
అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేయాలి: ఆర్ఐఓ
కదిరి అర్బన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు అధ్యాపకులంతా కృషి చేయాలని ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (ఆర్ఐఓ) సయ్యద్ మౌల సూచించారు. గురువారం ఆయన స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులతో ఆయన సమావేశం నిర్వహించారు. కళాశాలలో ఇప్పటికే ఉన్న విద్యార్థుల సంఖ్య... జూనియర్ ఇంటర్ ప్రవేశాలపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర ప్రసాద్, అధ్యాపకులు ఎంఎస్ ప్రశాంత్తో పాటు పలువురు పాల్గొన్నారు.