దళిత ఎమ్మెల్యేల నోరు మూగబోయిందా? | - | Sakshi
Sakshi News home page

దళిత ఎమ్మెల్యేల నోరు మూగబోయిందా?

Jun 8 2025 12:28 AM | Updated on Jun 8 2025 12:29 AM

దళిత ఎమ్మెల్యేల నోరు మూగబోయిందా?

దళిత ఎమ్మెల్యేల నోరు మూగబోయిందా?

అనంతపురం ఎడ్యుకేషన్‌: ‘రామగిరి మండలంలోని గ్రామంలో దళిత మైనర్‌ బాలికపై అత్యాచార ఘటనలో వాస్తవాలు వెలుగులోకి వస్తోంటే ఇది అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం అమలవుతున్న రాష్ట్రమా... లేక రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతున్న దుర్మార్గపు ప్రపంచమా అనేది తెలియడం లేదు. ఇంత జరుగుతున్నా జిల్లాలోని దళిత ఎమ్మెల్యేలు, నాయకులు ఎందుకు మాట్లాడడం లేదో అర్థం కావడం లేదు. వారి నోరు మూగబోయిందా.. మాట గొంతుదాటి బయటకు రావడం లేదా’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగిరి మండలం పరిటాల కుటుంబం కబంధహస్తాల్లో ఉందన్నారు. బాలికపై అఘాయిత్యం జరిగిన రామగిరి మండలంలోని గ్రామం పరిటాల పెత్తనంతో 40 ఏళ్లుగా ప్రజాస్వామ్యం చూడలేదన్నారు. ‘అక్కడ పరిటాల వారు చెప్పిందే వేదం. చేసిందే శాసనం. అదే చట్టం’ అన్నారు. అక్కడ పరిటాల రాజ్యాంగం అమలవుతోందన్నారు. ఆ గ్రామంలో సూడో నక్సలైట్లు, కిరాయి హత్యలు చేసేవారు, రౌడీషీటర్లంతా పరిటాల సైన్యమన్నారు. ఇలాంటి గ్రామంలో ఒక దుర్మార్గుడు మైనర్‌ బాలికను బెదిరించి లొంగదీసుకుని వీడియో తీసి... ఆ వీడియోను బయటకు పెడతానంటూ బెదిరించి బలత్కారం చేశాడన్నారు. తర్వాత బ్లాక్‌మెయిల్‌ చేసి 14 మంది ఆ బాలికపై అత్యాచారం చేశారన్నారు. చివరకు వీడియో తీసిన వాడి తండ్రి కూడా బాలికపై కన్నేసి బలాత్కరించాడని తెలిపారు. ఏడాదికాలంగా ఆ అమ్మాయిని చిత్రవధకు గురి చేశారన్నారు. ఆ బాలిక గర్భం దాల్చిన ఆర్నెల్ల తర్వాత ఆనోట, ఈనోట పడి ‘సాక్షి’ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలిసిందన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తుంటే సభ్యసమాజం సిగ్గుపడే విధంగా ఉందన్నారు. ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం, ఒక మహిళ ఎస్పీగా ఉన్న జిల్లాలో మైనర్‌ బాలికపై అత్యంత దారుణంగా నెలల తరబడి అత్యాచారం జరిగితే ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చీమ చిటుక్కుమన్నా పరిటాల కుటుంబానికి సమాచారం చేరవేసే గ్రామస్తులు ఇంతటి దారుణ ఘటన గురించి చెప్పకుండా ఉంటారా అనే అనుమానం వ్యక్తం చేశారు. కీచకుల మెడల్లో చెప్పుల హారాలు వేయించి ఊరేగించేలా చూడాలని కోరారు. రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌కు ఈ ఘటన తెలియకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. మరి ఇన్ని రోజులు ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు వైస్‌ ఎంపీపీ కృష్ణారెడ్డి, గోవిందరెడ్డి, పెన్నోబులేసు, ఆలమూరు ఓబులేసు, మీనుగ నాగరాజు, సాకే వెంకటేష్‌, విశ్వనాథరెడ్డి, ఈశ్వరయ్య పాల్గొన్నారు.

సభ్యసమాజం సిగ్గుపడేలా

దళిత మైనర్‌ బాలికపై అత్యాచారం

ఇంత జరిగినా దళిత ప్రజాప్రతినిధులు మిన్నకుండిపోవడం అన్యాయం

ఎస్పీ గారూ.. నిష్పక్షపాతంగా

విచారించండి

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి

ప్రకాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement