బాధితులకు చట్టపరిధిలో న్యాయం | - | Sakshi
Sakshi News home page

బాధితులకు చట్టపరిధిలో న్యాయం

Apr 29 2025 7:11 AM | Updated on Apr 29 2025 7:11 AM

బాధితులకు చట్టపరిధిలో న్యాయం

బాధితులకు చట్టపరిధిలో న్యాయం

కడప అర్బన్‌ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్‌ఎస్‌)కు వచ్చిన ఫిర్యాదు దారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని ఎస్పీ ఈ.జి అశోక్‌ కుమార్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పెన్నార్‌ పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెస్సల్‌ సిస్టం) కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్‌ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. ఎ.ఆర్‌ డీఎస్పీ కె. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement