
బాధను దిగమింగుకుని పరీక్షలు రాసి..
ధర్మవరం అర్బన్: పదో తరగతి పరీక్షల్లో తండ్రి అనారోగ్యానికి గురవడంతో బాధను దిగమింగుకుని పరీక్షలు రాసిన విద్యార్థి 593 మార్కులతో రాణించాడు. ధర్మవరం పట్టణంలోని సుందరయ్యనగర్ శ్రీగణేష్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి కె.గౌతమ్ కృష్ణ పదో తరగతి పరీక్షలు రాసే సమయంలో తండ్రి సుబ్రహ్మణ్యంకు కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ చేయాలని ఆస్పత్రి అత్యవసర విభాగంలో చేర్పించారు. అంతటి బాధలోనూ పరీక్షలు రాసిన తన కుమారుడు 593 మార్కులు సాధించడంపై తండ్రి సంతోషం వ్యక్తం చేస్తూ స్వీటు తినిపించాడు. ఆ విద్యార్థిని హెచ్ఎం లక్ష్మీనారాయణరెడ్డి, ఉపాధ్యాయులు సానే రవీంద్రరెడ్డి, గోపి, శేఖర్, వెంకటరాముడులు అభినందించారు.
గతేడాది కంటే 10 శాతం తగ్గిన ఉత్తీర్ణత
రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచిన జిల్లా
బాలికలు 79.04 శాతం,
బాలురు 70.81 శాతం ఉత్తీర్ణత
కార్పొరేట్తో పోటీపడుతూ
ప్రభుత్వ విద్యార్థుల సత్తా

బాధను దిగమింగుకుని పరీక్షలు రాసి..

బాధను దిగమింగుకుని పరీక్షలు రాసి..

బాధను దిగమింగుకుని పరీక్షలు రాసి..

బాధను దిగమింగుకుని పరీక్షలు రాసి..

బాధను దిగమింగుకుని పరీక్షలు రాసి..