్ ఉన్నారు. -
అంతర జిల్లా చైన్స్నాచర్ల అరెస్ట్
అనంతపురం: ఒంటరిగా వెళ్లే మహిళల్ని టార్గెట్ చేసి వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కొని ఉడాయించే అంతర జిల్లా చైన్స్నాచర్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి మొత్తం రూ.32.40 లక్షల విలువ చేసే 36 తులాల బంగారం, నగదు, మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో అనంతపురం శివారులోని రాజీవ్ కాలనీకి చెందిన కె.పంపాచారి అలియాస్ నరేష్, రాయల్ నగర్కు చెందిన షేక్ షాకీర్, ప్రియాంకనగర్ నివాసి షేక్ ఫజిల్ అహమ్మద్ అలియాస్ షేక్ ఫజిజ్ అహమ్మద్, శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ నివాసి కంబం నాగార్జున అలియాస్ చిన్నా ఉన్నారు. బుధవారం డీపీఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ వెల్లడించారు. అందరూ 24 నుంచి 30 ఏళ్ల లోపు వారే పట్టుబడిన నిందితులందరూ 24 నుంచి 30 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. కె.పంపాచారి కార్పెంట్ వృత్తితో పాటు డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పేకాట, క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి సంపాదన మొత్తం వ్యసనాలకే ఖర్చు పెట్టేవాడు. ఇతనికి నాలుగు నెలల క్రితం కంబం నాగార్జున పరిచయమయ్యాడు. నాగార్జున సొంతూరు శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ కాగా, ఏడాదిన్నర క్రితం కుటుంబంతో సహా అనంతపురానికి వలస వచ్చి సుఖ్దేవ్నగర్లో నివాసముంటున్నాడు. డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పంపాచారి పరిచయమైన తర్వాత ఇద్దరూ కలసి పేకాట, ఆన్లైన్ జూదం ఆడుతూ సంపాదన మొత్తం పోగొట్టుకుని అప్పుల పాలయ్యారు. రాయల్ నగర్కు చెందిన షేక్ షాకీర్... కార్పెంటర్గా పనిచేసేవాడు. ఈ క్రమంలో సొంతంగా ఓ ఫర్నీచర్ షాప్ ఏర్పాటు చేసుకుని అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కోసం అన్వేషిస్తుండగా పంపాచారి, నాగార్జున పరిచయమయ్యారు. ముగ్గురు కలసి వ్యక్తిగత అవసరాలకు, అప్పులు తీర్చేందుకు చైన్స్నాచింగ్లకు సిద్ధమయ్యారు. అనంతరం వీరందరూ కలసి బృందాలుగా విడిపోయి చైన్స్నాచింగ్కు పాల్పడేవారు. ప్రైవేట్ వాహన డ్రైవర్గా పనిచేస్తున్న షేక్ ఫజిల్ అహమ్మద్ సైతం ఆన్లైన్ బెట్టింగ్, పేకాట తదితర వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో పాటు ఇటీవల పెళ్లి సంబంధం కూడా ఖాయమైంది. పెళ్లి ఖర్చులకు డబ్బు లేకపోవడంతో చైన్స్నాచర్గా మారాడు. ఒంటిరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా..పంపాచారి ద్విచక్ర వాహనంపై ఒక్కడే వెళుతూ శివారు కాలనీలు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలోని బంగారు నగలను లాక్కొని అదే టూవీలర్పై ఉడాయించేవాడు. 2023 నుంచి కురుగుంట, మన్నీల, రాప్తాడు, అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డు, గణేష్ నగర్, లలితానగర్, ఒకటో రోడ్డు, తదితర ప్రాంతాల్లో 10 చైన్ స్నాచింగ్లు చేశాడు. అనంతరం షేక్ షాకీర్తో కలసి బైక్పై వెళుతూ కళ్యాణదుర్గం రోడ్డు, ద్వారకా విల్లాస్లో రెండు స్నాచింగ్లు, కంబం నాగార్జునతో కలసి హెచ్చెల్సీ రోడ్డు, స్టాలిన్ నగర్, బుక్కరాయసముద్రం, బి.కొత్తపల్లి గ్రామాల్లో నాలుగు స్నాచింగ్లు చేశాడు. మొత్తం 16 కేసుల్లో పంపాచారి నిందితుడు. ఇందులో రెండు కేసుల్లో షేక్ షాకీర్, నాలుగు కేసుల్లో కంబం నాగార్జున నిందితులుగా ఉన్నారు. షేక్ ఫజిల్ అహమ్మద్ ఎవరూ గుర్తుపట్టకుండా తలకు ఎరుపు రంగు క్యాప్ పెట్టుకుని, ముఖానికి ఖర్చీఫ్ కట్టుకుని చైన్స్నాచింగ్లకు పాల్పడేవాడు. అనంతపురంలోని శ్రీశ్రీ నగర్, హెచ్చెల్సీపై ఒంటరిగా వెళ్తున్న సచివాలయ మహిళా ఉద్యోగిని వెంబడించి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ అపహరణ, ఇతర మూడు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. నిందితులు నలుగురూ పోలీసులకు వేర్వేరుగా పట్టుబడ్డారు. చైన్స్నాచర్ల అరెస్ట్లో చొరవ చూపిన అనంతపురం రూరల్ సీఐ ఎన్.శేఖర్, నాల్గో పట్టణ సీఐ కె.సాయినాథ్, సీసీఎస్ సీఐలు ఇస్మాయిల్, జయపాల్రెడ్డి, ఎస్బీ ఎస్ఐ రాజశేఖర్రెడ్డి, రూరల్ ఎస్ఐ కె.రాంబాబును ఎస్పీ జగదీష్ అభినందించారు. రూ.32.40 లక్షల విలువ చేసే 36 తులాల బంగారం, నగదు, మూడు బైక్ల స్వాధీనం వ్యసనాలతో అప్పులపాలై చైన్స్నాచర్లుగా మారిన యువకులు -
ప్రజారోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు
● పరిగి, ఊటుకూరు పీహెచ్సీలను తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ ● కొడిగెనహళ్లి ఏపీఆర్ఎస్లో భోజన గది పరిశీలన పరిగి: ప్రజారోగ్యంపై అశ్రద్ధ వహించకుండా సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని వైద్య, ఆరోగ్యాధికారి డాక్టర్ ఫైరోజ్ బేగం ఆదేశించారు. బుధవారం పరిగి మండలంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. తొలుత స్థానిక పీహెచ్సీని పరిశీలించారు. పలు రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఎండాకాలంలో వడదెబ్బ బారిన పడిన వారికి అందిస్తున్న చికిత్సలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సకాలంలో ఆస్పత్రిలో రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం ఊటుకూరులో నూతనంగా ఏర్పాటైన పీహెచ్సీని తనిఖీ చేశారు. అలాగే కొడిగెనహళ్లిలోని ఏపీఆర్ఎస్ పాఠశాలను తనిఖీ చేశారు. మద్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు శుచి, శుభ్రతతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందించడంతో పాటు పాఠశాల పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. దోమకాటు జబ్బుల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ స్వరూపరెడ్డి, నవీన, సురేష్, రూబీ, సీహెచ్ఓ వన్నప్ప, పీహెచ్ఎన్ వెంకమ్మ, వైద్యారోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు కదిరి టౌన్: స్థలం పేరుతో మహిళను వంచనకు గురి చేసిన కేసులో ఓ ఉపాధ్యాయుడితో పాటు ఆయన కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సీఐ నారాయణరెడ్డి బుధవారం వెల్లడించారు. స్థానిక అడపాలవీధిలో నివాసముంటూ టైలరింగ్తో జీవనం సాగిస్తున్న షేక్ భానుకు అదే వీధికి చెందిన ఉపాధ్యాయుడు మేకల ఓబులేసు, ఆయన కుమారుడు కరేజ్కుమార్.. స్థలం ఇస్తామంటూ ఆశ చూసి రూ.13 లక్షలు తీసుకున్నారు. అయితే స్థలం ఇవ్వకపోవడంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె కోరింది. ఆ సమయంలో ఇద్దరూ బెదిరింపులకు పాల్పడుతూ దౌర్జన్యం చేశారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఓబులేసు, ఆయన కుమారుడు కరేజ్కుమార్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాఠశాలలో ఆకతాయిల విధ్వంసం ఉరవకొండ: స్థానిక 8వ వార్డు పాతపేటలోని మండల పరిషత్ ప్రాథమిక సెంట్రల్ పాఠశాలలో ఆకతాయిలు, తాగుబోతులు మంగళవారం రాత్రి విధ్వంసానికి పాల్పడ్డారు. తొలుత పాఠశాల గ్రౌండ్ ప్లోర్లోని వరండా ఇనుప గ్రిల్ తలుపును విరగొట్టి లోపలికి ప్రవేశించారు. తరగతి గదిలోని రెండు సీలింగ్ ఫ్యాన్లు తొలగించి పక్కన పడేశారు. అనంతరం విద్యుత్ స్విచ్ బోర్డుతో పాటు నీటి మోటార్కు చెందిన స్టార్టర్ బోర్డును పగులగొట్టారు. ప్లోరింగ్ టైల్స్ బండరాళ్లతో ధ్వంసం చేశారు. తరగతి గదిలోనే మద్యం తాగి అక్కడే సీసాలు పగులగొట్టి, మూత్ర విసర్జన చేశారు. బుధవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు అక్కడి విధ్వంసాన్ని గుర్తించి ఎంఈఓ ఈశ్వరప్ప దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో ఎంఈఓ పరిశీలించిన అనంతరం హెచ్ఎం నసీరాబేగంతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
● అనంతపురం నగరానికి చెందిన రంగనాథ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వయసు 32 ఏళ్లు. మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఎందుకో అనుమానమొచ్చి ఇటీవల ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా షుగర్ ఉన్నట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా అతను ఖిన్నుడయ్యాడు.
● నగరానికి చెందిన మటన్ వ్యాపారి గౌస్మొహిద్దీన్కు 37 ఏళ్లు కూడా లేవు. ఇద్దరు పిల్లలున్నారు. సరైన వ్యాయామం లేక ఒత్తిడికి గురై బీపీ, షుగర్ రెండూ వచ్చాయి. ఇటీవల సరిగా నిద్రపట్టడం లేదని బాధితుడు వాపోతున్నాడు. వీరే కాదు.. ఉమ్మడి జిల్లాలో మధుమేహం, రక్తపోటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంత పురం జిల్లాలో మధుమేహ జబ్బు చాపకింద నీరులా విస్తరిస్తోంది. జనాభా పెరుగుదల రేటుతో పోల్చి చూస్తే డయాబెటిక్ బారిన పడుతున్న వారే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. యువకులు సైతం జీవనన శైలి జబ్బుల బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో 40 ఏళ్లు నిండిన వారిలో ఎక్కువగా ఆయా జబ్బుల బారిన పడేవారు. కానీ, ఇటీవల 30 ఏళ్లు దాటని వారూ వీటి కోరల్లో చిక్కుతున్నారు. ఈ విషయం వైద్యులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. గ్రామీణులూ బాధితులే.. మధుమేహం, రక్తపోటు తదితర జబ్బులతో బాధపడే వారు ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువగా ఉండేవారు. పని ఒత్తిడితో సతమతమవడం కారణంగా వీటి బారిన పడేవారు. కానీ, ఇప్పుడు ఆయా రోగాలు పల్లెలకూ విస్తరించడం గమనార్హం. ఈ క్రమంలోనే డయాబెటిక్, బీపీ మందుల ధరలు పెరగడం సామాన్యులకు కొరకరాని కొయ్యగా మారింది. అవగాహన లేకే.. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) బాధితులు 27 శాతం పైగానే ఉన్నట్టు తేలింది. పట్టణాల్లో అయితే ఇది 30 నుంచి 32 శాతం కూడా ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. ఇక.. షుగర్, హైపర్టెన్షన్ జబ్బులు నియంత్రణలో లేనివారు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో శరీరంలో ఇతర అవయవాలపై ప్రభావం పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జబ్బుల నియంత్రణపై అవగాహన లేకపోవడం అనర్థాలకు దారి తీస్తోంది. సమస్యలెన్నో.. షుగర్ నియంత్రణలో లేకుంటే కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. కంటిచూపుపై దుష్ప్రభావం పడుతుంది. శరీరంలో గాయాలైనప్పుడు మానడం చాలా కష్టం. మధుమేహం అదుపులో లేకపోతే గుండె జబ్బులొచ్చే అవకాశాలు ఎక్కువ. అధిక రక్తపోటు వల్ల బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. నరాల వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. అలవాట్లు మార్చు కోవాలి ఉమ్మడి అనంతలో చాపకింద నీరులా విస్తరిస్తున్న షుగర్ వ్యాధి 22 శాతానికి పైగా బాధితులు వందలో 28 మందికి రక్తపోటు అవగాహన లేక గ్రామీణులూ బాధితులవుతున్న వైనం మధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లేని ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు. పొగ తాగడం చాలా ప్రమాదకరం. –డా.సుధాకర్రెడ్డి, గుండె వైద్య నిపుణులు -
సాయి సహస్రనామ హారం ప్రారంభం
ప్రశాంతి నిలయం: సత్యసాయి శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రశాంతి నిలయంలో ‘సాయి సహస్రనామ హారం–ప్రేమామృత సారం’ కార్యక్రమం ప్రారంభమైంది. సహస్ర నామ హారంలో భాగంగా 1,008 సత్యసాయి నామాలతో భక్తిగీతాలను ఆలపించనున్నారు. వారం రోజుల పాటు సాగే కార్యక్రమంలో 21 భజన బృందాలు, 900 మంది సంగీత కారులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి ప్రారంభించారు. అనంతరం భక్తులు సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలను ఆలపించారు. -
● చంద్రప్రభపై చౌడేశ్వరీదేవి
అమడగూరు: చౌడేశ్వరీ దేవి వార్షిక ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజు మంగళవారం అమ్మవారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అమడగూరుకు చెందిన బ్రాహ్మణ, శెట్టి బలిజ సంఘం సభ్యులు చంద్రప్రభ ఉత్సవాన్ని వైభవంగా జరిపించారు. అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విశేష అలంకరణలో చంద్రప్రభపై కొలువుదీరిన అమ్మవారిని గ్రామమంతా ఊరేగించి గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి ఎదుట కొలువుదీర్చారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించి భజన చేశారు. కాగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళాకారుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలు.. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో అమ్మవారికి బోనాలు సమర్పించారు. చీకిరేవులపల్లి, గంగిరెడ్డిపల్లి, రెడ్డివారిపల్లి, బలకవారిపల్లి, అమడగూరు గ్రామాల్లో మహిళలు బోనాలు తీసుకువెళ్లి చౌడేశ్వరీ అమ్మవారికి సమర్పించి పూజలు చేశారు. ఆయా గ్రామాల్లో పెద్దత్తున జంతుబలులను అర్పించారు. బంధుమిత్రులతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకుంది. ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీజ్యోతి ఉత్సవం నిర్వహించనున్నారు. -
అక్రమ కేసులతో భయపెట్టలేరు
● వేణురెడ్డిపై పోలీసులది ముమ్మాటికీ కక్ష సాధింపే ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పెనుకొండ రూరల్: అక్రమ కేసులు బనాయించినంత మాత్రాన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టలేరని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. పోలీసులు ఎంతగా వేధించినా వెనక్కుతగ్గేది లేదని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామన్నారు. మంగళవారం ఆమె పెనుకొండలో విలేకరులతో మాట్లాడారు. హిందూపురం పోలీసులు ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తల చేతులకు బేడీలు వేసి ఉగ్రవాదుల్లా రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లడం దుర్మార్గమన్నారు. దీనిపై ప్రశ్నించినందుకే గుడ్డంపల్లి వేణురెడ్డిపై పోలీసులు కక్షగట్టారన్నారు. శాంతియుత నిరసన తెలియజేసే హక్కునూ కాలరాస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని కూటమి పార్టీల నేతలతో పాటు పోలీసులూ గమనించాలన్నారు. చట్ట ప్రకారం నడుచుకోకపోతే భవిష్యత్లో తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అక్రమ అరెస్ట్లతో వైఎస్సార్ సీపీ శ్రేణుల గొంతు నొక్కలేరని గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాకు వర్షసూచన బుక్కరాయసముద్రం: ఉమ్మడి జిల్లాలో రానున్న 5 రోజుల్లో చిరు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్బాబు, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పగటి ఉష్ణోగ్రతలు 40.2 నుంచి 41.3 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు. -
పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
పరిగి: పోలీసులు రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైఎస్సార్ సీపీ హిందూపురం నియోజకవర్గ నాయకుడు వేణురెడ్డి కోరారు. అధికార కూటమి ప్రభుత్వం ట్రాప్లో పడొద్దన్నారు. మంగళవారం ఆయన పరిగి పోలీసు స్టేషన్ ఎదుట విలేకరులతో మాట్లాడారు. పోలీసులు తమ పార్టీకి చెందిన దళిత నాయకుడు, వాల్మీకి వర్గానికి చెందిన మరో నాయకుడిని తీవ్రవాదుల్లా చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ మంగళవారం శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చామన్నారు. అయితే పోలీసులు ఉదయమే తనతో పాటు మరో ముగ్గురు నేతలను అరెస్టు చేశారన్నారు. పోలీస్ వ్యవస్థపై తమకు గౌరవముందన్నారు. అందుకే వారికి ఎప్పుడూ సహకరిస్తామన్నారు. పోలీసులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అందరినీ సమానంగా చూడాలన్నారు. ఎవరో చెప్పారని అక్రమ కేసులు బనాయించకుండా నిజానిజాల కోసం విచారణ జరపాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల్లో అభద్రతా భావం
