
‘ఉద్యాన’ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మడకశిర రూరల్: డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ ఉద్యాన విశ్వ విద్యాలయం పరిధిలోని ఉద్యాన పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు (2025–26 విద్యాసంవత్సరం) నోటిఫికేషన్ విడుదల చేసినట్లు స్థానిక ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.శ్రీధర్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారితో పాటు ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. https://drysrhu.ap.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు సర్టిఫికెట్లను జత చేసి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం కార్యాలయం చిరునామాకు పంపించాలని సూచించారు. పూర్తి వివరాలకు 7382633687, 7702705721 నంబర్లలో సంప్రదించాలన్నారు.
స్కూళ్లు తెరిచేలోపే
పుస్తకాలు పంపిణీ
నల్లమాడ: పాఠశాలల పునఃప్రారంభమయ్యేలోపు విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని డీఈఓ కృష్ణప్ప తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక ఎమ్మార్సీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మండలానికి ఇప్పటికే 90 శాతం పాఠ్య పుస్తకాలు సరఫరా చేశామని, పాఠశాలలు తెరిచేలోపు తక్కిన 10 శాతం పుస్తకాలను కూడా సరఫరా చేస్తామన్నారు. అలాగే యూనిఫాం సైతం విద్యార్థులకు సకాలంలోనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడా కూడా ఉపాధ్యాయుల కొరత లేకుండా ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. డీఈఓ వెంట ఉపాధ్యాయుడు బ్రహ్మానందరెడ్డి, ఎమ్మార్సీ సిబ్బంది ఉన్నారు.

‘ఉద్యాన’ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం