
బీపీఈడీ ఫలితాల విడుదల
అనంతపురం: ఎస్కేయూ పరిధిలో బీపీఈడీ రెండో సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ఆచార్య బి.అనిత మంగళవారం విడుదల చేశారు. మొత్తం 63.51 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ జీవీ రమణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ లోకేశ్వర్లు, ఎస్కేయూ న్యాయశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
సీహెచ్ఓల వినూత్న నిరసన
పుట్టపర్తి అర్బన్: తమ డిమాండ్లు నెరవేరే వరకూ నిరవధిక సమ్మె చేస్తామని ప్రతినబూనిన సీహెచ్ఓలు రెండవ రోజు సమ్మెలో భాగంగా డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ... జీతభత్యాల సమస్యతో పాటు గ్రాట్యూటీ, ఇంక్రిమెంట్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
మద్యం అక్రమ రవాణాను అరికట్టండి
తనకల్లు: కర్ణాటక నుంచి మద్యం అక్రమ రవాణా కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఎకై ్సజ్ అధికారులను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య ఆదేశించారు. స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. పెండింగ్ కేసులను త్వరితగతిన విచారణ జరిపి చార్జిషీట్ దాఖలు చేయలన్నారు. నాటుసారా తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నాటుసారా తయారు చేస్తూ పట్టుబడిన వారితో పాటు బెల్లం విక్రేతపై కేసు నమోదు చేయాలన్నారు. మద్యం దుకాణాలపై డెకాయ్ ఆపరేషన్లు చేపట్టాలన్నారు. బెల్టు షాపులు నిర్వహించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్, సీఐ మారుతీరావు, తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
మడకశిర: స్థానిక మారెమ్మ గుడి వీధిలో నివాసముంటున్న రాజశేఖర్(54) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన మేరకు.. బెంగళూరులో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజశేఖర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఇంటికి వచ్చిన ఆయన మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి బలవన్మరణం
హిందూపురం: మండలంలోని తూముకుంట ఎస్సీ కాలనీ చెందిన రాజు(40) ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసైన ఆయన తాగుడుకు అలవాటు పడి తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం భార్యతో గొడవ పడిన రాజు.. ఇంటి పైభాగానికి చేరుకుని సిమెంట్ పిల్లర్కు లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

బీపీఈడీ ఫలితాల విడుదల

బీపీఈడీ ఫలితాల విడుదల