
పాపిరెడ్డిపల్లిలో భయం.. భయం
సాక్షి, పుట్టపర్తి/రామగిరి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే పరిటాల సునీత ఇలాకాలో వైఎస్సార్సీపీ నేత హత్య జరిగి నెల రోజులు కూడా కాలేదు. ఇంతలోనే పరిటాల సునీత మరో కుట్ర పన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఉగాది పర్వదినం రోజున కురుబ లింగమయ్యను టీడీపీ గూండాలు దారుణంగా హత్య చేశారు. నెల రోజులు తిరగకుండానే పోలీస్ పికెట్ తీసేయడంపై గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భయంతో బతుకుతున్నారు. పోలీసులు అందుబాటులో లేరని తెలిస్తే.. గ్రామంలోని టీడీపీ అల్లరిమూకలు రెచ్చిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసు పికెట్ ఏర్పాటు చేసి గ్రామానికి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
భద్రతా వైఫల్యం.. మరోసారి బహిర్గతం
గత మార్చిలో పాపిరెడ్డిపల్లిలో నాలుగు రోజుల పాటు గొడవ కొనసాగింది. పోలీసులకు విషయం తెలియజేసినా పట్టించుకోలేదు. దీంతో గొడవ పెద్దదై లింగమయ్యను హతమార్చే వరకూ వచ్చింది. అలాగే రామగిరి ఎంపీపీ ఎన్నికల విషయంలో పోలీసుల భద్రతా వైఫల్యం బట్టబయలైన సంగతి తెలిసిందే. పోలీసుల సమక్షంలోనే ఓ ఎంపీటీసీ సభ్యురాలిని టీడీపీ వాళ్లు కిడ్నాప్ చేశారు. అంతకుముందు రామగిరి ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు తెగబడ్డారు. పాపిరెడ్డిపల్లిలో హత్య జరిగి నెల రోజులు కూడా పోలీసు బందోబస్తు నిర్వహించలేదంటే.. మరో కుట్రకు తెరలేపారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లికి పర్యటన సమయంలో హెలిప్యాడ్ వద్ద సమస్య వచ్చిన సంగతి తెలిసిందే.
ఎస్ఐ సుధాకర్యాదవ్ ఏం చేస్తున్నారో?
రామగిరి ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న సుధాకర్యాదవ్.. అక్కడ విధుల్లో చేరిన నాటి నుంచి ఎమ్మెల్యే పరిటాల సునీత కనుసన్నల్లోనే ఉన్నారన్న విమర్శలున్నాయి. అయినా పోలీసు ఉన్నతాధికారులు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయింపునకు కూడా ఆయన వెనుకాడటం లేదు. పోలీసు పికెట్ రద్దు చేయడంపై సుధాకర్యాదవ్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పోలీసు పికెట్ తీసేసిన యంత్రాంగం
మళ్లీ రెచ్చిపోయే ఆలోచనలో
టీడీపీ రౌడీమూకలు
లింగమయ్య హత్య జరిగి
నెల పూర్తికాకనే కుట్రలు