
శభాష్... దీక్షిత్
● ఐఎఫ్ఎస్కు ఎంపికకావడంపై
తెలంగాణ గవర్నర్ అభినందన
అమరాపురం: గ్రామీణ ప్రాంతంలో పుట్టినా..అఖిల భారత సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికై న దీక్షిత్ను తెలంగాణ గవర్నర్ విష్టుదేవ్ వర్మ అభినందించారు. అమరాపురం గ్రామానికి చెందిన పద్మ, ఈశ్వర్ప కుమారుడు దీక్షిత్ ఇటీవలే ఐఎఫ్ఎస్కు ఎంపికై న విషయం తెలిసిందే. బుధవారం హైదరాబాద్లోని రాజ్భవన్లో అఖిల భారత సర్వీసులకు ఎంపికై న వారిని ఆ రాష్ట్ర గవర్నర్ విష్టుదేవ్ వర్మ సన్మానించారు. ఈ క్రమంలో ఐఎఫ్ఎస్కు ఎంపికై న దీక్షిత్కు మెమొంటో అందజేసి అభినందనలు తెలిపారు. ఆల్ ఇండియా స్థాయిలో 30వ ర్యాంకు సాధించడం గర్వ కారణమన్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రజలకు, రాష్ట్రానికి సేవ చేయాలని గవర్నర్ సూచించారని దీక్షిత్ తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ కార్యదర్శి ధనకిశోర్, సహాయ కార్యదర్శి భవాని శంకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.