నేర పరిశోధనలో జిల్లాకు రెండో స్థానం | - | Sakshi
Sakshi News home page

నేర పరిశోధనలో జిల్లాకు రెండో స్థానం

Apr 17 2025 12:34 AM | Updated on Apr 17 2025 12:34 AM

నేర పరిశోధనలో జిల్లాకు రెండో స్థానం

నేర పరిశోధనలో జిల్లాకు రెండో స్థానం

పుట్టపర్తి టౌన్‌: నేరాల పరిశోధనలో సాధించిన పురోగతికి సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్ర పోలీస్‌ శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రకటిస్తున్న ఏబీసీడీ ర్యాంకింగ్‌లో జిల్లాకు రెండో స్థానం దక్కింది. బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్త, సీఐడీ అడిషనల్‌ డీజీపీ రవిశంకర్‌, లాఅండ్‌ ఆర్డర్‌ ఐజీ మధుసూదన్‌రెడ్డి చేతుల మీదుగా ఎస్పీ రత్నతో పాటు సిబ్బంది సన్మానం అందుకున్నారు. మడకశిర తాలూకా దిన్నేహట్టి గ్రామంలో 1998, అక్టోబర్‌ 2న తిప్పేస్వామి తన బార్యపై ఉన్న అనుమానంతో అరునెలల బాబు (శివలింగమయ్య)ను గొంతు నులిమి హత మార్చిన విషయం తెలిసిందే. బాబు తల్లి ఫిర్యాదు మేరకు గుడిబండ పోలీసులు కేసు నమోదు చేసినా నిందితుడి ఆచూకీని గుర్తించలేకపోయారు. ఎస్పీ రత్న బాధ్యతలు తీసుకున్న తర్వాత డీజీపీ ఆదేశాల మేరకు పాత కేసుల దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది నవంబర్‌లో బాలుడి హత్యపై పల్లె నిద్ర కార్యక్రమంతో ఆరా తీయడంతో కొంత సమాచారం దొరికింది. దీని ఆధారంగా పెళ్లి పత్రిక ఽఆధారంగా కేసును ఛేదించి నిందితుడిని గుర్తించి అరెస్ట్‌ చేశారు. 26 ఏళ్ల తర్వాత నిందితుడిని గుర్తించిన ఎస్పీ బృందానికి ఏబీసీడీ ర్యాంకింగ్‌లో రెండో స్థానం దక్కింది. అవార్డు అందుకున్న వారిలో ఎస్పీ రత్నతో పాటు పెనుకొండ సబ్‌ డివిజన్‌, మడకశిర సర్కిల్‌ పోలీసులు ఉన్నారు.

ఎస్పీ రత్నకు అవార్డు అందజేసిన డీజీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement