
స్తంభానికి కట్టేసి.. చితకబాది..
కదిరి టౌన్: పెట్రోల్ బంకు వర్కర్ను స్తంభానికి కట్టేసి.. చితకబాదిన అమానుష ఘటన కదిరిలో వెలుగు చూసింది. కుమ్మరవాండ్లపల్లిలో హరికృష్ణ అనే వ్యక్తి పెట్రోలుబంకు నిర్వహిస్తున్నాడు. ఇక్కడ బాబా అనే వ్యక్తి వర్కర్గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని.. పెట్రోలు అమ్మగా వచ్చిన మొత్తాన్ని మేనేజర్ సూర్యనారాయణకు అందజేశాడు. అయితే అందులో రూ.24వేలు తక్కువగా వచ్చిందని, ఆ మొత్తాన్ని అతనే కాజేసి ఉంటాడని మేనేజర్ సూర్యనారాయణ, అమర అనే మరో వర్కర్తో కలిసి బాబాను దుస్తులు తొలగించి, స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం బాధితుడు తాను డబ్బు సక్రమంగా జమచేసినా.. అకారణంగా దొంగను చేసి కొట్టారంటూ మేనేజర్, మరొక వర్కర్పై కదిరి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సీఐ నిరంజన్రెడ్డి కేసు నమోదు చేశారు.