
దేవునికడప ఆలయ జీర్ణోద్ధరణ పనులు
కడప సెవెన్రోడ్స్: దేవునికడప శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవాలయ జీర్ణోద్ధరణ పనులకు తిరుమల–తిరుపతి దేవస్థానం సమయాత్తమైంది. ప్రాచీన ఆలయం కావడంతో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి వారు, పద్మావతి అమ్మవారు, ఆండాళ్ అమ్మవారి గర్భాలయాలు, విమాన గోపురాలు, రాజగోపురం మరమ్మతు పనులు చేపడుతున్నారు. దీంతో ఆలయంలో శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి, అమ్మవార్ల మూల విరాట్కు బదులుగా బాలాలయంలో స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చనున్నారు. ఈనెల 18వ తేది సాయంత్రం అంకురార్పణతో ఈ కార్యక్రమం ప్రారంభమై 20వ తేది పూర్ణాహుతితో ముగుస్తుంది. ఆరోజు నుంచి గర్భగుడి ఎదురుగా ఉన్న మండపంలో నిర్మించే బాలాలయంలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకోవచ్చు. భక్తులు తమకు సహకరించాలని ఆలయ అధికారులు కోరారు.
● బాలాలయ నిర్మాణ పనులు ప్రారంభం
● 20 నుంచి భక్తులకు అందుబాటులోకి..

దేవునికడప ఆలయ జీర్ణోద్ధరణ పనులు