
శభాష్ ఉమామహేశ్వరెడ్డి
● సివిల్స్లో 221 ర్యాంకు
కదిరి అర్బన్: తల్లిదండ్రుల ప్రొత్సాహం, ప్రణాళిక బద్ధంగా చదివి సివిల్స్లో 221 ర్యాంకు సాధించాడు కదిరికి చెందిన బొల్లంపల్లి ఉమామహేశ్వరెడ్డి. ఆయన కర్నూలు మాంటిస్సోరిలో పదో తరగతి చదివారు. హైదరాబాద్లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేశారు. ఉమామహేశ్వర్రెడ్డి తల్లిదండ్రులు రాజశేఖర్రెడ్డి, తల్లి పద్మావతి విశ్రాంత ఉపాధ్యాయులు. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో ఢిల్లీలో శిక్షణ పొందారు. హైదరాబాద్లో ఉంటూ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. గతంలోనే సివిల్స్లో 270 ర్యాంకు సాధించి ఐఆర్ఎస్ సాధించారు. ప్రస్తుతం నాగపూర్లో ఐఆర్ఎస్ శిక్షణలో ఉన్నారు. ఇంకా మెరుగైన ర్యాంకు సాధించాలని ప్రణాళికాబద్ధంగా చదివి మొన్న వచ్చిన సివిల్స్ ఫలితాల్లో 221వ ర్యాంకు సాధించారు.