
డీసీసీబీ, డీసీఎంఎస్లకు నూతన చైర్మన్ల నియామకం
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ కూటమి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్గా గార్లదిన్నె మండలానికి చెందిన టీడీపీ నాయకుడు ముంటిమడుగు కేశవరెడ్డి నియమించారు. అలాగే జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్గా కనగానపల్లి మండలానికి చెందిన టీడీపీ నాయకుడు నెట్టెం వెంకటేసును నియమించారు.
డిమాండ్లు నెరవేర్చే వరకూ సమ్మె
పుట్టపర్తి అర్బన్: తమ డిమాండు నెరవేర్చే వరకూ సమ్మెలో కొనసాగుతామని వైద్య, ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న సీహెచ్ఓలు స్పష్టం చేశారు. సోమవారం డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకూ బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు మాట్లాడుతూ... గత రెండేళ్లుగా జీతభత్యాల విషయంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సమస్యలను పరిస్కరించే వరకూ నిరవధిక సమ్మెలోకి వెళుతున్నామని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజబేగంకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ఎంసీఏ జిల్లా అధ్యక్షుడు కార్తీక్రెడ్డి, జనరల్ సెక్రెటరీ నందీశ్వరరెడ్డి, చందన, వేణుగోపాల్, ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రామమోహన్, నాయకులు శంకర్, జగదీష్, బాబాఫకృద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల సంఖ్య పెంచండి : డీఐఈఓ
పెనుకొండ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి మెరుగైన ఫలితాలు రాబట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధ్యాపకులకు డీఐఈఓ సయ్యద్ మౌలా సూచించారు. పెనుకొండలోని కళాశాలలో నిర్వహిస్తున్న ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను సోమవారం పరిశీలించారు. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బొటనీ సబ్జెక్టులకు బోధనా విధానాలపై ఆన్లైన్లో అందిస్తున్న శిక్షణను పరిశీలించారు. అనంతరం ఆయన విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలో అధికంగా చేరడానికి తగిన దృష్టి సారించాలన్నారు. అనంతరం ఆయనను ప్రిన్సిపాల్ సుదర్శన్, అధ్యాపకులు సన్మానించారు.
హౌస్ వైరింగ్పై ‘రూడ్సెట్’లో ఉచిత శిక్షణ
అనంతపురం: ఎస్కేయూ సమీపంలోని రూడ్సెట్ సంస్థలో మే 6 నుంచి జూన్ 4వ తేదీ వరకూ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్పై యువకులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 18 నుంచి 45 సంవత్సరాల్లోపు వయస్సు, రేషన్కార్డు, ఆధార్కార్డు కలిగి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు అర్హులు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వసతి ఉంటుంది. పూర్తి వివరాలకు 94925 83434లో సంప్రదించవచ్చు.

డీసీసీబీ, డీసీఎంఎస్లకు నూతన చైర్మన్ల నియామకం

డీసీసీబీ, డీసీఎంఎస్లకు నూతన చైర్మన్ల నియామకం