నేడు పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌

Apr 25 2025 12:55 AM | Updated on Apr 25 2025 12:55 AM

నేడు పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌

నేడు పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌

గోరంట్ల: పాలసముద్రం సమీపంలోని సెంట్రల్‌ ఎకై ్సజ్‌ అకాడమి అండ్‌ నార్కోటిక్స్‌ (నాసిన్‌) సంస్థలో శిక్షణ పొందుతున్న ఐఆర్‌ఎస్‌ 75వ బ్యాచ్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ శుక్రవారం జరగనుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి హాజరుకానున్నారు. గురువారం రాత్రే ఆయన జిల్లాకు చేరుకున్నారు.

నాణ్యమైన భోజనం అందించాలి

కదిరి టౌన్‌: ఖైదీలకు నాణ్యమైన భోజనం అందించాలని అనంతపురం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.శివప్రసాద్‌ ఆదేశించారు. గురువారం కదిరి సబ్‌ జైలును తనిఖీ చేశారు. అనంతరం జైలు సూపరింటెండెంట్‌కు పలు సూచనలు చేశారు. ఖైదీలకు వండిన భోజనాన్ని పరిశీలించారు. మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, మార్పు చెందాలని ఖైదీలకు సూచించారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ వాసుదేవరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

30న పాలిసెట్‌

అనంతపురం: డిప్లొమో కోర్సుల్లో అడ్మిషన్లు నిర్వహించడానికి నిర్వహిస్తున్న ఏపీ పాలిసెట్‌–2025ను ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్‌ సి. జయచంద్రా రెడ్డి తెలిపారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లనుwww.poycetap.nic.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement