జిల్లాలో విరివిగా మొక్కలు నాటాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో విరివిగా మొక్కలు నాటాలి

Apr 30 2025 12:53 AM | Updated on Apr 30 2025 12:53 AM

జిల్ల

జిల్లాలో విరివిగా మొక్కలు నాటాలి

ప్రశాంతి నిలయం: పర్యావరణ పరిరక్షణకు జిల్లాలో విరివిగా మొక్కలు నాటాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో అటవీశాఖ, ఎన్‌హెచ్‌ఏ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ తదితర శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, చెరువుగట్లు, బంజరు భూములు, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇందుకు ఎన్ని మొక్కలు అవసరయో జిల్లా అటవీశాఖ అధికారికి తెలియజేయాలన్నారు. వారంలోపు మొక్కలు నాటేందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. జిల్లాలోని 1,74,065 హెక్టార్లలో 10.43 లక్షల మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్‌ అధికారి చక్రపాణి, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీపీఓ సమత, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఐటీఐలో ప్రవేశాలకు

దరఖాస్తుల స్వీకరణ

హిందూపురం టౌన్‌: స్థానిక శ్రీకంఠపురం ఝూన్సీలక్ష్మీబాయి పురపాలక ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో ప్రవేశాలకు తొలి విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్‌ రాయపురెడ్డి మంగళవారం పేర్కొన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 24వ తేదీలోపు https:/ iti.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకుని ఒరిజినల్‌ సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేయించుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 94402 58629, 94904 45744 నంబర్లలో సంప్రదించాలన్నారు.

ఈవీఎంల భద్రత పరిశీలన

ధర్మవరం రూరల్‌: స్థానిక మార్కెట్‌ యార్డ్‌లోని గోదాములో భద్రపరిచిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్ల (ఈవీఎం)ను జేసీ అభిషేక్‌ కుమార్‌ మంగళవారం పరిశీలించారు. గోదాముకు వేసిన సీళ్లు, సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక పరికరాలు తదితర వాటిని పరిశీలించారు. జేసీ వెంట ఆర్డీఓ మహేష్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు.

చెర్లోపల్లి – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దష్ట్యా చెర్లోపల్లి – తిరుపతి మధ్య వయా వికారాబాద్‌, గుంతకల్లు, కడప మీదుగా ప్రత్యేక రైళ్లును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి గురు, శుక్రవారాల్లో ఈ రైళ్లు నడుస్తాయన్నారు. మే 8వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ రాకపోకలు ఉంటాయని పేర్కొన్నారు. చెరోపల్లి నుంచి ఈ రైలు (07257) 8వ తేదీ (గురువారం) సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు తిరుపతి జంక్షన్‌కు చేరుతుందన్నారు. తిరిగి అదే రైలు (07258) అదే రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి శనివారం తెల్లవారుజూమున 4.30 గంటలకు చెర్లోపల్లి జంక్షన్‌ చేరుతుందన్నారు. ఈ రైలు సనత్‌నగర్‌, లింగంపల్లి, వికరాబాద్‌, తాండూరు, యాద్గిరి, కృష్ణ, రాయచూర్‌, మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రాజంపేట, రేణుగుంట మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు.

జిల్లాలో విరివిగా  మొక్కలు నాటాలి 1
1/3

జిల్లాలో విరివిగా మొక్కలు నాటాలి

జిల్లాలో విరివిగా  మొక్కలు నాటాలి 2
2/3

జిల్లాలో విరివిగా మొక్కలు నాటాలి

జిల్లాలో విరివిగా  మొక్కలు నాటాలి 3
3/3

జిల్లాలో విరివిగా మొక్కలు నాటాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement