
దేవపుత్ర సాహిత్యం చిరస్మరణీయం
అనంతపురం కల్చరల్: జిల్లా సాహిత్యంలో చిలుకూరి దేవపుత్రది ప్రత్యేక స్థానం. ఆయన ఎన్నో రచనలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని పలువురు వక్తలు కొనియాడారు. గురువారం స్థానిక విశాలాంధ్ర బుక్ హౌస్ ప్రాంగణంలో టీవీ రెడ్డి అధ్యక్షతన చిలుకూరి దేవపుత్ర 73వ జయంతిని అనంత సాహితీ సంస్థలు, తెలుగు వెలుగు సామాజిక సంస్థ సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రచయితలు, కవులు మాట్లాడుతూ.. జిల్లా సాహిత్యంలో చిలుకూరు దేవపుత్ర సామాన్యుల పక్షం వహించి ఎన్నో మానవీయ రచనలు చేశారని గుర్తు చేసుకున్నారు. అనంత సాహిత్యంలో చేసిన ప్రయోగాలు విలక్షణమైనవని తెలిపారు. దేవపుత్ర ఆశయాలను కొనసాగిస్తుండటంపై వారి కుటుంబ సభ్యులను అభినందించారు. కవి, గాయకుడు అంకె రామలింగమయ్య ఆలపించిన పద్యం ఆకట్టుకుంది. అనంతరం సీనియర్ కవి చం.శాస్త్రిని దేవపుత్ర స్మారకంగా సత్కరించారు. కార్యక్రమంలో ఈశ్వరయ్య, ప్రసాద్, తిరుపాలు, హరీష్, రసూల్, వెంకటేష్, దేవుపుత్ర కుటుంబీకులు చిలుకూరి దీవెన, అన్వేష్, కవులు, విశ్రాంత అధికారులు డాక్టర్ శశాంకమౌళి, మధురశ్రీ,. రియాజుద్దీన్, రామాంజనేయులు, గోవిందరాజులు, విశాలాంద్ర బుక్ హౌస్ విశ్రాంత మేనేజర్ చెట్ల ఈరన్న పాల్గొన్నారు.