
మొక్కల పెంపకంతో ఎడారి నివారణ
● ‘నాసిన్’లో మొక్కలు నాటిన కేంద్ర
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
గోరంట్ల: మొక్కలు విరివిగా నాటడం వల్ల ఎడారి నివారణ సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అతితక్కువ వర్షపాతం నమోదయ్యే రాజస్థాన్లోని జైసల్మీర్లోనూ ఎడారి ఛాయలు ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని ఆమె వివరించారు. అందువల్ల ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ విరివిగా మొక్కలు నాటడం వల్ల జిల్లాను సస్యశ్యామలం చేయవచ్చన్నారు. శుక్రవారం ఆమె పాలసముద్రం సమీపంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎకై ్సజ్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) సంస్థలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలసీతారామన్ విద్యార్థులు, రైతులతో కలసి నాసిన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ తరచూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని, వాటి అధిగమించడానికి చెట్లను విరివిగా పెంచాలని సూచించారు. ఈ క్రమంలోనే నాసిన్ సంస్థలో జపాన్ టెక్నాలజీతో మొక్కలు నాటి పర్యావరణ, పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావులకేశవ్, నాసిన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
9న ‘షైనింగ్ స్టార్స్’ పురస్కారాలు
● జిల్లా వ్యాప్తంగా 225 మంది
విద్యార్థుల ఎంపిక
● ఒక్కో విద్యార్థికి రూ.20 వేల చొప్పున
నగదు పురస్కారం
పుట్టపర్తి: పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం ‘షైనింగ్ స్టార్స్’ పురస్కారాలతో సత్కరిస్తోంది. ఇందుకోసం 225 మందిని అధికారులు ఎంపిక చేశారు. జిల్లాలో 32 మండలాలకు సంబంధించి 186 మంది పదో తరగతి విద్యార్థులు, మరో 39 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యార్థికి రూ. 20 వేల చొప్పున నగదు పురస్కారం అందించనున్నారు. ఈనెల 9వ తేదీన కొత్తచెరువు సమీపంలోని వెంకటేశ్వర కళ్యాణమండపంలో పురస్కారాల ప్రదానోత్సవం ఏర్పాటు చేసినట్లు డీఈఓ కృష్ణప్ప శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విద్యార్థులకు సమాచారం పంపామన్నారు.
ఐటీఐల్లో ప్రవేశాలకు
9న కౌన్సెలింగ్
హిందూపురం టౌన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో (2025–26 విద్యా సంవత్సరం) జూన్ 9న అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు హిందూపురం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ రాయపురెడ్డి తెలిపారు. శ్రీకంఠపురం ఝూన్సీ లక్ష్మీ బాయ్ పురపాలక ప్రాథమిక పాఠశాల ఆవరణలోని ప్రభుత్వ ఐటీఐలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు. 9వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 1–30 ర్యాంకుల వారికి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు 31 – 60 ర్యాంకుల వారికి కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. వివరాలకు 9440258629, 9490445744 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.