సాక్షి కార్యాలయంపై దాడి హేయం | - | Sakshi
Sakshi News home page

సాక్షి కార్యాలయంపై దాడి హేయం

Apr 24 2025 8:29 AM | Updated on Apr 24 2025 8:29 AM

సాక్షి కార్యాలయంపై దాడి హేయం

సాక్షి కార్యాలయంపై దాడి హేయం

పుట్టపర్తి టౌన్‌: వ్యతిరేక వార్త వచ్చిందని ఏలూరు సాక్షి కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఖండించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం జర్నలిస్టులతో కలిసి ఎస్పీ రత్నకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సాక్షి కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్‌ ధ్వంసం చేయడంతో పాటు అక్కడ విధుల్లో ఉన్న పాత్రికేయునిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. వాస్తవాలు వెలికితీసే జర్నలిస్టులపై దాడులను పూర్తిగా అరికట్టాలని డిమాండ్‌ చేశారు. పత్రికలో వచ్చిన వార్తలో వాస్తవాలు లేకుంటే దానికి వివరణ ఇవ్వాలే కానీ, కార్యాలయంపై దాడి చేయడం సిగ్గు చేటన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే జర్నలిస్టులపై కక్షపూరితంగా కుట్రలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు పుల్లయ్య, బాబు, దివిటీ రాజేష్‌, గంగిరెడ్డి, కేశవరెడ్డి, ఉద్దడం చంద్రశేఖర్‌, రమణ, విజయశేఖర్‌రెడ్డి, సతీష్‌, టీసీ గంగాధర్‌, అంజిప్రసాద్‌, నాగరాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

కక్ష సాధింపు చర్య సరికాదు

కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జర్నలిస్టులపై నిత్యం దాడులు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు. దాడులతోపాటు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే ప్రజాస్వామ్యానికే మప్పు వాటిల్లుతుంది. పాలకులు స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలి.

– దివిటీ రాజేష్‌, సాక్షి స్టాఫ్‌ రిపోర్టర్‌

నిందితులను వెంటనే

శిక్షించాలని డిమాండ్‌

ఎస్పీకి వినతిపత్రం

అందజేసిన జర్నలిస్టులు

చర్యలు తీసుకోవాలి

నిజాలు బయటకు తీసి ప్రజలకు తెలియజేసే రిపోర్టర్లు, కార్యాలయాలపై దాడులు చేయడం హేయమైన చర్య. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి వ్యతిరేకం. రాజకీయంగా కక్షలు ఉంటే రాజకీయంగానే చూసుకోవాలి. అంతేకానీ జర్నలిస్టులపై దాడులు చేయడం మంచి పద్ధతికాదు. దాడులకు పాల్పడిన ఎమ్మెల్యే చింతమనేని అనుచరులను అరెస్ట్‌ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలి. – డి.బాబు,

జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజే

దాడులు మంచి పద్ధతి కాదు

ప్రజల పక్షాన వార్తలు రాస్తూ సమాజ అభివృద్ధి కోసం పాటు పడే పాత్రికేయులపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. ఏమైనా అభ్యతరం ఉంటే ఖండించే హక్కు ఎవరికై నా ఉంటుంది. కానీ ఇలా పాత్రికేయులపై కక్షసాధింపు ధోరణి ప్రదర్శించడం తగదు. ఏలూరులో సాక్షి కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడులు ఇలాగే కొనసాగితే ఉద్యమాలు ఉధృతం చేస్తాం.

– చింతకాయల పుల్లయ్య,

జిల్లా అధ్యక్షుడు, ఏపీయూడబ్ల్యూజే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement