
జాతీయ స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీకి ఎంపిక
రొళ్ల: జాతీయ స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో రొళ్ల మండలం దొమ్మరహట్టి వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు టి.నవదీప్, టి.వరుణ్సందేష్, ఎన్.హర్షవర్ధన్, ఎం.దినేష్ చోటు దక్కించుకున్నారు. మే 3, 4వ తేదీల్లో నెల్లూరు వేదికగా జాతీయ స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ జరగనుంది. ప్రతిభ చాటిన విద్యార్థులను ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మైలారప్ప, వైస్ ప్రిన్సిపాల్ రమేష్ పీఈటీలు వెంకటనారాయణ, చంద్రశేఖర్, అనంతపురం జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు శుక్రవారం అభినందించారు.