ఎర్రమట్టి.. కొల్లగొట్టి.. | - | Sakshi
Sakshi News home page

ఎర్రమట్టి.. కొల్లగొట్టి..

Apr 28 2025 12:13 AM | Updated on Apr 28 2025 12:13 AM

ఎర్రమట్టి.. కొల్లగొట్టి..

ఎర్రమట్టి.. కొల్లగొట్టి..

సాక్షి ప్రతినిధి, కడప: అధికారమే పెట్టుబడిగా టీడీపీ నేతలు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. ఇసుక, గ్రావెల్‌, ఎర్రమట్టి ఎక్కడ ఎలాంటి అవకాశం ఉంటే.. అక్కడ దోపిడీకి తెరలేపుతున్నారు. కోట్లాది రూపాయాలు రాయల్టీ ప్రభుత్వ ఖజానాకు చేరాల్సి ఉండగా, ఒక్క రూపాయి చెల్లించకుండా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. జిల్లాలో పట్టపగలు ఇలాంటి వ్యవహారం నిత్యం తెరపైకి వస్తున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులు తెలుగు తమ్ముళ్ల అయితే.. ఎలాంటి ఆటంకాలు కల్గించవద్దనే దిశగా జిల్లాలో అధికారుల నడవడిక కన్పిస్తోంది.

యథేచ్ఛగా దందా

ప్రభుత్వ నిర్వాకం వల్ల గ్రావెల్‌, ఎర్రమట్టి మాఫియా తెరపైకి వచ్చింది. మైనింగ్‌ లీజుదారులకు పర్మిట్లు ఇవ్వకపోవడంతో అక్రమ మైనింగ్‌కు ఆస్కారమిచ్చారు. జిల్లా కేంద్రంలో ఐదు గ్రావెల్‌ మైన్లు ఉండగా, ఒక్క మైన్‌కు కూడా రాయల్టీలు ఇవ్వలేదు. వెరసి గ్రావెల్‌ మాఫియా విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతోంది. ఆపై ఈ వ్యవహారం కమలాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా కొనసాగుతోంది. చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వల్లూరు, కమలాపురం మండలాల్లో అక్రమ మైనింగ్‌ ద్వారా కోట్లాది రూపాయాలు కొల్లగొట్టారు.

ఎగువ చెరువును చెరపట్టిన టీడీపీ వర్గీయులు

రాయల్టీ చెల్లించకుండా మిషన్లు పెట్టి దోపిడీ

నిత్యం వందలాది టిప్పర్లతో తరలింపు

పట్టించుకోని అధికార యంత్రాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement