
నేడు వెన్నుపోటు దినం..
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీల డప్పు కొట్టి.. అధికారంలోకి వచ్చాక సామాన్యులు, పేదల పొట్టకొట్టిన కూటమి సర్కారు వెన్నుపోటుకు నేటితో ఏడాది పూర్తయింది. సరిగ్గా 2024 జూన్ 4వ తేదీన ‘కూటమి’కి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ‘మా హామీలు మీ జీవితాలనే మార్చేస్తాయం’టూ ఎన్నికల ముందు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల్లో లేని ఆశలు కల్పించిన చంద్రబాబు, ఆయన పార్టీ పరివారం.. గద్దెనెక్కాక మాత్రం ముఖం చాటేశారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి ప్రభుత్వం వచ్చాక ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందలేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని మోసగించారు. 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని నేడు ఆ విషయమే పట్టించుకోవడం లేదు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఉచిత బస్సుకు ముహూర్తమే ఖరారు కాలేదు. ‘ఇంటింటికీ ఉద్యోగమిస్తాం.. ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు రూ.3 వేలు భృతి’ అన్నా నేటికీ అతీగతీ లేకుండా పోయింది. ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఇస్తామని ఇప్పటివరకూ పైసా ఇవ్వలేదు.
సామాన్యుల బెంబేలు..
అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకపోగా ఎమ్మెల్యేలు, పోలీసులు, టీడీపీ కార్యకర్తలు, సామాన్యులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. కబ్జాలు, ఆక్రమణలు, దందాలు, అక్రమ వసూళ్లకు అంతులేకపోవడంతో జనం బెంబేలెత్తుతున్నారు.
● కొత్త మద్యం పాలసీ పేరుతో ఊరూరా బెల్టుషాపులు, పర్మిట్ రూములతో ఉమ్మడి అనంత జిల్లాను మత్తులో జోగేలా చేశారు.
● హిందూపురంలో బాలకృష్ణ పీఏల అండ చూసుకుని ఇసుక మాఫియా రెచ్చిపోతోంది.
● ఫ్యాక్షన్ హత్యలు మళ్లీ పురుడుపోసుకున్నాయి. రామగిరి మండలంలో కురుబ లింగమయ్యను పచ్చ మూకలు కొట్టి చంపాయి. రాప్తాడులో నారాయణరెడ్డి, ముత్యాలమ్మను టీడీపీ నేతలు నరికి చంపారు.
● ఉమ్మడి జిల్లాలో కొండలు, గుట్టల్ని ‘తమ్ముళ్లు’ పిండిచేసి సహజ వనరులను లూటీ చేస్తున్నారు.
● చిత్రావతి, పెన్నా, వేదవతి హగరి నదుల్లో అక్రమంగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నా పట్టించుకునే దిక్కు లేదు.
● వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు.
● అనంతపురం అర్బన్లో ఎవరైనా ఇళ్లు కట్టాలంటే ఎమ్మెల్యేకు ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి.
● మట్కా, గంజాయికి తాడిపత్రి నియోజకవర్గం అడ్డాగా మారిపోయింది.
● గుత్తిలో ఓ వ్యక్తిని టీడీపీ నేతలు రైలు పట్టాలపై పడుకోబెట్టి డబ్బు దండుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
● రాప్తాడులో వెంచర్లు, పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే డబ్బు ముట్టజెప్పాలని చెబుతుండటంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అటువైపు చూడటమే మానేశారు.
నమ్మించి మోసం చేశారు
వెన్నుపోటుకు ఏడాది
గమనిక: చంద్రబాబు ప్రభుత్వంలో వీరిలో ఒక్కరికీ రూపాయి లబ్ధి చేకూరలేదు..
అలవిగాని హామీలతో
లక్షలాది మందికి కుచ్చుటోపీ
ఎన్నికల ముందు ఊరూరా ‘సూపర్సిక్స్’ ప్రచారం
అధికారంలోకి వచ్చాక ఒక్క పథకమూ అమలు చేయని వైనం
పైగా కబ్జాలు, ఆక్రమణలు, మోసాలు, దోపిడీలతో భయభ్రాంతులు
‘కూటమి’ పాలనను ఎండగడుతూ నేడు వైఎస్సార్ సీపీ నిరసన ర్యాలీ
హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కూటమి సర్కారు తీరుకు నిరసనగా ‘వెన్నుపోటు దినం’ పేరుతో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీకి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని నియోజవర్గాల్లో పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి నేతలు ర్యాలీలు నిర్వహించనున్నారు. నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కనున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తుందని ఆశపడ్డాం. కానీ ఏడాది పాలన పూర్తయినా ‘సూపర్ సిక్స్’లో పేర్కొన్న ఏ ఒక్క పథకమూ అమలు చేయలేదు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంట్లో ఆడబిడ్డలకు నెలకు రూ.1,500, నిరుద్యోగ భృతి లాంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మోసం చేసింది.
– శ్రీచందన, బుచ్చయ్యగారిపల్లి,
బుక్కపట్నం మండలం

నేడు వెన్నుపోటు దినం..

నేడు వెన్నుపోటు దినం..

నేడు వెన్నుపోటు దినం..