ఈ నెల 14వ తేదీన రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉత్సవాల సందడి ముందే మొదలైంది. తమ వీధుల్లో, కాలనీల్లో అందరికంటే భారీ విగ్రహాలను ప్రతిష్ఠించి, ఘనంగా పూజలు చేయాలని భక్తజనం ఉరకలేస్తోంది. కడప నగరంలోని చిన్నచౌకుతో పాటు ప్రధాన ప్రాంతాలలో విగ్రహాల తయారీ కేంద్రాలు రంగురంగుల గణపతులతో కళకళలాడుతున్నాయి. ఉత్సవ కమిటీ సభ్యులు భారీ విగ్రహాల కోసం కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే నచ్చిన విగ్రహాలను అడ్వాన్సులు ఇచ్చి రిజర్వ్ చేసుకుంటుండగా.. మరికొందరు ముందస్తుగానే భక్తిశ్రద్ధలతో, డప్పు వాయిద్యాల మధ్య విగ్రహాలను మండపాలకు తరలిస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కడప


