
మడకశిర మున్సిపల్ పీఠంపై టీడీపీ కన్ను
మడకశిర: మడకశిర మున్సిపాలిటీని అడ్డదారుల్లో తన ఖాతాలో వేసుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందుకోసం ఇప్పటికే పావులు కదిపింది. సొంతంగా బలం లేకపోవడంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసింది. చైర్పర్సన్గా ఉన్న దళిత మహిళను ఎలాగైనా పీఠం నుంచి దింపేందుకు రంగం సిద్ధం చేసింది.
20 స్థానాల్లో 15 వైఎస్సార్ సీపీవే..
మడకశిర మున్సిపాలిటీలో 20 వార్డులుండగా...గత ‘స్థానిక’ ఎన్నికల్లో 15 వార్డుల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. టీడీపీ కేవలం ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది. చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వు కాగా, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ పీఠంపై ఓ మహిళను కూర్చోబెట్టాలని భావించారు. ఈ నేపథ్యంలోనే 7వ వార్డు నుంచి గెలుపొందిన దళిత సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీ నరసమ్మకు చైర్పర్సన్గా అవకాశం ఇచ్చి పాలనలో మహిళలను భాగస్వామ్యులను చేశారు. కానీ టీడీపీ నేతలు మాత్రం దళిత మహిళను చైర్పర్సన్ స్థానం నుంచి దించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు గాలం..
ఎలాగైనా సరే మడకశిర మున్సిపాలిటీని కై వసం చేసుకోవాలని భావిస్తున్న టీడీపీ నాయకులు.. తమకు తగినంత బలం లేకపోవడంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు గాలం వేస్తున్నారు. ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి ఇప్పటికే 8 మందికి టీడీపీ కండువా కప్పేశారు. దీంతో టీడీపీ బలం 13కు చేరగా...వారందరితో సంతకాలు చేయించి చైర్పర్సన్ లక్ష్మీనరసమ్మపై అవిశ్వాసం ప్రవేశ పెట్టడానికి అవకాశం కల్పించాలని కలెక్టర్కు వినతిపత్రం అందించారు.
దళిత మహిళకు అన్యాయం
చేసేందుకు కుట్ర
కలెక్టర్కు
అవిశ్వాసం నోటీసు ఇచ్చిన కౌన్సిలర్లు