హౌసింగ్‌ లబ్ధిదారులకు అదనపు నిధులు | - | Sakshi
Sakshi News home page

హౌసింగ్‌ లబ్ధిదారులకు అదనపు నిధులు

Apr 25 2025 12:55 AM | Updated on Apr 25 2025 12:55 AM

హౌసిం

హౌసింగ్‌ లబ్ధిదారులకు అదనపు నిధులు

లేపాక్షి: రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకం కింద గతంలో మంజూరై అర్ధాంతరంగా ఆగిపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులు ఇళ్లు పూర్తి చేసుకునేలా ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వెంకటనారాయణ తెలిపారు. గురువారం స్థానిక హౌసింగ్‌ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అదనంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అయితే అనుకున్న స్థాయిలో ఇళ్లను పూర్తి చేసుకోలేకపోయారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అదనంగా నిధులు మంజూరు చేసిందన్నారు. ఇళ్లను జూన్‌ 12వ తేదీలోగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే మండల వ్యాప్తంగా 830 ఇళ్లు మంజూరు చేయాలని దరఖాస్తులు వచ్చాయని వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో డీఈఈ శ్రీనివాసులు, ఏఈ రాజేంద్రప్రసాద్‌, అధికారులు పాల్గొన్నారు.

ఆర్డీటీ సెట్‌కు

దరఖాస్తుల ఆహ్వానం

బత్తలపల్లి: పదో తరగతి ఫలితాల్లో 500 మార్కులు పైబడిన వచ్చిన విద్యార్థులు ఆర్డీటీ నిర్వహించే ఆర్డీటీ సెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ రీజనల్‌ డైరెక్టర్‌ ప్రమీల, ఏటీఎల్‌ కృష్ణ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్డీటీ ఫీల్డ్‌ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆర్డీటీ పేద విద్యార్థులను ఇంటర్‌ చదివించేందుకు అవకాశం కల్పిస్తోందన్నారు. 500 మార్కులు పైబడి సాధించిన విద్యార్థులు ఆర్డీటీ సెట్‌కు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో ఆర్డీటీ స్పాన్సర్‌షిప్‌ కలిగి ఉంటే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివి ఉన్నా అర్హులన్నారు. ఓసీ, బీసీ, స్పాన్సర్‌షిప్‌ లేనివారు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చదివి ఉండాలన్నారు. శుక్రవారం నుంచి స్థానిక ఫీల్డ్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. 30వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. మే 11న ఆర్డీటీ సెట్‌ పరీక్ష ఉంటుందన్నారు. ఆర్డీటీ సెట్‌కు దరఖాస్తు చేసుకునేవారు ఆధార్‌, రేషన్‌కార్డు, పదో తరగతి హాల్‌ టికెట్‌, మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌ ఫోటోలు తీసుకురావాలన్నారు.

స్వచ్ఛతలో జిల్లాకు అవార్డు

ప్రశాంతి నిలయం: స్వచ్చాంధ్ర గ్రామీణ్‌ కార్యక్రమం అమలులో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు జిల్లాకు ప్రత్యేక అవార్డును అందజేశారు. గురువారం విజయవాడలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ చేతులు మీదుగా కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ అవార్డును అందుకున్నారు.

ఇంటర్‌లో నూతన

సిలబస్‌పై శిక్షణ

పుట్టపర్తి: ఈ ఏడాది ప్రభుత్వం ఇంటర్‌లో నూతన సిలబస్‌ ప్రవేశ పెట్టిందని, ఆ సిలబస్‌పై ఆయా కళాశాల అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్నట్లు ఇంటర్‌ జిల్లా విద్యాశాఖ అధికారి రఘునాథరెడ్డి తెలిపారు. ఆయన సిబ్బందితో కలిసి కొత్తచెరువు కార్యాలయం ఆవరణలో బ్యానర్‌ ప్రదర్శించారు. నూతన సిలబస్‌పై అధ్యాపకులకు నాలుగు దశలలో శిక్షణ ఉంటుందన్నారు. మే 5వ తేదీ వరకూ పెనుకొండ కళాశాలలో సబ్జెక్టుల వారీగా శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు.

హౌసింగ్‌ లబ్ధిదారులకు  అదనపు నిధులు 1
1/2

హౌసింగ్‌ లబ్ధిదారులకు అదనపు నిధులు

హౌసింగ్‌ లబ్ధిదారులకు  అదనపు నిధులు 2
2/2

హౌసింగ్‌ లబ్ధిదారులకు అదనపు నిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement