
సనపకు పోటెత్తిన భక్త జనం
ఆత్మకూరు: మండలంలోని సనప గ్రామంలో ఊరి దేవరకు మంగళవారం భక్తులు పోటెత్తారు. 35 సంవత్సరాల తరువాత నిర్వహించిన ఊరి దేవరకు వేల సంఖ్యలో ప్రజలు రావడంతో సనప గ్రామం కిటకిటలాడింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో పెద్దమ్మ తల్లి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జంతువులను బలిచ్చారు. మంగళవారం భక్తులు అమ్మవారికి టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఇంట్లో మొక్కుబడిలో భాగంగా పొట్టేళ్లు, గొర్రెలను బలి ఇచ్చారు. బంధు మిత్రులతో కలసి విందు భోజనాలు చేశారు. గ్రామంలోకి వచ్చేందుకు ప్రజలకు గంటల సమయం పట్టింది. మూడు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

సనపకు పోటెత్తిన భక్త జనం