
పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి కృషి
ప్రశాంతి నిలయం: జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం చేయడానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం జిల్లా పంచాయతీశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ హాజరై జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళిలర్పించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ తరుఫున పన్నులు, ఇతర వసూళ్లు 80 శాతం చేసినందుకు, ఓడీఎఫ్ 100 శాతం, పంచాయతీ పోర్టల్లో పాలనాపరమైన విషయాలు, ఇతర వివరాలు 100 శాతం నమోదు చేసినందుకు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో పురోగతి సాధించడంతో జిల్లాకు ఉత్తమ అవార్దు వచ్చిందన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులకు జాయింట్ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంధర్బంగా పలువురు డివిజనల్ పంచాయతీ అధికారులు, ఉప మండలాభివృద్ధి అధికారులు, 18 మంది పంచాయతీ కార్యదర్శులు, జిల్లా గ్రామ పంచాయతీ కార్యాలయం ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ధర్మవరం డివిజనల్ పంచాయతీ అధికారి శివకుమారి, కదిరి డీఎల్డీఓ అంజనప్ప, బుక్కపట్నం ఉప మండలాభివృద్ధి అధికారి అశోక్కుమార్రెడ్డి, బత్తలపల్లి కృష్టప్ప, తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్