కదిరి అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల్లో అభద్రతాభావం నానాటికీ పెరిగిపోతోంది. 2019లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 1–2019 సర్క్యులర్ జారీ చేసి ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రతకు భరోసా కల్పించింది. అంతేకాక ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తూ కార్మికులను ఉద్యోగులుగా పరిగణించింది. దీంతో ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం పెరిగి నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఫలితంగా సంస్థ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను అటకెక్కించింది. దీంతో తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోతోందని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. ఈ క్రమంలో తరచూ ఏదో ఒక డిపో పరిధిలో కార్మికులు నిరసన బావుటా ఎగురవేస్తూనే ఉన్నారు. దశలవారీ ఉద్యమ కార్యాచరణతో కదిరి డిపో పరిధిలోని నేషనల్ మజ్దూర్ యూనియన్ పోరుబాటకు సిద్ధమైంది. ఇప్పటికే రెండు సార్లు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. అలాగే మరో రెండు పర్యాయాలు గేట్ మీట్లతో ధర్నా నిర్వహించారు. రోడ్డున పడనున్న కుటుంబాలు జిల్లాలో వ్యాప్తంగా మొత్తం ఆరు డిపోల పరిధిలో ఆర్టీసీ, అద్దె బస్సులు రెండు కలిపి 410 వరకు ఉన్నాయి. ఈ ఆరు డిపోల్లో 1,600 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ అమలు కాకపోవడంతో ఇప్పటి వరకూ సుమారు 50 మంది డ్రైవర్లు, కండక్టర్లు సర్వీస్లో నుంచి రిమూవ్ అయినట్లు సమాచారం. ఇదే బాటలో మరికొందరు ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఉద్యోగాలు కోల్పోయిన వారి కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. గత ప్రభుత్వంలో నో టెన్షన్ చిన్న పాటి తప్పిదాలకే ఉద్యోగం నుంచి తొలగిస్తున్న కూటమి ప్రభుత్వం రోజూ భయపడుతూ విధులు నిర్వర్తించలేమంటున్న ఉద్యోగులుఉద్యోగ భద్రత కోసం పోరాడతాం ఆర్టీసీలో విధులు నిర్వర్తించేందుకు ఉద్యోగులు చాలా భయపడతున్నారు. చిన్నపాటి తప్పిదాలకు సర్వీసు నుంచి తొలగిస్తూ ఉద్యోగుల ఆత్మస్తైర్యం దెబ్బతినేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఉద్యోగ భద్రతా సర్క్యులర్ అమలు చేసే వరకూ పోరాటాలు సాగిస్తాం. – ఎన్వీ రమణ, నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కదిరి డిపో మా పరిధిలో లేదు ఉద్యోగ భద్రతా సర్క్యులర్ 1–19 అమలు అనేది మా పరిధిలోని అంశం కాదు. ఇది పెద్దవాళ్లు చూసుకుంటారు. దీనిపై నేను ఏమీ మాట్లాడకూడదు. – మధుసూదన్, జిల్లా ప్రజారవాణా అధికారిఏపీఎస్ఆర్టీసీలో 1963లో ఏర్పాటు చేసుకున్న కాండక్ట్, క్లాసిఫికేషన్, అప్పీల్ మేరకు చిన్న చిన్న తప్పులకు సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు భారీ శిక్షలు వేసేవారు. ఎవరైనా టికెట్టు లేకుండా ప్రయాణిస్తున్నట్లుగా తనిఖీ అధికారి గుర్తిస్తే తక్షణమే కండక్టర్ను ఉద్యోగం నుంచి తొలగిచేవారు. అలాగే తన ప్రమేయం లేకుండా ప్రమాదం చోటు చేసుకుంటే డ్రైవర్ను బాధ్యుడిని చేస్తూ విధుల నుంచి తొలగించేవారు. 2019 వరకూ ఈ నిరంకుశ ధోరణి కొనసాగుతూ వచ్చింది. రాష్ట్రంలో 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే తొలుత ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తూ, 52 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో సంస్థలో పని చేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, అసిస్టెంట్ మేనేజర్ ర్యాంక్ వరకు విధివిధానాలను రూపొందిస్తూ ఎన్ఏంయూ నాయకులతో అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్రబాబు సంప్రదించి సర్కులర్ 1–19ని తీసుకువచ్చారు. దీంతో 2024 వరకు ఉద్యోగులు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. తప్పు చేసి పట్టుబడిన కండక్టర్లు, డ్రైవర్లకు ఇంక్రిమెంట్లుతో కోతలు విధించడం తప్ప వారిని ఉద్యోగాల నుంచి తొలగించకపోవడం గమనార్హం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సర్కులర్ 1–19ని అటకెక్కించింది. ఫలితంగా కదిరి డిపోలో పనిచేస్తున్న ఓ కండక్టర్, డ్రైవర్ చిన్నపాటి తప్పిదానికి తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇది ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని పెంచింది.