
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
పుట్టపర్తి టౌన్: ప్రతి ఒక్కరూ మన ఇంటితో పాటు పరిసరాలు, కార్యాలయాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ, పోలీస్ అధికారులు, డీపీఓ సిబ్బంది, ఏఆర్ పోలీసులు కార్యాలయ ఆవరణాన్ని శుభ్రం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందన్నారు. కార్యక్రమంలో ఏఓ సుజాత, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, డీటీఆర్బీ సీఐ సతీష్, ఆర్ఐలు మహేష్, వలి, ఎస్బీ ఎస్ఐ ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.