
ఇదేనా మీ సంస్కారం మంత్రి గారూ..?
● అధికారులను గౌరవించడం నేర్చుకోండి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్
పెనుకొండ రూరల్: ‘‘ప్రజల బాగోగులు ఎలాగూ పట్టించుకోవడం లేదు. కనీసం మీ కోసం పనిచేసే అధికారులనైనా మనుషులుగా చూడండి. ఎవరైనా నమస్కారం పెడితేనే ప్రతి నమస్కారం చేస్తాం. అలాంటిది ఒక మండల మెజిస్ట్రేట్ గౌరవంతో పూలబొకే తీసుకువస్తే విసిరిపడేస్తారా...ఇదేనా మీ ప్రభుత్వం అధికారులకు ఇచ్చే విలువ..? ఇప్పటికై నా కాస్త సంస్కారం నేర్చుకోండి’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మంత్రి సవితకు హితవు పలికారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఆదివారం పెనుకొండలోని ఓ ప్రభుత్వ చౌక ధాన్యపు దుకాణం వద్ద రేషన్ సరుకుల పంపిణీలో పాల్గొన్న మంత్రి సవిత... పౌరసరఫరాల శాఖ అధికారి ప్రభావతి, తహసీల్దార్ శ్రీధర్లను తీవ్రంగా అవమానించారన్నారు. వారిద్దరూ గౌరవంతో పూలబొకేలు ఇచ్చి ఆహ్వానిస్తుంటే. కలెక్టర్ సమక్షంలోనే మంత్రి ఆ బొకేలను వెనక్కు విసరడం ఎంత వరకు న్యాయమన్నారు. అధికారులకు మంత్రి ఇచ్చే గౌరవం ఇదేనా...? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో అధికారులకు విలువ తగ్గిందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన మంత్రి వీడియో చూస్తే తెలుస్తుందన్నారు. మంత్రి సవిత ప్రవర్తనలో మార్పు రావాలన్నారు. సభ్యత, విలువలను నేర్చుకోవాలని హితవు పలికారు.
ఇంటర్ ఫలితాల్లో
జిల్లాకు 9వ స్థానం
పుట్టపర్తి టౌన్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఽశనివారం విడుదలయ్యాయి. జిల్లా నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,188 మంది పరీక్షలు రాయగా, 1,902 మంది (45 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2,199 మంది పరీక్ష రాయగా, 1,437 మంది (65 శాతం) ఉత్తీర్ణులైనట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 9వ స్థానంలో నిలిచింది.
సెమీస్కు జూనియర్
మహిళల హాకీ జట్టు
ధర్మవరం: పశ్చిమ గోదావరి జిల్లా బీమవరంలో జరుగుతున్న 15వ రాష్ట్రస్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీల్లో జిల్లా మహిళల హాకీ జట్టు సెమీ ఫైనల్కు చేరిందని హాకీ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి సూర్యప్రకాష్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కోచ్ హసేన్ తెలిపారు. జిల్లా మహిళల జట్టు శనివారం నెల్లూరు జిల్లా జట్టుపై 11–0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. జట్టులో నసీమా మూడు గోల్స్, నవ్యశ్రీ మూడు గోల్స్, మాధురి బాయి రెండు గోల్స్, పవిత్ర, వైష్ణవి, వర్ష ఒక్కొక్క గోల్ చేసి రెండో విజయాన్ని నమోదు చేశారు. మధ్యాహ్నం మూడో లీగ్ మ్యాచ్లో తిరుపతి జట్టుతో 3–1 గోల్స్ తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్కు చేరుకున్నారు. ఆదివారం జరిగే సెమీ ఫైనల్స్లో అనంతపురం జిల్లా జట్టుతో తలపడనుంది. క్రీడాకారుల వెంట మేనేజర్ అరవింద్గౌడ్, కోచ్ మారుతికుమార్ ఉన్నారు.
రైళ్లలో పోలీసుల తనిఖీలు
హిందూపురం: రైల్వే, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. హిందూపురం రైల్వేస్టేషన్ గుండా వచ్చివెళ్లే రైళ్లలోని ప్రయాణికుల లగేజీని తనిఖీ చేశారు. అలాగే ప్లాట్ఫారంలో అనుమానాస్పదంగా ఉన్న వారిని విచారించారు. పార్సిల్ కార్యాలయంలోని వస్తువులనూ క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా గంజాయి, తదితర వాటిని నియంత్రించేందుకే తనిఖీలు చేపట్టినట్లు రైల్వే ఎస్ఐ సజ్జప్ప తెలిపారు.

ఇదేనా మీ సంస్కారం మంత్రి గారూ..?

ఇదేనా మీ సంస్కారం మంత్రి గారూ..?