వర్షాల కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు | - | Sakshi
Sakshi News home page

వర్షాల కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

Sep 10 2026 1:21 AM | Updated on Sep 10 2026 1:21 AM

సింహాద్రిపురం: మండల కేంద్రమైన సింహాద్రిపురంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ బుధవారం ముస్లిం సోదరులు రెండో రోజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ.. తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా నాలుగు రోజుల పాటు నాలుగు దిక్కుల్లోని బీడు భూములలో ఈ ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల కష్టాలు తొలగి, పాడిపంటలు బాగా పండేలా అల్లాహ్‌ కరుణించాలని వేడుకున్నారు. శుక్రవారం జరిగే ముగింపు ప్రార్థనలలో ముస్లిం సోదరులందరూ భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement