డీజిల్‌ అక్రమ డంప్‌ స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

డీజిల్‌ అక్రమ డంప్‌ స్వాధీనం

Jun 4 2025 12:29 AM | Updated on Jun 4 2025 12:29 AM

డీజిల్‌ అక్రమ డంప్‌ స్వాధీనం

డీజిల్‌ అక్రమ డంప్‌ స్వాధీనం

చెన్నేకొత్తపల్లి: డీజిల్‌ చోరీ దళారులకు కాసుల పంట పండిస్తోంది. ధాబాల వద్ద, రోడ్డు పక్కన నిలిపిన లారీల నుంచి చోరీ చేసిన డీజిల్‌ అక్రమంగా ఓ ప్రాంతంలో డంప్‌ చేసి గ్రామీణులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్న వైనం వెలుగు చూసింది. జిల్లాలో అక్రమంగా సాగుతున్న ఈ దందాలో ఇద్దరు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

లారీ డ్రైవర్‌ ఫిర్యాదుతో వెలుగులోకి

సోమవారం రాత్రి ప్రయాణిస్తున్న ఓ లారీ డ్రైవర్‌ నిద్ర ముంచుకు రావడంతో చెన్నేకొత్తపల్లి శివారున 44వ జాతీయ రహదారి పక్కన తన లారీని ఆపి నిద్రపోయాడు. మంగళవారం ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం లారీని శుభ్రం చేస్తుండగా డీజిల్‌ ట్యాంక్‌ వేసిన తాళం బద్ధలుగొట్టి ఉండడం గమనించాడు. ట్యాంక్‌లోని డీజిల్‌ మొత్తం అపహరించినట్లుగా గుర్తించి, విషయాన్ని వెంటనే చెన్నేకొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన ఎస్‌ఐ సత్యనారాయణ తన సిబ్బందితో కలసి ఉదయం 44వ జాతీయ రహదారిపై దామాజిపల్లి జంక్షన్‌ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో చెన్నేకొత్తపల్లి వైపుగా వస్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్‌ కలిగిన కారును ఆపి పరిశీలించగా... అందులోని క్యాన్లలో 90 లీటర్ల డీజిల్‌ను గుర్తించి డ్రైవర్‌ బసవరాజును అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో బయటపడిన వాస్తవం

తమ అదుపులో ఉన్న డ్రైవర్‌ బసవరాజును పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. హంద్రీ–నీవా కాలువ వద్ద పనులు చేపట్టిన వాహనాల నుంచి సోమవారం రాత్రి డీజిల్‌ అపహరించుకుని వస్తున్నట్లుగా పోలీసుల ఎదుట బసవరాజు అంగీకరించాడు. దొంగిలించిన డీజిల్‌ను రామగిరి మండలం పెనుబోలు వద్ద ఉన్న రాము అనే వ్యక్తికి అప్పగించి సొమ్ము చేసుకుంటున్నట్లుగా వివరించాడు. దీంతో పోలీసులు వెంటనే పెనుబోలుకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. రామును అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. స్థానికుడైన అంకిత్‌తో కలసి డీజిల్‌ దందా సాగిస్తున్నట్లుగా రాము అంగీకరించడంతో అంకిత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాము ఇంటి వెనుక ఉన్న పొలంలో డ్రముల్లో నిల్వ చేసిన 1,500 లీటర్లను గుర్తించి, రామగిరి సీఐ శ్రీధర్‌కు తెలపడంతో ఆయన అక్కడకు చేరుకుని సమగ్ర విచారణ అనంతరం నిల్వ చేసిన డీజిల్‌ డ్రమ్ములను పీఎస్‌కు తరలించారు. రాము, అంకిత్‌తో పాటు డ్రైవర్‌ బసవరాజుపై కేసు నమోదు చేసి, నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా, ఈ అక్రమ దందాలో నిందితులు రూ.కోట్లు వెనకేసున్నట్లుగా ఆరోపణలున్నాయి.

లారీల నుంచి యథేచ్ఛగా డీజిల్‌ అపహరణ

దందాతో రూ.కోట్లలో అక్రమార్జన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement