
అనుమతుల్లేకుండా క్లినిక్లు నడిపితే చర్యలు
● డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం
కదిరి టౌన్: అనుమతుల్లేకుండా క్లినిక్లు నడిపితే చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) ఫైరోజాబేగం హెచ్చరించారు. క్లినిక్ సీజ్ చేయడంతో పాటు సదరు డాక్టర్పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం ఆమె కదిరి ప్రభుత్వ ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాలులో కదిరి ఐఎంఏ ప్రతినిధులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయన్నారు. అందువల్ల డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలో బ్రూణహత్యల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనధికార అబార్షన్లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జననాల ధ్రువీకరణ పద్ధతి, మేల్ అండ్ ఫిమేల్ జననాల సంఖ్యపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోషియేషన్ కదిరి శాఖ సభ్యులు, ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు డీఎంహెచ్ఓను సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటి డీఎంహెచ్ఓ నాగేంద్రనాయక్, డాక్టర్లు శంకరయ్య, సీవీ మదన్కుమార్, విద్యాసాగర్, హుస్సేన్, చంద్రశేఖర్రెడ్డి, అశోక్కుమార్రెడ్డి, మారుతి ప్రసాద్, ముస్తఫా, విజయ్, తన్వీర్, ప్రమీల, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీలో ఆరుగురికి పదోన్నతి
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లాలోని పరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆరుగురికి పదోన్నతి కల్పిస్తూ జెడ్పీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు ల్యాబ్ అసిస్టెంట్, ఓ రికార్డు అసిస్టెంట్కు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. వీరిలో భీమయ్య (గుమ్మఘట్ట), ఫకృద్ధీన్ (సిద్దరాంపురం), లక్ష్మన్న (నాగసముద్రం), సాదిక్ బాషా (తగరకుంట), హరికృష్ణ (ముదిగుబ్బ), వెంకటేశులు (కళ్యాణదుర్గం) ఉన్నారు. వీరికి పదోన్నతుల ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అందజేసి, అభినందించారు. అలాగే జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పనిచేసే ఉద్యోగులకు శనివారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఈఓ వెంకట సుబ్బయ్య తెలిపారు. చైర్పర్సన్ సమక్షంలో ఉదయం 9:30 గంటలకు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుందన్నారు.

అనుమతుల్లేకుండా క్లినిక్లు నడిపితే చర్యలు