వేర్వేరు ప్రమాదాల్లో అన్నదమ్ముల మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో అన్నదమ్ముల మృతి

Apr 18 2025 12:43 AM | Updated on Apr 18 2025 12:43 AM

వేర్వ

వేర్వేరు ప్రమాదాల్లో అన్నదమ్ముల మృతి

ముదిగుబ్బ: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయారు. దీంతో ముదిగుబ్బ మండలం దొరిగిల్లు క్వార్టర్స్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానికుల వివరాల మేరకు.. దొరిగిల్లు సమీపంలో గురువారం ఓ యువకుడి శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొరిగిల్లుకు చెందిన రమణయ్య (46) బుధవారం వ్యవసాయ పనులకు వెళ్లి పనులు ముగిసిన తరువాత స్నానం చేసేందుకు తోట సమీపంలోని గుర్రాల మడుగులోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో తమ్ముడు..

నాలుగు రోజుల క్రితం రమణయ్య సోదరుడు మునికృష్ణ (45) మొలకలచెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఒకే రోజు అన్నదమ్ములిద్దరూ చనిపోవడంతో దొరిగిల్లులో విషాదఛాయలు అలముకున్నాయి. రమణయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే మునికృష్ణ భార్య ఇప్పటికే చనిపోగా కుమారుడు ఉన్నారు. కేసు నమదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివరాముడు తెలిపారు.

నీటి మడుగులో ఒకరు..

రోడ్డు ప్రమాదంలో మరొకరు

దొరిగిల్లులో విషాదం

వేర్వేరు ప్రమాదాల్లో అన్నదమ్ముల మృతి 1
1/1

వేర్వేరు ప్రమాదాల్లో అన్నదమ్ముల మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement