
టీబీ డ్యాంకు 20,025 క్యూసెక్కుల ఇన్ఫ్లో
బొమ్మనహాళ్: కర్ణాటకలోని హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో పెరిగింది. సోమవారం నాటికి 20,025 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. కొన్ని రోజులుగా డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ, ఆగుంబే, తీర్థనహాళ్లి, వరనాడు తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో డ్యాంకు ఇన్ఫ్లో మొదలైంది. మూడు రోజులుగా వరద చేరిక పెరిగింది. మే మొదటి వారంలో ఇన్ఫ్లో జీరోగా ఉండగా.. నేడు 20,025 క్యూసెక్కులుగా నమోదవుతుండటం గమనార్హం. అవుట్ ఫ్లో 236 క్యూసెక్కులుగా ఉంది. ప్రసుత్తం జలాశయంలో 1,633 అడుగులకు గాను 1,597.84 అడుగులకు నీరు చేరింది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 18.860 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 1,577.47 అడుగుల వద్ద 3.360 టీఎంసీల నీటి నిల్వతో 411 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండింది.