
కర్ణాటక మద్యం పట్టివేత
హిందూపురం టౌన్: స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో ముగ్గురిని సోమవారం అరెస్ట్ చేసి, 240 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. సోమవారం తనిఖీలు చేపట్టిన సమయంలో కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తూ నంది సర్కిల్ వద్ద ఎకై ్సజ్ సిబ్బందికి అంబేడ్కర్ నగర్కు చెందిన మారుతి, నారాయణ, రాజు పట్టుబడ్డారన్నారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
గంజాయి విక్రేతల అరెస్ట్
బత్తలపల్లి: మండల కేంద్రంలో సోమవారం గంజాయి విక్రయిస్తూ ఇద్దరు పట్టుబడినట్లు ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. పట్టుబడిన వారిలో జ్వాలాపురం గ్రామానికి చెందిన లోక్నాథరెడ్డి, వెంకటరమణ ఉన్నారన్నారు. వీరిద్దరూ బత్తలపల్లిలోని తాడిపత్రి రోడ్డులో ఉన్న జగనన్న కాలనీ వద్ద గంజాయి విక్రయిస్తుండగా రెడ్హ్యాండెడ్గా అరెస్ట్ చేసి, 190 గ్రాముల గంజాయిని స్వాధీని చేసుకున్నట్లు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించామన్నారు.