దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ఆదివారం వెల్లడించింది. ఏప్రిల్ 11న జరిగే తొలివిడతలో 20 రాష్ట్రాల్లోని 91 స్ధానాలకు పోలింగ్ జరగనుంది. రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 115 స్ధానాలకు, మూడవ దశలో 14 రాష్ట్రాల్లోని 115 స్దానాలకు పోలింగ్ జరుగుతుంది.