
భానుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. వడగాల్పులు ప్రజలను
● మధ్యాహ్నం పూట ఇంట్లోనే ఉండాలి.
● ఎక్కువ మోతాదులో మంచినీళ్లు తీసుకోవాలి.
● ఎండలో తిరిగి వచ్చినప్పుడు కొబ్బరి నీళ్లు లేదా ఓఆర్ఎస్ తీసుకోవాలి.
● జ్వరం లేదా నీరసం అనిపించినప్పుడు వెంటనే సైలెన్ పెట్టించుకోవాలి.
● బీపీ, షుగర్, గుండెజబ్బులకు మందులు వాడే వారిలో వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ. వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.
● వేసవిలో తేలికపాటి వ్యాయామాలు మాత్రమే చేయాలి.
● దోస, పుచ్చ, దానిమ్మ, అరటి వంటి పండ్లను బాగా తీసుకోవాలి.
● పండ్లతో పాటు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు.
● జ్వరంగా ఉంటే నుదిటిపై తడిబట్టను పెట్టాలి.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో భానుడు భగ భగ మండిపోతున్నాడు. పగటి పూట ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. ఏప్రిల్ మొదటి వారంలో 40 డిగ్రీల లోపు ఉన్న ఉష్ణోగ్రతలు తాజాగా 42 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండ వేడిమికి తాళలేక జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పట్టణాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పల్లెటూళ్లలో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ఎండదెబ్బకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి హామీ కూలి పనులకు వెళ్లి ఇప్పటికే ఓ వ్యక్తి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వడదెబ్బ కేసులు పెరుగుతున్నట్లు ఆస్పత్రుల రికార్డులు వెల్లడిస్తున్నాయి.
గత ఏడాది ఇదే సమయానికి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఈసారి మాత్రం అప్పుడే 42 డిగ్రీలు నమోదైంది. రానున్న నెలన్నర రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మే రెండో వారం నుంచి ఎండ తీవ్రత మరింతగా ఉంటుందని, వడదెబ్బ ప్రభావం తారస్థాయికి చేరుకుంటుందని పేర్కొంటున్నారు. మరోవైపు వృద్ధులు, బాలింతలు, చిన్నారులు మధ్యాహ్నం పూట బయటకు రావద్దని, వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందని, వాళ్లు కూడా ఎండలో తిరగకూడదంటున్నారు.
వడదెబ్బకు గురికాకూడదంటే..
వడదెబ్బ లక్షణాలు
విపరీతమైన తలనొప్పి, వాంతికి వచ్చినట్లు ఉండటం
నాలుక తడి ఆరిపోయినట్లు ఉండటం
శరీర ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరగడం
శరీరం బాగా అలసిపోయినట్లు ఉండటం
మాట తడబడుతున్నట్లు ఉండటం
ఒక్కోసారి కండరాలు పట్టేసినట్టు అనిపించడం
వెంటనే నీరసం వచ్చేసి ఎక్కడైనా వాలిపోవాలనిపించడం
శరీరం తిమ్మిరిగా అనిపించడం
భారీగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
ఏప్రిల్లోనే 42 డిగ్రీలను
దాటుతున్న వైనం
మేలో 45 డిగ్రీల వరకూ పెరిగే
అవకాశం ఉందంటున్న శాస్త్రవేత్తలు
వృద్ధులు, బాలింతలు, చిన్నారులు
బయటకు రావద్దంటున్న వైద్యులు
ఈసారి ఎండలు ఎక్కువే
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంది. మేలో 45 డిగ్రీల వరకూ నమోదు కావచ్చు. మిగతా జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉక్కపోత (హ్యుమిడిటీ) తక్కువ. ఈ ఏడాది కాస్త ముందస్తు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
– విజయశేఖర్, సైంటిస్ట్, రేకులకుంట వాతావరణ కేంద్రం
45 డిగ్రీలు దాటే అవకాశం..

భానుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. వడగాల్పులు ప్రజలను