
శేషవాహనంపై విహరించిన శ్రీవారు
బొమ్మనహాళ్: మండల కేంద్రంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి బ్రహోత్సవాల సందర్భంగా గురువారం శ్రీవారు శేష వాహనం ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వైదపండితుల ఆధ్వర్యంలో పవిత్ర గంగాజలాభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక అలంకరణ , అలంకరణ , మంగళహారతి, తీర్థప్రసాదాలు, అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. రాత్రి 8 గంటలకు ప్రత్యేకంగా అలంకరించిన శేషవాహనంలో స్వామి వారిని గ్రామ వీధుల్లో ఊరేగింపు చేశారు. వందలాదిగా భక్తులు పాల్గొని శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు.