
అగ్గిపడితే.. బుగ్గే
ధర్మవరం: వేసవిలో వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో నిత్యం ఏదో ఒకచోట అగ్ని ప్రమాదం జరుగుతోంది. ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ స్టేషన్కు ఫోన్ చేద్దామంటే సమయానికి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. ఎందుకంటే ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లోని ఆరు మండలాలకు ఒకే ఫైర్ ఇంజిన్, ఒకే ఫైర్స్టేషన్ ఉండటమే కారణం. ధర్మవరంలోని మాధవనగర్లోని అగ్నిమాపకశాఖ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయ పరిధిలోకి బత్తలపల్లి, తాడిమర్రి, ధర్మవరం మండలాలతోపాటు చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాలు వస్తాయి. ఈ ఆరు మండలాల్లోని ఏ ప్రాంతంలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా ఇక్కడినుంచే ఫైరింజన్ వెళ్లాల్సి ఉంది. రామగిరి మండలం ధర్మవరానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా తాడిమర్రి మండలంలో చివరి గ్రామం పట్టణానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రమాదం జరిగినపుడు ఆ ప్రాంతాల్లోకి ఫైరింజన్ చేరుకోవాలంటే గంటపైనే సమయం పడుతుండడంతో ఫైర్ సిబ్బంది స్థానికుల ఆగ్రహానికి గురవుతున్నారు. దీనికితోడు ఇతర ప్రాంతాల్లో విపత్తులు సంభవించినపుడు ఇక్కడి సిబ్బంది అక్కడ విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
ముందుకు కదలని కొత్త ఫైర్స్టేషన్ ఏర్పాటు..
అగ్ని మాపకశాఖ అధికారులు సీకేపల్లి మండలంలో కొత్త ఫైర్స్టేషన్ ఏర్పాటు చేసేలా గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తద్వారా ధర్మవరంలో ఉన్న ఫైర్స్టేషన్కు పనిభారం తగ్గడంతో పాటు రాప్తాడులోని సీకేపల్లి, కనగానపల్లి, రామగిరి మండలాలకు సత్వరం ఫైర్ సేవలు అందించే వీలుంటుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. మంత్రి సత్యకుమార్ ఈ విషయంపై దష్టిసారించి కొత్త ఫైర్స్టేషన్ ఏర్పాటుతో పాటు ధర్మవరంలో ఉన్న ఫైర్స్టేషన్కు రెండు ఫైర్ ఇంజిన్లు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
● ఈ విషయమై సాక్షి జిల్లా అగ్ని మాపక అధికారి హేమంత్రెడ్డిని వివరణ కోరగా ఫైర్స్టేషన్ అప్గ్రేడ్ చేయడం మా చేతుల్లో లేదని, అది ప్రభుత్వం చేయాల్సిన పని అని, తమను అడగకండి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
వేసవి సీజన్లో వరుస అగ్ని ప్రమాదాలు
ఆరు మండలాలకు ఒకే ఫైర్ స్టేషన్
ఫైర్సేవలు సత్వరం అందడం
ప్రశ్నార్థకమే
తీవ్రంగా నష్టపోతున్న
అగ్ని ప్రమాద బాధితులు