
నేటి నుంచి వేసవి సెలవులు
● జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం
పుట్టపర్తి: అన్ని యాజమాన్య పాఠశాలలకు గురువారం నుంచి వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విద్యార్థులు ఆనందంతో బుధవారం తరగతి గదుల నుంచి కేరింతలతో బయటకు వచ్చారు. మొత్తం ఒక నెలా 19 రోజుల పాటు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 12వ పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.
ఇదెక్కడి వివక్ష బాలయ్యా!
● ఉత్తమ సర్పంచ్ అవార్డు ఎంపికపై
పీఏల రాజకీయం
చిలమత్తూరు: పనితీరు ఆధారంగా ఉత్తమ సర్పంచ్ అవార్డుకు ఎంపికై న చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి వైఎస్సార్సీపీ సర్పంచ్ ఈడిగ తిరుమలేష్పై ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు వివక్ష చూపడం విమర్శలకు తావిస్తోంది. దేమకేతేపల్లి సర్పంచ్ను జిల్లా పంచాయతీ అధికారులు ఎంపిక చేసి రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ విషయాన్ని అధికారులు తెలపడంతో సదరు సర్పంచ్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లేందుకు టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. అయితే ఉన్నఫలంగా బాలయ్య పీఏల ఒత్తిడితో అవార్డుల జాబితాలో తిరుమలేష్ పేరును తొలగించేశారు. ఆ స్థానంలో టేకులోడు టీడీపీ సర్పంచ్ పేరు చేర్చారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఇదెక్కడి వివక్ష బాలయ్యా అంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు.
నెగ్గిన అవిశ్వాస తీర్మానం
కదిరి టౌన్: మున్సిపల్ చైర్పర్సన్ పరికి నజీమున్నీసాతో పాటు వైస్ చైర్పర్సన్లు కొమ్ము గంగాదేవి, అంజుకుంట రాజశేఖర్రెడ్డిపై బుధవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను 30 మంది వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచారు. ఐదుగురు టీడీపీ, ఒకరు ఇండిపెండెంట్గా గెలిచారు. అయితే మున్సిపల్ కౌన్సిల్లో జరిగిన అవిశ్వాస తీర్మానానికి 25 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. 11 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ప్రిసైడింగ్ అధికారి ఆర్డీఓ వీవీఎస్ శర్మ అధ్యక్షతన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టగా.. 25 మంది కౌన్సిలర్లు చేతులెత్తారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో చైర్పర్సన్ ఎన్నికకు జీఓ వచ్చిన తరువాత ఎన్నిక ఉంటుందని ఆర్డీఓ తెలిపారు. సంఖ్యా బలం తక్కువ ఉన్నప్పటికీ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి నేతలు పాపులు కదుపుతున్నారు.

నేటి నుంచి వేసవి సెలవులు

నేటి నుంచి వేసవి సెలవులు