4న వెన్నుపోటు దినం | - | Sakshi
Sakshi News home page

4న వెన్నుపోటు దినం

Jun 1 2025 12:22 AM | Updated on Jun 1 2025 12:22 AM

4న వెన్నుపోటు దినం

4న వెన్నుపోటు దినం

పుట్టపర్తి టౌన్‌: ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల నాలుగో తేదీన పుట్టపర్తిలో ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం పుట్టపర్తిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులతో కలసి ‘వెన్నుపోటు దినం’ పోస్టర్లు విడుదల చేశారు. దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ తల్లికి వందనం, ఇంటికో ఉద్యోగం/ నిరుద్యోగ భృతి, అన్నదాతా సుఖీభవ తదితర పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకోవచ్చని నారా లోకేష్‌ ఎన్నికల సమయంలో అన్నారని, మరి ఇప్పుడు దీనిపై ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కుటమి ప్రభుత్వంపై సమర సంఖారావం పూరించే సమయం ఆసన్నమైందన్నారు. నాలుగో తేదీ ఉదయం 9 గంటలకు వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధసంఘాల సభ్యలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి

విజయవంతం చేయాలని

పార్టీ శ్రేణులకు పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement