
తాగి బండి నడిపితే జైలుకు పంపండి
ప్రశాంతి నిలయం: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని, హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి రోడ్ సెఫ్టీ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. అధ్యక్షత వహించిన కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ... జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించాలన్నారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్ స్కూళ్ల బస్సులను కచ్చితంగా తనిఖీ చేయాలన్నారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ.. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జాతీయ రహదారుల్లోని ధాబాలు, రెస్టారెంట్లలో సీసీ కెమెరాలు అమర్చేలా చూడాలన్నారు. సమావేశంలో కదిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎన్హెచ్ఏ అధికారి భరత్, డీఈఓ కృష్టప్ప తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం